ఓ కుటుంబ సభ్యుడిగా కాకపోయినా ఓ ముఖ్యమంత్రిగానైనా నిజంవైపు నిలబడాలని జగన్ మోహన్ రెడ్డికి వివేకానంద సతీమణి బహిరంగ లేఖ రాశారు. ఇద్దరు చెల్లెళ్లల వ్యక్తిత్వ హననం జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండటాన్ని ఆమె తప్పుపట్టారు. న్యాయపోరాటం చేస్తున్న వారికి అండగా నిలబడాల్సిన వ్యక్తి నిందితులకు రక్షణా ఉన్నారని ఆరోపించారు.


వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ రాసిన లేఖలో ఏముంది అంటే... 2009లో నువ్వు మీ తండ్రిని కోల్పోయినప్పుడు మనోవేదన అనుభవించావో. 2019లో నీ చెల్లి సునీత కూడా అంతే మనోవేదన అనుభవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మమ్మల్ని ఎక్కువగా బాధపెట్టిన అంశాం మన కుటుబంలోనీ వారే హత్యకు కారణం కావడం. హత్యకు కారణం ఆయిన వాళ్లకు నువ్వు రక్షణంగా ఉండటం. నిన్ను సీఎంగా చూడాలని ఎంతో తపించిన చిన్నాన్నను ఈ విధంగా నీ పత్రిక, నీ టీవీ ఛానెల్‌లో సోషల్ మీడియా, నీ పార్టీ వర్గాలు తీవ్రంగా దూషిస్తున్నాయి. చెప్పలేనంత విధంగా హననం చేయించడం ఇది నీకు తగునా?
న్యాయం కోసం పోరాటం చేస్తున్న నీ చెల్లెళ్ళను హేళన చేస్తూ... నిందలు మోపుతూ,దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా?. సునీతకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తున్న షర్మిలను కూడా టార్గెట్ చేస్తుంటే నీవు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం ఏంటి?. కుటుంబ సభ్యునిగా కాకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇదేనా నీ కర్తవ్యం?




హత్యకు కారకులైన ఆయిన వారికి మరలా ఎంపీగా అవకాశాన్ని నీవు కల్పించడం ఇంకా బాధించే అంశం. ఇది సమంజసమా? . ఇటువంటి దుశ్చర్యలు నీకు ఏ మాత్రం మంచిది కాదు. హత్యకు కారకుడు ఆయిన నిందితుడు నామినేషన్ దాఖలు చేసినందున.. చివరి ప్రయత్నంగా న్యాయం ధర్మం ఆలోచన చేయమని  నిన్ను ప్రార్థిస్తున్నాను. రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని ప్రమాణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా న్యాయం,ధర్మం,నిజం వైపు నిలబడమని వేడుకుంటున్నాను. అని బహిరంగ లేఖ రాశారు.