Supreme Court Judgesభారత్‌ న్యాయవ్యవస్థలో పేరుకుపోతున్న కేసుల పరిష్కారానికి వేగం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్రమంత్రిమండలి, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రకారం, దేశ అత్యున్నత న్యాయస్థానంలో చీఫ్‌ జస్టిస్‌్ ఆఫ్ ఇండియాతో కలిసి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38కి చేరుకుంటుంది. 

Continues below advertisement

ప్రస్తుతం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 34 మంది న్యాయమూర్తులు విధులు నిర్వహించేందుకు అనుమతి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ సంఖ్యను మరో నలుగురు పెంచాలని నిర్ణయించింది. అంటే కొత్త సవరణ తర్వాత సుప్రీంకోర్టు 37 మంది న్యాయమూర్తులు, ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటారు. 

Also Read: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?

కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, సుప్రీంకోర్టు పని తీరును మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపారు. దీని కోసం ప్రభుత్వం సుప్రీం కోర్టు సవరణ బిల్లు 2026ను పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనుంది. ఈ బిల్లు ద్వారా 1956 నాటి అసలు చట్టానికి సవరణలు చేస్తారు.

Continues below advertisement

సుప్రీంకోర్టులో కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వేల సంఖ్యలో ఉన్న పెండింగ్ కేసుల వల్ల న్యాయం అందడంలో జాప్యం జరుగుతోందనే ఆందోలన ఉంది. న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం వల్ల అత్యున్నత న్యాయస్థానం మరింత సమర్థవంతంగా, ప్రభావవంతంగా పని చేయడానికి వీలవుతుంది. కేసుల విచారణ వేగవంతమై, సామాన్య ప్రజలకు త్వరితగతిన న్యాయ అందుతుంది. రాజ్యాంగ ధర్మాసనాలు, ఇతర కీలక కేసుల విచారణకు అవసరైన న్యాయమూర్తుల లభ్యత పెరుగుతుంది. 

Also Read: శబరిమలలోకి మహిళల ప్రవేశంపై ఆంక్షలకు కేంద్రం మద్దతు! సుప్రీంకోర్టు అఫిడవిట్ దాఖలు!

కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన ఈ ప్రతిపాదన ఇప్పుడు బిల్లు రూపంలో పార్లమెంట్‌ వస్తుంది. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టంగా మారుతుంది. అప్పుడు అధికారికంగా సుప్రీంకోర్టులో 38 మంది న్యాయమూర్తుల నియామకానికి మార్గం సుగమమవుతుంది.

పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్యను అనుగుణంగా వారి జీతభత్యాలు, సిబ్బంది ఖర్చులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం అయ్యే వ్యయాన్ని భారత కన్సాలిడేటెడ్‌ ఫండ్స్‌ నుంచి భరించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పరిణామ క్రమం 

భారత రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు ఏర్పడినప్పుడు, న్యాయమూర్తుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. 1956లో చేసిన సుప్రీంకోర్టు చట్టం ప్రకారం తొలుత ప్రధాన న్యాయమూర్తిని మినహాయించి కేవలం 10 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉండేవారు. కాలక్రమేణా కేసుల భారం పెరగడంతో ఈ సంఖ్యను ప్రభుత్వం పలుమార్లు సవరించింది. 1960లో న్యాయమూర్తుల సంఖ్యను 13కు పెంచారు. తర్వాత కాలంలో 17కు పెరిగింది. 1986లో ఈ సంఖ్య 25కు పెంచారు. 2009లో  సంఖ్యను 30 చేశారు. 2019లో సవరణ చేసి 30 నుంచి 33 చేశారు. ఇప్పుడు 33 నుంచి 37కు పెంచారు. దీనికి సీజేఐ అదనం.