దేశంలోని గ్రామీణ ప్రాంత పేద విద్యార్థినులకు ఆర్థిక చేయూతనివ్వడం కోసం విప్రో సంస్థ ‘సంతూర్‌ ఉపకారవేతనా’లను ఇస్తూ వస్తోంది. ఇంటర్‌ పూర్తిచేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం ఉన్న బాలికలను చదువులో ప్రోత్సహించడానికి విప్రో కన్సూమర్‌ కేర్, విప్రో కేర్స్‌ సంయుక్తంగా బాలికలకు ఉపకారవేతనం అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి ఏడాదికి 1900 మందికి ఈ ప్రోత్సాహకాలు అందుతున్నాయి.


వివరాలు...


* సంతూర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2023-24


అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే చదివుండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన పేద బాలికలే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. 2022-23 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ లేదా సమాన స్థాయి కోర్సులు పూర్తిచేసినవారై ఉండాలి. 2023-24లో ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరి ఉండాలి. కనీసం మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సుల్లో చేరినవారే ఈ స్కాలర్‌షిప్పు పొందడానికి అర్హులు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ (లేదా) ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తును వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు నింపి, విద్యార్హతకు సంబంధించిన జిరాక్స్ కాపీలను పోస్టు ద్వారా పంపాలి. ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.


ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా.


స్కాలర్‌షిప్‌: ఎంపికైన విద్యార్థినులకు మూడేళ్లు లేదా కోర్సు పూర్తయినంత వరకు ప్రతినెలా రూ.2000 చొప్పున స్కాలర్‌షిప్‌ ఇస్తారు. డబ్బు నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమచేస్తారు. 


దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: 30.09.2023.


దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
Wipro Cares - Santoor Scholarship,
Doddakannelli, Sarjapur Road,
Bangalore-560035.


Notification


Online Application


Application


ALSO READ:


వరంగల్‌ నిట్‌లో బీఎస్సీ- బీఈడీ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు, అర్హతలివే
వరంగల్‌‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 2023-24 విద్యాసంవత్సరానికిగాను నాలుగేళ్ల బీఎస్సీ-బీఈడీ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. బీఎస్సీ, బీఈడీ మిళితం చేసే ఇంటిగ్రేటెడ్‌ పాఠ్యాంశాలు కోర్సులో ఉంటాయి. అక్టోబర్‌లో కోర్సు ప్రారంభం కానుంది. 
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


సెప్టెంబరు 25 నుంచి ఈసెట్‌ ఫార్మసీ కౌన్సెలింగ్‌, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
ఏపీలోని ఫార్మసీ కళాశాలల్లో డిప్లొమా అర్హత ఉన్నవారికి బీఫార్మసీ ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీఈసెట్ (ఫార్మసీ) కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 25 నుంచి ప్రారంభంకానుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 25, 26 తేదీల్లో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 25 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు నమోదు చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి సెప్టెంబరు 27న వెబ్‌ఆప్షన్లలో మార్పునకు అవకాశం కల్పించనున్నారు. అభ్యర్థులకు సెప్టెంబరు 28న సీట్లు కేటాయిస్తారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూలు కోసం క్లిక్ చేయండి..


నీట్ ఎండీఎస్‌ కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్
నీట్ ఎండీఎస్‌ కటాఫ్‌ స్కోర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తగ్గించిన నేపథ్యంలో కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో సీట్ల భర్తీకి వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ సెప్టెంబ‌రు 23న వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబ‌రు 24 ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబరు 27న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితా విడుదల చేస్తామన్నారు. అర్హత, ఇతర వివరాలు వెబ్‌సైట్ చూడాలని విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...