జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్ మెయిన్స్‌ 2022 పరీక్ష ఈ నెలలో నిర్వహించనున్నారు. ఇదే ఇప్పుడు విద్యార్థులను భయపెడుతోంది. సీబీఎస్‌ఈ పరీక్షల టైంలోనే ఈ పరీక్ష కూడా ఉండటంతో విద్యార్థల్లో టెన్షన్‌ పెరిగిపోతోంది. 






సీబీఎస్‌ఈ ఇంటర్‌  రెండో టెర్మ్‌ పరీక్షలను ఏప్రిల్‌ 26 నుంచి జూన్ 15 వరకు జరపనుంది. ఎన్టీఏ కూడా ఏప్రిల్‌ 21 నుంచి మే 4 వరకు జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపైనే విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 


ఈ రెండు పరీక్షలు ఒకే టైంలో నిర్వహించడంపై సోషల్ మీడియాలో తీవ్రంమైన చర్చ నడుస్తోంది. విద్యాశాఖ మంత్రికి, ఎన్టీఏకు విన్నపాలు చేస్తున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ వాయిదా వేయాలని కోరుతున్నారు. 






దీన్ని ఓ ఉద్యమంలా తీసుకెళ్తున్నారు.  దీంతో #PostponeJEEMain2022హ్యాస్‌టాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ఈ రెండు పరీక్షల మధ్య సరిపడా గ్యాపర్ ఉండాలని కోరుతున్నారు విద్యార్థులు. సీబీఎస్‌ఈ, ఎన్టీఏ మాట్లాడుకొని ఓ నిర్ణయానికి రావాలని సూచిస్తున్నారు. 


ఇలాంటి కీలకమైన పరీక్షలను అధికారులు చాలా క్లిష్టతరం చేస్తున్నారని అందుకే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. కాస్త ఆలస్యమైతే పరీక్షలకు ఎలాంటి ముప్పు ఉండదని... ఇలా చేస్తే మాత్రం విద్యార్థులు పిచ్చెక్కిపోతారని అంటున్నారు. ఈ టెన్షన్‌లో మార్కులు రాకపోతే చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందని హెచ్చరించారు విద్యార్థులు. 






ఈ వివాదంపై ఫన్నీ ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. సీరియస్‌గా నడుస్తున్న టాపిక్‌కు హాస్యం జోడించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు మరికొందరు విద్యార్థులు. 






జేఈఈ మెయిన్స్‌ పరీక్షకు సంబందించిన షెడ్యూల్‌ను గత నెలలోనే ఎన్టీఏ విడుదల చేసింది. అది జరిగిన కొన్ని రోజులకే సీబీఎస్‌ఈ పరీక్ష షెడ్యూల్ వచ్చింది. దీంతో ఈ రెండు పరీక్షలపై విద్యార్థుల్లో టెన్షన్ మొదలైంది.