విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అప్డేట్ ఇచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMSS) కోసం విద్యా సంవత్సరం 2026-27 రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించింది. ఈ పథకం కింద 9వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు తొలిసారి స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 10 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమకు వస్తున్న స్కాలర్‌షిప్‌ను రెన్యూవల్ చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుకు చివరి తేదీని ఆగస్టు 31గా నిర్ణయించారు. దీని కోసం విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Continues below advertisement

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం NMMSS పథకం

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించడం. ఈ స్కీమ్ ప్రత్యేకంగా 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ కాకుండా, విద్యార్థులు తమ చదువును కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వపు ఈ పథకం ఒక ప్రధాన ఉద్దేశం బడి మానేయడం అంటే డ్రాప్‌అవుట్ సమస్యను తగ్గించడం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందో, వారికి ఈ స్కాలర్‌షిప్ ద్వారా చదువు కొనసాగించడంలో సహాయం లభిస్తుంది.

Continues below advertisement

NMMSS కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

NMMSS కోసం ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్),  స్థానిక సంస్థల పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటు 10, 11, 12 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్కాలర్‌షిప్‌ కోసం రెన్యూవల్ దరఖాస్తు చేసుకోవాలి అయితే రెన్యూవల్ కోసం విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు సంబంధించిన నిర్ణీత నిబంధనలను పూర్తి చేయాలి. దీంతో పాటు విద్యార్థులు NMMSS వంటి మెరిట్ ఆధారిత స్కాలర్‌షిప్ కాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్కాలర్‌షిప్ పథకాల కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే సంబంధిత స్కీమ్ అర్హతలను పూర్తి చేయాలి. 

ఆగస్టు 31 వరకు దరఖాస్తులకు ఛాన్స్

NMMSS 2026-27 కోసం కొత్తవి, రెన్యూవల్ రెండింటికీ చివరి తేదీ ఆగస్టు 31, 2026గా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత సమయం లోపలే తమ దరఖాస్తును పూర్తి చేయాలి. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ (NSP) ని సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

NMMSS Scholarship 2026-27 ఇలా దరఖాస్తు చేయండి

స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి మొదట నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్ https://scholarships.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండి.

తొలి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ముందుగా New Registration ప్రక్రియను కంప్లీట్ చేయాలి.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వచ్చిన లాగిన్ వివరాల సహాయంతో పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.

ఆ తర్వాత అందుబాటులో ఉన్న స్కాలర్‌షిప్ పథకాలలో National Means cum Merit Scholarship Scheme (NMMSS) ని సెలక్ట్ చేసుకోవాలి. 

ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన అవసరమైన సమాచారాన్ని నింపి, అవసరమైన పత్రాలను (డాక్యుమెంట్లను) అప్‌లోడ్ చేయండి.

అన్ని వివరాలు నింపిన తర్వాత ఒకసారి ఫామ్‌ను బాగా సరిచూసుకుని, ఆపై అప్లై ఆప్షన్ సబ్‌మిట్ చేయండి.

దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం కన్‌ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని మీ వద్ద ఉంచుకోవాలి. 

దరఖాస్తు తర్వాత రెండు దశల్లో వెరిఫికేషన్

NMMSS కోసం దరఖాస్తు చేసినంత మాత్రాన ప్రక్రియ పూర్తికాదు. విద్యార్థుల దరఖాస్తు ఫారమ్ వెరిఫికేషన్ కూడా అవుతుంది.  ఈ వెరిఫికేషన్ 2 దశల్లో పూర్తవుతుంది. ఇందులో మొదటి దశలో ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (INO) విద్యార్థుల అప్లికేషన్  వెరిఫై చేస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత రెండో దశలో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ (DNO) దరఖాస్తును వెరిఫై చేస్తారు. దీనిని సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.