JEE Main Paper 2 Results 2026: దేశవ్యాప్తంగా ఆర్టిటెక్చర్‌ , ప్లానింగ్‌ కోర్సుల్లో చేరాలని ఆకాంక్షిస్తున్న వేలాది మంది విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ, జేఈఈ మెయిన్ 2026 పేపర్ -2 ఫలితాలను అధికారికంగా వెల్లడించింది. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఈ పరీక్ష అత్యంత కీలకం. 

Continues below advertisement

జేఈఈ మెయిన్ 2026 పేపర్‌ -2 ఫలితాలను మే 5 రాత్రి సమయంలో విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను, స్కోరు కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన అధికారిక పోర్టల్‌ jeemain.nta.nic.inలో చూడవచ్చు. ఎన్‌టీఏ ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్‌ పద్ధతిలో నిర్వహించింది. తద్వారా విద్యార్థులు ఎక్కడి నుంచైనా తమ ఫలితాలను సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు. 

ఫలితాలను డౌన్‌లౌడ్ చేసుకోవడం ఎలా

స్కోర్ కార్డు డౌన్‌లోడ్‌ ప్రక్రియను అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ చాలా ఈజీ చేసింది. విద్యార్థులు ఈజీ స్టెప్స్‌ ఫాలో అయితే తమ మార్కులను తెలుసుకోవ్చచు. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ jemain.nta.nic.inను విజిట్ చేయాలి. హోమ్‌పేజీలో ఉన్న JEE Main BArh/BPlanning Scorecard PDF అనే లింక్‌పై క్లిక్ చేయాలి. లాగిన్ విండోలో అభ్యర్థి తన రిజిస్ట్రేషన్ నంబర్‌ లేదా రోల్ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి. వివరాలు సమర్పించిన తర్వాత స్కోర్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది. అభ్యర్థులు ఈ పీడీఎఫ్‌ ఫైల్‌ను డౌన్లోడ్ చేసుకొని, భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి. 

Continues below advertisement

స్కోర్ కార్డులో ఉండే వివరాలు 

డౌన్‌లోడ్ చేసిన స్కోర్‌ కార్డులో అభ్యర్థి పేరు, రోల్ నంబర్‌, సబ్జెక్ట్‌ల వారీగా వచ్చిన ఎన్‌టీఏ స్కోరు, మొత్తం స్కోరు, క్వాలిఫైయింగ్ స్టేటస్ వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. అభ్యర్థులు తమ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి సరి చూసుకోవాలి. 

మెరిట్ జాబితా, టాపర్ల వివరాలు 

ఫలితాలతోపాటు, ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థుల మెరిట్‌ జాబితాను కూడా ఎన్‌టీఏ విడుదల చేసింది. టాపర్ల జాబితాను కూడా అధికారిక వెబ్‌సైట్‌ నుంచి పీడీఎప్‌ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ జాబితాలో జాతీయ స్థాయిలో, రాష్ట్రాల వారీగా అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థుల వివరాలు ఉంటాయి. 

జేఈఈ మెయిన్ పేపర్ 2 ప్రాముఖ్యత ఏంటీ?

జేఈఈ మెయిన్ పరీక్ష రెండు పేపర్లుగా జరుగుతుంది. పేపర్‌ 1 ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కాగా, పేపర్ -2 అనేది బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తారు. దేశంలోని ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి ఈ ఫలితాలు ప్రామాణికంగా ఉంటాయి.