IWST Admissions: బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐడబ్ల్యూఎస్‌టీ) పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్ బీఈ, బీటెక్‌)  ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.


వివరాలు..


* పీజీ డిప్లొమా కోర్సు ఇన్‌ ఉడ్ అండ్ ప్యానెల్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ


కోర్సు వ్యవధి: ఒక సంవత్సరం.


అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్‌ డిగ్రీ (బీఎస్సీ కెమిస్ట్రీ/ ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ అగ్రికల్చర్/ ఫారెస్ట్రీ/ ఇంజినీరింగ్ బీఈ, బీటెక్‌) ఉత్తీర్ణులై ఉండాలి.


వయోపరిమితి: 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/ దివ్యాంగులకు వయోసడలింపులు వర్తిస్తాయి.


దరఖాస్తు ఫీజు: రూ.500. 


ఎంపిక విధానం:  అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 


దరఖాస్తుకు చివరితేదీ:  30.10.2023.


Notification & Application


Website


ALSO READ:


ఎన్‌ఐటీటీఆర్‌ చండీగఢ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌, వివరాలు ఇలా
చండీగఢ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్(సెల్ఫ్ స్పాన్సర్డ్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్ అండ్‌ అప్లైడ్ సైన్సెస్ (ఫిజిక్స్, మ్యాథమెటిక్స్) విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌,  2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 
దరఖాస్తు, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి..


సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి అక్టోబరు 2న ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 లోపు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇత వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...