<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!</title><atom:link href="https://telugu.abplive.com/education/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Wed, 9 Sep 2026 17:27:50 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Adilabad News: తండ్రితో కలిసి కిచిడి బండి నడుపుతూ ఎంబీబీఎస్ సీటు సాధించిన కుమారులు.. ABP Desam Exclusive]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443#respond</comments><pubDate>Wed, 9 Sep 2026 07:39:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shailender ]]></dc:creator><category><![CDATA[ నిజామాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/sons-of-adilabad-khichdi-vendors-defy-odds-to-secure-mbbs-seats-with-neet-rank-258443</guid><description><![CDATA[&lt;p&gt;వారిది మధ్య తరగతి కుటుంబం.. కుటుంబ పోషణ కోసం వారు కిచిడి బండి నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతి రోజు కష్టపడి కిచిడి అమ్ముతూ.. తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించారు. తండ్రికి చేదోడు వాదోడుగా కిచిడి బండి వద్ద ఉంటూ ఆ కుమారులు ఇంటర్ పూర్తి చేశారు. డాక్టర్ కావాలన్న లక్ష్యంతో రాత్రింబవళ్ళు కష్టపడి చదివి ఎంబీబీఎస్ సీటు సాధించడానికి నీట్ పరీక్ష రాశారు. కష్టాన్ని నమ్ముకున్న ఆ యువకులు నీట్ లో ర్యాంకు సాధించి ఎంబిబిఎస్ సీటు సంపాదించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఫుట్&amp;zwnj;పాత్ పై కిచిడి అమ్ముతూ నీట్ లో ర్యాంకు తెచ్చుకుని, ఎంబిబిఎస్ సీటు సంపాదించిన మహమ్మద్ బిలాల్, మహమ్మద్ షకిబ్ లపై ABP Desam Exclusive Story.&lt;/p&gt;
&lt;p&gt;ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ జావిద్, మహమ్మద్ ఆసిఫ్ అనే ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ ఈ ఇద్దరు నీట్ పరీక్ష రాసి ఎంబీబీఎస్ సీటు సాధించారు. వీరు ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ముందు కిచిడి బండి నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఆసిఫ్, జావిద్ ఇద్దరు అన్నతమ్ముళ్లు గత కొన్నేళ్లు గా కిచిడి బండి నడిపిస్తూ తమ పిల్లల్ని పక్కనే ఉన్న జడ్పీ పాఠశాలలో చదివించారు. పదవ తరగతి వరకు షకీబ్, బిలాల్ ఇంద్రవెల్లి జడ్పీ పాఠశాలలో చదువు పూర్తి చేసి స్థానికంగానే ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. చదువుకుంటూనే రోజు తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ కిచిడి బండి నడుపుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/456796c7a25dbed0739947a43b1603991788919493219233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రెండేళ్లు నీట్ కోసం ప్రిపేర్ అయ్యారు. రాత్రింబవళ్లు కష్టపడి చదివి నీట్ లో ర్యాంకు సాధించి.. ఎంబిబిఎస్ సీటు (MBBS Seat) సంపాదించారు. మహమ్మద్ ఆసిఫ్ కుమారుడు మహమ్మద్ బిలాల్ కు నీట్ లో ఆల్ ఇండియా ర్యాంకు 120325.. స్టేట్ లొ 1788 ర్యాంక్ రాగా. అలాగే మహమ్మద్ జావిద్ కుమారుడు మహమ్మద్ షకీబ్ &amp;nbsp;నీట్ లో ఆల్ ఇండియా ర్యాంక్ 147283, రాగా.. స్టేట్ లో 2583 ర్యాంక్ సాధించారు. ఫస్ట్ ఫేజ్ లో కరీంనగర్ ప్రతిమ మెడికల్ కళాశాలలో మహమ్మద్ షకిబ్ కు ఎంబిబిఎస్ సీటు రాగా, నిర్మల్ మెడికల్ కళాశాలలో మహమ్మద్ బిలాల్ కు ఎంబిబిఎస్ సీటు వచ్చింది. త్వరలో ఈ ఇద్దరు సెకండ్, థర్డ్ ఫేజ్ తరువాత తరగతులకు హాజరుకానున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/d3986e90579e7e0ff90d0891a2d8e8c21788919621797233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఇద్దరు అన్నదమ్ముల కుమారులు ఎంబిబిఎస్ సీటు సాధించడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడ్డ దానికి ఫలితం దక్కిందన్నారు. వీరికి ఎంబిబిఎస్ సీటు రావడంతో ఆదిలాబాద్ మైనార్టీ విభాగం నాయకులు వారిని సత్కరించారు. ప్రభుత్వ విప్ మహమ్మద్ షబ్బీర్ అలీతో పాటు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మాజీ మంత్రి జోగు రామన్న, సైతం శాలువాతో సత్కరించి అభినందించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/1936bd53623c5ad790ea23b2190e388e1788919655067233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మహమ్మద్ జావిద్, మహమ్మద్ ఆసిఫ్ ఈ ఇద్దరు అన్నదమ్ములు, కిచిడి బండి నడిపి తమ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ముల కుమారులు మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ వారికి చేదోడు వాదొడుగా ఉంటూ.. కష్టపడి చదివి ఎంబిబిఎస్ లో ఇద్దరు సైతం సీటు సంపాదించారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చని, తాము పడ్డ కష్టానికి తమ తల్లిదండ్రుల కష్టానికి ఫలితం దక్కిందని మహమ్మద్ షకీబ్, మహమ్మద్ బిలాల్ మరియు వారి తండ్రులు స్థానికులు ఏబీపీ దేశంకు వెల్లడించారు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చునని నిరూపించారు. స్థానికులు, వారి టీచర్లు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/57a0b99db9c33f9a3edd7fb5cdaa64501788919686153233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వీరి కష్టం అంతా ఇంతా కాదని, ఉదయం 3:30 గంటలకు లేచి కిచిడి తయారు చేసి 5:30గంటలకు అల్లాహు అక్బర్ అంటూ నమాజ్ చేసి 6 గంటల కళ్ల రెడీ అయి.. జడ్పి పాఠశాల ముందు రోడ్డుపై కిచిడి బండి పెట్టీ టిఫిన్ విక్రయిస్తారు. స్థానికులు ఈ ఇద్దరు అన్నదమ్ములను జావిద్ మాము, ఆసిఫ్ మాము అని ప్రేమగా పిలుస్తుంటారు. వారి కుమారులు షకీబ్ , బిలాల్ ఇద్దరు కూడా హాలిడే రోజు లేదా వారు లేని సమయాల్లోనూ, లేదా అంగడి రోజు బిజిగా ఉన్న సమయంలో ఈ బండి నడుపుతూ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ పని చేస్తారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/ee61dd311f7035f81d0fde737f187a951788919715897233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;కిచిడి అమ్మడం అయిపోయాక.. బయట ఖాళీగా తిరగకుండా ఇంట్లోనే ఉంటూ ఒక గదిలో కూర్చుని చదువుకుంటారు. ఇలా చదవడం వల్లే వారు పడ్డా కష్టానికి ఫలితం దక్కింది అంటున్నారు. ప్రతి ఒక్కరు తమ గమ్యానికి చేరుకోవాలనే లక్ష్యంతో ఉంటే.. కష్టపడి చదివితే తమ లక్ష్యాన్ని చేరుకోవచ్చని చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/fbe2d4493b2bec85bc9d9dd034571db81788922347189233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/1fcd426678457253e4e77b8ee85530b61788922370348233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/0b00f20e7a3d51ce08493c9121a4f3ad1788922403256233_original.jpeg&quot; /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/09/b8483987dc49b57f4992a5809e4a670b1788919419950233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[UK Student Visa Rules:  ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!]]></title><link>https://telugu.abplive.com/education/uk-student-visa-rules-2026-financial-requirement-hike-for-international-students-announced-258179</link><comments>https://telugu.abplive.com/education/uk-student-visa-rules-2026-financial-requirement-hike-for-international-students-announced-258179#respond</comments><pubDate>Sun, 6 Sep 2026 14:24:36 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/uk-student-visa-rules-2026-financial-requirement-hike-for-international-students-announced-258179</guid><description><![CDATA[&lt;p&gt;&lt;br /&gt;UK Student Visa Rules: &amp;nbsp;యూకేలో ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. నవంబర్ 30, 2026 నుండి అమల్లోకి వచ్చేలా యూకే స్టూడెంట్ వీసా నిబంధనలలో కీలక మార్పులను యూకే హోమ్ ఆఫీస్ ప్రకటించింది. ఈ కొత్త విదేశాంగ విధానం ప్రకారం.. అంతర్జాతీయ విద్యార్థులు వీసా పొందేందుకు తమ వద్ద ఉన్నట్లు చూపించాల్సిన మెయింటనెన్స్ ఫండ్స్&amp;zwnj; మొత్తాన్ని పెంచారు. ఈ నిర్ణయం వల్ల విదేశీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.&lt;/p&gt;
&lt;h3&gt;పెరిగిన మెయింటనెన్స్ ఫండ్స్&lt;/h3&gt;
&lt;p&gt;విద్యార్థులు తమ కాలేజీ ట్యూషన్ ఫీజులు, వీసా ఫీజులు, హెల్త్ సర్&amp;zwnj;ఛార్జీలతో సంబంధం లేకుండా ఈ నిర్వహణ నిధులను బ్యాంకు ఖాతాల్లో చూపించాల్సి ఉంటుంది. కోర్సు చదివే కాలన్ని బట్టి గరిష్టంగా 9 నెలల జీవన వ్యయాలను నిరూపించాలి.&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!&quot; href=&quot;https://telugu.abplive.com/education/mahatma-jyothiba-phule-overseas-vidya-nidhi-telangana-offers-up-to-rs-20-lakh-scholarship-for-bc-ebc-students-257513&quot; target=&quot;_self&quot;&gt;విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;లండన్&amp;zwnj;లో చదివే విద్యార్థులకు ప్రస్తుతం నెలకు సుమారు రూ.1.95 లక్షలు మెయింటనెన్స్ ఫండ్స్ ఉండగా, నవంబర్ 30 నుంచి ఇది సుమారు రూ.2.01 లక్షలు పెరగనుంది. దీని ప్రకారం 9 నెలల కాలానికి గరిష్టంగా రూ.18.06 లక్షలు నిధులు అకౌంట్&amp;zwnj;లో చూపించాలి. &amp;nbsp;లండన్ బయట చదివే విద్యార్థులకు ప్రస్తుతం నెలకు రూ.1.49 లక్షలు ఉండగా, నవంబర్ 30 నుండి రూ.1.53 లక్షలకు పెరిగింది. దీనితో 9 నెలల కాలానికి మొత్తం రూ.14 లక్షలు అకౌంట్&amp;zwnj;లో చూపించాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read:&amp;nbsp; &lt;a title=&quot;నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్&amp;zwnj;లో ట్రాఫిక్ ఆంక్షలు&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/neet-pg-exam-marathon-run-hyderabad-traffic-advisory-and-alternate-routes-released-257580&quot; target=&quot;_self&quot;&gt;నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్&amp;zwnj;లో ట్రాఫిక్ ఆంక్షలు&lt;/a&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;నవంబర్ 30 నుంచి&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;నవంబర్ 29, 2026 లోపు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు పాత నిబంధనలే వర్తిస్తాయి. నవంబర్ 30 లేదా ఆ తర్వాత దరఖాస్తు చేసుకునే వీసాలకు మాత్రమే ఈ కొత్త ఫండ్ నిబంధనలు అమలవుతాయి. యూకేలోని స్థానిక విద్యార్థుల రుణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతీ ఏటా ఈ సమీక్ష చేస్తారని, విదేశీ విద్యార్థుల విసా నిబంధనలు దుర్వినియోగం కాకుండా అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యూకే హోమ్ ఆఫీస్ స్పష్టం చేసింది.&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది&quot; href=&quot;https://telugu.abplive.com/telangana/hyderabad/student-denied-entry-as-neet-pg-2026-in-sheriguda-ranga-reddy-district-257597&quot; target=&quot;_self&quot;&gt;మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/09/06/dea5dd0bea16afd22576105be10b2b5717886826323121409_original.jpg" width="220"/></item><item><title><![CDATA[NEET PG Exam 2026: మద్యం మత్తులో నీట్ ఎగ్జామ్ రాసేందుకు వెళ్లిన విద్యార్థి.. వెనక్కి పంపిన సిబ్బంది]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/student-denied-entry-as-neet-pg-2026-in-sheriguda-ranga-reddy-district-257597</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/student-denied-entry-as-neet-pg-2026-in-sheriguda-ranga-reddy-district-257597#respond</comments><pubDate>Sun, 30 Aug 2026 10:33:34 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/student-denied-entry-as-neet-pg-2026-in-sheriguda-ranga-reddy-district-257597</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక నీట్ పీజీ 2026 ఎంట్రన్స్ టెస్ట్ ఆదివారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే, రంగారెడ్డి జిల్లా శేరిగూడలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఒక అభ్యర్థి మద్యం సేవించి నీట్ పీజీ పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్&amp;zwnj;కు వచ్చాడు. అతని ప్రవర్తన గమనించిన పరీక్షా కేంద్ర సిబ్బంది, మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించి ఆ విద్యార్థిని లోపలికి అనుమతించకుండా వెనక్కి పంపించివేశారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా మొత్తం 1,300 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 56 &amp;nbsp;కేంద్రాలను ఏర్పాటు చేసి ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. ఇక పరీక్షా సమయానికి అభ్యర్థులు సకాలంలో చేరుకోవడానికి ప్రయత్నించడంతో పలు ప్రధాన మార్గాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, విద్యార్థులు కొంత అసౌకర్యానికి గురయ్యారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నీట్ పీజీ ఎగ్జామ్.. అక్రమాలకు తావులేకుండా పటిష్ట భద్రత, సంస్కరణలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;పరీక్షల నిర్వహణలో పారదర్శకత, భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు. ఎన్&amp;zwnj;బీఈఎంఎస్, టెక్నాలజీ భాగస్వాముల సంసిద్ధతను సమీక్షించిన ఆయన, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వచ్చే పేపర్ లీక్ వదంతులను నమ్మవద్దని, పరీక్షకు కొద్ది సమయం ముందు మాత్రమే అత్యంత సురక్షితమైన, ఎన్&amp;zwnj;క్రిప్టెడ్ విధానంలో ఫైనల్ ఎగ్జామ్ పేపర్ ఎంపిక చేస్తామని తెలిపారు. కేవలం అధికారిక ప్రకటనలనే విశ్వసించాలని అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈసారి పరీక్షల సమగ్రతను కాపాడేందుకు పటిష్ఠమైన భద్రతా ఫ్రేమ్&amp;zwnj;వర్క్&amp;zwnj;ను అధికారులు అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సీసీటీవీ నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్, సిగ్నల్ జ్యామర్లు, డైనమిక్ కంప్యూటర్ కేటాయింపు వంటి చర్యలు చేపట్టారు. పరీక్షల ప్రత్యక్ష పర్యవేక్షణకు సెంట్రల్, రీజనల్ కమాండ్ సెంటర్లను ఏర్పాటు చేసి, 60,000 మందికి పైగా సిబ్బందిని నియమించారు. వేలిముద్రలు సరిపోలని పక్షంలో ఐరిస్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్&amp;zwnj;ను ప్రత్యామ్నాయంగా తీసుకుంటూ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టైమ్ పెంచి నీట్ పీజీ నిర్వహణ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;విద్యార్థుల సౌలభ్యం కోసం సొంత రాష్ట్రంతో పాటు మరో రెండు రాష్ట్రాలను పరీక్షా కేంద్రాలుగా ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. పరీక్ష జరిగే నగరం వివరాలను 3 వారాల ముందే తెలియజేయడంతో ప్రయాణ ఏర్పాట్లకు తగినంత సమయం లభించింది. పరీక్షా విధానంలో మార్పులు చేసి 210 నిమిషాల్లో 180 ప్రశ్నలకు సమాధానమిచ్చేలా సమయాన్ని పెంచారు. రిజిస్ట్రేషన్, పరీక్ష నిర్వహణలో ఆధార్ ఆధారిత గుర్తింపును నిర్వాహకులు తప్పనిసరి చేశారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/32c3b8c566308e6305c73736303808511788066159618233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[NEET PG Exam: నీట్ పీజీ ఎగ్జామ్, మారథాన్ నిర్వహణ.. నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు]]></title><link>https://telugu.abplive.com/telangana/hyderabad/neet-pg-exam-marathon-run-hyderabad-traffic-advisory-and-alternate-routes-released-257580</link><comments>https://telugu.abplive.com/telangana/hyderabad/neet-pg-exam-marathon-run-hyderabad-traffic-advisory-and-alternate-routes-released-257580#respond</comments><pubDate>Sun, 30 Aug 2026 06:35:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ హైదరాబాద్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/hyderabad/neet-pg-exam-marathon-run-hyderabad-traffic-advisory-and-alternate-routes-released-257580</guid><description><![CDATA[&lt;p&gt;హైదరాబాద్:&amp;nbsp;నీట్ పీజీ (NEET PG 2026) పరీక్ష జరగనున్న నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 30న) హైదరాబాద్&amp;zwnj; నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్&amp;zwnj; రద్దీ ఉండే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. నేటి ఉదయం 7 గంటల నుంచే మెయిన్ జంక్షన్ల వద్ద వాహనాల రాకపోకలు పెరిగే అవకాశం ఉండటంతో నగరంలోని 4 కీలక పరీక్షా కేంద్రాల సమీపంలో ప్రత్యేక ట్రాఫిక్ నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ప్యారడైజ్ సర్కిల్, తాజ్&amp;zwnj;మహల్ జంక్షన్, కింగ్ కోఠి, బండ్లగూడలతో పాటు రేతిబౌలి, నానల్&amp;zwnj;నగర్, దుర్గానగర్, కేఎఫ్&amp;zwnj;సీ జంక్షన్ల మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;హైదరాబాద్ మారథాన్ రన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు ఆదివారం ఉదయాన్నే నిర్వహించే &quot;హైదరాబాద్ రన్నర్స్ మారథాన్ రన్-2026&quot; దృష్ట్యా షేక్&amp;zwnj;పేట్&amp;zwnj;లోని జి. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజ్ కేంద్రానికి వెళ్లే విద్యార్థుల కోసం పోలీసులు ప్రత్యేక ప్రత్యామ్నాయ మార్గాలను కేటాయించారు. బోరబండ, మధురానగర్, కల్యాణ్&amp;zwnj;నగర్, యూసుఫ్&amp;zwnj;గూడ ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు జూబ్లీహిల్స్ మీదుగా చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సైబరాబాద్ వైపు నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి (Cable Bridge) మీదుగా వచ్చే వాహనదారులు రోడ్ నంబర్ 45- 51 రూట్ ఎంచుకోవాలని, బంజారాహిల్స్ రోడ్ నంబర్లు 14, 10, 12 నుంచి ప్రయాణించే వారు అగ్రసేన్ ఐలాండ్ - ఫిల్మ్&amp;zwnj;నగర్ రోడ్డును ఉపయోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.&lt;/p&gt;
&lt;blockquote class=&quot;twitter-tweet&quot;&gt;
&lt;p dir=&quot;ltr&quot; lang=&quot;en&quot;&gt;&lt;a href=&quot;https://x.com/hashtag/HYDTPinfo?src=hash&amp;amp;ref_src=twsrc%5Etfw&quot;&gt;#HYDTPinfo&lt;/a&gt;&lt;br /&gt;🚦 Traffic Advisory | NEET-PG Examination 2026&lt;br /&gt;&lt;br /&gt;Commuters, please make a note of the Traffic Advisory in connection with the NEET-PG Examination 2026 being conducted at various centres in Hyderabad on 30.08.2026.&lt;br /&gt;&lt;br /&gt;⏰ Expected time of moderate traffic congestion: 09:00&amp;hellip; &lt;a href=&quot;https://t.co/KeaB6T5SXy&quot;&gt;pic.twitter.com/KeaB6T5SXy&lt;/a&gt;&lt;/p&gt;
&amp;mdash; Hyderabad Traffic Police (@HYDTP) &lt;a href=&quot;https://x.com/HYDTP/status/2093708144337986023?ref_src=twsrc%5Etfw&quot;&gt;August 29, 2026&lt;/a&gt;&lt;/blockquote&gt;
&lt;p&gt;
&lt;script src=&quot;https://platform.x.com/widgets.js&quot; async=&quot;&quot; charset=&quot;utf-8&quot;&gt;&lt;/script&gt;
&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ ఏర్పాటు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఏదైనా అత్యవసర ప్రయాణం లేదా సమాచారం కోసం ట్రాఫిక్ హెల్ప్&amp;zwnj;లైన్ నంబర్&amp;zwnj; 9010203626ను సంప్రదించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా పరీక్ష రాసే విద్యార్థులు కాస్త ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాలను కాకుండా సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ఎగ్జామ్ సెంటర్లకు ముందుగానే చేరేకోవాలని పోలీసులు విజప్తి చేశారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎంబీబీఎస్ విద్యార్థిని విషం తాగి ఆత్మహత్య&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;లోని ఆర్&amp;zwnj;టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో ఉన్న అపరాజిత హాస్టల్&amp;zwnj;లో తీవ్ర విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో నీట్ పీజీ ఎగ్జామ్ ఉండగా, తీవ్ర మానసిక ఒత్తిడి తట్టుకోలేక కర్నూలుకు చెందిన ప్రముఖ వ్యాపారి రామ్మోహన్ రెడ్డి ఏకైక కుమార్తె, ఎంబీబీఎస్ విద్యార్థిని యశ్విత విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. గత 6నెలలుగా ఆమె హైదరాబాద్&amp;zwnj;లోనే ఉంటూ పరీక్షకు సిద్ధమవుతోంది. పరీక్షల భయమే కారణమని భావిస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/30/9daf99ed606a59b25c8595b3d21fb3f21788035297845233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: విదేశాల్లో చదువులకు తెలంగాణ సర్కార్ సాయం.. బీసీ, ఈబీసీ విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్ షిప్!.. పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/education/mahatma-jyothiba-phule-overseas-vidya-nidhi-telangana-offers-up-to-rs-20-lakh-scholarship-for-bc-ebc-students-257513</link><comments>https://telugu.abplive.com/education/mahatma-jyothiba-phule-overseas-vidya-nidhi-telangana-offers-up-to-rs-20-lakh-scholarship-for-bc-ebc-students-257513#respond</comments><pubDate>Sat, 29 Aug 2026 09:52:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/mahatma-jyothiba-phule-overseas-vidya-nidhi-telangana-offers-up-to-rs-20-lakh-scholarship-for-bc-ebc-students-257513</guid><description><![CDATA[&lt;p&gt;Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi: తెలంగాణ ప్రభుత్వం బీసీ, ఈబీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. విదేశాల్లో ఉన్నత విద్య (మాస్టర్స్, పీహెచ్&amp;zwnj;డీ) చదవాలనుకునే విద్యార్థుల కోసం మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధి (Mahatma Jyothiba Phule Overseas Vidya Nidhi) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి సెప్టెంబర్ 1,2026 నుంచి అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులు ఆగస్టు,సెప్టెంబర్&amp;zwnj; ఫాల్&amp;zwnj; సెషన్&amp;zwnj; కోసం అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సెప్టెంబర్&amp;zwnj; 1 నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ముఖ్యమైన ప్రయోజనాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;ol&gt;
&lt;li&gt;ఈ పథకం కింద ఎంపికైన ప్రతి విద్యార్థికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు స్కాలర్&amp;zwnj;షిప్ గ్రాంట్&amp;zwnj; ఇస్తారు. &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;విదేశాలకు వెళ్లేందుకు వన్-వే ఎకానమీ క్లాస్ విమాన టికెట్ ఛార్జీలు ఇస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;వీసా ప్రక్రియకు సంబంధించిన ఛార్జీలను రీయింబర్స్ చేస్తారు.&lt;/li&gt;
&lt;li&gt;ఈ గ్రాంటును రెండు విడతలుగా విద్యార్థి లేదా విదేశీ వర్సిటీ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేస్తారు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ol&gt;
&lt;p&gt;Also Read: &lt;a title=&quot;ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షల లోన్.. గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్ గురించి తెలుసా?&quot; href=&quot;https://telugu.abplive.com/education/guruji-student-credit-card-scheme-get-up-to-rs-15-lakh-education-loan-at-4-percent-interest-257469&quot; target=&quot;_self&quot;&gt;ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షల లోన్.. గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్ గురించి తెలుసా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;అర్హతలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;ul&gt;
&lt;li&gt;దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీసీ లేదా ఈబీసీ వర్గానికి చెందినవారై ఉండాలి.&lt;/li&gt;
&lt;li&gt;నోటిఫికేషన్ వచ్చే నాటికి 35 ఏళ్లలోపు వయస్సు ఉండాలి.&lt;/li&gt;
&lt;li&gt;కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షలు మించకూడదు.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఒక కుటుంబం నుండి ఒక్క విద్యార్థికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;జీఆర్&amp;zwnj;ఈ-260 లేదా జీమ్యాట్&amp;zwnj;-500 స్కోర్ ఉండాలి.&lt;/li&gt;
&lt;li&gt;టోఫెల్&amp;zwnj; -60 మార్కులు లేదా ఐఈఎల్&amp;zwnj;టీఎస్&amp;zwnj;-6.0 లేదా పీటీఈ-50 మార్కుల స్కోర్ ఏదైనా కలిగి ఉండాలి.&lt;/li&gt;
&lt;li&gt;పీజీ కోసం: ఇంజినీరింగ్, మేనేజ్&amp;zwnj;మెంట్, సైన్స్, అగ్రికల్చర్, మెడిసిన్, నర్సింగ్, హ్యుమానిటీస్&amp;zwnj;లో 60% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;పీహెచ్డీ కోసం: పీజీ కోర్సులో 60% మార్కులు సాధించాలి&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, జపాన్, న్యూజిలాండ్, ఫ్రాన్స్ వంటి గుర్తింపు పొందిన విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్ పొంది ఉండాలి.&lt;/li&gt;
&lt;li&gt;జీఆర్ఈ, జీమ్యాట్, TOEFEL/IELTS/PTE స్కోర్లు కలిగి ఉండాలి. &amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;p&gt;Also Read: &lt;a title=&quot;డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకు రూ.30 వేలు.. అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్&amp;zwnj;షిప్ అప్లై ప్రాసెస్ ఇదే!&quot; href=&quot;https://telugu.abplive.com/education/azim-premji-scholarship-2026-announced-eligibility-benefits-how-to-apply-for-degree-diploma-girls-257260&quot; target=&quot;_self&quot;&gt;డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకు రూ.30 వేలు.. అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్&amp;zwnj;షిప్ అప్లై ప్రాసెస్ ఇదే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;కావలసిన డాక్యుమెంట్స్&lt;/h3&gt;
&lt;ol&gt;
&lt;li&gt;ఆధార్ కార్డు, నేటివిటీ సర్టిఫికెట్ &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;కుల ధ్రువీకరణ పత్రం &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఆదాయ ధ్రువీకరణ పత్రం &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;SSC, ఇంటర్, డిగ్రీ/పీజీ మార్కుల మెమోలు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు&lt;/li&gt;
&lt;li&gt;GRE / GMAT, TOEFL / IELTS / PTE స్కోర్ కార్డులు&lt;/li&gt;
&lt;li&gt;విదేశీ యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్ &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;పాస్&amp;zwnj;పోర్ట్ కాపీ &amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;పాస్&amp;zwnj;పోర్ట్ సైజ్ ఫొటో, సంతకం&lt;/li&gt;
&lt;li&gt;బ్యాంకు పాస్&amp;zwnj;బుక్ (తెలంగాణలో)&lt;/li&gt;
&lt;/ol&gt;
&lt;p&gt;ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. వీరిలో 250 మంది బీసీ విద్యార్థులు, మిగతా 100 మంది ఈబీసీకి చెందినవారు ఉంటారని అధికారులు తెలిపారు. &amp;nbsp;అర్హులైన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను సందర్శించాలని తెలిపింది. &amp;nbsp;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS&quot; href=&quot;https://telugu.abplive.com/education/free-neet-ug-2027-long-term-coaching-offered-by-tgswreis-hyderabad-256173&quot; target=&quot;_self&quot;&gt;నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/29/fb600e9ec8b08401a61e0ac9f287b31217879766658301409_original.png" width="220"/></item><item><title><![CDATA[NTA New Director: NTAలో కీలక మార్పులు! కొత్త డైరెక్టర్లలో ఒకరు ఏపీ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేష్!]]></title><link>https://telugu.abplive.com/news/india/national-testing-agency-director-andhra-pradesh-ias-officer-prasanna-venkatesh-administrative-restructuring-257479</link><comments>https://telugu.abplive.com/news/india/national-testing-agency-director-andhra-pradesh-ias-officer-prasanna-venkatesh-administrative-restructuring-257479#respond</comments><pubDate>Fri, 28 Aug 2026 18:58:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/national-testing-agency-director-andhra-pradesh-ias-officer-prasanna-venkatesh-administrative-restructuring-257479</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;NTA New Director Prasanna Venkatesh:జా&lt;/strong&gt;తీయ పరీక్షల ఏజెన్సీని బలోపేతం చేసి, పునర్నిర్మించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇద్దరు డైరెక్టర్లను, ఒక జాయింట్ డైరెక్టర్&amp;zwnj;ను నియమించింది. ఆగస్టు 27న ఈ ఉత్తర్వు జారీ కాగా, నియామకాల వివరాలు ఈరోజు వెల్లడయ్యాయి. పోటీ పరీక్షలకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో ఎన్&amp;zwnj;టీఏపై కొనసాగుతున్న పరిశీలన, ఏజెన్సీని సంస్కరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మధ్య ఈ చర్య తీసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;జాతీయ పరీక్షా సంస్థలో కొత్త నియామకాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఐపీఎస్ అధికారి రవి కుమార్ సింగ్, ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ &amp;nbsp;డైరెక్టర్లుగా నియమితులయ్యారు. 2016 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన అమిత్ సమదరియా జాయింట్ డైరెక్టర్&amp;zwnj;గా నియమితులయ్యారు.&amp;nbsp;ఉత్తర్వు జారీ అయిన 3 వారాలలోగా ఆ ముగ్గురు అధికారులు తమ విధులను చేపట్టాలని ఆదేశించారు. నిర్దేశించిన సమయంలోగా వారు విధుల్లో చేరని పక్షంలో, వారిని కేంద్ర సిబ్బంది నియామక పథకం నుంచి తొలగించే ప్రక్రియను ప్రారంభిస్తామని కూడా పేర్కొన్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;కొత్తగా నియమితులైన అధికారులు ఎవరు?&lt;/h2&gt;
&lt;p&gt;ఐపీఎస్ అధికారి రవి కుమార్ సింగ్ ఐదేళ్ల కాలానికి ఎన్&amp;zwnj;టీఏ డైరెక్టర్&amp;zwnj;గా నియమితులయ్యారు. ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేష్ వి కూడా ఐదేళ్ల కాలానికి డైరెక్టర్&amp;zwnj;గా నియమితులయ్యారు. 2016 బ్యాచ్ ఐఆర్&amp;zwnj;ఎస్ అధికారి అయిన అమిత్ సమదరియా నాలుగేళ్ల కాలానికి జాయింట్ డైరెక్టర్&amp;zwnj;గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ నియామకాలను, పరీక్షల సంస్థ పరిపాలనా నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా పరిగణిస్తున్నారు.&lt;/p&gt;
&lt;h2&gt;ఎవరీ ప్రసన్న వెంకటేష్&amp;zwnj;?&lt;/h2&gt;
&lt;p&gt;తమిళనాడు రాష్ట్రంలోని తిరిచీ చెందిన ప్రసన్న వెంకటేష్&amp;zwnj; 2012 బ్యాచ్&amp;zwnj; ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్ కేడర్&amp;zwnj;లో సర్వీస్ ప్రారంభించి ఇప్పుడు ఎన్టీఏ డైరెక్టర్&amp;zwnj; స్థాయికి ఎదిగారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్&amp;zwnj;గా పని చేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్&amp;zwnj;గా కూడా తనదైన ముద్రవేశారు. ఇప్పుడు ఎన్డీఏ డైరెక్టర్&amp;zwnj;గా ఐదేళ్లు పని చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;జాతీయ పరీక్షా సంస్థ సంస్కరణల కింద మరిన్ని నియామకాలు&lt;/h2&gt;
&lt;p&gt;పునర్&amp;zwnj;వ్యవస్థీకరణ ప్రక్రియ కేవలం సీనియర్ ఎగ్జిక్యూటివ్ నియామకాలకే పరిమితం కాలేదు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నాలుగు జనరల్ మేనేజర్, 16 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి కూడా ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టుల కోసం యూపీఎస్సీ పోర్టల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఏజెన్సీ సంస్థాగత, పరిపాలనా సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ అదనపు నియామకాల లక్ష్యం.&lt;/p&gt;
&lt;h2&gt;47 మంది అధికారుల తొలగింపు&lt;/h2&gt;
&lt;p&gt;NTA అధికారులపై ఇంతకుముందు తీసుకున్న ప్రధాన చర్యల కొనసాగింపుగా ఈ కొత్త చర్యలు తీసుకున్నారు. జూలై 25న, నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించి ఆ సంస్థ 47 మంది అధికారులను తొలగించింది. ఆ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పరీక్ష చుట్టూ నెలకొన్న వివాదం, అవకతవకల ఆరోపణలపై ఈ చర్య తీసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏంటీ నీట్ పేపర్ లీక్ కేసు?&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ వివాదం, మే 3, 2026న జరిగిన నీట్ యూజీ 2026 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించినది. ఈ వివాదంతో ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షను రద్దు చేసి, తిరిగి పరీక్షను నిర్వహించాయి. ఈ విషయం విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది, దీని ఫలితంగా బాధ్యులపై జవాబుదారీతనం, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనలు జరిగాయి. ఈ వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది, ఈ కాలంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు రిపోర్టులు వచ్చాయి.&lt;/p&gt;
&lt;p&gt;ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రదర్శనలతో సహా, ఈ నిరసనలు వారాల తరబడి కొనసాగాయి. కాక్రోచ్&amp;zwnj; జనతా పార్టీ ఒక నెలపాటు నిరసన తెలపగా, సోనమ్ వాంగ్&amp;zwnj;చుక్ 26 రోజులపాటు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరసనలు ఫలితాలనిచ్చాయి. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.&lt;/p&gt;
&lt;h2&gt;సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ప్రస్తుతం పేపర్ లీక్&amp;zwnj;పై దర్యాప్తు చేస్తోంది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఈ దర్యాప్తు జరుగుతోంది. ఎందుకంటే, దర్యాప్తు అధికారులు ఈ లీక్&amp;zwnj;కు సంబంధించిన విస్తృత నెట్&amp;zwnj;వర్క్&amp;zwnj;ను, పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో 13 మంది నిందితులను అరెస్టు చేశారు. సీబీఐ త్వరలోనే ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.&lt;/p&gt;
&lt;h2&gt;NTA పునర్నిర్మాణం ఎందుకు అవసరమైంది?&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;జాతీయ పరీక్షల ఏజెన్సీ అనేక ప్రధాన ప్రవేశ, పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. అందువల్ల, దేశవ్యాప్తంగా విద్యాసంస్థలలో ప్రవేశం కోరుకునే లక్షల మంది విద్యార్థులకు దీని పనితీరు కీలకం.&amp;nbsp;ఇద్దరు డైరెక్టర్లు, ఒక జాయింట్ డైరెక్టర్&amp;zwnj;ను నియమించడంతోపాటు, జనరల్ మేనేజర్, &amp;nbsp;ఒక యంగ్&amp;zwnj; ప్రొఫెషనల్&amp;zwnj; ఎక్స్&amp;zwnj;పర్ట్&amp;zwnj;ను నియమించాలనే ప్రతిపాదన, ఏజెన్సీని &amp;nbsp;మరింత బలోపేతం చేసే దిశగా ఒక ప్రధాన ముందడుగుగా చెబుతున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/0db588b17e7ed28053e770f170b945461787923685270215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Guruji Student Credit Card Scheme:  ఉన్నత చదువుల కోసం రూ.15 లక్షల లోన్.. గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీమ్ గురించి తెలుసా?]]></title><link>https://telugu.abplive.com/education/guruji-student-credit-card-scheme-get-up-to-rs-15-lakh-education-loan-at-4-percent-interest-257469</link><comments>https://telugu.abplive.com/education/guruji-student-credit-card-scheme-get-up-to-rs-15-lakh-education-loan-at-4-percent-interest-257469#respond</comments><pubDate>Fri, 28 Aug 2026 18:14:05 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/guruji-student-credit-card-scheme-get-up-to-rs-15-lakh-education-loan-at-4-percent-interest-257469</guid><description><![CDATA[&lt;p&gt;Guruji Student Credit Card Scheme: ఈ రోజుల్లో చదువులంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. చాలా మంది విద్యార్థులు కాలేజీ ఫీజులు, పుస్తకాలు, ఇతర అవసరాలను డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి విద్యార్థులకు సహాయం చేయడానికి, ఝార్ఖండ్ ప్రభుత్వం గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డు స్కీ్మ్ ప్రారంభించింది. ఈ పథకం కింద, అర్హులైన విద్యార్థులు ఉన్నత విద్య కోసం రూ.15 లక్షల వరకు విద్యా రుణాన్ని పొందవచ్చు. ఈ రుణాన్ని ఎలాంటి పూచీకత్తు లేకుండా అందిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;&amp;nbsp;ఉన్నత విద్యకు డబ్బులు లేకపోవడంతో మధ్యలోనే ఆపేస్తుంటారు విద్యార్థులు. అలాంటి వారి విద్యకు అంతరాయం కలగకుండా చూడటమే గురూజీ స్టూడెంట్ స్కీమ్ ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకం కింద డిప్లొమా, గ్రాడ్యుయేషన్, ఉన్నత చదువుల కోసం గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు విద్యా రుణాలను పొందవచ్చు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?&lt;/h3&gt;
&lt;p&gt;ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి.. డిప్లొమా విద్యార్థులు ఝార్ఖండ్&amp;zwnj;లోని గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేషన్ లేదా ఉన్నత విద్య కోసం, ఝార్ఖండ్&amp;zwnj;లో గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 10, 12వ తరగతులు రెండింటిలోనూ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసే సమయానికి విద్యార్థి వయస్సు 40 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. అంతేకాకుండా, విద్యార్థులు జాయిన్ అయ్యే కాలేజీ లేదా విద్యాసంస్థ ఈ పథకానికి అర్హత కలిగి ఉండాలి.&lt;/p&gt;
&lt;h3&gt;ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj; దరఖాస్తు విధానం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;విద్యార్థులు అధికారిక గురూజీ స్టూడెంట్ క్రెడిట్ కార్డ్ పోర్టల్&amp;zwnj;లో అప్లై చేసుకోవచ్చు. ముందుగా, రిజిస్టరేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థి పేరు, అడ్సస్, ఆధార్, మొబైల్ నెంబర్, కాలేజీ, కోర్సు, బ్యాంకు వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వార రుణం కోసం బ్యాంకును ఎంచుకోవాలి.&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకు రూ.30 వేలు.. అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్&amp;zwnj;షిప్ అప్లై ప్రాసెస్ ఇదే!&quot; href=&quot;https://telugu.abplive.com/education/azim-premji-scholarship-2026-announced-eligibility-benefits-how-to-apply-for-degree-diploma-girls-257260&quot; target=&quot;_self&quot;&gt;డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకు రూ.30 వేలు.. అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్&amp;zwnj;షిప్ అప్లై ప్రాసెస్ ఇదే!&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;కావాల్సిన డాక్యుమెంట్స్?&lt;/h3&gt;
&lt;p&gt;అప్లై చేసుకున్న సమయంలో 10, 12వ తరగతి మార్క్ షీట్లు, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి. కాలేజీ అడ్మిషన్ రుజువు, ఫీజుకు సంబంధించిన డాక్యుమెంట్, బ్యాంకు అకౌంట్, అవసరమైన పత్రాలను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. &amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక&quot; href=&quot;https://telugu.abplive.com/news/india/niti-aayog-report-8-7-crore-indian-youth-not-in-education-employment-training-vikasit-bharat-2047-257046&quot; target=&quot;_self&quot;&gt;8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;లోన్, వడ్డీ &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ స్కీమ్ కింద రూ.15 లక్షల వరకు ఎడ్యుకేషన్ రుణం పొందవచ్చు. ప్రభుత్వ వడ్డీ రాయితీ తర్వాత విద్యార్థులకు వడ్డీ రేటు 3 నుంచి 4 శాతం వరకు ఉండొచ్చు. లోన్ అప్రూవ్ &amp;nbsp;బ్యాంకు వెరిఫికేషన్, నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. &amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS&quot; href=&quot;https://telugu.abplive.com/education/free-neet-ug-2027-long-term-coaching-offered-by-tgswreis-hyderabad-256173&quot; target=&quot;_self&quot;&gt;నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/28/d2325924ad26c61c44f33d307c1c7f0e17879162026081409_original.png" width="220"/></item><item><title><![CDATA[Azim Premji Scholarship 2026: డిగ్రీ, డిప్లొమా విద్యార్థినులకు రూ.30 వేలు.. అజీమ్ ప్రేమ్ జీ స్కాలర్‌షిప్ అప్లై ప్రాసెస్ ఇదే!]]></title><link>https://telugu.abplive.com/education/azim-premji-scholarship-2026-announced-eligibility-benefits-how-to-apply-for-degree-diploma-girls-257260</link><comments>https://telugu.abplive.com/education/azim-premji-scholarship-2026-announced-eligibility-benefits-how-to-apply-for-degree-diploma-girls-257260#respond</comments><pubDate>Wed, 26 Aug 2026 12:31:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Satyaprasad Bandaru ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/azim-premji-scholarship-2026-announced-eligibility-benefits-how-to-apply-for-degree-diploma-girls-257260</guid><description><![CDATA[&lt;p&gt;Azim Premji Scholarship 2026: పిల్లల ఉన్నత విద్య ఖర్చు చాలా కుటుంబాలకు ఒక పెద్ద సవాలు. ముఖ్యంగా కుమార్తె గ్రాడ్యుయేట్ చదువుల కోసం ఇంటి నుండి దూరంగా వెళ్లవలసి స్తే, ఆ ఖర్చు మరింత పెరుగుతుంది. అటువంటి విద్యార్థుల కోసం, అజీమ్ ప్రేమ్&amp;zwnj;జీ ఫౌండేషన్.. 'అజీమ్ ప్రేమ్&amp;zwnj;జీ స్కాలర్&amp;zwnj;షిప్ 2026-27' అవకాశాన్ని అందిస్తోంది. ఈ స్కాలర్&amp;zwnj;షిప్&amp;zwnj;కు, అర్హులైన విద్యార్థినులకు వారి &amp;nbsp;అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తయ్యేంత వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?&lt;/h3&gt;
&lt;p&gt;అజీమ్ ప్రేమ్&amp;zwnj;జీ స్కాలర్&amp;zwnj;షిప్ 2026ను దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల, కాలేజీ నుండి టెన్త్, ఇంటర్ కోర్సులను పూర్తి చేసిన రెగ్యూలర్ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్&amp;zwnj;షిప్&amp;zwnj;కు అర్హులు. అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి దేశంలో గుర్తింపు పొందిన ప్రభుత్వ లేదా ప్రైవేట్ కాలేజీ, యూనివర్సిటీలో రెండు నుంచి ఐదు సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులో ఫస్ట్ ఇయర్&amp;zwnj;లో రెగ్యులర్ అడ్మిషన్ పొందాలి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అజీమ్ ప్రేమ్&amp;zwnj;జీ స్కాలర్&amp;zwnj;షిప్ కింద, అర్హులైన విద్యార్థినులకు ఏడాదికి రూ.30,000 ఆర్థిక సహాయం అందిస్తారు. కోర్సు వ్యవధిని బట్టి, స్కాలర్ షిప్ రెండు నుంచి ఐదేళ్ల వరకు కొనసాగుతుంది. ఈ స్కాలర్&amp;zwnj;షిప్ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులు, ఇతర విద్యా ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS&quot; href=&quot;https://telugu.abplive.com/education/free-neet-ug-2027-long-term-coaching-offered-by-tgswreis-hyderabad-256173&quot; target=&quot;_self&quot;&gt;నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఎలా అప్లై చేసుకోవాలి?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;2026 బ్యాచ్ కోసం ఆగస్టు 10 నుంచి 31, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో మాత్రమే ఉంటాయి. దరఖాస్తు సమయంలో పాస్&amp;zwnj;పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్&amp;zwnj;లు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్&amp;zwnj;బుక్, 10, 12వ తరగతి మార్క్ షీట్లు, కాలేజీ అడ్మిషన్ ఫీజు రుజువు, బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా ట్యూషన్ ఫీజు రసీదు, అవసరమైన పత్రాలను తప్పనిసరిగా అప్&amp;zwnj;లోడ్ చేయాలి. &amp;nbsp;అధికారిక వెబ్&amp;zwnj;సైట్ azimpremjifoundation.org లో స్కాలర్ షిప్ అప్లై చేసుకోవచ్చు. &amp;nbsp;&lt;br /&gt;&lt;br /&gt;Also Read: &lt;a title=&quot;అక్టోబర్&amp;zwnj;లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?&quot; href=&quot;https://telugu.abplive.com/jobs/ap-dsc-notification-2026-teacher-posts-recruitment-syllabus-perspectives-in-education-educational-psychology-256012&quot; target=&quot;_self&quot;&gt;అక్టోబర్&amp;zwnj;లో వచ్చే డీఎస్సీ సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;h3&gt;&amp;nbsp;విద్యార్థినులకు రూ.30 వేల స్కాలర్ షిప్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అమ్మాయిల హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించేందుకు అజీం ప్రేమ్&amp;zwnj;జీ ఫౌండేషన్&amp;zwnj; ఇస్తున్న స్కాలర్&amp;zwnj;షిప్&amp;zwnj;పై డ్వాక్రా మహిళలకు అవగాహన కల్పించాలని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్&amp;zwnj; ఆదేశించారు. డిగ్రీ ఫస్టియర్ చదివే ప్రతి విద్యార్థినీ అప్లై చేసుకునేలా వెలుగు సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన ప్రతి విద్యార్థినికీ రూ.30 వేలు ఉపకారవేతనం అందిస్తారన్నారు. తొలి విడతలో ఆగస్టు 31 వరకు, రెండో విడతలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a title=&quot;NMMSS స్కాలర్&amp;zwnj;షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి&quot; href=&quot;https://telugu.abplive.com/education/nmmss-scholarship-registration-starts-apply-by-august-31-know-all-details-255891&quot; target=&quot;_self&quot;&gt;NMMSS స్కాలర్&amp;zwnj;షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి&lt;/a&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/26/504b526b7eb1e74fb1c87213889178f017877223605411409_original.png" width="220"/></item><item><title><![CDATA[NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక]]></title><link>https://telugu.abplive.com/news/india/niti-aayog-report-8-7-crore-indian-youth-not-in-education-employment-training-vikasit-bharat-2047-257046</link><comments>https://telugu.abplive.com/news/india/niti-aayog-report-8-7-crore-indian-youth-not-in-education-employment-training-vikasit-bharat-2047-257046#respond</comments><pubDate>Sun, 23 Aug 2026 20:56:47 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/niti-aayog-report-8-7-crore-indian-youth-not-in-education-employment-training-vikasit-bharat-2047-257046</guid><description><![CDATA[&lt;p&gt;దేశంలో యువత విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ఆందోళన పెంచుతోంది. ఈ నివేదిక ప్రకారం, 15 నుంచి 29 ఏళ్ల వయసులో ఉన్న దాదాపు 8.7 కోట్ల మంది భారత యువత చదువు, ఉద్యోగ చేయడం, లేదా ఏదైనా కోర్సులు, శిక్షణ తీసుకోవడం లేదు. ఉపాధి, నైపుణ్యాభివృద్ధిలో దీనిని అతిపెద్ద సవాలుగా నీతి ఆయోగ్ పేర్కొంది. యువత కోసం&amp;nbsp; సబ్సిడీతో కూడిన శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా స్కిల్లింగ్ కార్యక్రమాల అవసరం ఉందని స్పష్టం చేసింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;2021 సర్వే గణాంకాల ఆధారంగా నివేదిక&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీతి ఆయోగ్ 'Reimagining Skilling for Viksit Bharat@2047' పేరుతో ఈ నివేదిక విడుదల చేసింది. ఇందులో 8.7 కోట్ల మంది యువతకు సంబంధించిన అంచనాను 2021లో చేసిన నేషనల్ శాంపిల్ సర్వే (NSS) 78వ రౌండ్ గణాంకాల ఆధారంగా రూపొందించారు. ఈ నివేదికలో భారత వర్క్&amp;zwnj;ఫోర్స్, లర్నర్స్ 5 ప్రధాన భాగాలుగా విభజించారు. వీటిలో పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఆమోదిత (ఫార్మల్), ఇన్&amp;zwnj;ఫార్మల్ ఉపాధి, విద్య- ఉపాధి లేదా శిక్షణకు దూరంగా ఉన్న NEET (Not in Education, Employment, or Training) యువత, మహిళలు ఉన్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;NEET యువతకు శిక్షణ అవసరం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;విద్య, ఉపాధి లేదా శిక్షణలో భాగస్వాములు కాకుండా ఉన్న 15 నుంచి 29 ఏళ్ల యువతను నీతి ఆయోగ్ NEET&amp;nbsp; కేటగిరీలో చేర్చింది. ఇందులో నిరుద్యోగ యువత ఉన్నారు. నివేదిక ప్రకారం, NEET యువతకు ఆదాయం లేకపోవడం, గతంలో చదువు కోసం చేసిన ఖర్చులు వారికి ఆటంకంగా మారాయి. ఇలాంటి యువతకు అందుబాటు ధరల్లో లేదా సబ్సిడీతో కూడిన శిక్షణతో పాటు అవసరమైన ఆర్థిక సాయం అందించాలని నివేదిక సూచిస్తోంది. వేర్వేరు విభాగాల కోసం పని నేర్చుకోవడంతో పాటు సంపాదించే మార్గాన్ని లింక్ చేయాలని నీతి ఆయోగ్ తెలిపింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్థానిక అవసరాలు, కొత్త రంగాలతో స్కిల్లింగ్ చేయాలి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వర్క్&amp;zwnj;ఫోర్స్ , NEET యువత కోసం మిడ్-కెరీర్ రిస్కిల్లింగ్, స్వయం ఉపాధి మార్గాలు మరియు స్థానిక డిమాండ్&amp;zwnj;తో పాటు కొత్తగా ఉద్భవిస్తున్న రంగాలకు సంబంధించిన శిక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది. యువత కేవలం ఉద్యోగాల కోసం వెతికేవారిగానే కాకుండా, తమ సామర్థ్యం ఆధారంగా స్వయంగా ఉపాధిని ప్రారంభించేలా నైపుణ్యాలను అందించాలని నివేదికలో వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;అల్పదాయ వర్గాల విద్యార్థులకు సవాలుగా మారిన ఖర్చులు&amp;nbsp;&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ముఖ్యంగా తక్కువ ఆదాయ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులు ఇప్పటికే కాలేజీ ఫీజులు, అనేక సందర్భాల్లో ట్యూషన్ల ఖర్చులతో ఇబ్బందిపడుతున్నారని నివేదిక తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో సాంప్రదాయ డిగ్రీతో పాటు వేరే ఖరీదైన స్కిల్ కోర్సులు చేయడం వారికి మరింత భారంగా మారుతోంది. ఈ కారణంగానే చాలా మంది విద్యార్థులు చదువు పూర్తయిన వెంటనే కుటుంబానికి ఆర్థికంగా సాయపడటానికి ఏదో ఒక ఉద్యోగం లేదా స్థిరమైన ఆదాయ మార్గాన్ని వెతుక్కుంటారు. కొన్నిసార్లు తక్కువ జీతం వచ్చే ఉద్యోగాలో చేరతారు. మరికొందరు యువత చదువు పూర్తయ్యాక ఉద్యోగంలోకి అడుగుపెట్టలేక NEET కేటగిరీలోకి వెళ్లిపోతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;8.25 శాతం మందికి అర్హతకు తగ్గ ఉద్యోగం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఉన్నత విద్య, ఉపాధి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ ప్రకారం, కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే తమ చదువుకు తగిన ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. ప్రాక్టికల్ విద్య, పరిశ్రమల అవసరాలకు తగ్గ శిక్షణ లేకపోవడంతో యువత ఉద్యోగ అర్హత (ఎంప్లాయాబిలిటీ) దెబ్బతింటోందని నివేదిక పేర్కొంది. ఉన్నత విద్యను అభ్యసించిన యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;&amp;nbsp;7.67 కోట్లకు పైగా ప్రజలకు శిక్షణ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;వికసిత్ భారత్@2047 లక్ష్యాన్ని సాధించాలంటే యువతకు నిరంతరం నేర్చుకోవడానికి, సంపాదించడానికి అవకాశాలు కల్పించాలని నీతి ఆయోగ్ తెలిపింది. ఈ లక్ష్యంలో స్కిల్లింగ్ పాత్ర అత్యంత కీలకం. నీతి ఆయోగ్ ప్రకారం, 2014-15 నుంచి ఇప్పటివరకు 7.67 కోట్లకు పైగా యువత, నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. అయితే రాబోయే రోజుల్లో స్కిల్లింగ్&amp;zwnj;ను ఉపాధి, స్వయం ఉపాధి, స్థానిక డిమాండ్, కొత్తగా అభివృద్ధి చెందుతున్న రంగాలతో అనుసంధానం చేయాలని నివేదిక స్పష్టం చేసింది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/23/d8e017024a62997810a4d21bcf7f30f21787492947332233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Niti Aayog Report On Education:బోడి డిగ్రీలు వేస్ట్‌! విద్యావ్యవస్థ తీరును ఎండగట్టిన నీతి ఆయోగ్‌ నివేదిక!]]></title><link>https://telugu.abplive.com/education/niti-aayog-report-reimagining-skilling-for-viksit-bharat-2047-india-graduates-jobs-256864</link><comments>https://telugu.abplive.com/education/niti-aayog-report-reimagining-skilling-for-viksit-bharat-2047-india-graduates-jobs-256864#respond</comments><pubDate>Fri, 21 Aug 2026 11:22:04 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/niti-aayog-report-reimagining-skilling-for-viksit-bharat-2047-india-graduates-jobs-256864</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Niti Aayog Report On Indian Education System: &lt;/strong&gt;భారత్&amp;zwnj;లో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక సంఖ్యలో యువత డిగ్రీ పట్టాలతో కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే ఆ చేతికి అందుతున్న సర్టిఫికెట్&amp;zwnj;లు మార్కెట్&amp;zwnj;లో వారికి ఉద్యోగాలు లభించడం లేదని తేలింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యూహాత్మక, టెక్నికల్ సలహాలను అందించే అత్యున్నత థింక్&amp;zwnj; ట్యాంక్&amp;zwnj; నీతి ఆయోగ్&amp;zwnj; విడుదల చేసిన తాజా నివేదిక దేశంలోని విద్యారంగంలో ఉన్న ఒక భయానక సత్యాన్ని, విద్యా సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్టు చూపించింది. మంగళవారం నాడు నీతి ఆయోగ్&amp;zwnj; ప్రచురించిన రీఇమేజింగ్&amp;zwnj; స్కిల్లింగ్ ఫర్ వికసిత్ భారత్&amp;zwnj; @2047 అనే పత్రం భారత్&amp;zwnj;లో విద్యావిధానానికి, ఉద్యోగ మార్కెట్&amp;zwnj; డిమాండ్లకు మధ్య ఉన్న అగాధాన్ని బయటపెట్టింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆర్థిక సర్&amp;zwnj;వే 2024-25 గణాంకాలను ఉటంకిస్తూ ఈ నివేదిక వెల్లడించిన అత్యంత ఆందోళనకరమైన విషయం ఏంటంటే, భారత్&amp;zwnj;లో కేవలం 8.25 శాతం మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే తాము అభ్యసించిన చదువులకు, అర్హతలకు తగిన ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. అంటే మిగిలిన 91.75 శాతం మంది గ్రాడ్యుయేట్&amp;zwnj;లు తాము చదివిన చదువుకు ఎటువంటి సంబంధం లేని పనుల్లో లేదా తక్కువ వేతనాల ఉద్యోగాల్లో కాలం వెళ్లదీస్తున్నారు. లేదా అసలు ఉద్యోగమే లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇది కేవలం నిరుద్యోగ సమస్య మాత్రమే కాదు, విద్యార్థుల చదువులకు, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలనకు మధ్య ఏర్పడిన లోతైన అగాధం. ఈ సంక్షోభం ఎందుకు ఏర్పడింది, లక్షలాది మంది యువత జీవితాలు డిగ్రీలు ఉన్న ఎందుకు ఏర్పడింది? లక్షలాది మంది యువత జీవితాలు డిగ్రీలు ఉన్నా ఎందుకు నిరర్ధకంగా మారుతున్నాయో నివేదిక చెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ నివేదికలోని అంశాలు సంచలనం సృష్టిస్తున్నాయి. యువత తమ అమూల్యమైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని ఖర్చు చేసి డిగ్రీలు పొందుతున్నప్పటికీ, ఉద్యోగ మార్కెట్&amp;zwnj;కు అవసరమైన కనీస నైపుణ్యాలు వారిలో ఉండం లేదనే వాస్తవాన్ని ఈ నివేదిక నిరూపించింది. ఇది కేవలం ఒక విధానపరమైన పత్రం కాదు. భారత్&amp;zwnj;లోని విద్యావ్యవస్థ మూలాలను ప్రశ్నించే ఒక తీవ్రమైన హెచ్చరిక మన విద్యా సంస్కరణలు తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే దేశ ఆర్థిక పురోగతి దెబ్బతినే ప్రమాదం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;డిగ్రీలపై భయానక నిజాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj;లో ఉన్నత విద్య కోసం విపరీతంగా ఖర్చు చేసిన, సంవత్సరాల తరబడి శ్రమించి పట్టాలు పొందుతున్న యువత సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కానీ, ఈ డిగ్రీల వల్ల వారికి మంచి కెరీర్ లభించడం లేదు. భారత్&amp;zwnj;లో ఉన్నత, టెక్నికల్ విద్యావ్యవస్థలో విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలకు, శ్రామిక మార్కెట్&amp;zwnj; ఆశించే నైపుణ్యాలకు మధ్య ఉన్న పెద్ద లోపం స్పష్టంగా కనిపిస్తోందని నీతి ఆయోగ్ గుర్తించింది. అనేక విద్యాసంస్థల్లో ఇప్పటికే కాలం చెల్లిన సిలబస్&amp;zwnj; బోధిస్తున్నారు. పరిశ్రమల అవసరాలు వేగంగా మారుతున్నప్పటికీ, ఆ మార్పులకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. దీని వల్ల విద్యార్థులు సాధించే డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు వారి నైపుణ్యాలను ప్రతిబింబించలేకపోతున్నాయి. వారికి ఉపాధి కల్పించలేకపోతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత విద్యావ్యవస్థ కేవలం మార్కులు, పరీక్షల ఫలితాల ఆధారంగానే విజయాన్ని అంచనా వేస్తోంది. నిజమైన ఉపాధి సామర్థ్యాన్ని పెంచడం లేదు. డిగ్రీ పూర్తి చేసిన ఒక యువకుడు లేదా యువతి సమాంలోకి అడుగుపెట్టినప్పుడు , తాము సాధించిన చదువు మార్కెట్&amp;zwnj; అవసరాలకు ఎంతమాత్రం సరిపోవడం లేదని గ్రహిస్తున్నారు. ఈ పరిస్థితి గ్రాడ్యుయేట్లో నిరాశను పెంచుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj;లో సాధారణ సంప్రదాయ డిగ్రీల వైపు విద్యార్థులు విపరీతంగా ఆసక్తి చూపడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. దేశంలోని ఉన్నత విద్యావ్యవస్థలోని గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్ఫష్టమవుతోంది. దేేశంలో అండర్ గ్యాడ్యుయేట్ కోర్సుల్లో చేసిన మొత్తం విద్యార్థుల సంఖ్య 3.4 కోట్లు. ఇందులో కేవలం బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కోర్సుల్లోనే ఏకంగా 1.13 కోట్ల మంది చేరారు. ఇక బీఏ, బీఎస్సీ, బీకాం కోర్సులను కలిపి చూస్తే 2 కోట్లకు దాటిపోతుందీ సంఖ్య.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సాధారణ డిగ్రీ ప్రోగ్రామ్&amp;zwnj;లకు, ఉద్యోగ అవకాశాలకు మధ్య అనుసంధానం చాలా బలహీనంగా ఉందని నీతి ఆయోగ్ నివేదిక పేర్కొంది. అయినప్పటికీ ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఈ కోర్సుల్లో ఎందుకు చేరుతున్నారు. దీనికి ఒకే ప్రధాన కారణం ప్రభుత్వ ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలకు హాజరుకావడానికి ఈ డిగ్రీలు కనీస అర్హతగా ఉపయోగపడతాయనే ఆశతోనే ఇలా చేస్తున్నారు. చదువు పూర్తి అయిన తర్వాత తమకు కచ్చితమైన ఉపాధి లభిస్తుందనే నమ్మకంతోనే కాకుండా, ప్రభుత్వ నియామకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఒక అర్హత పత్రం కోసం మాత్రమే ఈ డిగ్రీలు పొందుతున్నారు. దీని ప్రతిఏటా నిరుద్యోగ గ్రాడ్యుయేట్&amp;zwnj;ల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్&amp;zwnj; కీలక వ్యాఖ్యలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;నీతి ఆయోగ్&amp;zwnj; నివేదిక బయటపెట్టిన ఈ చేదు నిజాలకు సరిగా సరిపోయే విధంగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్&amp;zwnj; చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆగస్టు 17 నాడు ఇంగ్లీష్ ఛానల్&amp;zwnj;కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలోని విద్యావిధానం, ఉద్యోగాల మార్కెట్&amp;zwnj;పై కీలక వ్యాఖ్యలు చేశారు. చదువు పూర్తి చేసినప్పటికీ ఉద్యోగాలు సాధించలేకపోతున్న, అదే సమయంలో ఎటువంటి శిక్షణ లేదా ఇతర విద్యాకోర్సులు చేయకుండా ఖాళీగా ఉంటున్న యువతపై ఆమె స్పందించారు.&amp;nbsp;&quot; కాలేజీలలో పూర్తి చేసిన కోర్సులు విద్యార్థులను ఉద్యోగాలకు సిద్ధం చేయడం లేదు. వారిని కొత్త పారిశ్రామికవేత్తలుగా కూడా ప్రోత్సహించడం లేదు.' అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;లక్ష్యం లేని జనరిక్ డిగ్రీలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;భారత్&amp;zwnj;లో ఉన్నత విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఒక భారీ ప్యాక్టరీలా మారింది. ఇది ఏటా లక్షలాి మంది గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తోంది. కానీ వారిలో ఎంతమంది ఉద్యోగానికి సిద్ధంగా ఉన్నారనే ప్రశ్న వచ్చినప్పుడు సమాధానం దొరకడం లేదు. దీనికి జనరిక్ డిగ్రీ వ్యవస్థే కారణం.&amp;nbsp;ఈ సంప్రదాయ కోర్సులు విద్యార్థుల్లో జ్ఞాపకశక్తిని పరీక్షిస్తాయే తప్ప వారిలో విశ్లేషణాత్మక ఆలోచనను, సమస్యల పరిష్కార సామర్థ్యాన్ని పెంచవు. ఈ కారణంగానే చాలా కంపెనీలు డిగ్రీలు ఉన్నప్పటికీ కొత్త గ్రాడ్యుయేట్&amp;zwnj;లకు మళ్లీ మొదటి నుంచి శిక్షణ ఇవ్వాల్సి వస్తోంది. కనీసం ఈమెయిల్ రాయడం, ఎక్సెల్ షీట్ల తయారీ, టైపింగ్, లాంటి ప్రాథమిక నైపుణ్యాలు కూడా సంప్రదాయ బీఏ, బీఎస్సీ, కోర్సుల్లో నేర్పించడం లేదు. ఇది యువకులకు శాపంగా మారుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యార్థుల ఆవేదన కూడా అదే&lt;/h2&gt;
&lt;p&gt;సమస్యలను విద్యార్థులు బహిరంగంగానే అంగీకరిస్తున్నారు. నీతి ఆయోగ్ నివేదిక ఈ లోపాలను విద్యార్థుల కోణం నుంచి కూడా విశ్లేషించింది.&amp;nbsp;దాదాపు 34 శాతం మంది విద్యార్థులు తమ డిగ్రీ చదువుల సమయంలో నైపుణ్యాల కొరతను అతి పెద్ద సమస్యగా పేర్కొన్నారు. చదువు పూర్తి అయిన తర్వాత ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో తెలియకపోవడం వల్ల 18 శాతం మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 80 శాతం మంది అభ్యర్థులు తమ డిగ్రీలలో ప్రాక్టికల్ పరిజ్ఞానం, పరిశ్రమల అనుభవం లోపించడమే ప్రధాన అడ్డంకిగా మారుతోందని వెల్లడించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్యూ&lt;/h2&gt;
&lt;p&gt;కార్పొరేట్ రంగానికి, ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు సంప్రదాయ చదువుల ద్వారా లభించపోవడంతో , దేశంలోని కోట్లాది మంది యువతకు ప్రభుత్వం ఉద్యోగాలే ఏకైక ఆశ్రయంగా మారుతున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సాధించాలంటే కావాల్సిన నైపుణ్యాలు లేకపోవడం, ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వ కొలువుల వైపు పరుగులు పెడుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కళాశాలలకు, పరిశ్రమకు మధ్య తెగిన బంధం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;నీటి ఆయోగ్&amp;zwnj; తన నివేదికలో కేవలం సిలబస్&amp;zwnj;లోని లోపాలను మాత్రమే కాకుండా కళాశాలల నిర్వహణలోని అనేక ఇతర లోపాలను కూడా ఎండగట్టింది. ముఖ్యంగా ఉన్నత విద్యాసంస్థల్లో కరికులం దాటి విద్యార్థులకు లభించాల్సిన కనీస ఉపాధి మద్ధతు కొరవడిందని పేర్కొంది.విద్యాసంస్థల్లోని విద్యార్థులు కనీసం ప్రొఫెషనల్ రెజ్యూమ్ ఎలా రాయాలి, మాక్ ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించాలి, ఉద్యోగాల కోసం ఎలా శోధించాలనే విషయాలపై ఎటువంటి అవగాహన ఉండటం లేదు. దీని వల్ల విద్యార్థులు నేరుగా జాబ్ మార్కెట్&amp;zwnj;లోకి వచ్చినప్పుడు ప్రతిభ ప్రదర్శించలేకపోతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;అధ్యాపకులు సరికొత్త టెక్నాలజీ, సబ్జెక్ట్ బోధిస్తున్నప్పటికీ &amp;nbsp;వారికి పరిశ్రమల అవసరాలపై కనీస అవగాహన ఉండటం లేదు. తగిన మౌలిక సదుపాయాలు, ల్యాబ్&amp;zwnj; సౌకర్యాలు లేకపోవడం వల్ల విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికే పరిమితమవుతున్నారు.&amp;nbsp;ఈ లోపాలు దేశంలో ఒక విషవలయాన్ని సృష్టిస్తున్నాయి. పరిశ్రమల యాజమాన్యాలు అనుభవం ఉన్న అభ్యర్థును కోరుకుంటాయి. కానీ కొత్త పట్టాలు పొందిన గ్రాడ్యుయేట్&amp;zwnj;లకు ఎలాంటి ప్రాక్టికల్ అనుభవం ఉండటం లేదు. కళాశాలలు పరిశ్రమలతో అనుసంధానం కాకపోవడం వల్ల విద్యార్థులకు ఆ అనుభవాన్ని కల్పించలేకపోతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/21/ba69064e61b60a479d1f3ff8096403271787291349570215_original.jpg" width="220"/></item></channel></rss>