<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?</title><atom:link href="https://telugu.abplive.com/education/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 16:24:12 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[How To Become Guest Faculty: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులుగా ఎలా చేరాలి? ఎలా అప్లై చేసుకోవాలి?]]></title><link>https://telugu.abplive.com/jobs/become-guest-faculty-central-universities-eligibility-requirements-ugc-net-phd-256317</link><comments>https://telugu.abplive.com/jobs/become-guest-faculty-central-universities-eligibility-requirements-ugc-net-phd-256317#respond</comments><pubDate>Fri, 14 Aug 2026 13:21:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/become-guest-faculty-central-universities-eligibility-requirements-ugc-net-phd-256317</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;How To Become Guest Faculty:&lt;/strong&gt; మీరు బోధనలో వృత్తిని కొనసాగించి, DU, JNU, JMI, లేదా BHU వంటి దేశంలోని అగ్రశ్రేణి కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఒకదానిలో చేరాలనుకుంటే, అతిథి అధ్యాపకుడిగా మారడం ఒక గొప్ప ప్రారంభం కావచ్చు. కేంద్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుడిగా మారడం వల్ల అద్భుతమైన జీతాలు లభించడమే కాకుండా, మీ CV కూడా చాలా మెరుగుపడుతుంది. అయితే, చాలా మంది విద్యార్థులు, యువతకు సరైన ప్రక్రియ గురించి తెలియదు. కాబట్టి, కేంద్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకుడిగా మారడానికి అవసరమైన అర్హతలు, ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం.&lt;/p&gt;
&lt;h3&gt;అతిథి అధ్యాపకుడిగా మారడానికి కావలసిన అర్హతలు&lt;/h3&gt;
&lt;p&gt;యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనల ప్రకారం, గెస్ట్ ఫ్యాకల్టీకి రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉండే అర్హతలే అవసరం. అసిస్టెంట్ ప్రొఫెసర్ కావాలంటే, మీరు సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. మీరు యూజీసీ-నెట్ లేదా సీఎస్ఐఆర్-నెట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని ధృవీకరించే సర్టిఫికేట్ కూడా మీ వద్ద ఉండాలి. అదనంగా, 2009 లేదా 2016 యూజీసీ నిబంధనల ప్రకారం తమ పీహెచ్&amp;zwnj;డీ డిగ్రీని పూర్తి చేసిన అభ్యర్థులకు నెట్ పరీక్ష నుంచి మినహాయింపు లభించవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎలా దరఖాస్తు చేయాలి?&lt;/h2&gt;
&lt;p&gt;కేంద్ర విశ్వవిద్యాలయాల్లో అతిథి అధ్యాపక పోస్టుల కోసం, అవసరాన్ని బట్టి వివిధ విభాగాలు ఏడాది పొడవునా నియామకాలు జరుపుతాయి. చాలా విశ్వవిద్యాలయాలు సుదీర్ఘమైన రాత పరీక్షల నిర్వహించవు. అవి కేవలం ఒక ప్రకటన జారీ చేసి, ఇంటర్వ్యూను షెడ్యూల్ చేస్తాయి. ఆ తర్వాత మీరు నిర్ణీత సమయంలో మీ అన్ని ఒరిజినల్&amp;zwnj; పత్రాలు, రెజ్యూమె (CV)తో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. అదనంగా, కొన్ని విశ్వవిద్యాలయాలు ఇంటర్వ్యూకు ముందే, తమ వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లలోని ఆన్&amp;zwnj;లైన్ గూగుల్ ఫారం లేదా అప్లికేషన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులను కోరతాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఖాళీల సమాచారం ఎక్కడ దొరుకుతుంది?&lt;/h2&gt;
&lt;p&gt;దీనికోసం, మీరు బోధించాలనుకుంటున్న కేంద్ర విశ్వవిద్యాలయం వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లోని 'నియామకాలు' లేదా 'ఖాళీల' విభాగాన్ని క్రమం తప్పకుండా చెక్ చేయండి. ఖాళీల ప్రకటనలు తరచుగా ప్రధాన జాతీయ వార్తాపత్రికల్లో, ఎంప్లాయిమెంట్&amp;zwnj; న్యూస్&amp;zwnj;లో ప్రచురితమవుతాయి. కాబట్టి ప్రతిరోజూ వార్తాపత్రికలను గమనిస్తూ ఉండండి.&lt;/p&gt;
&lt;h2&gt;మీకు ఎంత జీతం వస్తుంది?&lt;/h2&gt;
&lt;p&gt;జీతాల విషయంలో కేంద్ర విశ్వవిద్యాలయాలు చాలా మెరుగ్గా ఉంటాయి. యూజీసీ నిబంధనల ప్రకారం, అతిథి అధ్యాపకులకు ప్రతి లెక్చర్&amp;zwnj;కు ₹1,500 వరకు చెల్లిస్తారు. అంటే, అతిథి అధ్యాపకులకు నెలకు గరిష్టంగా ₹50,000 వరకు చెల్లించవచ్చు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/14/91c65cd5c505b7d62227bea96bc834531786693778869215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS]]></title><link>https://telugu.abplive.com/education/free-neet-ug-2027-long-term-coaching-offered-by-tgswreis-hyderabad-256173</link><comments>https://telugu.abplive.com/education/free-neet-ug-2027-long-term-coaching-offered-by-tgswreis-hyderabad-256173#respond</comments><pubDate>Wed, 12 Aug 2026 19:44:28 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/free-neet-ug-2027-long-term-coaching-offered-by-tgswreis-hyderabad-256173</guid><description><![CDATA[&lt;p&gt;Free NEET UG 2027 Long Term Coaching |&amp;nbsp;హైదరాబాద్: గత రెండు నెలలపాటు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్&amp;zwnj;పై ఆందోళన కొనసాగింది. యువత ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. మెడిసిన్ కోర్సులో నీట్ ఎంట్రన్స్ చాలా కీలకం. పేద విద్యార్థులు వైద్య విద్య అభ్యసించడం కల లాంటిదే. అయితే వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నీట్ (NEET UG 2027) పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TGSWREIS) శుభవార్త చెప్పింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నీట్ యూజీ 2027 ఉచిత లాంగ్ టర్మ్ కోచింగ్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2027 లో జరగనున్న నీట్ యూజీ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులకు ఉచితంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు సొసైటీ కార్యదర్శి కంభంపాటి శారద తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆగస్టు 22వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ 2026-27 అకాడమిక్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్&amp;zwnj;లో మొత్తం 200 మంది విద్యార్థులకు ఈ ఉచిత శిక్షణ అందిస్తారు. ఇందులో 100 మంది బాలురకు చిలుకూరులోని టీజీఎస్&amp;zwnj;డబ్ల్యూఆర్&amp;zwnj; ఫౌండేషన్ సీవోఈలో, మరో 100 మంది బాలికలకు మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ వద్ద వేర్వేరుగా వసతితో కూడిన శిక్షణ ఇవ్వనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోండి..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;2025-26 విద్యాసంవత్సరంలో ఇంటర్&amp;zwnj; బైపీసీ పూర్తి చేసిన అభ్యర్థులు, 2026 నీట్ పరీక్ష రాసిన వారు ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. TGSWREIS అధికారిక వెబ్&amp;zwnj;సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని, పూర్తి చేసిన దరఖాస్తును అవసరమైన డాక్యుమెంట్లతో జత చేసి, డీసీఓ (DCO) ద్వారా చిలుకూరు లేదా మహేంద్రహిల్స్&amp;zwnj;లోని సంబంధిత కాలేజీల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/news/india/students-free-laptops-central-government-pib-fact-check-viral-message-fake-links-25602&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్&amp;zwnj;టాప్&amp;zwnj;లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?&lt;/a&gt;&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/12/cd8d99c95c66ecfef8fcbc4bc99e09141786543913991233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!]]></title><link>https://telugu.abplive.com/news/india/khudiram-bose-history-in-telugu-sentenced-death-just-18-years-old-youngest-revolutionary-martyrs-256052</link><comments>https://telugu.abplive.com/news/india/khudiram-bose-history-in-telugu-sentenced-death-just-18-years-old-youngest-revolutionary-martyrs-256052#respond</comments><pubDate>Tue, 11 Aug 2026 15:09:49 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/khudiram-bose-history-in-telugu-sentenced-death-just-18-years-old-youngest-revolutionary-martyrs-256052</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Khudiram Bose History in Telugu:&lt;/strong&gt;భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రలో ఎందరో వీరులు తమ రక్తాన్ని ధారపోశారు. కానీ మీసాలు కూడా రాని ప్రాయంలో మృత్యువు కళ్లలోకి చూస్తూ చిరునవ్వు చిందించిన ఘనత మాత్రం ఖుదీరామ్&amp;zwnj; బోస్&amp;zwnj;కే దక్కుతుంది. 18 ఏళ్ల 8 నెలల 8రోజుల వయసుతో చేతిలో భగవద్గీత పట్టుకొని ఆయన ఉరి పీఠ ఎక్కిన తీరు నాటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఆ విప్లవ జ్వాల వెనుక ఉన్న అసలు కథ తెలుసుకోండి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆకలి నుంచి ఆయుధం వరకు...&lt;/h2&gt;
&lt;p&gt;ఖుదీరామ్ బోస్ డిసెంబర్&amp;zwnj; 3, 1889 ఉమ్మడి బెంగాల్&amp;zwnj;లోని మిడ్నాపూర్&amp;zwnj; జిల్లాలో జన్మించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలిన ఆయనను అక్క అనురూపాదేవి పెంచి పెద్ద చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆయన కౌమార దశలో ఉండగానే 1905లో జరిగిన బెంగాల్&amp;zwnj; విభజన దేశవ్యాప్తంగా అగ్ని కీలలను రగిల్చింది. బ్రిటిష్ వారి విభజించు-పాలించు కుట్రను గమనించిన ఖుదీరామ్&amp;zwnj;, చదువును మధ్యలోనే వదిలేసి విప్లవ మార్గాన్ని ఎంచుకున్నారు. నాటి ప్రముఖ విప్లవ సంస్థలైన అనుశీలన సమితి, యుగాంతర్&amp;zwnj;లలో చేరి, కేవలం 16 ఏళ్ల వయసులోనే బాంబుల తయారీలో నైపుణ్యం సంపాదించారు. దేశం పట్ల ఆయనకు ఉన్న అంకిత భావం ఎంతటిదంటే, అర్థరాత్రి వేళల్లో బ్రిటిష్&amp;zwnj; పోలీస్&amp;zwnj; స్టేషన్లపై ఆంగ్లేయ వ్యతిరేక కరపత్రాలు &amp;nbsp;చల్లుతూ వారి కంటి మీద కునుకు లేకుండా చేసే వారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కింగ్స్&amp;zwnj; ఫోర్డ్స్ అంతమే లక్ష్యం&lt;/h2&gt;
&lt;p&gt;నాటి కలకత్తా చీఫ్&amp;zwnj; ప్రెసిడెన్సీ మెజిస్ట్రేట్&amp;zwnj; డగ్లస్&amp;zwnj; కింగ్స్&amp;zwnj;ఫోర్డ్&amp;zwnj; భారతీయుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించేవాడు. స్వాతంత్య్ర కాంక్షతో పోరాడే యువకులను నడిరోడ్డుపై కొరడాలో కొట్టించేవాడు. విప్లవకారుల ఆగ్రహానికి గురైన కింగ్స్ ఫోర్డ్స్&amp;zwnj;ను అంతమొందించాలని &quot;యుగాంతర్&amp;zwnj;&quot; దళం నిర్ణయించింది. ప్రభుత్వం అతడిని ముజఫర్&amp;zwnj;పూర్&amp;zwnj;కు బదిలీ చేసినప్పటికీ, విప్లవకారులు అతడిని వదలదలుచుకోలేదు. ఈ ప్రమాదకరమైన బాధ్యతను ఖుదీరామ్&amp;zwnj; బోస్&amp;zwnj;, ప్రఫుల్ల చాకీలు భుజాన వేసుకున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;30 ఏప్రిల్ 1908 నాటి రాత్రి ఏం జరిగింది?&lt;/h2&gt;
&lt;p&gt;ముజఫ్&amp;zwnj;పూర్ చేరుకున్న ఈ ఇద్దరు యువకులు నరేన్ సర్కార్, దినేష్ రాయ అనే మారు పేర్లతో ఒక ధర్మశాలలో ఉంటూ కింగ్స్&amp;zwnj;ఫోర్డ్&amp;zwnj; కదలికలపై నిశితంగా నిఘా పెట్టారు. 1908ఏప్రిల్ 30 రాత్రి 8.30 గంటల సమయంలో యూరోపియన్ క్లబ్&amp;zwnj; నుంచి ఒక గుర్రపు బండి బయటకు రావడాన్ని గమనించారు. అందులో కింగ్స్&amp;zwnj;ఫోర్డ్ ఉన్నాడని భావించిన ఖుదీరామ్&amp;zwnj;, గురి చూసి బాంబు విసిరారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అయితే విధి వైపరీత్యం వల్ల ఆ బండిలో కింగ్స్&amp;zwnj; ఫోర్డ్ లేడు. బ్రిటిష్ బారిస్టర్&amp;zwnj; ప్రింగిల్&amp;zwnj; కెన్నెడీ భార్య, కుమార్తె ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. లక్ష్యం తప్పినప్పటికీ ఆ బాంబు పేలుడు శబ్ధం లండన్ వరకు వినిపించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;&amp;nbsp;ప్రఫుల్ చాకీ వీరమరణం&lt;/h2&gt;
&lt;p&gt;దాడి తర్వాత తప్పించుకున్న ఖుదీరామ్&amp;zwnj;, చెప్పులు లేకుండా దాదాపు 40 కిలోమీటర్లు నడిచి వైని రైల్వే స్టేషన్&amp;zwnj;కు చేరుకున్నారు. అక్కడ ఇద్దరు కానిస్టేబుళ్లు ఆయనను అనుమానించి పట్టుకునే ప్రయత్నం చేయగా, ఖుదీరామ్&amp;zwnj; వారిని ఎదిరించారు. కానీ చివరకు పోలీసుకు చిక్కారు. మరోవైపు మోకామ స్టేషన్ వద్ద పోలీసులు దొరకం ఇష్టం లేక ప్రఫుల్ల చాకీ తనను తాను కాల్చుకొని ఆత్మ బలిదానం చేసుకున్నాడు. నేడు వైని స్టేషన్&amp;zwnj;ను గౌరవార్థం ఖుదీరామ్&amp;zwnj; బోస్ పూసా రైల్వేస్టేషన్&amp;zwnj;గా పిలుస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కోర్టులో విస్మయ పరిచిన ధైర్యం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;విచారణ సమయంలో ఖుదీరామ్ ప్రదర్శించిన నిబ్బరం న్యాయమూర్తులనే ఆశ్చర్య పరిచింది. 1908 జూన్ 13న ఆయనకు మరణ శిక్ష ఖరారు చేసినప్పుడు, ఆయన ముఖంలో భయం బదులు చిరునవ్వు కనిపించింది. &quot; నీకు విధించిన శిక్ష అర్థమైందా?&quot; అని జడ్జి అడగ్గా...&quot; నాకు స్పష్టంగా అర్థమైంది. నాకు కాస్త సమయం ఇస్తే మీకు కూడా బాంబులు ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను&quot; అని ఆయన నిర్భయంగా సమాధానమిచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆగస్టు 11, 1908 ఉదయం ఆరు గంటలకు ముజఫర్&amp;zwnj;పూర్&amp;zwnj; జైలులో ఉరి శిక్ష అమలుకు సమయం ఆసన్నమైంది. చేతిలో భగవద్గీత పట్టుకొని, పెదవులపై వందేమాతరం నినాదంతో ఆయన ఉరి పీఠం వైపు నడిచారు. ఆయన త్యాగం ఎంతటి ప్రభావం చూపిందంటే బెంగాల్&amp;zwnj;లోని నేతగాళ్లు తమ ధోవతుల అంచులపై ఖుదీరామ్&amp;zwnj; పేరును నేయడం ప్రారంభించారు. ఆయన అమరత్వంతో ప్రతి ఇంటా ' మళ్లీ అవకాశం ఇవ్వు అమ్మా, మళ్లీ పుడతాను అనే పాట మారు మోగింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఖుదీరామ్&amp;zwnj; బోస్&amp;zwnj; జీవితం కేవలం ఒక చరిత్ర పాఠం కాదు. అది ఆత్మవిశ్వాసానికి, నిస్వార్థ దేశభక్తికి నిదర్శనం. వయసుతో నిమిత్తం లేకుండా లక్ష్యం పట్ల స్పష్టత ఉంటే ఎంతటి వారినైనా ఎదిరించవచ్చని ఆయన నిరూపించారు. నేడు ఆయన జ్ఞాపకార్థం ముజఫర్&amp;zwnj;పూర్&amp;zwnj; జైలును ఖుదీరామ్&amp;zwnj; బోస్&amp;zwnj; మెమోరియల్&amp;zwnj; సెంట్రల్&amp;zwnj; జైల్&amp;zwnj;గా ప్రభుత్వం నామకరణం చేసింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/11/46fbf22174bda57badedacc9c976041a1786441088432215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Fact Check: విద్యార్థులకు కేంద్రం ఉచితంగా ల్యాప్‌టాప్‌లు ఇస్తుందా? విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?]]></title><link>https://telugu.abplive.com/news/india/students-free-laptops-central-government-pib-fact-check-viral-message-fake-links-256029</link><comments>https://telugu.abplive.com/news/india/students-free-laptops-central-government-pib-fact-check-viral-message-fake-links-256029#respond</comments><pubDate>Tue, 11 Aug 2026 12:05:15 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/students-free-laptops-central-government-pib-fact-check-viral-message-fake-links-256029</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Fact Check:&lt;/strong&gt; విద్యార్థులకు సంబంధించిన ఒక మెసేజ్&amp;zwnj; బాగా వైర్ అవుతోంది. సోషల్ మీడియా &amp;nbsp;&lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt;&amp;zwnj;లో బాగా షేర్ అవుతోంది. విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచిత ల్యాప్&amp;zwnj;టాప్&amp;zwnj;లను అందిస్తోందని, ఆన్&amp;zwnj;లైన్ దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయని ఆ మెసేజ్&amp;zwnj; సారాంశం. దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయాల్సిన ఒక లింక్ కూడా ఆ మెసేజ్&amp;zwnj;లో ఇచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందేశంలో ప్రధానమంత్రి ఫోటోతోపాటు విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం జి20 లోగోలను ఉపయోగించారు. చాలామంది ఇది నిజమైన ప్రభుత్వ పథకంగా భావిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్&amp;zwnj; సంస్థ అయిన పిఐబి దీన్ని ఖండించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఉచిత ల్యాప్&amp;zwnj;టాప్ గురించి వైరల్ అవుతున్న మెసేజ్ ఏంటీ?&lt;/h2&gt;
&lt;p&gt;విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ల్యాప్&amp;zwnj;టాప్&amp;zwnj;లు అందిస్తోందని వైరల్ అవుతున్న మెసేజ్&amp;zwnj;లో ఉంది. అందులో ఒక లింక్&amp;zwnj; కూడా ఉంది. ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో అప్లై చేయాలనుకునే వారంతా లింక్&amp;zwnj;పై క్లిక్ చేయాలని కూడా సూచిస్తోంది. 2024-25 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ల్యాప్&amp;zwnj;టాప్&amp;zwnj;లు అందజేస్తారని కూడా ఆ సందేశంలో పేర్కొన్నారు. ఆ సందేశం అచ్చం ప్రభుత్వం విడుదల చేసిన సందేశంగా మార్చేందుకు దానిలో ప్రధానమంత్రి ఫోటోతో పాటు విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, జి20 లోగోలను కూడా పొందుపరిచారు. స్క్రీన్&amp;zwnj;పై &quot;ప్రభుత్వం నుండి ఉచిత ల్యాప్&amp;zwnj;టాప్ పొందండి&quot; మరియు &quot;ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో దరఖాస్తు చేసుకోండి&quot; అనే పదాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగానే, మొదటి చూపులో ఈ సందేశం ప్రభుత్వ పథకానికి సంబంధించినదిగా అనిపించవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పింది?&lt;/h2&gt;
&lt;p&gt;వైరల్ అవుతున్న ఈ వాదనపై విచారణ జరిపిన తర్వాత, పిఐబి ఫ్యాక్ట్ చెక్ ఇది పూర్తిగా అబద్ధమని ప్రకటించింది. పిఐబి ప్రకారం, విద్యార్థులకు ఉచిత ల్యాప్&amp;zwnj;టాప్&amp;zwnj;లు అందించేందుకు భారత ప్రభుత్వం గానీ, విద్యా మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి పథకాన్ని తీసుకురాలేదని స్పష్టం చేసింది. అంటే, వైరల్ మెసేజ్&amp;zwnj;లో చెప్పిందంతా అబద్ధం. ఈ మెసేజ్&amp;zwnj;కు భారత ప్రభుత్వంతో గానీ, విద్యా మంత్రిత్వ శాఖతో గానీ ఎలాంటి సంబంధం లేదని కూడా పిఐబి తేల్చి చెప్పింది. ఈ మెసేజ్&amp;zwnj;లో ఉపయోగించిన లోగో, ఫార్మాట్, లింక్ కూడా నకిలీవే.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నకిలీ లింక్&amp;zwnj;లపై క్లిక్ చేయవద్దు&lt;/h2&gt;
&lt;p&gt;ఇలాంటి అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిఐబి ఫ్యాక్ట్ చెక్ ప్రజలకు సలహా ఇస్తోంది. వైరల్ మెసేజ్&amp;zwnj;ల లింక్&amp;zwnj;పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెబుతాయి, కానీ అలాంటి లింకులు నకిలీ వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లు లేదా యాప్&amp;zwnj;లకు దారితీయవచ్చు, అక్కడ ప్రజలను వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు చోరీకి గురి అయ్యే ప్రమాదం ఉంది. &amp;nbsp;అందువల్ల, అలాంటి &amp;nbsp;మెసేజ్&amp;zwnj;లను వెంటనే నమ్మే ముందు లేదా లింక్&amp;zwnj;పై క్లిక్ చేసే ముందు, అందులోని సమాచారాన్ని సరిచూసుకోవడం ముఖ్యం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విద్యా మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది?&lt;/h2&gt;
&lt;p&gt;స్టూడెంట్ ల్యాప్&amp;zwnj;టాప్ స్కీమ్ 2026 కింద ఉచిత ల్యాప్&amp;zwnj;టాప్&amp;zwnj;లు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వాదనను ప్రభుత్వం కూడా ఖండించింది. వైరల్ అవుతున్న ఆ సందేశంలో, లబ్ధిదారులు తమ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవాలని కోరారు. ప్రభుత్వం అటువంటి పథకాన్ని ఏదీ ప్రకటించలేదని పేర్కొంటూ, ఈ వాదన నకిలీదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ప్రకటించింది. ఇటువంటి ప్రకటనలతో మోసపోవద్దని, ఏదైనా ప్రభుత్వ పథకం లేదా వార్తను అధికారిక ప్రభుత్వ వర్గాల నుంచి మాత్రమే ధృవీకరించుకోవాలని ఆ సంస్థ ప్రజలను కోరింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/11/c6d39886486502802b616af1ff9e22fa1786429927675215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?]]></title><link>https://telugu.abplive.com/jobs/ap-dsc-notification-2026-teacher-posts-recruitment-syllabus-perspectives-in-education-educational-psychology-256012</link><comments>https://telugu.abplive.com/jobs/ap-dsc-notification-2026-teacher-posts-recruitment-syllabus-perspectives-in-education-educational-psychology-256012#respond</comments><pubDate>Tue, 11 Aug 2026 09:03:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/ap-dsc-notification-2026-teacher-posts-recruitment-syllabus-perspectives-in-education-educational-psychology-256012</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP DSC Notification 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలో ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా స్థిరపడాలనేది లక్షల మంది యువత కల. రాష్ట్ర విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేసింది. ఇప్పుడు మరోసారి అక్టోబర్&amp;zwnj;లో నోటిఫికేషన్ జారీ చేసేందుకు రెడీ అవుతోంది. అభ్యర్థులు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా చదువుపై శ్రద్ధ పెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులు సూచిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్&amp;zwnj; అన్సారియా, మంత్రి నారా లోకేష్ వెల్లడించిన వివరాలు ప్రకారం, రాబోయే డీఎస్సీ-2026 ప్రక్రియ అక్టోబర్&amp;zwnj; నెలలో ప్రారంభంకానుంది. అక్టోబర్&amp;zwnj;లో అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుంది. అభ్యర్థులకు ప్రిపరేషన్ కోసం తగిన సమయం ఇస్తూ, డిసెంబర్&amp;zwnj; నెలలో కంప్యూటర్&amp;zwnj; ఆధారిత పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ స్పష్టమైన కాలపరిమితి అభ్యర్థులు తమ ప్రిపరేషన్&amp;zwnj;ను ప్రణాళికాబద్ధంగా మార్చుకోవడానికి ఎంతో దోహదపడుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని ప్రభుత్వం పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ఉపాధ్యాయ-విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ఈ నోటిఫికేషన్ ప్రధాన ఉద్దేశం. మెగా డీఎస్సీ-2025 ద్వారా &amp;nbsp;16,347 పోస్టులను భర్తీ చేసినప్పటికీ ఇంకా మిగిలిన ఉన్న ఖాళీలను భర్తీ చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. సోషల్ మీడియాలో నియామక ప్రక్రియపై వస్తున్న తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, అభ్యర్థుల్లో భరోసా కల్పించడానికి ఈ కొత్త నోటిఫికేషన్ ప్రకటన ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల అమలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, ప్రతి దశలోనూ పారదర్శకత పాటిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. ఈసారి అంతే పారదర్శకతతో ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;డీఎస్సీ 2026 సిలబస్&amp;zwnj;&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రాబోయే డీఎస్సీ పరీక్షల కోసం విద్యాశాఖ సజెస్టివ్ సిలబస్&amp;zwnj;ను ఇప్పటికే రూపొందించింది. 2025-26 విద్యా సంవత్సరం సిలబస్&amp;zwnj;ను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఎస్జీటీ-&lt;/strong&gt; ఎస్జీటీ పోస్టులకు మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్&amp;zwnj; నాలెడ్జ్&amp;zwnj; &amp;amp; కరెంట్&amp;zwnj; అఫైర్స్&amp;zwnj;(8 మార్కులు), పర్స్పెక్టివ్స్&amp;zwnj; ఇన్ ఎడ్యుకేషన్(4 మార్కులు), ఎడ్యుకేషనల్&amp;zwnj; సైకాలజీ (8మార్కులు) కంటెంట్&amp;zwnj; అండ్&amp;zwnj; మెథడాలజీ(60 మార్కులు) ఉంటాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;స్కూల్ అసిస్టెంట్&amp;zwnj;(SA):-&lt;/strong&gt; స్కూల్&amp;zwnj; అసిస్టెంట్&amp;zwnj; అభ్యర్థులకు జీకే (10 మార్కులు), పర్స్పెక్టివ్స్&amp;zwnj;(5 మార్కులు), సైకాలజీ(5 మార్కులు), సబ్జెక్ట్&amp;zwnj; కంటెంట్&amp;zwnj;(40 మార్కులు)తోపాటు మెథడాలజీ(20 మార్కులు)కీలక భూమిక పోషిస్తాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;భాషా అంశాలు:&lt;/strong&gt; తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కన్నడ, ఒడియా, తమిళం, సంస్కృతం వంటి భాషలకు సంబంధించి 3 నుంచి 10వ తరగతి స్థాయి వరకు ఉన్న సాహిత్యం, వ్యాకరణం, బోధన పద్ధతులపై ప్రశ్నలు వస్తాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;బోధనేతర సబ్జెక్టులు: గ&lt;/strong&gt;ణితం, ఫిజికల్ సైన్స్&amp;zwnj;, బయోలాజికల్ సైన్స్&amp;zwnj;, సోషల్ స్టడీస్&amp;zwnj; అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్మీడియట్&amp;zwnj; స్థాయి వరకు లోతైన జ్ఞానాన్ని కలిగి ఉండాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;పర్స్పెక్టివ్&amp;zwnj; అండ్ సైకాలజీ:&lt;/strong&gt; డీఎస్సీలో కేవలం సబ్జెక్ట్&amp;zwnj; నాలెడ్జ్&amp;zwnj; మాత్రమే కాకుండా, ఒక ఉపాధ్యాయుడికి ఉండాల్సిన సామాజిక స్పృహ, మానసిక శాస్త్ర అవగాహన కూడా పరీక్షిస్తారు. పర్స్పెక్టివ్స్&amp;zwnj; ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో భారతీయ విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారత, సమకాలీన విద్యా ధోరణులు, ఎడ్యుకేషనల్&amp;zwnj; యాక్ట్స్&amp;zwnj;, జాతీయ విద్యా విధానం 2020 వంటి అంశాలు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. అదే విధంగా ఎడ్యుకేషనల్&amp;zwnj; సైకాలజీలో శిశు వికాసం, అభ్యసనం, వ్యక్తిత్వం వంటి అంశాల ద్వారా విద్యార్థుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;స్పెషల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు&lt;/h2&gt;
&lt;p&gt;దివ్యాంగులైన విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేక ఉపాధ్యాయులు అవసరం. దీని కోసం డీఎస్సీలో ప్రత్యేకంగా ఎస్జీటీ, టీజీటీ విభాగాల్లో పోస్టులు భర్తీ చేస్తారు. వినికిడి లోపం, దృష్టి లోపం కలిగిన విద్యార్థులకు బోధించే మెళకువలు, వారి కోసం ప్రత్యేక సిలబస్, ఆర్సీఐ నిబంధనల ప్రకారం పరీక్ష నిర్వహిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అభ్యర్థులకు సూచనలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;నోటిఫికేషన్ రాక ముందే అభ్యర్థులు తమ ప్రిపరేషన్&amp;zwnj;ను ప్రారంభించడం మంచిది. సోషల్ మీడియాలో వచ్చే చర్చలు, అపోహలను పట్టించుకోకుండా ప్రిపరేషన్&amp;zwnj;పై ఫోకస్ చేయాలని ప్రభుత్వం చెబుతోంది. పాఠ్యపుస్తకాలను క్షుణ్ణంగా చదవడంతోపాటు , పాత్ర ప్రశ్నా పత్రాలను విశ్లేషించుకోవడం వల్ల మంచి మార్కులు సాధించే ఛాన్స్ ఉందని అంటున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/11/079ec897622babdecc7e73040078eddb1786419104233215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[JNVST 2027 Registration: నవోదయ విద్యాలయాల్లో ప్రవేశానికి ఇదే చివరి అవకాశం! ఫారం నింపడానికి నేడే లాస్ట్‌ డేట్! ]]></title><link>https://telugu.abplive.com/education/jawahar-navodaya-vidyalaya-6th-class-admission-2027-registration-255947</link><comments>https://telugu.abplive.com/education/jawahar-navodaya-vidyalaya-6th-class-admission-2027-registration-255947#respond</comments><pubDate>Mon, 10 Aug 2026 12:19:31 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/jawahar-navodaya-vidyalaya-6th-class-admission-2027-registration-255947</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;JNVST 2027 Registration:&lt;/strong&gt; మీ పిల్లలను జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో చేర్పించడానికి మీకు ఆసక్తి ఉంటే, ఈ వార్త మీకు ముఖ్యమైనది కావచ్చు. జవహర్ నవోదయ సమితి 2027-28 సంవత్సరానికిగాను జేఎన్&amp;zwnj;వీఎస్&amp;zwnj;టి 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు గడువును పొడిగించింది. జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు ఇంకా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈరోజు, ఆగస్టు 10వ తేదీన ఆన్&amp;zwnj;లైన్ ఫారం నింపవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;అధికారిక JNVS వెబ్&amp;zwnj;సైట్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 6వ తరగతి ప్రవేశం కోసం జరిగే ఎంపిక ప్రక్రియలో పాల్గొనడానికి, విద్యార్థులు నిర్దేశించిన గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, అభ్యర్థులకు వారి దరఖాస్తులలో సవరణలు చేసుకునే అవకాశం ఇస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఆగస్టు 11,12 తేదీలలో సవరణలు &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఆగస్టు 11, 12 తేదీలలో NVS దరఖాస్తు సవరణల విండో ఓపెన్ చేస్తారు. ఈ సమయంలో, అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారంలో నమోదు చేసిన అవసరమైన సమాచారాన్ని సమీక్షించుకోవచ్చు. అందుబాటులో ఉన్న సవరణ ఎంపికలను ఉపయోగించి మార్పులు చేసుకోవచ్చు. విద్యార్థులు ఫారమ్&amp;zwnj;ను సమర్పించే ముందు మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని, భవిష్యత్ సూచన కోసం దరఖాస్తు కాపీని భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఎంపిక పరీక్ష నవంబర్ 28న &amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;జేఎన్&amp;zwnj;వీఎస్&amp;zwnj;టీ 6వ తరగతి ప్రవేశం 2027-28 కోసం ఎంపిక ప్రక్రియ 2026 నవంబర్ 28న &amp;nbsp;నిర్వహిస్తారు. ఈ పరీక్ష నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కొరకు ఉద్దేశించింది. పరీక్ష అనంతరం, ఫలితాలు 2026 మార్చి-ఏప్రిల్ నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ రోల్ నంబర్&amp;zwnj;ను ఉపయోగించి అధికారిక వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;లో తమ ఫలితాలను, స్కోర్&amp;zwnj;కార్డులను చూసుకోగలరు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;JNVST 6వ తరగతి ప్రవేశం 2027 ముఖ్యమైన తేదీలు&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;నమోదు ప్రారంభం &amp;ndash; జూలై 6, 2026&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;దరఖాస్తుకు చివరి తేదీ &amp;ndash; 10 ఆగస్టు 2026&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;దరఖాస్తులో సవరణ - 11, 12 ఆగస్టు 2026&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;జేఎన్&amp;zwnj;వీఎస్టీ 6వ తరగతి ఎంపిక పరీక్ష &amp;ndash; నవంబర్ 28, 2026&amp;nbsp;&lt;/li&gt;
&lt;li&gt;ఫలితం &amp;ndash; 2027 మార్చి-ఏప్రిల్&amp;zwnj;లో వెలువడనుంది&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h2&gt;ఎలా దరఖాస్తు చేసుకోవాలి?&amp;nbsp;&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలంటే, ముందుగా navodaya.gov.inను సందర్శించాలి.&lt;/li&gt;
&lt;li&gt;దీని తర్వాత, హోమ్ పేజీలో ఉన్న &amp;lsquo;Apply for Class 6 JNVST 2027&amp;rsquo; పై క్లిక్ చేయండి.&lt;/li&gt;
&lt;li&gt;ఇప్పుడు 6వ తరగతి JNVST 2027-28 నమోదు కోసం ఇక్కడ క్లిక్ చేయండి అనే ఎంపికను ఎంచుకోండి.&lt;/li&gt;
&lt;li&gt;దీని తర్వాత, అవసరమైన సమాచారాన్ని పూరించి, పత్రాలను అప్&amp;zwnj;లోడ్ చేయండి.&lt;/li&gt;
&lt;li&gt;చివరగా, ఫారమ్&amp;zwnj;ను సమర్పించి, నిర్ధారణ పేజీని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకోండి.&amp;nbsp;&lt;/li&gt;
&lt;/ul&gt;
&lt;h2&gt;దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన పత్రాలు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;ul&gt;
&lt;li&gt;పాస్&amp;zwnj;పోర్ట్ సైజు ఫోటో&lt;/li&gt;
&lt;li&gt;విద్యార్థి సంతకం&lt;/li&gt;
&lt;li&gt;తల్లిదండ్రుల సంతకం&lt;/li&gt;
&lt;li&gt;ప్రిన్సిపాల్ సంతకం చేసిన సర్టిఫికేట్&lt;/li&gt;
&lt;li&gt;ఆధార్ కార్డు&lt;/li&gt;
&lt;li&gt;కుల ధృవీకరణ పత్రం&lt;/li&gt;
&lt;/ul&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/10/85c9e0396df3cacf50e1bae1dae243f21786344481894215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[NMMSS Scholarship 2026-27 : NMMSS స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం, ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకోండి]]></title><link>https://telugu.abplive.com/education/nmmss-scholarship-registration-starts-apply-by-august-31-know-all-details-255891</link><comments>https://telugu.abplive.com/education/nmmss-scholarship-registration-starts-apply-by-august-31-know-all-details-255891#respond</comments><pubDate>Sun, 9 Aug 2026 16:04:15 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/nmmss-scholarship-registration-starts-apply-by-august-31-know-all-details-255891</guid><description><![CDATA[&lt;p&gt;విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ విద్యార్థులకు స్కాలర్&amp;zwnj;షిప్ అప్డేట్ ఇచ్చింది. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్&amp;zwnj;షిప్ స్కీమ్ (NMMSS) కోసం విద్యా సంవత్సరం 2026-27 రిజిస్ట్రేషన్&amp;zwnj;ను ప్రారంభించింది. ఈ పథకం కింద 9వ తరగతి చదువుతున్న అర్హులైన విద్యార్థులు తొలిసారి స్కాలర్&amp;zwnj;షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 10 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తమకు వస్తున్న స్కాలర్&amp;zwnj;షిప్&amp;zwnj;ను రెన్యూవల్ చేసుకోవడం కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. దరఖాస్తుకు చివరి తేదీని ఆగస్టు 31గా నిర్ణయించారు. దీని కోసం విద్యార్థులు నేషనల్ స్కాలర్&amp;zwnj;షిప్ పోర్టల్ (NSP)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం NMMSS పథకం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్&amp;zwnj;షిప్ స్కీమ్ ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు చదువు కొనసాగించడానికి ఆర్థిక సహాయం అందించడం. ఈ స్కీమ్ ప్రత్యేకంగా 8వ తరగతి తర్వాత డ్రాపౌట్ కాకుండా, విద్యార్థులు తమ చదువును కొనసాగించేలా ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రభుత్వపు ఈ పథకం ఒక ప్రధాన ఉద్దేశం బడి మానేయడం అంటే డ్రాప్&amp;zwnj;అవుట్ సమస్యను తగ్గించడం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందో, వారికి ఈ స్కాలర్&amp;zwnj;షిప్ ద్వారా చదువు కొనసాగించడంలో సహాయం లభిస్తుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;NMMSS కోసం ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;NMMSS కోసం ప్రభుత్వ, ప్రభుత్వ సహాయం పొందే (ఎయిడెడ్),&amp;nbsp; స్థానిక సంస్థల పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. వీరితో పాటు 10, 11, 12 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు తమ స్కాలర్&amp;zwnj;షిప్&amp;zwnj; కోసం రెన్యూవల్ దరఖాస్తు చేసుకోవాలి అయితే రెన్యూవల్ కోసం విద్యార్థులు స్కాలర్&amp;zwnj;షిప్&amp;zwnj;కు సంబంధించిన నిర్ణీత నిబంధనలను పూర్తి చేయాలి. దీంతో పాటు విద్యార్థులు NMMSS వంటి మెరిట్ ఆధారిత స్కాలర్&amp;zwnj;షిప్ కాకుండా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్కాలర్&amp;zwnj;షిప్ పథకాల కోసం కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే సంబంధిత స్కీమ్ అర్హతలను పూర్తి చేయాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఆగస్టు 31 వరకు దరఖాస్తులకు ఛాన్స్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;NMMSS 2026-27 కోసం కొత్తవి, రెన్యూవల్ రెండింటికీ చివరి తేదీ ఆగస్టు 31, 2026గా నిర్ణయించారు. అర్హులైన విద్యార్థులు నిర్ణీత సమయం లోపలే తమ దరఖాస్తును పూర్తి చేయాలి. నేషనల్ స్కాలర్&amp;zwnj;షిప్ పోర్టల్ (NSP) ని సందర్శించి ఆన్&amp;zwnj;లైన్&amp;zwnj;లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;NMMSS Scholarship 2026-27 ఇలా దరఖాస్తు చేయండి&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;స్కాలర్&amp;zwnj;షిప్ కోసం దరఖాస్తు చేయడానికి మొదట నేషనల్ స్కాలర్&amp;zwnj;షిప్ పోర్టల్ &lt;a href=&quot;https://scholarships.gov.in/&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;https://scholarships.gov.in/&lt;/a&gt; వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;కి వెళ్లండి.&lt;/p&gt;
&lt;p&gt;తొలి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ముందుగా New Registration ప్రక్రియను కంప్లీట్ చేయాలి.&lt;/p&gt;
&lt;p&gt;రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వచ్చిన లాగిన్ వివరాల సహాయంతో పోర్టల్&amp;zwnj;లో లాగిన్ అవ్వండి.&lt;/p&gt;
&lt;p&gt;ఆ తర్వాత అందుబాటులో ఉన్న స్కాలర్&amp;zwnj;షిప్ పథకాలలో National Means cum Merit Scholarship Scheme (NMMSS) ని సెలక్ట్ చేసుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇప్పుడు దరఖాస్తు ఫారమ్&amp;zwnj;లో అడిగిన అవసరమైన సమాచారాన్ని నింపి, అవసరమైన పత్రాలను (డాక్యుమెంట్లను) అప్&amp;zwnj;లోడ్ చేయండి.&lt;/p&gt;
&lt;p&gt;అన్ని వివరాలు నింపిన తర్వాత ఒకసారి ఫామ్&amp;zwnj;ను బాగా సరిచూసుకుని, ఆపై అప్లై ఆప్షన్ సబ్&amp;zwnj;మిట్ చేయండి.&lt;/p&gt;
&lt;p&gt;దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత భవిష్యత్తు అవసరాల కోసం కన్&amp;zwnj;ఫర్మేషన్ పేజీని డౌన్&amp;zwnj;లోడ్ చేసుకుని మీ వద్ద ఉంచుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;దరఖాస్తు తర్వాత రెండు దశల్లో వెరిఫికేషన్&lt;/p&gt;
&lt;p&gt;NMMSS కోసం దరఖాస్తు చేసినంత మాత్రాన ప్రక్రియ పూర్తికాదు. విద్యార్థుల దరఖాస్తు ఫారమ్ వెరిఫికేషన్ కూడా అవుతుంది.&amp;nbsp; ఈ వెరిఫికేషన్ 2 దశల్లో పూర్తవుతుంది. ఇందులో మొదటి దశలో ఇన్స్టిట్యూట్ నోడల్ ఆఫీసర్ (INO) విద్యార్థుల అప్లికేషన్&amp;nbsp; వెరిఫై చేస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత రెండో దశలో డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ (DNO) దరఖాస్తును వెరిఫై చేస్తారు. దీనిని సెప్టెంబర్ 30 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/09/093e98caedca636d991df068ee2da1211786271538480233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?]]></title><link>https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-neet-medical-colleges-government-private-seats-cutoff-ranks-255738</link><comments>https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-neet-medical-colleges-government-private-seats-cutoff-ranks-255738#respond</comments><pubDate>Fri, 7 Aug 2026 14:48:39 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/telangana/nizamabad/telangana-neet-medical-colleges-government-private-seats-cutoff-ranks-255738</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana NEET Cutoff:&amp;nbsp;&lt;/strong&gt;వైద్య వృత్తికి సమాజంలో ఉండే గౌరవం సామాన్యమైంది కాదు. అందుకే ప్రతి ఏటా లక్షలాది మంది విద్యార్థులు డాక్టర్&amp;zwnj; కావాలనే లక్ష్యంతో జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్&amp;zwnj; కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు. పరీక్ష రాసిన ఫలితాలు వచ్చాక, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మెదడును తొలిచే ప్రధాన ప్రశ్న... మొత్తం ఎన్ని మార్కులు వస్తే సీటు వస్తుంది? నా ర్యాంకుకు ప్రభుత్వ కాలేజీలో అవకాశం ఉంటుందా. గడిచిన కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్యారంగం అనూహ్య మార్పులకు లోనైంది. మునుపెన్నడూ లేని విధంగా సీట్ల సంఖ్య పెరగడం , కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడం విద్యార్థులకు వరంలా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం ప్రతీ జిల్లాకు ఒక ప్రభుత్వం మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుంది. దీని వల్ల సీట్ల పూల్&amp;zwnj; భారీగా పెరిగింది. గతంలో కేవలం ఉస్మానియా, గాంధీ వంటి కొన్ని ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్న మెడికల్&amp;zwnj; సీట్లు, నేడు మారుమూల జిల్లాల విద్యార్థులకు కూడా చేరువయ్యాయి.&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలోని వైద్య కళాశాలల్లో ప్రవేశాలను ప్రధానంగా రెండు విభాగాలుగా విభజించారు. అందులో మొదటి విభాగంలో 15 శాతం సీట్లు ఆల్&amp;zwnj; ఇండియా కోటాలో మెడికల్ కౌన్సెలింగ్&amp;zwnj; కమిటీ ఫిల్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఇందులో పోటీ పడవచ్చు. 85 శాతం సీట్లను రాష్ట్ర ప్రభుత్వం ఫిల్ చేస్తుంది. దీనిని వరంగల్&amp;zwnj;లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఈ ప్రక్రియను పూర్తి చేస్తుంది. ఇందులో తెలంగాణ స్థానిక విద్యార్థులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలో వైద్య విద్యకు అర్హత పొందాలంటే విద్యార్థి 9వ తరగతి నుంచి ఇంటర్&amp;zwnj;మీడియట్&amp;zwnj; వరకు వరుసా నాలుగేళ్లు ఈ తెలంగాణలో చదివి ఉండాలి. ప్రభుత్వం కాలేజీల్లో &amp;nbsp;నాణ్యమైన విద్యతోపాటు తక్కువ ఖర్చుతో చదువుకునే అవకాశం ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఓసీ అభ&amp;zwnj;యర్థులకు ఆల్&amp;zwnj; ఇండియా ర్యాంక్ 12వేల నుంచి 48వేల లోపు ఉంటే ప్రభుత్వ కాలేజీలో సీటు దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.EWS రిజర్వేషన్ ఉన్న వారికి మరో రెండు నుంచి నాలుగు వేల ర్యాంకుల సడలింపు ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;బీసీ కేటగిరిలో బీసీ బి అభ్యర్థులకు పోటీ ఎక్కువగా ఉంటుంది.వీరికి పాతిక వేల నుంచి 52వేల లోపు ర్యాంక్ అవసరం.. బీసీ ఏ వర్గానికి యాభై వేల నుంచి 85వేల వరకు బీసీ ఇ వారికి 45వేల నుంచి 75వేల ర్యాంకుల వరకు అవకాశం ఉండవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎస్సీ కేటగిరీలో ప్రభుత్వ కాలేజీలో మెడికల్ సీట్ సాధించడానికి 85వేల నుంచి 1,3 5,000 మధ్య ఆల్&amp;zwnj; ఇండియా ర్యాంక్ ఉంటే సరిపోతుంది. ఎస్టీ కేటగిరీలో సీటు పొందాలంటే 90వేల నుంచి 1, 40, 000 వరకు ర్యాంకు రావాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రముఖ కాలేజీల కటాఫ్&amp;zwnj;&lt;/h2&gt;
&lt;p&gt;టాప్ ర్యాంకర్ల మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ గాంధీ, ఉస్మానియా కాలేజీలే. గాంధీ మెడికల్ కాలేజీలో ఓసీ కేటగిరిలో సీటు రావాలంటే 1500 నుంచి 4200 ర్యాంకు వద్దే ముగిసిపోతుంది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో సీటు కావాలంటే 2వేల నుంచి 5500 ర్యాంకు రావాలి. కాకతీయ మెడికల్ కాలేజీ ఓసీ కేటగిరిలో పదివేల నుంచి 18,500 మధ్య ర్యాంక్&amp;zwnj; ఉన్న వారు ఇక్కడ సీటు పొందవచ్చు.&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వం సీటు మిస్ అయిన వారికి ప్రైవేటు కాలేజీలు తదుపరి ప్రత్యామ్నాయం. ఇక్కడ మూడు రకాల కేటగిరీలు ఉంటాయి. ఏ కేటగిరీ సీట్లు 45వేల నుంచి 90వేల ర్యాంకు వరకు రావచ్చు. ఇక్కడ ఫీజు ఏడాదికి 60వేల వరకు ఉండొచ్చు. బీ కేటగిరీ సీట్ల కోసం 1.5 లక్షల నుంచి 2.8 లక్ష ర్యాంకు వరకు రావచ్చు. ఈ సీటు పొందితే ఏడాదికి 12 లక్షల వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సీ కేటగిరీ సీట్లు నీట్&amp;zwnj; క్వాలిఫై అయితే ఇస్తారు. ఫీజులు మాత్రం ఇరవై లక్షలకుపైగానే ఉంటాయి. &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఏర్పడ్డ మెడికల్ కాలేజీల వల్ల సీట్లు పెరిగాయి. ఓసీ, బీసీ విద్యార్థులకు సుమారు 3 నుంచి ఆరు వేల ర్యాంకులు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పదివేల నుంచి 15వేల ర్యాంకుల వరకు ఉపశమనం లభిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/07/cc20f86c0a9b8ea46864267e77f278f61786094227533215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!]]></title><link>https://telugu.abplive.com/news/india/cbi-neet-ug-paper-leak-national-testing-agency-subject-matter-experts-exam-system-security-255688</link><comments>https://telugu.abplive.com/news/india/cbi-neet-ug-paper-leak-national-testing-agency-subject-matter-experts-exam-system-security-255688#respond</comments><pubDate>Fri, 7 Aug 2026 09:55:06 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/cbi-neet-ug-paper-leak-national-testing-agency-subject-matter-experts-exam-system-security-255688</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;CBI On NEET Paper Leak:&lt;/strong&gt; నీట్-యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ కీలక విషయాలు చెబుతోంది. పరీక్షా వ్యవస్థ భద్రతపై తీవ్రమైన అనుమానాలు రేకెత్తిసోతంది. ఈ పేపర్ లీక్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా కాకుండా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న సబ్జెక్ట్ మేటర్ ఎక్స్&amp;zwnj;పర్ట్స్ ద్వారా జరిగిందని దర్యాప్తులో వెల్లడైంది.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/07/bf5df0a68f5cd1d5aefc97ba019a749b1786076597445215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?]]></title><link>https://telugu.abplive.com/education/ap-neet-mbbs-cutoff-ranks-medical-colleges-seats-255682</link><comments>https://telugu.abplive.com/education/ap-neet-mbbs-cutoff-ranks-medical-colleges-seats-255682#respond</comments><pubDate>Fri, 7 Aug 2026 09:15:32 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఎడ్యుకేషన్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/education/ap-neet-mbbs-cutoff-ranks-medical-colleges-seats-255682</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP NEET MBBS Cutoff Ranks:&lt;/strong&gt;వైద్యులుగా మారి సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలలుకంటూ ఉంటారు. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్&amp;zwnj; కౌన్సెలింగ్&amp;zwnj; తాజాగా ప్రారంభమైంది. అయితే చాలా మంది మదిలో ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. నాకు వచ్చిన ర్యాంకుకు ఏపీలో ఎంబీబీఎస్ సీటు వస్తుందా? వస్తే ఏ కాలేజీలో రావచ్చు?. నిజానికి కటాఫ్&amp;zwnj; మార్కులు స్థిరంగా ఉండవు. ఏడాదికి ఏడాది మారిపోతూ ఉంటుంది. ప్రశ్నాపత్రంలో క్లిష్టత, అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు, రిజర్వేషన్ల ఆధారంగా మారుతుంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిన కౌన్సెలింగ్&amp;zwnj;లను ఆధారంగా ఒక అంచనాకు మాత్రం రావచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్&amp;zwnj;్ సీట్లు ఎన్ని?&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, సొసైటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో మొత్తం 7200పైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లు భర్తీ ప్రక్రియ ప్రధానంగా రెండు విభాగాల్లో జరుగుతుంది. మెడిక్ కౌన్సెలింగ్ ద్వారా దేశవ్యాప్తంగా మెరిట్ ఆధారంగా మొదట విధానంలో పదిహేను శాతం సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలోని ప్రతిష్టాత్మక కాలేజీల్లో ఈ కోటా కింద సీటు రావాలంటే ఆల్&amp;zwnj; ఇండియా ర్యాక్&amp;zwnj; మూడు వేల నుంచి పన్నెండు వేల లోపు ఉండాలి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మిగతా 85 శాతం సీట్లను విజయవాడలోని ఎన్టీఆర్&amp;zwnj; ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం భర్తీ చేస్తుంది. లోకల్ అభ్యర్థులకు ఈ కోటా అత్యంత కీలకం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;టాప్ ఎంబీబీఎస్&amp;zwnj; ప్రభుత్వ కాలేజీలు ఏవీ?&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీటు సాధించడం అంటే అత్యుత్తమ మెరిట్ ఉండాల్సిందే. రాష్ట్రంలోనే నెంబర్&amp;zwnj;వన్&amp;zwnj;గా ఉన్న ఆంధ్రా మెడిక్ కాలేజ్&amp;zwnj;లో సీటు సాధించాలి అంటే 1700 నుంచి 9700 ర్యాంకు ఉండాలి. గుంటూరు మెడిక్ కాలేజ్&amp;zwnj;లో సీటు కోసం 2300 నుంచి 12000 లోపు ర్యాంకు ఉన్న వారికి ఛాన్స్ ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజ్&amp;zwnj;లో చేరాలీ అంటే 7100 నుంచి 17,700 మధ్య ర్యాంక్&amp;zwnj; సాధించాలి. శ్రీవెంటకేశ్వర మెడికల్ కాలేజ్&amp;zwnj;లో సీటు కోసం 11,500నుంచి 27, 600 మధ్య ర్యాంక్ సాధించిన వారికి ప్రవేశం లభిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కేటగిరీల వారీగా సేఫ్&amp;zwnj; ర్యాంక్ ఎంత?&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;రిజర్వేషన్ల ఆధారంగా సీటు దక్కే అవకాశాలు మారుతూ ఉంటాయి. అభ్యర్థుల అవగాహన కోసం ప్రాథమిక అంచనాలు మాత్రమే చెప్పగలం. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఆల్ ఇండియా ర్యాంక్&amp;zwnj; 15000నుంచి 35000 మధ్య ఉంటే ప్రభుత్వం కాలేజీల్లో సీటు గ్యారంటీగా వస్తుంది. బీసీ కేటగిరీ అభ్యర్థులకు 20వేల నుంచి 45వేల మధ్య ర్యాంకు ఉంటే సీటు ఖాయంగా చెప్పవచ్చు. ఎస్సీ అభ్యర్థులకు 50వేల నుంచి లక్ష వరకు ర్యాంకు వస్తే సీటు దక్కుతుంది. ఎస్టీ అభ్యర్థులకు 80వేల నుంచి లక్షా యాభైవేల వరకు ఛాన్స్ ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కొత్త మెడికల్ కాలేజీల ప్రభావం ఎంత?&lt;/h2&gt;
&lt;p&gt;గడిచిన కొద్ది కాలంలో ఏపీ ప్రభుత్వం కొత్త కాలేజీలను ఏర్పాటు చేసింది. దీని వల్ల మొత్తం సీట్ల సంఖ్య పెరిగి కటాఫ్&amp;zwnj; ర్యాంకుల్లో సుమారు రెండు వేల నుంచి ఐదు వేల వరకు ర్యాంకుల సడలింపు లభిస్తుంది. మధ్యస్థ ర్యాంకులు సాధించిన వారికి ఊరటగా చెప్పవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రైవేటు కాలేజీల్లో సీట్ల విభజన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ప్రభుత్వ కాలేజీల్లో సీటు రాని వారికి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు దక్కవచ్చు. ఇక్కడ మూడు కేటగిరీలు ఉంటాయి. ఇందులో యాభై శాతం సీట్లు భర్తీ చేసే ఏ కేటగిరీ కోటా సీట్ల కోసం 35వేల నుంచి 70వేల ర్యాంకు వచ్చిన వారు పోటీ పడతారు. 35 శాతం సీట్లు భర్తీ చేసే మేనేజ్&amp;zwnj;మెంట్ కోటాలో 1.5లక్షల నుంచి 2.5 లక్షల ర్యాంక్ ఉన్న అభ్యర్థుల వరకు ఇక్కడ పోటీ పడవచ్చు. మూడోది సీ కేటగిరీ. అర్హత కలిగిన నీట్ స్కోర్ ఉండి, ఎన్&amp;zwnj;ఆర్&amp;zwnj;ఐ స్పాన్సర్&amp;zwnj;షిప్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎంబీబీఎస్ సీటు సాధించం అనేది ఒక మైలు రాయి మాత్రమే. సరైన కాలేజీ ఎంపిక మీ వృత్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అభ్యర్థులు తమ ర్యాంకులకు అనుగుణంగా వాస్తవిక దృక్పథంతో వెబ్&amp;zwnj; ఆప్షన్లు ఎంచుకోవాలి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/07/28198e1bcce1c411ff39505a1b20c8001786074221861215_original.jpg" width="220"/></item></channel></rss>