AP Inter 1st Year Results 2026 | అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం ఉదయం ఇంటర్మీడియట్‌ పబ్లిక్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అధికారిక వెబ్‌సైట్  https://resultsbie.ap.gov.in/ లో ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్‌ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించారు.

Continues below advertisement

ఈ ఏడాది ఇంటర్‌  పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య గత కొన్నేళ్లతో పోల్చితే పెరిగింది. మొత్తం 10, 57, 899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో ఫస్టియర్ విద్యార్థులు 5, 31, 275 మంది ఉన్నారు. జనరల్‌ విభాగంలో, ఒకేషనల్‌ కోర్సుల విద్యార్థులు ఇద్దరూ ఉన్నారు. 

Continues below advertisement

నేరుగా మీ వాట్సాప్‌లో ఫలితాలుమీ ఫోన్‌లో 9552300009 నెంబర్‌ కు వాట్సాప్ లో హాయ్ అని మెస్సేజ్ చేసి రిజల్ట్స్ చేక్ చేసుకోవచ్చు. Hi అని మెస్సేజ్ తరువాత వచ్చే సూచనలు పాటిస్తూ మీ హాల్‌టికెట్ నెంబర్, వివరాలు ఎంటర్ చేస్తే సెకన్‌లలో ఫలితాలు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ఏపీ ఇంటర్ ఫస్టియర్ లో 510307 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జనరల్ విభాగంలో 361526 మంది, వొకేషనల్ విభాగంలో 23569 మంది పాసయ్యారు. ఫస్టియర్‌లో జనరల్ విభాగంలో బాలికలు 81 శాతం, బాలురు 72 శాతం పాసయ్యారు. వొకేషనల్ విభాగంలో బాలికలు 71 శాతం, బాలురు 49 శాతం పాసయ్యారు. 

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు - జిల్లా వారీగా

 జిల్లాహాజరుపాసైన వారు

పాస్ శాతం (%)

1కృష్ణా22,40320,14290
2గుంటూరు33,64329,53088
3విశాఖపట్నం37,89132,33485
4ఎన్టీఆర్34,51029,10384
5పార్వతీపురం మన్యం5,7134,75983
6తూర్పు గోదావరి19,97716,43982
7ఎస్పీఎస్ఆర్ నెల్లూరు25,14719,68278
8తిరుపతి28,38322,01678
9అల్లూరి సీతారామరాజు5,6534,36877
10పశ్చిమ గోదావరి16,70112,77576
11ఏలూరు14,62111,13376
12అనకాపల్లి10,3157,60274
13పల్నాడు15,94511,62273
14కర్నూలు22,47416,35673
15అనంతపురము21,73015,81473
16విజయనగరం16,98412,26872
17బాపట్ల8,8316,36172
18డా.బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ10,5277,58072
19ప్రకాశం19,25413,52070
20శ్రీ సత్యసాయి9,9596,96970
21శ్రీకాకుళం17,43212,16370
22చిత్తూరు12,5678,69169
23కాకినాడ19,43413,15668
24వైఎస్ఆర్ కడప15,28610,15066
25నంద్యాల13,5989,02466
26అన్నమయ్య12,8867,96962
మొత్తంTOTAL4,71,8643,61,52677

అత్యధిక ఉత్తీర్ణత సాధించిన టాప్ 5 జిల్లాలు

ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా 90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో గుంటూరు (88 శాతం), విశాఖపట్నం (85 శాతం) జిల్లాలు నిలిచాయి. ఎన్టీఆర్ జిల్లా 84 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, పార్వతీపురం మన్యం జిల్లా 83 శాతంతో ఐదో స్థానంలో నిలిచింది. 

అల్ప ఉత్తీర్ణత నమోదైన చివరి 5 జిల్లాలు

అన్నమయ్య జిల్లా 62 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలు చెరో 66 శాతంతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచాయి. కాకినాడ జిల్లాలో 68 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, చిత్తూరు జిల్లా 69 శాతంతో చివరి నుండి ఐదో స్థానంలో ఉంది. ఈ జిల్లాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత అయిన 77 శాతం కంటే తక్కువ ఫలితాలు సాధించాయి.