ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇటీవల జరిగిన కేబిట్ సమావేశంలో ఉద్యోగ కల్పనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి కేబినేట్ ఆమోదించింది. ఇందులో భాగంగా 5388 పోస్టులను భర్తీ చేయనున్నారు. రూ 6,000ల గౌరవ వేతనాన్ని ఇవ్వనున్నారు. మరి ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారం (మార్చి 20) విడుదల చేసింది. త్వరలోనే నోటిఫికేషన్ జారీకానుంది. పూర్తి పారదర్శకంగా ఈ నియామకాలను చేపట్టనుంది.


నియామకాల్లో వీరికి ప్రాధాన్యం..
ఇప్పటికే ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న అయా భర్తకు మొదటి ప్రాధాన్యత ఇస్తారు. గ్రామం/వార్డులో మాజీ-సేవా పురుషులకు రెండవ ప్రాధాన్యత ఇస్తారు. ఈ రెండు విభాగాలకు సంబంధించినవారు లేనిపక్షలో పేరెంట్స్ కమిటీ ఇతర అర్హత గల వ్యక్తిని నియమించవచ్చు. అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ కమీషనర్, మిడ్ డే మీల్స్ డైరెక్టర్, ఈ విషయంలో తదుపరి అవసరమైన చర్యలను తీసుకుంటారు.


ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం “మన బడి నాడు-నేడు”. 2020-21 నుండి అమలు చేస్తోంది. దీనిద్వారా పాఠశాలల్లో నీటి లభ్యత, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్ల ఏర్పాటు; విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్ ఏర్పాటు, గ్రీన్ చాక్ బోర్డు, పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబులు ఏర్పాటు చేసింది. అదేవిధంగా ప్రతి పాఠశాలకు తప్పనిసరిగా కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్‌లు, అదనపు తరగతి గదులు ఏర్పాటు చేసింది.


'మనబడి నాడు-నేడుస మొదటి దశలో 15,715 పాఠశాలలకు రూ. 3,669 కోట్లు, రెండో దశలో 22,228 కింద రూ.9,860 కోట్లతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించారు. ఇక మిగిలిన పాఠశాలలను ఫేజ్-3లో చేపట్టనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి పథకం కింద అన్ని పాఠశాలలకు పారిశుద్ధ్య కార్మికుల ఆయాలను నియమించడమే కాకుండా క్లీనింగ్ కెమికల్స్, క్లీనింగ్ టూల్స్ అందజేస్తున్నారు. నాడు నేడు రెండో దశలో భాగంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలే కాకుండా ఇంటరాక్టివ్ ఫ్లా ప్యానెల్‌లు, స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రభుత్వ ట్యాబ్‌లు కూడా అందజేసింది.


అయితే కొన్ని పాఠశాలల్లో దొంగతనాలు జరుగుతున్నాయని, నాడు నేడు కింద అందించే పాఠశాలల్లోని విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయని.. కొన్ని చోట్ల మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు, సంఘ విద్రోహశక్తులు బడి ముగిసే సమయాల్లో కూడా పాఠశాల ఆవరణలోకి ప్రవేశించి పాఠశాల వాతావరణానికి అనుకూలించకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఫర్నీచర్‌, చరాస్తులను ధ్వంసం చేస్తున్నారు. వీటివల్ల రాష్ట్ర ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.


పాఠశాలల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం చాలా డబ్బు ఖర్చు చేసింది. అందువల్ల ఖరీదైన ఫర్నిచర్‌ను రక్షించాల్సిన అవసరం ఉంది. కావున, ఈ వస్తువులన్నింటిని రక్షించడంతోపాటు సంఘ వ్యతిరేక శక్తులు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి ప్రభుత్వం నైట్ వాచ్‌మెన్ పోస్టుల నియామకానికి మొగ్గు చూపింది. మొత్తం 5,388 నాడు నేడు హైస్కూల్‌లలో పాఠశాలకు ఒక నైట్ వాచ్‌మెన్‌ను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది.



మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..