AP ECET Exam Results 2024: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్, బీఎస్సీ విద్యార్థులకు బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సు్ల్లో రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన 'ఏపీఈసెట్-2024' పరీక్ష ఫలితాలు నేడు (మే 30న) వెలువడనున్నాయి. అనంతపురం జేఎన్‌టీయూ ప్రాంగణలో ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాల విడుదల అనంతరం కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మే 8న నిర్వహించిన ఈసెట్ పరీక్షకు మొత్తం 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీఈసెట్ ప్రాథమిక కీని, అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను జేఎన్‌టీయూ అనంతపురం మే 10న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి మే 12 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఈ ప్రక్రియ ముగియడంతో ఫలితాలను వెల్లడించనున్నారు.


ఏపీలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో ద్వితీయ సంవత్సరం లేటరల్ ఎంట్రీ ప్రవేశాల కోసం AP ECET 2024 నోటిఫికేషన్ మార్చి 14న విడుదలైన సంగతి తెలిసిందే.  ఈసెట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ మార్చి 15న ప్రారంభమైంది. అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు రుసుము లేకుండా ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు స్వీకరించారు. రూ.500 ఆలస్యరుసుముతో  ఏప్రిల్ 22 వరకు, రూ.2000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 29 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో  మే 12 వరకు స్వీకరించారు. పాలిటెక్నిక్ డిప్లొమా (ఇంజినీరింగ్), బీఎస్సీ (మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణత ఉన్నవారు ఈసెట్ పరీక్ష రాయడానికి అర్హులు. చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకున్నారు.  జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షల నిర్వహణ బాధ్యతను చేపట్టింది. 


AP ECET 2024 ఫలితాలు ఇలా చూసుకోండి..


Step 1: ఈసెట్ ఫలితాల కోసం అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి-https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_HomePage.aspx 


Step 2: అక్కడ హోంపేజీలో కిందిభాగంలో కనిపించే  AP ECET 2024 Results లింక్ మీద క్లిక్ చేయాలి. 


Step 3: ఆ తర్వాత వచ్చే పేజీలో అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలు నమోదు చేయాలి.


Step 4: ఈసెట్ ఫలితాలు కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపిస్తాయి.


Step 5: ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవాలి. 


ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్.. (Link 1)


ఫలితాల కోసం క్లిక్ చేయండి (Link 2)


పరీక్ష విధానం:


➥ మొత్తం 200 మార్కులకు ఏపీ ఈసెట్ పరీక్ష నిర్వహించారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 50 మార్కులు-50 ప్రశ్నలు, ఫిజిక్స్ 25 మార్కులు - 25 ప్రశ్నలు, కెమిస్ట్రీ 25 మార్కులు - 25 ప్రశ్నలు ఉంటాయి. ఇక విద్యార్థులకు సంబంధించిన విభాగం నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. 


➥ ఇందులో ఫార్మసీ విభాగంలో ఫార్మాస్యూటిక్స్‌లో 50 మార్కులు - 50 ప్రశ్నలు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీలో 50 మార్కులు - 50 ప్రశ్నలు, ఫార్మాకాగ్నసీలో 50  మార్కులు - 50 ప్రశ్నలు, ఫార్మాకాలజీలో 50 మార్కులక - 50 ప్రశ్నలు ఉంటాయి. 


➥ బీఎస్సీ విద్యార్హతతో దరఖాస్తు చేసేవారికి మ్యాథ్స్‌లో 100 మార్కులు - 100 ప్రశ్నలు, అనలిటికల్ ఎబిలిటీ 50 మార్కులు - 50 ప్రశ్నలు, కమ్యూనికేషన్ ఇంగ్లిష్‌ 50 మార్కులు - 50 ప్రశ్నలు ఉంటాయి.


అర్హత మార్కులు..
పరీక్షలో కనీస అర్హత మార్కులను 25% (50 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు ఉండవు.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..