AP SET 2024 Admitcard: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అర్హత పరీక్ష(AP SET)-2024కు సంబంధించిన అడ్మిట్‌కార్డులను ఆంధ్ర యూనివర్సిటీ ఏప్రిల్ 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏపీసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఈమెయిల్‌ ఐడీ/ మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది. మొత్తం 30 సబ్జెక్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు జిల్లా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ కోసం ఏయూ అధికారులు ఏర్పాట్లు చేశారు.


APSET - 2024 అడ్మిట్‌కార్డుల కోసం క్లిక్ చేయండి..


పరీక్ష విధానం: ఏపీ సెట్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌-1(జనరల్ పేపర్)లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2(అభ్యర్థులకు సంబంధించిన సబ్జెక్టు)లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పేపర్-1కు 60 నిమిషాలు (గంట), పేపర్-2కు 120 నిమిషాల (2 గంటల) సమయం కేటాయించారు.


➥ పేపర్-1 పరీక్షను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనుండగా.. పేపర్-2లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులను ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించనున్నారు. తెలుగు, ఉర్దూ, సంస్కృతం, హిందీ సబ్జెక్టులు తప్ప మిగతా సబ్జెక్టులను ఇంగ్లిష్‌లో మాత్రమే నిర్వహిస్తారు.


పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు.


సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, హిస్టరీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్- అట్మాస్పియరిక్‌- ఓషన్ అండ్‌ ప్లానెటరీ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్స్, లా, లైఫ్ సైన్సెస్, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్, మేనేజ్‌మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్.


ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 10న ఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 14 వరకు ఎలాంటి ఆలస్యరుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరించింది. ఇక రూ.2000 ఆలస్యరుసుముతో మార్చి 25 వరకు, రూ.5000 ఆలస్యరుసుముతో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించింది. పరీక్ష ఫీజుగా జనరల్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1200 చెల్లించారు. బీసీ అభ్యర్థులు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్‌ అభ్యర్థులు రూ.700 చెల్లించారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏప్రిల్ 19న విడుదల చేసింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 28న ఏపీసెట్-2024 ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. రూ.5000 ఆలస్యరుసుముతో ఫీజు చెల్లించినవారికి కేవలం విశాఖపట్నం కేంద్రంలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు.


కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి.  పీహెచ్‌డీ అర్హత ఉన్నవారు 19.09.1991లోపు మాస్టర్ డిగ్రీ పూర్తిచేసి ఉంటే దరఖాస్తుకు అర్హులు. 01.06.2002 కు ముందు సెట్/నెట్ పూర్తిచేసినవారికి ఏపీనెట్ నుంచి మినహాయింపు ఉంది. ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు.


Notification


Website


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..