వరంగల్..


 


వరంగల్: గుప్తనిధుల పేరుతో ఓ కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసి రూ.15 లక్షలు వసూలు చేసిన గుప్త నిధులు ముఠాను వరంగల్ కమిషనరేట్ పోలీస్ లు అరెస్ట్ చేశారు. బాధితురాలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేసి గుప్తనిధుల ముఠాను అరెస్ట్ చేసి ఇద్దరు నిందితుల నుండి 15 లక్షలు, 540 గ్రాముల వెండి బిళ్ళలు, 76 బంగారు రేకు బిళ్ళలు, రెండు కార్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నట్లు జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ చెప్పారు. మరో ఇద్దరు నిదితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు.


నలుగురు చనిపోయారు, గుప్త నిధులే కారణం 
జనగామ జిల్లా కొడకండ్ల కి చెందిన ఒక బాధితురాలు వివరాల ప్రకారం.. మూడు నెలల కిందట బాధితురాలు అత్తకు సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తి రజనీకాంత్ కలిశారు. ఆమె వద్దకు వచ్చి మీ కుటుంబం సమస్యలతో బాధపడుతున్నారని మీ ఇంట్లో నలుగురు చనిపోయారని చెప్పినట్లు డీసీపీ చెప్పారు. మీ ఇంట్లో నలుగురు చనిపోయారు అని చెప్పేసరికి అత్త, కోడలు అతని మాటలు నమ్మారు. రజినీకాంత్ ను ఇంటికి తీసుకెళ్లి చూపెట్టగా ఇంట్లో గుప్తనిధి ఉందని దానివల్లనే నలుగురు చనిపోయారని డీసీపీ తెలిపారు. ఆ గుప్త నిధులను బయటకు తీయకపోతే మిగితా కుటుంబ సభ్యులు చనిపోతారని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఏం చేయాలని అడగ్గా మీ ఇంట్లో ఉన్న గుప్త నిధులను బయటకు తీయాలని ఒక పూజ చేయాలన్నారు.


పూజ సామాగ్రి పేరుతోనూ మోసాలే 
ఆ పూజ చేయడానికి ముందు అంజనం కోసం యాదగిరిగుట్ట లోని ఓ షాప్ కి వెళ్లి ఒక పౌడర్ తీసురావాలని చెప్పారు. బాధితురాలు యాదగిరిగుట్టలో 1 లక్ష 75 వేలు చెల్లించి పౌడర్ తీసుకొని వచ్చారు. పౌడర్ తీసుకువచ్చామని సమాచారం అందించినట్లు సమాచారం ఇవ్వడంతో  ఆ ముఠా సభ్యులు నరసింహ, మోటం సురేష్ లు ఇంటికి వచ్చి గుప్త నిధులు తేవడానికి పూజా సామాను కోసం 9 లక్ష 20 వేలు ఖర్చు అవుతుందని చెప్పినట్లు డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. ఆ డబ్బు తీసుకొని వేములవాడలోని విఘ్నేశ్వర పూజ స్టోర్ లో పూజ సామాను తీసుకురాగా పూజ చేశారని డీసీపీ చెప్పారు. పూజ పూర్తి అయిన తరువాత 15 రోజుల తరువాత మరో పూజ చేయాలని అందుకు 14 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పినట్లు డీసీపీ తెలిపారు.


కరీంనగర్ లోని శ్రీ రాజరాజేశ్వర పూజ షాప్ లో రూ.7 లక్షలు చెల్లించి, మిగతా ఏడు లక్షలు చెల్లిస్తే పూజా సామాన్లు తీసుకొస్తామని ముఠా అభ్యులు చెప్పినట్లు డీసీపీ తెలిపారు. ముందు పూజ చేయండి తర్వాత డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఈరోజు కొడకండ్ల గ్రామానికి పూజ సామాన్ తో పాటు నరసింహ పూజ చేయడం కోసం వచ్చారు. పోలీసుల ముందస్తు ప్రణాళికతో ముఠా సభ్యుడు నరసింహను  కొడకండ్ల పోలీస్ లు పట్టుకొని విచారించగా జరిగిన ప్లాన్ ను చేసినట్లు డీ సీపీ చెప్పారు. మిగతా నిందితులు కడమంచి రజనీకాంత్, మోటాం సురేష్ లు ఇద్దరూ పెద్దూరు గ్రామం సిరిసిల్ల మండలం జిల్లా కి చెందినవారు పరారీలో ఉన్నారని రాజమహేంద్ర నాయక్ చెప్పారు.