శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఈ దాడిలో ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ముద్దాడపేటకు చెందిన రీసు అప్పన్న శనివారం మద్యం మత్తులో కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భార్య అప్పమ్మ, సోదరి చెల్లుబోయిన రాజు అక్కడికక్కడే మృతి చెందారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ముగ్గురికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేసి తర్వాత తానూ ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు అప్పన్న. కత్తితో పొడుచుకోవడంతో అప్పన్న కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పోలీసులు, క్లూస్ టీం పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మద్యం మత్తులో అప్పన్న ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.


మద్యం మానమన్నందుకు


ముద్దాడపేటలో నివాసం ఉంటున్న రీసు అప్పన్న మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగొద్దని భార్య, బంధువులు వారించేవారని స్థానికులు అంటున్నారు. తననే మద్యం మానేమంటారా అని కోపంతో కుటుంబ సభ్యులపై కత్తితో దాడి చేశాడు అప్పన్న. భార్య, సోదరి హత్య చేశాడు. తర్వాత ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. భార్యను చంపుతుండగా అడ్డొచ్చిన తన తండ్రితో పాటు సోదరి కుమార్తె కూడా అప్పన్న కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వాళ్లిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన వారితో పాటు అప్పన్నను శ్రీకాకుళం జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


పబ్జీకి బానిసై


పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ రాజధాని పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. లాహోర్ ఖన్నా ఏరియాలో నహిద్ ముబారక్  (45) ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తోంది. ఈమె 14 ఏళ్ల కుమారుడు గత కొంతకాలం నుంచి చదవడం లేదు. ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్లో పబ్‌జీ గేమ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. శుక్రవారం నాడు దీనిపై ఇంట్లో గొడవ జరిగింది. పబ్‌జీ ఆడొద్దని బాలుడ్ని తల్లి మందలించింది. తన ఇష్టం ఇని కుమారుడు సమాధానం చెప్పడంతో పదే పదే వారించారు. తనను ఆన్‌లైమ్ ఆడుకోనిస్తలేరని బాలుడు విసుగుచెందాడు. పబ్‌జీ గేమ్ మత్తులో పడిపోయిన బాలుడు తుపాకీ తీసుకొచ్చి తల్లి, సోదరీమణులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తల్లి, ఇద్దరు మైనర్ బాలికలు చనిపోయారు.17, 11 ఏళ్ల వయసున్న మైనర్లు చనిపోయారని పీటీఐ రిపోర్ట్ చేసింది. బాలికలు నిద్రపోతుండగా వారిపై సైతం కాల్పులు జరిపినట్లు సమాచారం. తమ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కాల్పులు జరిపాడని చుట్టుపక్కల వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు. తాను పై అంతస్తులో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ఇంటికి వచ్చి కాల్పులు జరిపి తల్లిని, సోదరిమణులను హత్య చేశాడని ఆరోపించాడు.   


Also Read: పబ్‌జీ గేమ్‌కు బానిసైన బాలుడు.. మందలించారని తల్లి, అక్కాచెల్లెల్ని కాల్చి చంపాడు