Red sandalwood In Tirupati District | తిరుపతి: సినిమా స్టైల్లో స్మగ్లింగ్ చేస్తుండగా తిరుపతి జిల్లాలో భారీ విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 72 ఎర్రచందనం దుంగలు సీజ్ చేయడంతో ఏడుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  పాటు ఒక లారీ, ఒక కారు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ  జి. బాలిరెడ్డి సూచనల మేరకు ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ ఎస్ ఐ సి. వినోద్ కుమార్ టీమ్ శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో ఆదివారం కూంబింగ్ చేపట్టారు. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లతో పాటు కాటూరు ఫారెస్ట్ బీటు పరిధిలో పంగూరు మెయిన్ రోడ్డు దొమ్మరపాళెం వద్ద సైతం వాహనాలు తనిఖీ చేపట్టారు. 

Continues below advertisement


నిందితులలో తమిళనాడు వాసులు


పోలీసులు తనిఖీలు చేస్తున్నారని గమనించి సోమవారం ఉదయం ఒక కారు, దాని వెనుక కొంచెం దూరంలో లారీ ఆపిన నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్రమత్తమై నిందితులను ఛేజ్ చేసి చుట్టుముట్టారు. లారీని పరిశీలించగా అందులో 72 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటి విలువ దాదాపు రూ. 2.5 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. మొత్తం ఏడుగుర్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారిలో నలుగురు తిరుపతి జిల్లాకు చెందిన వారు, మరో ముగ్గురు తమిళనాడు వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు. ఎర్రచందనం దుంగలతో సహా లారీని, కారును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. 


కారును ఎస్కార్ట్ లాగ పెట్టి లారీలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. అయితే పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేస్తున్నారని చివరి నిమిషంలో గుర్తించడంతో నిందితులు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. డీఎస్పీలు వీ. శ్రీనివాసులురెడ్డి, షరీఫ్ లు నిందితులను విచారించారు. వారి ఆదేశాల మేరకు సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.