Boy Assault In Madrasa: ఒడిశాలోని నయాగఢ్​ జిల్లాలో దారుణం జరిగింది. ఐదుగురు మైనర్లు కలిసి తమ జూనియర్​పై లైంగిక దాడికి పాల్పడి ఆపై దారుణంగా హత్య చేశారు. ఆపై డెడ్​బాడీని సెప్టిక్​ ట్యాంక్​లో పడేశారు. అంతకుముందు సైతం సదురు బాలుడిపై ఇలాంటి దారుణానికే పాల్పడగా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిపై ఆ తర్వాత కూడా హత్యాచారానికి పాల్పడి మత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని సదరు మైనర్​ బాలురను అదుపులోకి తీసుకున్నారు. 

Continues below advertisement


అంతకుముందే ఒకసారి హత్యాయత్నం
పోలీసుల వివరాల ప్రకారం.. నీలపల్లిలోని మదర్సాలో కటక్​ జిల్లాకు చెందిన ఓ బాలుడు చదువుతున్నాడు. అదే క్యాంపస్​లో చదివే ముగ్గురు సీనియర్​ స్టూడెంట్లు​ ఆగస్టు 31న రాత్రి 10 గంటలకు బాలుడిని బాత్​రూమ్​లో దారుణంగా కొట్టి అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలోకి వెళ్లిన బాలుడు చనిపోయాడని భావించి అతడిని సెప్టింక్​ ట్యాంక్​లో పడేసి వెళ్లిపోయారు. అయితే బాధిత బాలుడు ఎలాగోలా తప్పించుకున్నాడు.


అయితే ఆ బాలుడిని హాస్టల్​ నుంచి తప్పిస్తామని నమ్మించిన ఇద్దరు స్టూడెంట్లు సెప్టెంబర్​ 2న మళ్లీ అదే ప్రాంతానికి తీసుకెళ్లారు. మరో ముగ్గురు ఫ్రెండ్స్​తో కలిసి అతడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆపై హత్య చేసి మళ్లీ సెప్టిక్​ ట్యాంక్​లో పడేశారు.


ఐదుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాలుడు అదృశ్యమైనట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యకు గురైనట్లు గుర్తించి బాలుడి డెడ్​బాడీని సెప్టిక్​ ట్యాంక్​లో నుంచి బయటకు తీశారు. ఫోరెన్సిక్​ బృందం ఎవిడెన్స్​ సేకరించిందని,  నిందితులైన ఐదుగురు బాలురను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. వారంతా 12 నుంచి 15 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. విచారణలో తామే నేరం చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.


జువైనల్​ బోర్డు ముందుకు కేసు
నిందితులైన విద్యార్థుల పేర్లను రికార్డుల నుంచి తొలగించినట్లు మదర్సా అడ్మినిస్ట్రేషన్​ తొలగించింది. వారి బర్త్​ సర్టిఫికెట్లను సైతం స్వాధీనం చేసుకుంది. ఈ కేసును జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు ఉంచారు. ఈ బోర్డు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనుంది.