Karimnagar Crime: కరీంనగర్ జిల్లా కేంద్రంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. చుట్టూ రద్దీగా ఉన్నప్పటికీ సీసీ కెమెరాలలో తాము చేసే నేరం రికార్డ్ అవుతాయనే భయం ఉన్నప్పటికీ.. బైక్ పై స్పీడ్ గా వచ్చి ఓ వ్యక్తి దగ్గరనుంచి 15 లక్షల రూపాయలు లూటీ చేశారు. అటు దగ్గర్లోనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉండడం.. కమిషనర్ ఆఫీస్ కూడా అతి సమీపంలోనే ఉన్నప్పటికీ వారి తెగింపు చూసి పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు.అసలు ఏం జరిగింది?కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకరంపుర ప్రాంతంలో ఓ బ్యాంకుకి పనిమీద సాయివాణి ఆర్ఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు చంద్ర ప్రకాష్, బండ మల్లారెడ్డి తమ ఆఫీసు కార్యకలాపాలకు సంబంధించి డబ్బుల కోసం జిల్లా కలెక్టరేట్ లో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) బ్రాంచ్ కి వచ్చారు. ఉదయం 11:15 ప్రాంతంలో రెండు చెక్కుల ద్వారా 15 లక్షల డ్రా చేసుకొని తమ బైక్ పై రిటర్న్ అయ్యారు. అయితే వారిని మొదటి నుండి గమనిస్తూ వస్తున్న ఇద్దరు అగంతకులు పక్కా ప్లానింగ్ తో పద్మనాయక రోడ్డులో ఓవర్టేక్ చేస్తూనే చంద్రప్రకాష్ చేతిలో ఉన్న డబ్బులకు సంబంధించి బ్యాగ్ ని లాక్కొని క్షణాల్లో మాయమయ్యారు. అయితే జరిగిందేంటో తెలుసుకుని తేరుకొని వారిని వెంబడించిన కూడా సమీప ప్రాంతాల్లో కనీసం జాడ కూడా దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక టూ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Karimnagar Crime: పట్టపగలే 15 లక్షలు లూటీ, దొంగల తెగింపు చూసి పోలీసుల షాక్
ABP Desam | 06 Sep 2022 08:27 AM (IST)
Karimnagar Crime: బైక్ పై స్పీడ్ గా వచ్చి ఓ వ్యక్తి దగ్గరనుంచి 15 లక్షల రూపాయలు లూటీ చేశారు. అటు దగ్గర్లోనే కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఉండడం.. కమిషనర్ ఆఫీస్ కూడా అతి సమీపంలోనే ఉంది.
పట్టపగలే 15 లక్షలు లూటీ
Published at: 06 Sep 2022 08:25 AM (IST)