ఝార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ధన్‌బాద్ జిల్లాలో ఉన్న బొగ్గు గనుల్లో పైకప్పు కూలిన ఘటనలో ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారు. మరికొంత మంది గనుల్లో చిక్కుకున్నారు. ఈ గనుల్లో అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.


రెండు ఘటనలు..


మొదటగా సోమవారం సాయంత్రం 5 గంటలకు కాప్సరా ఔట్​సోర్సింగ్​ ప్రాజెక్ట్ వద్ద గని కూలిందని, ఆ తర్వాత కొన్ని గంటలకు బీసీసీఎల్​ వద్ద ఉన్న గని మంగళవారం ఉదయం గోపీనాథ్​పుర్​ వద్ద గనుల్లో ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. భారీ యంత్రాలతో సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు తెలిపారు.


ఇప్పటివరకు ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈస్ట్రెన్​ కోల్​ఫీల్డ్​ లిమిటెడ్ (ఈసీఎల్​)కు చెందిన గని నుంచి బయటపడ్డ మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు వెల్లడించారు.


కాపాసరలోని ఈసీఎల్​, ఛాచ్​ విక్టోరియా ఆఫ్​ భారత్​ కోకింగ్​ కోల్​ లిమిటెడ్​ (బీసీసీఎల్​)కు చెందిన గనుల్లో కూడా మృతులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


సీఎం ట్వీట్..






గనుల్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గనుల్లో చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేయమని ఆదేశించినట్లు తెలిపారు.


Also Read: India Corona Cases: దేశంలో నిన్న ఒక్కరోజులో 1,733 కరోనా మరణాలు.. కొత్తగా లక్షన్నర మందికి కొవిడ్


Also Read: PM e-Vidya: వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్.. హైక్వాలిటీ కంటెంట్‌తో 200 టీవీ ఛానెళ్లు.. బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపు ఇదీ..