హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. నార్సింగిలోని ఓ ఫ్లాట్‌లో హైటెక్ పద్ధతిలో ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీని నిర్వహకులు ఉగాండా దేశస్తులు అని పోలీసులు నిర్ధరించారు. వారిని అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడం కోసం ఈ ఉగాండా దేశీయులు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరూ వీఐపీలేనని గుర్తించారు. ఈ వ్యభిచార యాప్‌ను బ్యాంకు యాప్‌ మాదిరిగా ప్రత్యేక సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ముందుగా బుక్ చేసుకున్న ప్రకారం ప్రత్యేక కోడ్ లేదా ఓటీపీ వాడితేనే లోనికి రానిచ్చే విధంగా సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నారు. ఆ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే విటులకు అనుమతిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. 


విటుడు డబ్బు చెల్లించడానికి ఒప్పుకున్న తర్వాత ఆ ఇంటిలోకి, మహిళ వద్దకు వెళ్లేందుకు ఆ కోడ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆ వెంటనే నిర్వహకులు కస్టమర్ ఫోన్ నుంచి సంప్రదించిన వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. అలా చేయడం ద్వారా వినియోగదారుడు ఆ డేటాను దుర్వినియోగం చేయకుండా వీలు ఉంటుందని పోలీసులు వివరించారు. హైటెక్ పద్ధతిలో ఇలాంటి సెక్స్ రాకెట్‌ను ఇప్పటి వరకు చూడలేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు.


జీడిమెట్లలోనూ..
జీడిమెట్లలోనూ మరో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. రహస్యంగా వ్యభిచారం ని­ర్వహిస్తున్న ఇంటిపై జీ­డిమెట్ల పోలీసులు దాడి చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదా­వరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు అనే 33 ఏళ్ల వ్యక్తి జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కా­లనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి నిర్వహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్‌­(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నా­రు. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వహకుడు వీరరాజు సహా విటుడిపై కేసు నమోదు చేశారు.


ఓ మ‌హిళ‌ను వ్యభిచార కూపంలోకి దింపాల‌ని యత్నించిన ఓ వ్యక్తికి మేడ్చల్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.వెయ్యి జ‌రిమానా విధించింది. 2021లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ హైదరాబాద్‌ వచ్చేందుకు కర్నూల్‌ బస్టాండ్‌లో బ‌స్సుల కోసం వేచి ఉంది. ఇది గ‌మ‌నించిన అదే ప్రాంతానికి చెందిన బుగ్గన మధుమోహన్‌ రెడ్డి ఆమెను ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఆమెతో మాట‌లు క‌లిపి.. త‌న‌వెంట‌నే హైద‌రాబాద్ కు తీసుకువ‌చ్చాడు. ఈ క్రమంలోనే మాయ‌మాట‌లు చెబుతూ.. వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించాడు. ముందుగానే అప్రమ‌త్తమైన స‌ద‌రు మ‌హిళ‌.. అత‌ని నుంచి త‌ప్పించుకుని.. జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్ కు చేరుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.