Child Died Falling Under School Bus In Hyderabad: హైదరాబాద్‌లో (Hyderabad) శుక్రవారం ఘోర విషాదం జరిగింది. ఐదేళ్ల చిన్నారి స్కూల్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల దుండిగల్ పీఎస్ పరిధిలోని మల్లంపేట్‌లో గల ఒక్‌లీఫ్ స్కూల్ బస్సు ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మహన్విత (5) పై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో ఈ దారుణం జరిగింది. గమనించిన స్కూల్ యాజమాన్యం వెంటనే చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. బస్సు నుంచి జారి పడి చిన్నారి మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం పాప తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.


స్కూలుకు చేరుకున్న చిన్నారి తల్లిదండ్రులు యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నీటితో పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. అయితే, బస్సు డ్రైవర్‌ను అక్కడి నుంచి పంపించేశారని.. కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని చిన్నారి బంధువులు ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Kedarnath: కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగువారు - వర్షాలు, తీవ్ర చలితో ఇబ్బందులు