Budaun Double Murders: యూపీలో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. బుదౌన్‌లో ఈ దారుణం జరిగింది. ఇద్దరు చిన్నారుల్ని ఓ వ్యక్తి హత్య చేశాడు. ఇద్దరు చిన్నారులను కత్తితో గొంతు కోసి చంపాడు. మరో చిన్నారిపైనా దాడి చేశాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు సాజిద్ ఓ బార్బర్ షాప్‌ నడుపుతున్నాడు. ఈ షాప్ ఎదురుగానే బాధితుల ఇల్లు ఉంది. మార్చి 19వ తేదీన సాయంత్రం సాజిద్‌ వాళ్ల ఇంటికి వెళ్లాడు. ఆ చిన్నారుల తండ్రి వినోద్‌ని రూ.5 వేలు అప్పు అడిగేందుకు వెళ్లాడు. ఆ సమయంలో వినోద్‌ ఇంట్లో లేడు. వినోద్ భార్య టీ పెట్టేందుకు లోపలికి వెళ్లడం చూసిన నిందితుడు సాజిద్ వెంటనే గొడ్డలితో ముగ్గురు చిన్నారులపై దాడి చేశాడు. వాళ్లలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో చిన్నారి ప్రాణాలో పోరాడుతున్నాడు. తన భార్య గర్భిణి అని హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.5 వేలు కావాలని వినోద్‌ భార్యతో చెప్పాడు సాజిద్. ఆ సమయంలోనే ఆమె కిచెన్‌లోకి వెళ్లింది. అప్పుడే అక్కడి చిన్నారిని తల్లి బ్యూటీ పార్లర్ ఎక్కడుందో చెప్పాలని అడిగాడు. ముందు పెద్ద కొడుకు తనకు దారి చూపించాడు. పైకి తీసుకెళ్లిన వెంటనే బ్యూటీ పార్లర్‌లోని లైట్స్ ఆఫ్ చేశాడు. ఆ తరవాత కత్తితో పొడిచి చంపాడు. ఆ తరవాత మరో చిన్నారి పైకి వచ్చాడు. వెంటనే అతడినీ లాక్కొచ్చి చంపాడు. మూడో చిన్నారిపైనా దాడి చేసేందుకు ప్రయత్నించగా ఎలాగోలా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడు సాజిద్ కూడా తన సోదరుడితో కలిసి పరారయ్యాడు. నిఘా పెట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే సాజిద్ కాల్పులు జరిపాడు. పోలీసుల ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.