ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తన భార్య, ఇద్దరు ఆడపిల్లలను అనాథలను చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
Andhra Pradesh Crime News: కుమార్తెకు బర్త్డే కేక్ కొనడానికి డబ్బుల్లేవని ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య- అన్నమయ్య జిల్లాలో విషాదం
Andhra Pradesh Crime News: ఆర్థిక ఇబ్బందులు ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రాణాలు తీసింది. కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పుట్టిన రోజు కేక్ తేస్తాడని ఎదురు చూసిన ఆ చిన్నారికి తండ్రి చావు కబురు వచ్చింది.

Andhra Pradesh Crime News: ఒక పక్క నాలుగేళ్ల చిన్నారి పుట్టిన రోజు వేడుకలు, సాయంత్రం నాన్న వచ్చేటప్పుడు కేక్ తెస్తాడని ఆ బిడ్డ వెయ్యి కళ్లతో నిరీక్షణ. కానీ ఆ ఇంటికి చేరింది కేక్ కాదు. విగత జీవిగా మారిన తండ్రి భౌతిక కాయం. అన్నమయ్య జిల్లా బి. కొత్తకోటలో చోటు చేసుకున్న ఈ హృదయవిదారక ఉదంతం స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది.ఆర్థిక ఇబ్బందుల సుడిగుండంలో చిక్కుకున్న ఒక సచివాలయ ఉద్యోగి, తన ఇద్దరు ఆడపిల్లలను,భార్యను అనాథలను చేస్తూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఏం జరిగింది?
రామసముద్రానికి చెందిన 36 ఏళ్ల బి. సుబ్రమణ్యం సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. గతేడాది జులైలో బి. కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని తాకాటంవారిపల్లె సచివాలయానికి ఆయన బదిలీ అయ్యారు. భార్య సౌమ్య, ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, హైందవితో కలిసి బైపాస్ రోడ్డులో నివాసం ఉంటున్నారు.
ఆదివారం సెలవు దినం కావడంతో సుబ్రమణ్యం తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని నాగిరెడ్డి పల్లెలో ఉన్న అత్తవారింటికి వెళ్లాడు. సోమవారం ఉదయం తన పెద్ద కుమార్తె ఐశ్వర్య నాలుగో పుట్టిన రోజు. ఆఫీసుకు వెళ్లి సాయంత్రం, వచ్చేటప్పుడు నీ పుట్టిన రోజుకు కేక్ తీసుకొస్తాను అని ఆ చిన్నారికి ముద్దుగా చెప్పి ఉదయం 7 గంటలకు నాగిరెడ్డి పల్లె నుంచి బి. కొత్తకోటకు బయల్దేరారు. ఆ మాటలు తన బిడ్డతో ఆయన చెప్పిన చివరి మాటలని అప్పుడు ఎవరూ ఊహించలేదు.
వేధించిన ఆర్థిక ఇబ్బందులు
ఇంటికి చేరుకున్న తర్వాత, ఉదయం 7.50 గంటల సమయంలో రామసముద్రంలో ఉన్న తల్లి నీలమ్మతో సుబ్రమణ్యం ఫోన్లో మాట్లాడారు. ఆ మాటల్లో ఆయన గొంతులో ఏదో తెలియని భారం ఉంది. ఈ రోజు బిడ్డ పుట్టినరోజు కేక్ తీసుకోవాలి, కానీ చేతిలో పైసా లేదు, ఆర్థిక ఇబ్బందులు బాగా వేధిస్తున్నాయి. అంటూ తల్లి దగ్గర తన బాధను పంచుకున్నాడు.
కొడుకు మాటల్లో ఆందోళన గమనించిన నీలమ్మ వెంటనే కోడలు సౌమ్యకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆందోళనతో కుటుంబ సభ్యులు 8 గంటల నుంచి ఆయనకు వరుసగా కాల్స్ చేసినా, సుబ్రమణ్యం కాల్ లిఫ్ట్ చేయలేదు. అప్పటికే ఆయన తన మనసులో ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు.
ఆఖరి సందేశం
ఆత్మహత్యకు ముందు సుబ్రమణ్యం తన భార్య ఫోన్ నెంబర్కు ఒక మెసేజ్ టైప్ చేశాడు. " నీకు నీ బిడ్డలకు నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను... నన్ను క్షమించండి.." అని రాశాడు. అయితే మెసేజ్ పంపే ధైర్యం సరిపోలేదో, ఏమో కానీ, అది సెండ్ చేయకుండానే ఫోన్లో ఉండిపోయింది. ఆ తర్వాత ఉదయం 8 నుంచి 9.15 గంటల మధ్య తన నివాసంలోని శ్లాబ్ కొక్కికి చీరతో ఉరి వేసుకొని ప్రాణాలు విడిచాడు.
రోడ్డున పడ్డ కుటుంబం
చాలాసేపటి వరకు సుబ్రమణ్యం బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు, ఇంటి యజమాని కలిసి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే ఆయన మరణించి ఉన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. తల్లి నీలమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Frequently Asked Questions
అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్న హృదయవిదారక సంఘటన ఏమిటి?
ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి ఎవరు, ఆయన ఎక్కడ పని చేస్తున్నారు?
ఆయన పేరు బి. సుబ్రమణ్యం, వయస్సు 36 ఏళ్లు. ఆయన బి. కొత్తకోట నగర పంచాయతీ పరిధిలోని తాకాటంవారిపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు.
సుబ్రమణ్యం ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి?
ఆయన తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తన తల్లితో ఫోన్ లో మాట్లాడుతూ, డబ్బు లేదని, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నాయని తన బాధను పంచుకున్నారు.
సుబ్రమణ్యం తన కుటుంబానికి ఏమి సందేశం ఇచ్చాడు?
ఆత్మహత్యకు ముందు, ఆయన తన భార్యకు ఒక మెసేజ్ టైప్ చేశాడు. 'నీకు నీ బిడ్డలకు నరకాన్ని ఇచ్చి నేను వెళ్లిపోతున్నాను... నన్ను క్షమించండి..' అని అందులో రాశాడు.






















