Chittoor Crime News: పుంగునూరు పట్టణంలో కిడ్నాప్ కథ విషాదంగా మారింది. చిన్నారి హత్య స్థానికంగా కలకలం రేపుతోంది. పుంగనూరు ఉబేదుల్లా కాంపౌండ్ లో చిన్నారి అస్వియా (7) ఆదివారం రాత్రి మిస్ అయ్యింది. సెప్టెంబర్ 29న ఆదివారం రాత్రి 7 గంటలకు చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటుండగా కాసేపు విద్యుత్ అంతరాయం కాగా విద్యుత్ వచ్చిన తరువాత చెక్ చేయగా చిన్నారి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా చిన్నారి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విస్తృతంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం చిన్నారి పుంగనూరు సమ్మర్ స్టోరేజ్ లో శవమై కనిపించింది. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.