RBI Plastic Currency: భారత్‌ ఆర్థిక వ్యవస్థలో మరో కీలక యుగం ప్రారంభంకానుంది. నోట్ల రద్దు వరకు ఆన్‌లైన్ పేమెంట్‌ గురించి పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే వారి సంఖ్య భారీగా తగ్గిపోయింది. బ్యాంకు ఖాతాలో డబ్బులు ఉంటే చాలా చేతిలో మొబైల్ అందులో డిజిటల్ పేమెంట్ యాప్ ఉంటే దేశమంతా చుట్టి రావచ్చు. అయితే డిజిటల్ చెల్లింపులు ఎంత పెరుగుతున్నప్పటికీ ఫిజికల్ కరెన్సీ ప్రాధాన్యత కూడా ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే ఏటా కోట్ల రూపాయల నోట్లు వివిధ కారణాలతో రద్దు చేయాల్సి వస్తోంది. అందుకే కరెన్సీలో మార్పులకు ఆర్బీఐ శ్రీకారం చుట్టింది. పది రూపాయలు, ఇరవై రూపాయలు ఇప్పుడున్న నోట్లను పూర్తిగా ప్రింటింగ్ ఆపేసి సరికొత్తగా ప్లాస్టిక్ కరెన్సీని చెలామణిలోకి తీసుకురానున్నట్టు చెబుతోంది. 

Continues below advertisement

ఆర్బీఐ ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశ పెడుతుందా?

ఆర్బీఐ తరఫున నోట్లు ముద్రించే విభాగంలో బీఆర్‌బీఎన్పీఎల్ కీలక ప్రకటన చేసింది.ప్లాస్టిక్ కరెన్సీకీ కావాల్సిన ముడిసరకు సరఫరా కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ముడిసరకు సరఫరా చేసేందుకు చేసేందుకు టెండర్లను పిలిచి అధికారికం ప్రక్రియ ప్రారంభించింది. ఈ విభాగంలో ఆసక్తి ఉన్న కంపెనీలు ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొవచ్చ. 

ప్లాస్టిక్ నోట్ అంటే ఏంటీ?

పాలిమర్ నోట్లనే ప్లాస్టిక్ నోట్లు అంటారు. వీటిని పాలిమర్ షీట్లపై ముద్రిస్తారు. ఇది ఫిల్మ్‌లా ఉంటుంది. ఇది చాలా గట్టిగా దృఢంగా ఉంటుంది. దీనిపై పూత పూసి నోట్లకు సంబంధించిన వివరాలు ముద్రిస్తారు. దీన్ని డూప్లికేట్ చేయడానికి లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీనికి ఒక వైపు చిన్న పలక మాదిరిగా పెడతారు. అందులో నోట్‌కు సంబంధించిన వివరాలు పొందుపరుస్తారు. దీని వల్ల ఇది ఫేక్ కాదని గుర్తించవచ్చు. అలాంటి వివరాలు లేకుంటే అది ఫేక్ అని నిర్దారణకు రావచ్చు. 

Continues below advertisement

ముందు వచ్చే ప్లాస్టిక్ నోట్లు ఏంటీ?

ముందు పాలిమర్ నోట్లను పది, ఇరవై రూపాయల కెరన్సీతో ప్రారంభిస్తారు. ఇవి చాలా ఎక్కువ జనాలు వాడతారు. నార్మల్‌గా వీటి తయారీ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. త్వరగా పాడైపోతాయి. అందుకే ముందుగా వాటినే ప్రయోగాత్మకంగా చలామణిలోకి తీసుకొస్తారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ నోట్ల పని తీరుపై ఒక సరైన అవగాహన వస్తుంది. ఇది విజయవంతం అయితే మిగతా నోట్లను కూడా ఈ విధానంలో ముద్రిస్తారు. 

జనం చేతికి ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు వస్తుంది?

త్వరలోనే పాలిమర్‌ నోట్లను తీసుకురాబోతున్నట్టు గత నెలలో జరిగిన ద్రవ్యవిధాన ప్రకటనలో ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా వెల్లడించారు. ఆయన చెప్పిన నెల రోజుల తర్వాత పాలిమర్ షీట్ల కోసం ఆర్బీఐ టెండర్లను పిలిచింది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పాలిమర్ సప్లై చేసే కంపెనీలు ఈ టెండర్‌లలో పాల్గొనవచ్చు. అయితే ప్రక్రియ ఇప్పుడు అధికారికంగా ప్రారంభమైనప్పటికీ జనాల చేతికి ప్లాస్టిక్ కరెన్సీ వచ్చే సరికి చాలా సమయం పట్టవచ్చు. 

ప్లాస్టిక్ నోట్లు తీసుకురావడంలో ఆర్బీఐ పాటించే ప్రక్రియ ఏంటీ?

ఇప్పుడు ఆసక్తి ఉన్న కంపెనీల నుంచి ముడిసరకు కోసం ఆసక్తిని తెలపాలని మాత్రం చెప్పారు. తర్వాత టెండర్ల ప్రక్రియ ఉంటుంది. అనంతరం టెక్నికల్ పరిశీలన ఉంటుంది. మోడల్‌ను పరీక్షిస్తారు. దాన్ని భద్రతను పరిశీలిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద పది రూపాయలు, ఇరవై రూపాయల నోట్లతో చెలామణిలోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఉన్న కరెన్సీతోపాటు ప్లాస్టిక్ కరెన్సీ కూడా అందుబాటులోకి తెస్తారు. కొంతకాలం పరిశీలించి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు.  

ప్లాస్టిక్ కరెన్సీ తీసుకురావాలని గతంలో ఎప్పుడైనా ప్రయత్నం జరిగిందా?

భారత్‌లో ప్లాస్టిక్ నోట్ చెలామణిలోకి తీసుకురావాలనే ఆలోచన 2009లో మొదలైంది. 2012లో పది రూపాయ నోట్లతోనే దీన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇలా ముద్రించిన నోట్లను వివిధ పరిస్థితుల్లో ప్రయోగించాలని 2014లో భావించారు. తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టును ఆపేశారు. మళ్లీ 2026లో ప్రక్రియను మొదలు పెట్టారు. 

ప్లాస్టిక్ కరెన్సీ అవసరం ఏం వచ్చింది?

ఓవైపు డిజిటల్ చెల్లింపులు భారీగానే జరుగుతున్నాయి. అదే సమయంలో కరెన్సీ ప్రాధాన్యత తగ్గేదేలే అన్నట్టు ఉంది. 2026లో 42.86 కోట్ల రూపాయల నగదు దేశంలో చెలామణి అవుతోంది. అందుకే ఇందులో కోట్ల రూపాయల విలువైన కరెన్సీ వివిధ కారణాలతో నాశనమవుతోంది. వీటిని మళ్లీ ముద్రించేందుకు కోట్ల రూపాయలు ఆర్బీఐ ఖర్చు చేయాల్సి వస్తోంది.

ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోజనాలు ఏంటి?

ఎక్కువ కాలం మన్నిక అయ్యే ప్లాస్టిక్ కరెన్సీ తీసుకు వస్తే ఆర్బీఐపై భారం తగ్గుతుందని ఆలోచన ఉంది. ఇప్పుడు ఉన్న కరెన్సీ కంటే నాలుగైదు సంవత్సరాలు ఎక్కువ కాలం చెలామణిలో ఉంటాయి. నీటిలో త్వరగా పాడయ్యే పరిస్థితి ఉండదు. నోటు త్వరగా నాశనం కాదు. ఇందులో భద్రతా ఫీచర్స్‌ కారణంగా ఫేక్ చేయడానికి కూడా వీలు ఉండదు. ఈ విషయంలో ఆర్బీఐ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 

ప్లాస్టిక్ కరెన్సీతో వచ్చే సమస్యలేంటి?

పాలిమర్ కరెన్సీ నోట్ల విషయంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. భారత్ వంటి ఉష్ణ ప్రాంతంలో ప్లాస్టిక్ కరెన్సీ మనుగడ అంత ఈజీ కాదు. ఇప్పుడు దీనికి కావాల్సిన ముడి పదార్థాన్ని విదేశాల నుంచి తెప్పించుకోవాలి. ఇది ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. వాటిని భరించి పాలిమర్స్‌ కరెన్సీ తీసుకొచ్చినా... ఇప్పుడు ఉన్న ఏటీఎంలు, నోట్ల లెక్కింపు యంత్రాలు అన్నింటినీ మార్చాల్సి ఉంటుంది. ఇది బ్యాంకులకు భారం కానుంది. పాలిమర్స్ నోట్లు మడిచినప్పుడు ముడతలు పడుతున్నాయే ఫిర్యాదు చాలా దేశాల్లో ఉంది. దీన్ని కూడా అధిగమించాల్సి ఉంటుంది. అయితే ప్రారంభ ఖర్చు ఎక్కువగా ఉన్నప్పటికీ కాలక్రమేణా ఆ ఖర్చు తగ్గుతుందని చెబుతున్నారు.  

ప్లాస్టిక్ కరెన్సీ అమలు చేస్తున్న దేశాలు ఏవి?

ప్రపంచంలోని చాలా దేశాల్లో పాలిమర్ కరెన్సీ చెలామణిలో ఉంది. దీన్ని మొదట తీసుకొచ్చింది మాత్రం ఆస్ట్రేలియా. ఇక్కడ 1988లోనే తొలిసారిగా అమల్లోకి వచ్చింది. తర్వాత అక్కడ వాటి ప్రయోజనాలను గుర్తించిన బ్రిటన్, కెనడా, సింగపూర్, న్యూజిలాండ్, వియత్నాం, మలేషియా, బ్రూనై వంటి 40 దేశాల్లో ఈ ప్లాస్టిక్ కరెన్సీ వాడుకలో ఉంది.