By: ABP Desam | Updated at : 08 Oct 2021 06:54 AM (IST)
Edited By: Venkateshk
ప్రతీకాత్మక చిత్రం
కొంత కాలంగా రోజూ ఇంధన ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరింతగా పెరిగాయి. హైదరాబాద్లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.0.31 పైసలు పెరిగి రూ.107.40 అయింది. రూ.98.72 గా ఉన్న డీజిల్ ధర.. ప్రస్తుతం రూ.100.13కి చేరింది. ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.31 పైసలు పెరిగి రూ.107.40గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు పెరిగి రూ.99.67 గా ఉంది. వరంగల్లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా పెరిగాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.16 పైసలు తగ్గి.. రూ.107.27గా ఉంది. డీజిల్ ధర రూ.0.05 పైసలు తగ్గి రూ.100.01కు చేరింది. నిజామాబాద్లోనూ ఇంధన ధరలు కాస్త తగ్గాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.01 పైసలు తగ్గి రూ.108.85 గా ఉంది. డీజిల్ ధర రూ.0.08 పైసలు పెరిగి రూ.101.48 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో పెట్రోల్ ధరలు తాజాగా అతి స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం రూ.109.60 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.19 పైసలు తగ్గింది. డీజిల్ ధర రూ.0.09 పైసలు తగ్గి రూ.101.74కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.108.29గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.30 పైసలు పెరిగింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.100.50గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరిన రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి.
Also read: చాలామందికి భోజనం చేసేటప్పుడు ఇదే సమస్య.. మీకూ ఉందా? తేలికగా తీసుకోకండి
తిరుపతిలో ఇంధన ధరల్లోనూ పెరుగుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.0.09 పైసలు పెరిగి రూ.109.09 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. ఇక డీజిల్ ధర రూ.101.25గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.17 పైసలు పెరిగింది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 8 నాటి ధరల ప్రకారం 76.38 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Also Read: జియో సేవల్లో అంతరాయం.. #jiodown అంటూ యూజర్ల ఫిర్యాదులు
Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?
eMudhra IPO: ఈ-ముద్రా ఐపీవోకు తొలిరోజు 47% స్పందన, రిటైల్ కోటాలో 90% బుక్!
Stock Market News: హ్యాపీ వీకెండ్! రూ.7.5 లక్షల కోట్ల లాభం! సెన్సెక్స్ 1534, నిఫ్టీ 471 +
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో జోష్! బిట్కాయిన్ సహా అన్నీ లాభాల్లోనే!
Elon Musk: ఎలన్ మస్క్ ఆ యువతిని లైంగికంగా వేధించారా? 2.5 లక్షల డాలర్లు చెల్లించారా?
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం