By: ABP Desam | Updated at : 21 Aug 2021 07:07 AM (IST)
Petrol
దేశంలో హైదరాబాద్, చెన్నై, ముంబయి, బెంగళూరు, కోల్కతా సహా అన్ని ప్రధాన మెట్రో నగరాల్లో నెల రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉంటుండగా, డీజిల్ ధరల్లో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. రెండు రోజులుగా హైదరాబాద్లో డీజిల్ ధరల్లో తగ్గుదల కనిపిస్తోంది. వారం రోజుల క్రితం ఒక్క హైదరాబాద్లో పెట్రోల్ ధరలో స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉండగా.. ధరలు మళ్లీ యథాతథ స్థితికి చేరుకున్నాయి.
తెలంగాణలో ఆగస్టు 21న పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.105.83 గా నిలకడగానే కొనసాగుతుండగా.. డీజిల్ ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. లీటరుకు రూ.0.20పైసలు తగ్గి.. రూ.97.33 కు చేరింది. కరీంనగర్లో పెట్రోల్ ధర.. ముందు రోజు ధరతో పోలిస్తే స్థిరంగా ఉంది. తాజాగా పెట్రోల్ ధర కరీంనగర్లో రూ.105.98గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.0.21 పైసలు తగ్గి రూ.97.45 గా అయింది.
ఇక వరంగల్లో తాజాగా పెట్రోల్ ధర రూ.105.38 కాగా.. డీజిల్ ధర రూ.97.10 గా ఉంది. పెట్రోల్ నిలకడగా ఉండగా.. డీజిల్ రూ.0.20 పైసల చొప్పున తగ్గింది. కొద్దిరోజులుగా వరంగల్లో నిలకడగా ఉంటున్న ధరల్లో తాజాగా స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఇంధన ధరలు ఉంటున్నాయి.
నిజామాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.0.04 పైసల చొప్పున పెరిగింది. డీజిల్ ధర గత ధరతో పోల్చితే రూ.0.16 పైసలు తగ్గింది. దీంతో తాజాగా పెట్రోల్ రూ.107.75 గా ఉండగా.. డీజిల్ ధర రూ.99.11గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు ఉంటూ వస్తున్నాయి.
Also Read: Gold-Silver Price: మరింత ఎగబాకిన పసిడి ధర.. దిగొచ్చిన వెండి, మీ నగరంలో నేటి ధరలివీ..
ఆంధ్రప్రదేశ్లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడ మార్కెట్లో ఇంధన ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. పెట్రోల్ ధర రూ.0.26 చొప్పున స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం పెట్రోల్ రేటు లీటరుకు రూ.108.21 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ.0.41 పైసలు తగ్గి రూ.99.19కు చేరింది.
విశాఖపట్నం ఇంధన మార్కెట్లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.106.95గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ధర స్వల్పంగా ఉంది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.0.06 పైసలు తగ్గి రూ.97.97గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజుల క్రితం వరకూ రూ.0.50 పైసలకు పైబడి హెచ్చు తగ్గులు కనిపించగా.. తాజాగా స్వల్పంగా ఉంటున్నాయి.
తిరుపతిలో స్వల్ప మార్పులు
తిరుపతిలో ఇంధన ధరల్లో కొద్ది రోజుల క్రితం వరకూ పెద్ద మార్పులు చోటు చేసుకోగా.. తాజాగా స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. పెట్రోల్ ధరలో లీటరుకు రూ.0.25 పైసలు తగ్గింది. డీజిల్ రూ.0.45 పైసలు తగ్గింది. దీంతో తాజాగా లీటరు పెట్రోలు ధర రూ.108.12గా నిలకడగానే ఉండగా.. ఇక డీజిల్ ధర రూ.99.05గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా ఆగస్టు 20 నాటి ధరల ప్రకారం 62.32 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను అలాగే ఉంచుతున్నాయి. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి.
Also Read: Medak Murder: ధర్మాకర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక మలుపు.. ఆమె పాత్రపై పోలీసుల ఆరా..
Richest South Indian Actor: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!
Penalty on TCS: వారం రోజుల్లో టీసీఎస్కు రెండో భారీ షాక్, Q3 లాభాలు అమెరికాపాలు!?
Latest Gold-Silver Prices Today 28 November 2023: పట్టుకోలేనంత ఎత్తులో పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Car Prices To Hike: కొత్త కారు కొనాలనుకుంటే వెంటనే తీసుకోండి, అతి త్వరలో రేట్లు పెరుగుతాయ్
Share Market Opening Today 28 November 2023: ఆరంభ శూరత్వం, ఆ వెంటనే నీరసం - ఈ రోజు మార్కెట్ల తీరిది
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
Salaar Story: సలార్ వేరు, కెజిఎఫ్ వేరు - ప్రేక్షకులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
Silkyara Tunnel Rescue: ‘ర్యాట్ హోల్ మైనింగ్’ అంటే ఏంటి? బ్యాన్ చేసిన పద్ధతితోనే కూలీలు క్షేమంగా బయటికి
/body>