భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 90 పైసల చొప్పున పెరిగాయి. వారం రోజుల్లో ఇది రెండవసారి ధరల పెంపు.
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇంకా ఎంత పెరుగుతాయి?
Petrol Diesel Price Hike: భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలు రూ.3 మేర పెరిగిన తర్వాత, మరోసారి ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి.

- దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు 90 పైసలు పెరిగాయి.
- హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.111.88, ఢిల్లీలో రూ.98.64 చేరింది.
- ఆర్థిక నష్టాలను భర్తీ చేయడానికి చమురు కంపెనీలు ధరలు పెంచుతున్నాయి.
Petrol Price Hike News | న్యూఢిల్లీ: వాహనదారులకు వరుస షాకులు తగులుతున్నాయి. 5 రోజుల వ్యవధిలో రెండోసారి భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. మంగళవారం నాడు (మే 19న) పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 90 పైసల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండవసారి ఇంధన ధరలు పెరగడం వాహనదారులను ఇబ్బంది పెడుతోంది. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుల గమనిస్తే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయని అర్థమవుతోంది. ఆయిల్ కంపెనీలు తమ నష్టాలను భర్తీ చేసుకునేందుకు మాత్రమే ధరలు పెంచుతున్నాయని కేంద్రం చెబుతోంది.
పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, హైదరాబాద్లో రూ.110.89 ఉన్న లీటర్ పెట్రోల్ ధర మంగళవారం రూ.111.88కి చేరింది దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 97.77 నుంచి రూ. 98.64 కు చేరుకుంది. అలాగే డీజిల్ ధర లీటరుకు రూ. 90.67 నుంచి రూ. 91.58 కి పెరిగింది. గత శుక్రవారం కూడా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు దాదాపు రూ. 3 చొప్పున పెంచాయి.
కొత్త ఇంధన ధరలు ఇవే..
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89 నుంచి రూ.111.88కి చేరింది
ఢిల్లీలో పెట్రోల్ రూ. 98.64, డీజిల్ లీటరుకు రూ. 91.58 కి చేరుకుంది.
ముంబైలో పెట్రోల్ రూ. 107.59, డీజిల్ లీటరుకు రూ. 94.08 అయింది.
కోల్కతాలో పెట్రోల్ రూ. 109.70, డీజిల్ లీటరుకు రూ. 96.07 గా నమోదైంది.
చెన్నైలో పెట్రోల్ రూ. 104.49, డీజిల్ లీటరుకు రూ. 96.11 అయింది.
జైపూర్లో పెట్రోల్ ధర రూ. 108.84, డీజిల్ ధర లీటరుకు రూ. 94.12 కి చేరుకుంది.
VIDEO | Delhi: As fuel prices see a hike of 90 paise per litre, a consumer at the Gole Market Fuel Station says, "Cost of travelling will now increase. Inflation will rise... It will get very inconvenient for the common people now."
— Press Trust of India (@PTI_News) May 19, 2026
(Full video available on PTI Videos -… https://t.co/r7ZXy7TUCM pic.twitter.com/mtWT4ORXN0
డీజిల్ కొత్త ధరల వివరాలు
హైదరాబాద్లో డీజిల్ లీటర్ ధర రూ.98.96 నుంచి రూ.99.95 చేరింది.
ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 91.58 అయింది.
కోల్కతాలో లీటర్ డీజిల్ ధర రూ. 96.07 కు చేరుకుంది.
ముంబయిలో లీటర్ డీజిల్ ధర రూ. 94.08 అయింది
చెన్నైలో లీటర్ డీజిల్ ధర రూ. 96.11కు చేరుకుంది.
ప్రభుత్వ చమురు కంపెనీలకు నష్టాలు
భారత ప్రభుత్వ చమురు కంపెనీలు గత 4 సంవత్సరాలుగా రిటైల్ ధరలను పెంచలేదు. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ (ముడిచమురు) ధరలు పెరగడం వల్ల ఈ కంపెనీలకు ప్రతిరోజూ దాదాపు రూ. 1000 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ధరలను క్రమంగా పెంచుతున్నారు. గతంలో రూ. 3 పెంచిన తర్వాత ఈ నష్టం కొద్దిగా తగ్గి రోజుకు రూ. 750 కోట్లకు చేరుకుంది. తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు 90 పైసల చొప్పున వాహనదారులపై బారం పడింది. ఇతర దేశాలతో పోల్చితే భారత్ చమురు సంక్షోభాన్ని బాగానే తట్టుకుని నిలబడింది. పలు దేశాల్లో ఇంధన ధరలు గత రెండు నెలలో 50 నుంచి 100 శాతం మేర పెరిగాయి.
Before You Go
Budget 2026 - 2027 Top 10 Points | కేంద్ర బడ్జెట్ లో పది ముఖ్యమైన అంశాలు
Frequently Asked Questions
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయి?
హైదరాబాద్లో పెట్రోల్ ధర ఎంతకు చేరింది?
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.89 నుండి రూ.111.88కి చేరింది.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు పెరిగాయి?
ఇరాన్, అమెరికా సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ప్రభుత్వ చమురు కంపెనీలకు రోజుకు దాదాపు రూ. 1000 కోట్ల నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి ధరలు పెంచుతున్నారు.
గతంలో చమురు ధరల పెంపు తర్వాత కంపెనీల నష్టం ఎంతకు తగ్గింది?
గతంలో రూ. 3 పెంచిన తర్వాత, కంపెనీల రోజువారీ నష్టం రూ. 1000 కోట్ల నుండి రూ. 750 కోట్లకు తగ్గింది.
ట్రెండింగ్ వార్తలు























