Patanjali Environmental Protection : సేంద్రీయ వ్యవసాయం, సౌరశక్తి, వ్యర్థాల నిర్వహణ ద్వారా పర్యావరణ పరిరక్షణలో చురుకుగా పాల్గొంటున్నట్టు పతంజలి ఆయుర్వేద సంస్థ పేర్కొంది. బయో-ఎరువులను అభివృద్ధి చేయడం, సౌరశక్తిని ప్రోత్సహించడం, వ్యర్థాల నుంచి కంపోస్ట్‌ను తయారు చేయడంలో కంపెనీ యాక్టివ్‌్గా ఉంది. 

పతంజలి ఆయుర్వేద తన పర్యావరణ అనుకూల కార్యక్రమాల ద్వారా పర్యావరణ పరిరక్షణకు గణనీయమైన కృషి చేస్తోందని చెబుతోంది. స్వామి రామ్‌దేవ్ నాయకత్వంలో, కంపెనీ ఆయుర్వేద ఉత్పత్తులను ప్రోత్సహించడమే కాకుండా స్థిరమైన వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, వ్యర్థాల నిర్వహణ వంటి రంగాలలో వినూత్న చర్యలు తీసుకుందని పతంజలి పేర్కొంది. పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని కలిగించడం, రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందివ్వాలనే లక్ష్యంతో ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపింది.

సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం

"కంపెనీ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి అనేక చర్యలు తీసుకుంది. పతంజలి ఆర్గానిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (PORI) ద్వారా, కంపెనీ రసాయన ఎరువులపై ఆధారపడటాన్ని తగ్గించే బయో-ఎరువులు, బయో-పురుగుమందులను అభివృద్ధి చేసింది. ఈ ఉత్పత్తులు నేల సారాన్ని మెరుగుపరుస్తాయి. పంట నాణ్యతను పెంచుతాయి. PORI 8 రాష్ట్రాలలో 8,413 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది, వారు సేంద్రీయ వ్యవసాయాన్ని స్వీకరించడానికి సహాయపడింది. ఇది నేల, నీరు, వాయు కాలుష్యాన్ని తగ్గించింది, అలాగే జీవవైవిధ్యాన్ని కూడా ప్రోత్సహించింది."

పతంజలి సౌరశక్తి రంగంలో కూడా చురుకుగా ఉంది. పతంజలి "కంపెనీ సౌర ఫలకాలు, ఇన్వర్టర్లు, బ్యాటరీలు వంటి ఉత్పత్తులను మరింత చవకగా మార్చేసింది. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన శక్తిని ప్రోత్సహిస్తుంది. ప్రతి గ్రామం, నగరంలో 'పతంజలి ఎనర్జీ సెంటర్లు' ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు స్వామి రామ్‌దేవ్, ఇది కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ చొరవ పర్యావరణానికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా గ్రామీణ వర్గాలకు సరసమైన విద్యుత్తును కూడా అందిస్తుంది."

వ్యర్థాల నిర్వహణలో ఆవిష్కరణ

"పతంజలి విశ్వవిద్యాలయం వ్యర్థాల నిర్వహణ కోసం ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకుంది.  ఇక్కడ పొడి వ్యర్థాలను కంపోస్ట్‌గా మారుస్తారు యజ్ఞాలకు కావాల్సిన పవిత్రమైన పదార్థాలను ఆవు పేడ నుంచి తయారు చేస్తారు. ఇది పురాతన జ్ఞానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం  ప్రత్యేకమైన మిశ్రమం, ఇది వ్యర్థాలను తగ్గించడంలో , పదార్థాలను సృష్టించడంలో సహాయపడుతుంది. ఈ చొరవ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడమే కాకుండా సాంస్కృతిక విలువలను కూడా ప్రోత్సహిస్తుంది" అని పతంజలి అన్నారు.

"కంపెనీ నీటి సంరక్షణ, చెట్ల పెంపకం వంటి కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యతనిచ్చింది. కంపెనీ నీటి పొదుపు పద్ధతులను అవలంబించింది.పెద్ద ఎత్తున మొక్కల పెంపకం డ్రైవ్‌లను నిర్వహించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి ,వాతావరణ మార్పులను పరిష్కరించడానికి చేపడుతున్న చర్యలు చాలా ముఖ్యమైనవి."