IRCTC Account: జులై 1, 2025 నుంచి, తత్కాల్ టిక్కెట్లు ఆధార్ నంబర్‌ను IRCTC ఖాతాతో లింక్ చేసి అధీకృత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయని IRCTC ప్రకటించింది. టికెట్ బుకింగ్‌లో పారదర్శకతను తీసుకురావడం, బాట్/ఏజెంట్ ఆధారిత బుకింగ్‌ను నిలిపివేయడానికి ఈ కొత్త విధానం తీసుకొచ్చినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. వినియోగదారులు ఆధార్ లింక్,  ధృవీకరణను సమయానికి ముందే పూర్తి చేసినప్పుడు మాత్రమే సేవలు సజావుగా లభిస్తాయి. 

IRCTCతో ఆధార్‌ను లింక్ చేయడం చాలా సులభంIRCTC ఖాతాకు ఆధార్‌ను లింక్ చేయడం చాలా సులభం. దీని కోసం, ముందుగా IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లోకి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత, "ఖాతా" విభాగానికి వెళ్లి "వినియోగదారుని అథింటికేషన్" లేదా "KYC" ఎంపికపై క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్, పాన్ కార్డ్‌ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో ఒకటి ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆధార్‌పై క్లిక్ చేసి 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత OTPపై క్లిక్ చేయాలి. 

మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. మీరు ఈ OTPని పూరించిన వెంటనే, మీ ఆధార్ విజయవంతంగా లింక్ అవుతుంది. మీ ఆధార్, IRCTC ఖాతాలో పేరు లేదా పుట్టిన తేదీలో తేడా ఉంటే, సిస్టమ్ హెచ్చరిక ఇస్తుంది. లింకింగ్ విఫలం కావచ్చు. అటువంటి పరిస్థితిలో, మీరు మొదట మీ డేటాను సరిదిద్దుకోవాలి.

ఒక నెలలో చాలా టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చుకొత్త వ్యవస్థ కింద, ఒక నెలలో గరిష్టంగా 24 టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. గతంలో ఈ పరిమితి ఆధార్ లింక్ లేకుండా 12 టిక్కెట్లు మాత్రమే. అలాగే, జులై 15, 2025 నుంచి, టికెట్ బుకింగ్ సమయంలో ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు OTP పంపిస్తారు. అది ధృవీకరించడం తప్పనిసరి చేయనుంది. ఈ నియమం అన్ని ఆన్‌లైన్ బుకింగ్‌లు, PRS కౌంటర్లు, ఏజెంట్ బుకింగ్‌లకు వర్తిస్తుంది.

ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి!ఈ విదానం టికెట్ బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకునేలా ఉంటుందని సాధారణ ప్రయాణీకులు సులభంగా టిక్కెట్లు పొందగలరని రైల్వే శాఖాధికారులు చెబుతున్నారు. మీరు ఇంకా ఆధార్ లింక్ చేయకపోతే, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయండి, లేకుంటే జులై 1 తర్వాత తత్కాల్ టిక్కెట్లను బుక్ చేసుకోవడం కష్టం కావచ్చు.