కరోనా తరువాత, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. కానీ ఈ గడ్డు పరిస్థితిలో కూడా భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా రికార్డు సృష్టించింది. యుకెను అధిగమించి ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 


గత ఏడాది కాలంలో భారత స్టాక్ మార్కెట్ స్వల్ప క్షీణతను నమోదు చేసినప్పటికీ రూపాయి బలహీనత ఆందోళన పెంచుతోంది. గత ఏడాది కాలంలో రూపాయి విలువ సుమారు 10% క్షీణించినప్పటికీ, దేశంలో సంపన్నుల సంపదలో మాత్రం పెరుగుదల కనిపించింది. భారతదేశంలోని 100 మంది అత్యంత ధనవంతుల సంపద 25 బిలియన్ డాలర్లు పెరిగి 800 బిలియన్ డాలర్లు దాటింది.


అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఎదిగారు. అదే సమయంలో ముఖేశ్‌ అంబానీ రెండో స్థానంలో నిలిచారు. గౌతమ్ అదానీ సంపద సుమారు 150 బిలియన్ డాలర్లు కాగా, గత ఏడాది కాలంలో ఇది రెట్టింపు అయింది. అదే సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని ముఖేశ్ అంబానీ రెండో స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ముకేశ్ అంబానీ సంపద సుమారు 5 బిలియన్ డాలర్లు క్షీణించి 92.7 బిలియన్ డాలర్ల నుంచి 88 బిలియన్ డాలర్లకు తగ్గింది. 2013 నుంచి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్న ముఖేశ్‌ అంబానీ 2022లో గౌతమ్ అదానీని అధిగమించి దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఎదిగారు.


2022లో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ అదానీ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గౌతమ్ అదానీ సంపదలో నిరంతర పెరుగుదల వెనుక ఉన్న అతిపెద్ద కారణం అతని కంపెనీ షేర్లు నిరంతరం పెరుగడమే. అందుకే అతని సంపద గత ఏడాదిలో విపరీతమైన పెరుగుదలను చూసింది.


ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది సంపన్న భారతీయుల జాబితాను ఈ సంవత్సరం విడుదల చేసింది. ఈ ఏడాది జాబితాలో సావిత్రి జిందాల్ ఒక స్థానం ఎగబాకి 6వ స్థానానికి చేరారు. అదే సమయంలో హిందూజా బ్రదర్స్, బజాజ్ ఫ్యామిలీ కూడా ఈ జాబితాలోకి వచ్చాయి. గత ఏడాది జాబితాలో 8వ స్థానంలో ఉన్న ఉదయ్ కోటక్ 12వ స్థానానికి పడిపోయారు. ఫోర్బ్స్ విడుదల చేసిన 100 మంది సంపన్నుల జాబితాలో టాప్ 10లో ఎవరున్నారో తెలుసుకుందాం.


1. గౌతమ్ అదానీ అండ్ ఫ్యామిలీ - 150 బిలియన్ డాలర్లు
2. ముఖేశ్‌ అంబానీ - 88 బిలియన్ డాలర్లు
3. రాధాకృష్ణ దమానీ అండ్ ఫ్యామిలీ - 27.6 బిలియన్ డాలర్లు 
4. సైరస్ పూనావాలా - 21.5 బిలియన్ డాలర్లు
5. శివ్ నాడార్ - 21.4 బిలియన్ డాలర్లు
6. సావిత్రి జిందాల్ అండ్ ఫ్యామిలీ - 16.4 బిలియన్ డాలర్లు
7. దిలీప్ సంఘ్వీ అండ్ ఫ్యామిలీ - -15.5 బిలియన్ డాలర్లు
8. హిందూజా సోదరులు - 15.2 బిలియన్ డాలర్లు
9. కుమార్ బిర్లా - 
10. బజాజ్ ఫ్యామిలీ - 14.6 బిలియన్ డాలర్లు


ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది సంపన్నుల జాబితాలో నైకా సీఈఓ ఫాల్గుని నాయర్ మొదటిసారి చేరారు. ఈ జాబితాలో 44వ స్థానంలో ఉన్నారు. సంస్థ ఐపిఒ నుంచి ఆ సంస్థ నికర విలువ పెరుగుతూ వచ్చింది. మొత్తం ఆస్తులు ప్రస్తుతం $4.08 బిలియన్లుగా ఉన్నాయి. ఇవే కాకుండా ఎథ్నిక్ గార్మెంట్ రిటైలర్ రవి మోడీ కూడా తొలిసారిగా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. 3.75 బిలియన్ డాలర్లతో 50వ స్థానంలో నిలిచారు. పాదరక్షల రిటైల్‌లో ప్రపంచంలోనే పెద్ద పేరున్న రఫీక్ మాలిక్ కూడా ఈ జాబితాలో 2.22 బిలియన్ డాలర్ల నికర సంపదతో 89వ స్థానంలో నిలిచారు.