అన్వేషించండి

Budget session 2026: గత 5 ఏళ్లలో ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్ మూతపడ్డాయి? కేంద్ర మంత్రి లెక్కలకు మైండ్ బ్లాక్

Union Budget 2026 | ఇద్దరు ఎంపీలు ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్ని లెక్కలు బయటపెట్టారు.

న్యూఢిల్లీ: లోక్‌సభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా, ప్రభుత్వ పాఠశాలల మూసివేతపై ఇటీవల పెద్ద ప్రశ్నలు తలెత్తాయి. బిహార్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ మహమ్మద్ జావేద్, రాజస్థాన్‌కు చెందిన ఎంపీ భజన్ లాల్ జాతవ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రభుత్వ పాఠశాలలపై ప్రశ్నించారు, 'గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని గవర్నమెంట్ స్కూల్స్  మూసివేశారు. లేదా రద్దు చేశారు ? రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి? ఈ పాఠశాలలను మూసివేయడానికి గల కారణాలు ఏంటని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం వల్ల ఎంతమంది పిల్లలు చదువు మానేశారని లోక్‌సభలో ప్రశ్న లేవనెత్తారు.

ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం వల్ల పేద, గ్రామీణ ప్రాంతాల పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని, వారిపై చెడు ప్రభావం పడుతోందని ఇద్దరు ఎంపీలు ఎంపీ డాక్టర్ మహమ్మద్ జావేద్, ఎంపీ భజన్ లాల్ జాతవ్ అన్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వాలని, ఈ దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించాలని వారు కోరారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి వివరణ

 కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లోక్‌సభలో ఆ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విద్య భారత రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉందన్నారు. అంటే పాఠశాలలను తెరవడం, మూసివేయడం లేదా వాటిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి మార్చడం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలన పరిధిలో ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా ఇందులో నిర్ణయం తీసుకోదని తెలిపారు. ఉచిత, నిర్బంధ బాలల విద్య హక్కు చట్టం 2009 (RTE చట్టం) ప్రకారం, ప్రతి చిన్నారికి వారి ఇంటి సమీపంలో ప్రాథమిక విద్య (1 నుండి 5 తరగతి వరకు) అందించడం అవసరమని ఆయన వివరించారు. RTE సెక్షన్ 6 ప్రకారం, అన్ని రాష్ట్రాలు తమ పరిసరాల్లోని పాఠశాలల దూరం, ప్రమాణాలను నిర్ణయించాయి. సెక్షన్ 8 ప్రకారం, ప్రతి బిడ్డకు ఉచిత, నిర్బంధ విద్యను అందించడం, పాఠశాలను కలిగి ఉండటం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా పేర్కొన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చిన గణాంకాలు

ప్రభుత్వ పాఠశాలలపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, ఈ దిశగా చాలా పని జరిగిందని విద్యా మంత్రి అన్నారు. ఆయన UDISE+ (యునిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్) గణాంకాలను ఉదహరించారు. UDISE+ అనేది పాఠశాల విద్య గణాంకాలను సేకరించే వ్యవస్థ. దీని ప్రకారం దేశంలో పాఠశాలలకు సౌకర్యాలు మెరుగవుతున్నాయి. దీనిని గ్రాస్ యాక్సెస్ రేషియో (GAR)తో కొలుస్తారు. GAR అంటే ఒక ప్రాంతంలో నిర్ణీత ప్రమాణాల ప్రకారం పాఠశాలలు అందుబాటులో ఉన్న గ్రామాలు లేదా నివాసాల శాతం.

పాఠశాలల గణాంకాలు ఇవే

  • ప్రాథమిక స్థాయి (1-5 తరగతులు): 2018-19లో 97.15% ఉండగా, 2024-25 నాటికి 97.83%కి పెరిగింది.
  • అప్పర్ ప్రైమరీ స్థాయి (6-8 తరగతులు): 2018-19లో 96.49 శాతం ఉండగా, 2024-25లో 96.57%కి పెరిగింది.
  • సెకండరీ స్థాయి (9-10 తరగతులు): 2018-19లో 88.24 శాతం ఉండగా, 2024-25 నాటికి 95.35 శాతానికి పెరిగింది.
  • హయ్యర్ సెకండరీ స్థాయి (11-12 తరగతులు): 2018-19లో 65.05 శాతం ఉండగా, 2024-25 నాటికి 94.97%కి పెరిగింది.

ఈ గణాంకాలు వివిధ స్థాయిల్లో పాఠశాలలకు నిరంతరం మద్దతు లభిస్తోందని, సౌకర్యాలు మెరుగవుతున్నాయని చూపిస్తున్నాయి. అదే సమయంలో, డ్రాపౌట్ రేటు (విద్యార్థులు పాఠశాల మానేసే రేటు) కూడా తగ్గింది.

పిల్లల కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు

RTE చట్టం నిబంధనలను అనుసరించి మాత్రమే ఏదైనా పాఠశాలను మూసివేయవచ్చు లేదా విలీనం చేయవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఏదైనా పాఠశాలను మూసివేస్తే, పిల్లల చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా, వారిని సమీపంలోని ఇతర పాఠశాలకు పంపేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్షా యోజన కింద రాష్ట్రాలకు సహాయం చేస్తుంది, తద్వారా పాఠశాలలు మెరుగవుతాయి. టీచర్లు అందుబాటులో ఉండి, పిల్లలు పాఠశాలలను మానేయకుండా ఉంటారని పేర్కొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Srisailam Maha Shivaratri 2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు
YSRCP: ప్రతిపక్ష హోదా కంటే ప్రజల గొంతే ముఖ్యం - వైసీపీ ప్రజలకేం చెబుతుంది?
ప్రతిపక్ష హోదా కంటే ప్రజల గొంతే ముఖ్యం - వైసీపీ ప్రజలకేం చెబుతుంది?
Rats Bite Students: కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Advertisement

వీడియోలు

Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam
India va Namibia Match Preview | T20 World Cup 2026 లో మోత మొదలు పెడతారా.? | ABP Desam
Rohit Sharma on 2027 ODI World Cup | వన్డే వరల్డ్ కప్ భారత్ గెలుస్తుందని హిట్ మ్యాన్ ధీమా | ABP Desam
Saqlain Mushtaq on Ind vs Pak Match Pitch | మ్యాచ్ ఆడకముందే ఏడుపులు మొదలు | ABP Desam
Sanju Samson Playing Against Namibia | నమీబియాతో మ్యాచ్ లో బరిలోకి దిగనున్న సంజూ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srisailam Maha Shivaratri 2026: శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు
శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. 4 రోజులపాటు టోల్ ఛార్జీలు రద్దు
YSRCP: ప్రతిపక్ష హోదా కంటే ప్రజల గొంతే ముఖ్యం - వైసీపీ ప్రజలకేం చెబుతుంది?
ప్రతిపక్ష హోదా కంటే ప్రజల గొంతే ముఖ్యం - వైసీపీ ప్రజలకేం చెబుతుంది?
Rats Bite Students: కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
కేజీబీవీలో 12 మంది విద్యార్థినులను కరిచిన ఎలుకలు, ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CPI leader Narayana: శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
శ్రీవారికి భక్తుడిగా మారిన కమ్యూనిస్టు దిగ్గజం - బీజేపీ స్పందన ఇదే !
Ind vs Nam Match Highlights: T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
T20 ప్రపంచ కప్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన టీమిండియా! నమీబియాపై ఘనవిజయం!  
YSRCP: మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
మండలిలోనే పోరాటం - శాసనసభ బహిష్కరణ - వైసీపీఎల్పీ సమావేశంలో జగన్ నిర్ణయం
Vishwak Sen: ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
ఫ్లాపుల్లోనూ 'ఫంకీ'కి కెరీర్ బెస్ట్ బిజినెస్... విశ్వక్ సేన్‌ లాస్ట్ 5 ఫిలిమ్స్ కంపేరిజన్ చూస్తే?
Ambati Rambabu remanded: తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
తగ్గేదే లే.. మళ్లీ రాజమండ్రి జైలుకు అంబటి రాంబాబు - లక్కీ డ్రా కేసులో 14 రోజుల రిమాండ్
Embed widget