<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>budget</title><atom:link href="https://telugu.abplive.com/budget/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Thu, 30 Apr 2026 06:23:52 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! ]]></title><link>https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-27-dwakra-women-interest-free-loans-2500-crore-allocation-241537</link><comments>https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-27-dwakra-women-interest-free-loans-2500-crore-allocation-241537#respond</comments><pubDate>Fri, 20 Mar 2026 14:29:42 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-27-dwakra-women-interest-free-loans-2500-crore-allocation-241537</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Budget 2026-27:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్&amp;zwnj;లో రాష్ట్రంలోని ఆడపడుచులకు, ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి &lt;a title=&quot;రేవంత్ రెడ్డి&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Revanth-Reddy&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;రేవంత్ రెడ్డి&lt;/a&gt; సర్కారు తీపి కబురు అందించింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్&amp;zwnj;లో మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటించారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే పరమావధిగా ప్రభుత్వం తన ప్రణాళికలను సిద్ధం చేసింది. ఇందులో భాగంగా డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాల కోసం ఈ బడ్జెట్&amp;zwnj;లో భారీ &amp;nbsp;కేటాయింపులు జరిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వడ్డీ లేని రుణాలకు 2500 కోట్లు కేటాయింపు&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణ బడ్జెట్&amp;zwnj;లో డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం రూ. 2500 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రకటించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు వడ్డీ భారం లేకుండా మహిళలు తమ వ్యాపారాలను స్వయం ఉపాధి మార్గాలను మెరుగుపరుచుకోవడానికి ఈ నిధులు వెన్నుదన్నుగా నిలవనున్నాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు ఈ వడ్డీ లేని రుణాల ద్వారా లబ్ధి పొందనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటికే వడ్డీ లేని రుణాల పథకం కింద 2023 డిసెంబర్&amp;zwnj; నుంచి ఇప్పటి వరకు పట్టణ, గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు 1329 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 67 లక్షల మంది మహిళలతో కూడిన ఐకేపీ నెట్&amp;zwnj;వర్క్&amp;zwnj; బలంగా ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మహిళా శక్తి మిషన్- లక్షల కోట్ల లక్ష్యం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహత్తర సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి మిషన్&amp;zwnj;ను ముందుకు తీసుకెళ్తోంది. దీని కోసం రాబోయే ఐదేళ్ల కాలంలో బ్యాంకుల ద్వారా మొత్తం లక్ష కోట్ల రుణాలను మహిళా సంఘాలకు ఇప్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా ఇప్పటికే రూ. 57, 938 కోట్ల రుణాలను మహిళలకు అందించడం విశేషం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ప్రభుత్వం వివిధ అవసరాల కోసం విభిన్న శ్రేణుల్లో రుణాలను అందిస్తోంది. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు రూ. 5 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు అందుబాటులో ఉన్నాయి. మహిళల కుటుంబాల్లో ఆరోగ్యం, పిల్లల విద్య అవసరాల కోసం స్త్రీ నిధి ద్వారా ప్రత్యేకంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు లేదా చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు ద్వారా జీవనోపాధి పొందే మహిళలకు 50 వేల ఐదు లక్షల వరకు రుణ సాయం అందుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మహిళలను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో చేరే వయోపరిమితిని కూడా సవరించింది. ఇప్పుడు 18 ఏళ్ల నుంచి 61 ఏళ్ల లోపు ఉన్న మహిళలందరూ &amp;nbsp;ఈ సంఘాల్లో చేరి ప్రభుత్వ ఫలాలను పొందే అవకాశం కల్పించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మహిళా సంఘాలకు కేవలం రుణాలు ఇవ్వడమే కాకుండా, వారు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది. శిల్పా రామంలో 106 స్టాళ్లతో ఏర్పాటు చేసి ఈ బజార్&amp;zwnj; ద్వారా మహిళా సంఘాలు ఉత్పత్తుల విక్రయాలు ఇప్పటికే 7.68 కోట్లకు చేరుకున్నాయి. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేసి వాటిని టీజీఎస్&amp;zwnj;ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. మొదటి దశలో 177.84 కోట్లతో 494 బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది. నారాయణపేట్&amp;zwnj;, సంగారెడ్డి, జిల్లాల్లో ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో రెండు పెట్రోల్ బంకులు విజయవంతంగా నడుస్తున్నాయి. మరో 28 బంకులను మహిళలను అప్పగించే పనులు పురోగతిలో ఉన్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మహిళా సాధికారతను బలోపేతం చేయడానికి రాష్ట్రంలోని మరో 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలను ప్రభుత్వం నిర్మిస్తోంది. అలాగే, &amp;nbsp;రాంప్ పథకం ద్వారా 140 మహిళా సంఘాల ఆధ్వర్యంలోని వ్యాపారాలను వేగవంతం చేసేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్&amp;zwnj;లను కూడా ప్రభుత్వం చేపట్టింది.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/20/8cef2288595edf7634d9adf5656546f01773997146530215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!]]></title><link>https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-telangana-indiramamma-kutumba-jeevita-beema-scheme-announces-rs-5-lakh-insurance-for-every-family-241531</link><comments>https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-telangana-indiramamma-kutumba-jeevita-beema-scheme-announces-rs-5-lakh-insurance-for-every-family-241531#respond</comments><pubDate>Fri, 20 Mar 2026 13:26:20 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-telangana-indiramamma-kutumba-jeevita-beema-scheme-announces-rs-5-lakh-insurance-for-every-family-241531</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme :&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేలా ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈ బడ్జెట్&amp;zwnj;లో తీసుకుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడమే లక్ష్యంగా &amp;lsquo;ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం&amp;rsquo; అనే పథకాన్ని జూన్ 2, 2026 నుంచి ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2026-27 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అధికారికంగా ప్రకటించారు. ఒకేసారి రాష్ట్రంలోని కోటిన్నర మంది ప్రజలకు వర్తించేలా రూపొందించిన ఈ పథకం, భారత్&amp;zwnj; సామాజిక భద్రతా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవనుంది.&lt;/p&gt;
&lt;h3&gt;జూన్ 2 నుంచి ఈ కొత్త పథకం ఎందుకు ప్రారంభిస్తున్నారు?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పిస్తారు. ఒక కుటుంబంలో ఆదాయం సంపాదించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే, ఆ కుటుంబం రోడ్డున పడకుండా, ఆర్థికంగా చితికిపోకుండా ఉండాలనే మానవీయ కోణంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా, సంపాదించే వ్యక్తి దూరమైనప్పుడు ఆ కుటుంబం ఎదుర్కొనే మానసిక వేదన ఒకటెైతే, ఆర్థిక విపత్తు మరొకటి. అటువంటి విపత్కర పరిస్థితుల్లో అభయహస్తంలా ఈ రూ. 5 లక్షల బీమా మొత్తం ఆ కుటుంబాన్ని ఆదుకుంటుంది అన్నారు. ప్రపంచంలోని మరే ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇటువంటి సామాజిక భద్రతా పథకం లేదని, ఇంత భారీ స్థాయిలో ఒకేసారి ఒక కోటి 15 లక్షల కుటుంబాలకు బీమా కల్పించడం ఒక రికార్డు అని ప్రభుత్వం అభిప్రాయపడింది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అర్హులు ఎవరు? లబ్ధిదారులను ఎలా నిర్ణయిస్తారు?&lt;/h3&gt;
&lt;p&gt;సాధారణంగా సంక్షేమ పథకాలు కేవలం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే పరిమితమవుతాయి. కానీ, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం విషయంలో ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. సామాజిక, ఆర్థిక అంతరాలు లేవు. ఈ పథకం వర్తించడానికి పేద, మధ్యతరగతి లేదా ధనిక అనే వ్యత్యాసం లేదు. అన్ని వర్గాలకు వర్తింపు చేయాలని నిర్ణయించారు. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రభుత్వం ఈ భరోసాను కల్పించనుంది. అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.15 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద రక్షణ పొందనున్నాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియలో ప్రభుత్వం ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల డేటాబేస్, ప్రజా పాలన దరఖాస్తులను ప్రాతిపదికగా తీసుకునే అవకాశం ఉంది. అయితే, ప్రతి కుటుంబం అని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించినందున, రాష్ట్రంలోని ప్రతి రిజిస్టర్డ్ కుటుంబానికి ఈ ఇన్సూరెన్స్ వర్తించేలా మార్గదర్శకాలు రూపొందించే ఛాన్స్ ఉంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఏ రాష్ట్రాల్లో ఇలాంటి పథకం ఉంది?&lt;/h3&gt;
&lt;p&gt;భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు కూడా గతంలో ఇటువంటి బీమా పథకాలను ప్రవేశపెట్టాయి. ఆంధ్రప్రదేశ్ సంపాదించే వ్యక్తి మరణిస్తే బీమా సొమ్ము అందిస్తారు, అయితే ఇది ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు, పేద కుటుంబాలకు పరిమితం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజనలను అమలు చేస్తోంది, కానీ వీటిలో లబ్ధిదారులు స్వయంగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. &amp;nbsp;ఇవి అందరికీ (Universal) వర్తించవు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణ పథకం ఎందుకు ప్రత్యేకం?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఇతర రాష్ట్రాల కంటే భిన్నమైనది. ఎందుకంటే, ఇది కేవలం ఒక వర్గానికో లేదా కేవలం పేదలకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి ప్రభుత్వం తన సొంత ఖర్చుతో బీమా కల్పించనుంది. రాష్ట్రంలో పుట్టడం, ఇక్కడ జీవించడం ఒక వరంగా భావించేలా ప్రభుత్వం ఈ భద్రతను కల్పిస్తోందని మంత్రి పేర్కొన్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/20/beb8a039396e826c6dace2539149adf81773993335769215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్]]></title><link>https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-27-live-updates-financial-minister-mallu-bhatti-vikramarka-presents-financial-year-plan-in-assembly-241520</link><comments>https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-27-live-updates-financial-minister-mallu-bhatti-vikramarka-presents-financial-year-plan-in-assembly-241520#respond</comments><pubDate>Fri, 20 Mar 2026 11:20:20 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/telangana-budget-2026-27-live-updates-financial-minister-mallu-bhatti-vikramarka-presents-financial-year-plan-in-assembly-241520</guid><description><![CDATA[&lt;p&gt;Telangana Budget 2026-27: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. కాససేపట్లో శాసనసభలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్&amp;zwnj;ను ఉంచబోతోంది. సుమారు రూ. 3.30 లక్షల కోట్ల నుంచి రూ. 3.36 లక్షల కోట్ల భారీ అంచనాలతో ఈ పద్దును రూపొందించారు. ప్రజా సంక్షేమానికి, ఇటు మౌలిక సదుపాయాల కల్పనకు సమాన ప్రాధాన్యతనిస్తూ ఈసారి బడ్జెట్&amp;zwnj;ను రూపొందించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్&amp;zwnj;గా పెట్టుకున్న ట్రిలియన్&amp;zwnj; డాలర్ల ఎకానమీ సాధనలో ఈ బడ్జెట్ అత్యంత కీలకమైనదని అంటున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఉప ముఖ్యమంత్రి ,ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన నివాసమైన ప్రజాభవన్&amp;zwnj;లోని పోచమ్మ ఆలయంలో దంపతులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. శాసనమండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్, ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. తర్వాత క్యాబినెట్ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోదం లభించింది. సరిగా 12 గంటలకు అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్&amp;zwnj;ను ప్రవేశ పెడితే, శాసనమండలిలో మంత్రి ఉత్తమ్&amp;zwnj;కుమార్&amp;zwnj;రెడ్డి బడ్జెట్ ప్రతిపాదనలు చదివి వినిపిస్తారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;బడ్జెట్&amp;zwnj;పై భారీ అంచనాలు &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;2026-27 బడ్జెట్&amp;zwnj; పద్దు గత బడ్జెట్ కంటే పెంచినట్టు తెలుస్తోంది. సుమారు రూ. 3.30 లక్షల కోట్ల నుంచి రూ. 3.36 లక్షల కోట్ల వరకు ఉంటుందని అధికారుల నుంచి అందుతున్న సమాచారం. గత ఆర్థిక సంవత్సరం (2025-26) బడ్జెట్&amp;zwnj;లో మొత్తం వ్యయం రూ. 3,04,965 కోట్లుగా ప్రతిపాదించగా, ఈసారి దానిపై సుమారు 8 నుంచి 10 శాతం వరకు అదనంగా పెంచినట్లు తెలుస్తోంది. స్థిరంగా పెరుగుతున్న పన్ను రాబడులు, &amp;nbsp;కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో అందే నిధులను పరిగణలోకి తీసుకొని బడ్జెట్ రూపొందించినట్టు వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;సంక్షేమానికి అధిక ప్రాధాన్యత&lt;/h3&gt;
&lt;p&gt;మొదటి నుంచి చెబుతున్నట్టు ఈసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికే అధిక ప్రాధాన్యత ఇచ్చింది. అదే టైంలో అభివృద్ధిని విస్మరించకుండా దానికి కూడా తగిన నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు తోడు మరికొన్ని కొత్త పథకాలను ఈ బడ్జెట్&amp;zwnj;లో ప్రవేశ పెట్టనున్నారు. 2034 విజన్&amp;zwnj;కు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు ఉంటాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/20/17a70b1fafd5a8608ef2c4f2569bc5c81773985781521215_original.jpeg" width="220"/></item><item><title><![CDATA[Telangana Budget 2026-27: నేడు 3.36 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్‌ 2026-27; అభివృద్ధి సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం!]]></title><link>https://telugu.abplive.com/business/budget/telangana-budget-3-36-lakh-crore-focuses-education-health-agriculture-welfare-241497</link><comments>https://telugu.abplive.com/business/budget/telangana-budget-3-36-lakh-crore-focuses-education-health-agriculture-welfare-241497#respond</comments><pubDate>Fri, 20 Mar 2026 07:40:08 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/telangana-budget-3-36-lakh-crore-focuses-education-health-agriculture-welfare-241497</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Telangana Budget 2026-27:&amp;nbsp;&lt;/strong&gt;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరం కోసం సర్వన్నద్ధమైంది. ముఖ్యంగా విద్య,వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యతగా తీసుకొని రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే విధంగా భారీ బడ్జెట్&amp;zwnj;ను రూపొందించింది. ఈ దఫా బడ్జెట్ అంచనాలు అక్షరాల 3.36 లక్షల కోట్లకు చేరుకున్నట్టు తెలుస్తోంది. గత ఏడాది బడ్జెట్ 3.04 లక్షల కోట్లు. ఈసారి సుమారు 32వేల కోట్లు రూపాయలు పెరుగుదలతో సరికొత్త రికార్డును సృష్టించబోతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం బహుముఖ వ్యూహాలను అవలంభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పన్నుల వాటా ఆదాయం ఏడాదికి మారు 4వేల కోట్ల మేర పెరగడం రాష్ట్రానికి పెద్ద ఊరటనిస్తోంది. దీనికి తోడు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా లభించే నిధులను వదులుకోకుండా రాష్ట్ర వాటాను సక్రమంగా చెల్లించ గరిష్టంగా నిధులు రాబట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంపై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే పెద్ద ఎత్తున రుణాలను రీస్ట్రక్చర్ చేయగా రానున్న ఆర్థిక సంవత్సరంలో కూడా ఈ ప్రక్రియను కొనసాగించడం ద్వారా వడ్డీల భారం తగ్గించుకోవాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పన్నుల రాబడి కూడా ఆశాజనంగా ఉంది. సవరించిన అంచనాల ప్రకారం పన్నుల రూపేణా రూ. 1.75 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని భావించగా అందులో 92 శాతం మేర ఇప్పటికే వసూలైంది. జీఎస్టీ స్లాబ్&amp;zwnj;లలో మార్పులు జరిగినప్పటికీ ఆదాయం తగ్గకపోవడం విశేషం. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది పన్నుల ఆదాయ లక్ష్యాన్ని 1.90 లక్షల కోట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్ర బడ్జెట్&amp;zwnj;ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుభ ముహూర్తాన్ని ఎంచుకున్నారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తంలో ఆయన బడ్జెట్ శాసనసభ ముందు ఉంచుతారు. అదే శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్&amp;zwnj; ప్రసంగం చేస్తారు. అంతకు ముందు ఉదయం 9.30 గంటలకు అసెంబ్లీ లాబీల్లోని కమిటీ హాల్&amp;zwnj;లో రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్ ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోదం తెలపనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ప్రాధాన్యత రంగాల వివరాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ బడ్జెట్&amp;zwnj;లో సామాన్యుడికి అవసరమైన ప్రాథమిక రంగాలు, మౌలిక సదుపాయాలకు అత్యధిక కేటాయింపులు ఉండబోతున్నాయి. విద్య, వైద్యానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలల ఆధునీకరణ, వైద్య సేవల విస్తరణకు నిధుల కేటాయింపు గణనీయంగా పెరగనుంది. రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలతో పాటు వ్యవసాయ యాంత్రీకరణ బడ్జెట్&amp;zwnj;లో ప్రాధాన్యత లభించనుంది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును త్వరిగతిన పూర్తి చేయడంతోపాటు, తుమ్మడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన భారీ నిధులను ఈ బడ్జెట్&amp;zwnj;లో కేటాయించనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;నగరాభివృద్ధి, భవిష్యత్&amp;zwnj; ప్రాజెక్టులు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు ఇచ్చే నిధుల పెంచడం ద్వారా క్షేత్రస్థాయిలో అభివృద్ధిని పరుగులు తీయించాలని ప్రభుత్వం భావిస్తోంది.&amp;nbsp;హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్&amp;zwnj; సిటీగా తీర్చిదిద్దడంలో భాగంగా కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించనున్నారు. మూసీ నది పునరుజ్జీవనం, అందంగా తీర్చిదిద్దం కోసం ప్రత్యేక కేటాయింపులు చేయనున్నారు. నగరంలోని మరిన్ని ప్రాంతాలకు మెట్రో సౌకర్యాన్ని విస్తరిస్తారు. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఆర్&amp;zwnj;ఆర్&amp;zwnj;ఆర్&amp;zwnj; ప్రాజెక్టుకు ఊతమివ్వనున్నారు. భవిష్యత్ అవసరాల కోసం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్&amp;zwnj;లో నిధులు సిద్ధం చేస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/03/20/5fc7ad38ea84b891ed35b4a293c9d6f41773972573192215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య]]></title><link>https://telugu.abplive.com/news/india/karnataka-budget-2026-social-media-ban-for-children-under-16-years-cm-siddaramaiah-240081</link><comments>https://telugu.abplive.com/news/india/karnataka-budget-2026-social-media-ban-for-children-under-16-years-cm-siddaramaiah-240081#respond</comments><pubDate>Fri, 6 Mar 2026 12:48:25 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/karnataka-budget-2026-social-media-ban-for-children-under-16-years-cm-siddaramaiah-240081</guid><description><![CDATA[&lt;p&gt;Karnataka Budget 2026 | 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం (మార్చి 6న) రాష్ట్ర బడ్జెట్&amp;zwnj; 2026ను ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. మొబైల్ వినియోగంతో పిల్లలపై పెరుగుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;గత నెలలో రాజధాని బెంగళూరులో జరిగిన వైస్ ఛాన్సలర్ల (వీసీల) సమావేశంలో సిద్ధరామయ్య ఈ అంశంపై చర్చించి, వారి అభిప్రాయాలను కోరారు. ఆ చర్చల సందర్భంగా మొబైల్ వ్యసనం (Mobile addiction), ఆన్&amp;zwnj;లైన్ గేమింగ్ (Online Gaming), పిల్లల ఎడ్యుకేషన్, శారీరక దృఢత్వంపై సోషల్ మీడియా చూపుతున్న చెడు ప్రభావంపై సీఎం సిద్ధరామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. స్మార్ట్ ఫోన్ వినియోగంతో సోషల్ మీడియాకు టీనేజర్లు మరింతగా అడిక్ట్ అవుతున్నారని, వారి మానసిక పరిస్థితిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. వారిలో నేర ప్రవృత్తి పెరగడం, పెద్దల మాట వినకపోవడం, చదువుపై సైతం ఫోకస్ చేయకపోవడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సిద్దరామయ్య ప్రస్తావించారు.&lt;/p&gt;
&lt;p&gt;యువతలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగుతున్న క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి కొన్ని చర్యలు తీసుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోందని &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt; ఐటీ, బీటీ (IT &amp;amp; BT) శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే జనవరి 30న అసెంబ్లీలో పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;a title=&quot;కాంగ్రెస్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Congress&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కాంగ్రెస్&lt;/a&gt; అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల మాట్లాడుతూ.. పిల్లలు, టీనేజర్లు మొబైల్ విపరీతంగా వాడటం తీవ్రమైన అంశమని అన్నారు. ఫిన్లాండ్ ఇప్పటికే ఇటువంటి చర్యలు తీసుకుందని, యునైటెడ్ కింగ్&amp;zwnj;డమ్ (UK) కూడా ఇదే విధమైన చర్యను పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఇప్పటికే కొన్ని వయస్సుల పిల్లలకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిందని ఖర్గే గుర్తు చేశారు. సోషల్ మీడియా మితిమీరిన వాడకాన్ని నివారించడానికి ఏమి చేయవచ్చనే అంశంపై తాము కూడా సంబంధిత వర్గాలతో (స్టేక్ హోల్డర్స్) చర్చలు ప్రారంభించామని మల్లికార్జున ఖర్గే కొన్ని రోజుల కిందట అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/tech/if-you-make-this-mistake-then-your-mobile-battery-can-also-explode-237975&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;తక్కువ వయస్సు గల వినియోగదారుల కోసం సోషల్ మీడియా యాక్సెస్&amp;zwnj;ను పరిమితం చేయడానికి ఆస్ట్రేలియా కఠినమైన చర్యలు తీసుకుంది. ఫ్రాన్స్, స్పెయిన్&amp;zwnj;తో సహా ఐరోపాలోని మరికొన్ని దేశాల్లో కూడా పాఠశాలల్లో తరగతుల సమయంలో విద్యార్థుల ఏకాగ్రతను పెంచడానికి, పరధ్యానంగా ఉండటాన్ని నియంత్రించేందుకు స్కూల్లో స్మార్ట్&amp;zwnj;ఫోన్ వినియోగంపై కఠినమైన రూల్స్ అమలు చేస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/images/dw/74665339_607.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Assembly Session: ఏపీ బడ్జెట్ సెషన్.. నేడు మూడు కీలక సవరణ బిల్లులు పెట్టనున్న ప్రభుత్వం]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/ap-assembly-sessions-budget-discussion-and-key-bill-presentations-begin-today-238312</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/ap-assembly-sessions-budget-discussion-and-key-bill-presentations-begin-today-238312#respond</comments><pubDate>Tue, 17 Feb 2026 08:22:55 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/ap-assembly-sessions-budget-discussion-and-key-bill-presentations-begin-today-238312</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుండి తిరిగి ప్రారంభం కానున్నాయి. రెండు రోజుల విరామం తర్వాత బడ్జెట్&amp;zwnj;పై సాధారణ చర్చ నేడు మొదలుకానుంది. ప్రభుత్వం నేడు మూడు కీలక సవరణ బిల్లులను ప్రవేశపెట్టనుంది. మున్సిపల్ చట్టాల్లో రెండు సవరణ బిల్లులను మంత్రి నారాయణ, విద్యుత్ సుంకం సవరణ బిల్లును మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభ ముందు ఉంచనున్నారు. మధ్యాహ్నం నుండి బడ్జెట్&amp;zwnj;పై సమగ్ర చర్చ ప్రారంభమవుతుంది.&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్&amp;zwnj;పై ప్రసంగించనుండగా, ఎల్లుండి సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు దీనిపై సమాధానం ఇవ్వనున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీలో తొలుత ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ఈ సెషన్&amp;zwnj;లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా 2019-24 మధ్య కాలంలో నాడు-నేడు పథకం కింద పాఠశాలల్లో జరిగిన పనుల్లో అవకతవకలు, స్వర్ణ గ్రామం - స్వర్ణ వార్డు వ్యవస్థల క్రమబద్ధీకరణ, ఆంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో గంజాయి అక్రమ రవాణా అరికట్టడం వంటి అంశాలపై సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిస్తారు. అలాగే ఆక్వా రైతులందరికీ ఏకరీతి విద్యుత్ రాయితీ, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ గేట్ల పునర్నిర్మాణం, హజ్ యాత్రికుల సమస్యలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సభలో చర్చించనున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;మరోవైపు, ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న శాసనమండలిలో కూడా బడ్జెట్&amp;zwnj;పై తొలిరోజు చర్చ జరగనుంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆడబిడ్డ నిధి పథకం అమలు, యురేనియం గనుల తవ్వకం వల్ల కలిగే పర్యావరణ ప్రభావాలు, పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఆసుపత్రుల్లో మందుల నాణ్యత, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం వంటి ప్రజా ప్రాధాన్యత ఉన్న అంశాలపై మండలిలో మంత్రులు వివరణ ఇవ్వనున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/17/c3c7296c66c1cfbe01b14e14ed215dd71771296167561233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Budget 2026 Updates: పవన్, లోకేష్‌ శాఖలకు ఏపీ బడ్జెట్‌లో చేసిన కేటాయింపులు ఇవే! ]]></title><link>https://telugu.abplive.com/business/budget/these-are-allocations-made-in-ap-budget-to-pawan-and-lokesh-departments-238061</link><comments>https://telugu.abplive.com/business/budget/these-are-allocations-made-in-ap-budget-to-pawan-and-lokesh-departments-238061#respond</comments><pubDate>Sat, 14 Feb 2026 14:18:06 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/these-are-allocations-made-in-ap-budget-to-pawan-and-lokesh-departments-238061</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Budget 2026 Updates: &lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్&amp;zwnj; పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలతోపాటు అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక శాఖలను పర్యవేక్షిస్తున్నారు. లోకేష్ విద్యారంగంతోపాటు, ఐటీ శాఖను చూస్తున్నారు. మరి ఈ శాఖలకు కేటాయింపులు ఎలా ఉన్నాయో చూద్దాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;విద్య అనేది కేవలం భవనాలు, పాఠ్య ప్రణాళికలు లేదా పరీక్షలకే పరిమితం కాదని, బిడ్డకు మంచి భవిష్యత్&amp;zwnj; భరోసా ఇవ్వడమే ప్రధాన లక్ష్యమని అన్నారు. పిల్లలు గ్లోబల్&amp;zwnj; స్థాయిలో పోటీ పడగల నైపుణ్యాలతో సిద్ధమవుతున్నారని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;2019-24 మధ్య కాలంలో విద్యావ్యవస్థ తీవ్రమైన విద్య, సంస్థాగత వెనుకబాటుకు గురైందని అన్నారు. సమగ్ర ప్రణాళిక లేకుండా చేపట్టిన సంస్కరణలు గందరగోళాన్ని సృష్టించాయని అన్నారు తొందరపాటు నిర్ణయంతో వెయ్యి పాఠశాలలను సీబీఎన్&amp;zwnj;ఈ విధానానికి మార్చడం వల్ల సుమారు 90 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేకపోయారని గుర్తు చేశారు. నాడు నేడు కార్యక్రమంలో చేపట్టిన 7, 876 కోట్లు పనులు పాలనా వైఫల్యాల వల్ల అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు. &amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రతి విద్యార్థికి ఏటా 15000 అందజేస్తున్నారు. దీని వల్ల 67, 27 లక్ష మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది. పరిపాలన పారదర్శకతను మెగా పేరెంట్ టీచ్ సమావేశాలు, పాఠశాల స్టార్&amp;zwnj; రేటింగ్ వ్యవసస్థ, సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశామన్నారు. అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవని అన్నారు. మెగా డీఎస్సీ ద్వారా నోటిఫై చేసిన 16, 347 పోస్టుల్లో 15, 941 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశామన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భవిష్యత్ ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థు రూపొందిస్తున్నామన్నారు. విద్య పరిశ్రమలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ఐటీఐలు 167 పరిశ్రమ భాగస్వాములతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,188 మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల్లో 98 శాతం మంది నియామకాల లేదా అప్రెంటిస్&amp;zwnj; అవకాశాలను పొందారని ప్రకటించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మరింత మంచి చేసేందుకు ఈ సారి పాఠశాల విద్యాశాఖకు 32, 308 కోట్లు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్రాభివృద్ధికి 15, 00కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కట్లు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు 12, 32కోట్లు కేటాయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పంచాయతీ రాజ్&amp;zwnj;, గ్రామీణాభివృద్ధికి భారీ కేటాయింపులు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;&lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt;&amp;zwnj; నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోందని అన్నారు. పవన్ చేపట్టిన కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లేందుకు బడ్జెట్&amp;zwnj;లో 22, 942 కోట్లను &amp;nbsp;కేటాయించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పర్యావరణ, అటవీ విజ్ఞాన శాస్త్రానికి ఇచ్చిన కేటాయింపులు ఇవే&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;గత ప్రభుత్వం వైఫల్యాలు కారణంగా ఎర్ర చందనం అక్రమ రవాణా అక్రమ గనుల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏపీని హరిత ఆంధ్రప్రదేశ్&amp;zwnj;గా మార్చేందుకు 2030 నాటికి 37శాతం 2047 నాటికి 50 శాతం పచ్చదనం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. వ్యూహాత్మక పర్యావరణ రక్షణ వలయంగా గ్రీన్ కవర్&amp;zwnj; వాల్&amp;zwnj; ఆఫ్&amp;zwnj; ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను అమలు చేయనున్నామని వివరించారు. అందుకే ఈ డిపార్ట్&amp;zwnj;మెంట్&amp;zwnj;కు 714 కోట్లు కేటాయించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/14/94730d74c1dfda3af6d79f46fb2f1a4b1771058852103215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Wealth Fund: ఆంధ్రప్రదేశ్‌ వెల్త్‌ ఫండ్‌; అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు చంద్రబాబు ప్రయోగం! ఇది ఏపీ తలరాతను ఎలా మారుస్తుంది?]]></title><link>https://telugu.abplive.com/business/budget/what-is-andhra-pradesh-wealth-fund-how-can-usefull-people-and-state-swarna-andhra-2047-vision-economic-engine-238053</link><comments>https://telugu.abplive.com/business/budget/what-is-andhra-pradesh-wealth-fund-how-can-usefull-people-and-state-swarna-andhra-2047-vision-economic-engine-238053#respond</comments><pubDate>Sat, 14 Feb 2026 12:47:24 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/what-is-andhra-pradesh-wealth-fund-how-can-usefull-people-and-state-swarna-andhra-2047-vision-economic-engine-238053</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Wealth Fund:&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. అప్పులు ఆంధ్రప్రదేశ్&amp;zwnj; అని పేరు తెచ్చుకున్న రాష్ట్రాన్ని సంపన్న ఆంధ్రప్రదేశ్&amp;zwnj;గా మార్చడానికి ఒక భారీ ఆర్థిక ప్రయోగం మొదలైంది. అదే ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వెల్త్&amp;zwnj; ఫండ్&amp;zwnj; ఏర్పాటు చేస్తున్నట్టు 2026-27 బడ్జెట్&amp;zwnj; సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రతిపాదించారు.ఓ నిధి ఏర్పాటుకు అధికారికంగా పచ్చజెండా ఊపారు. ఇది కేవలం ఒక ప్రభుత్వం సంస్థ కాదని, రాబోయే తరాల భవిష్యత్&amp;zwnj;ను బంగారు మయం చేసే ఆర్థిక యంత్రమని ప్రభుత్వం చెబుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అసలు ఈ వెల్త్ ఫండ్ అంటే ఏంటీ? సింగపూర్&amp;zwnj;, నార్వే వంటి దేశాల్లో ఉన్న వ్యవస్థలు మనకు ఎలా ఉపయోగపడతాయి? సామాన్య రైతుకు, మధ్యతరగతి మనిషికి దీని వల్ల వచ్చే లాభం ఏంటీ? అనే పూర్తి వివరాలపై లోతైన విశ్లేషణ ఇక్కడ చూద్దాం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అసలు ఏంటీ ఈ వెల్త్&amp;zwnj;ఫండ్&amp;zwnj;?&lt;/h3&gt;
&lt;p&gt;మనం ఇంట్లో ఉన్న అదనపు డబ్బును లేదా బంగారాన్ని ఎలాగైతే బ్యాంకులో ఫిక్స్&amp;zwnj;డ్&amp;zwnj; డిపాజిట్&amp;zwnj; చేస్తామో లేదా భూమిని కొని దాని మీద వచ్చే ఆదాయంతో మరిన్ని &amp;nbsp;ఆస్తులు కొనే ప్రయత్నం చేస్తామో ప్రభుత్వం అలాంటి ప్రయత్నమే చేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉన్న కొన్ని ఆస్తులను కేవలం ఖాళీగా ఉంచకుండా వాటిని ఆదాయం ఇచ్చే వనరులుగా మార్చుకుంటుంది. వాటిని ఈ వెల్త్&amp;zwnj;ఫండ్స్&amp;zwnj;లో జమ చేస్తుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రపంచంలో నార్వే, సింగపూర్&amp;zwnj; వంటి దేశాలు ఇలాంటి సోవర్నిటీ వెల్త్ ఫండ్ &amp;nbsp; ఏర్పాటు చేసి నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంత దేశాలుగా ఎదిగాయి. భారత్&amp;zwnj; దేశంలో ఒక రాష్ట్ర స్థాయిలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?&lt;/h3&gt;
&lt;p&gt;2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ వంటి ఆదాయం వచ్చే నగరం లేకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆ అప్పులు 12 నుంచి 1 లక్ష కోట్లు వరకు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఏపీ కడుతున్న వడ్డీలే యాభై వేల కోట్లకుపైగా ఉంటోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం ప్రజల మీద పన్నులు వేయడం ద్వారా లేదా మళ్లీ అప్పులు చేయడం ద్వారా ఈ పరిస్థితి మార్చలేమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే సంపద సృష్టి అనే మంత్రాన్ని జపిస్తోంది. ప్రభుత్వం వద్ద ఉన్న వనరులను తెలివిగా వాడుకొని ఆస్తులను అమ్మకుండానే ఆదాయం సంపాదించడం ఏకైక మార్గమని వెల్త్&amp;zwnj; ఫండ్&amp;zwnj;ను తెరపైకి తెచ్చింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;స్వర్ణాంద్ర 2047 లక్ష్యంగా అడుగులు&lt;/h3&gt;
&lt;p&gt;ముఖ్యమంత్రి చంద్రబాబు 2047 నాటికి అంటే భారత్&amp;zwnj;కు స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు నిండే నాటికి ఏపీని అగ్ర రాష్ట్రాల జాబితాలో చూడాలని అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఈ ఫండ్&amp;zwnj;ను క్రియేట్ చేస్తున్నారు. దీని వల్ల ప్రతి ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉండే వ్యక్తి ఆదాయం జాతీయ సగటు కంటే మూడు రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. పేదరికాన్ని జీరోకు వస్తుందని లెక్కలు వేస్తున్నారు. అమరావతి, పోలవరం వంటి మెగా ప్రాజెక్టులకు నిధుల కొరత కూడా ఉండబోదని వివరిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఈ ఫండ్&amp;zwnj;కు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి?&lt;/h3&gt;
&lt;p&gt;డబ్బులు లేని రాష్ట్రంలో ఈ ఫండ్&amp;zwnj;లో డబ్బులు ఎలా పెడుతుందని అనుమానం చాలా మందికి ఉంటుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం ఈ నిధిలో నగదు కంటే ఎక్కువగా ఆస్తులను పెట్టుబడిగా పెట్టనుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ చేతిలో మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాల భూమి ఉంది. దీని విలువ మార్కెట్&amp;zwnj;లో పది నుంచి 15 లక్షల కోట్లు ఉంటుంది. ఈ భూములను డెవలప్ చేసి లీజుకు ఇస్తే ఆదాయం వస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ, జెన్కో వంటి సంస్థల్లో ఉన్న వాటాలను తెలివిగా వాడుకోవాలని చూస్తోంది. సముద్ర తీరంలోని ఇసుక, ఆయిల్, గ్యాస్ నిక్షేపాల నుంచే ఆదాయాన్ని ఫండ్&amp;zwnj;కు తరలిస్తారు. విదేశాల్లో ఉన్న తెలుగువారు, రాష్ట్రంలో ఉన్న వ్యాపారవేత్తలు ఇతర ఉన్నత వర్గాలు దీనికి ఫండ్ ఇచ్చేలా ప్రోత్సహిస్తారు. ఇప్పటికే దీనికి ప్రారంభ పెట్టుబడిగా 100 కోట్లు ఈ బడ్జెట్&amp;zwnj;లో ప్రభుత్వ కేటాయించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;నార్వే మోడల్ ఏం చెబుతోంది?&lt;/h3&gt;
&lt;p&gt;నార్వే దగ్గర ఆయిల్&amp;zwnj; ద్వారా వచ్చిన డబ్బుతో ఒక ఫండ్&amp;zwnj; ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆ ఫండ్ విలువ సుమారు .1.7 ట్రిలియన్&amp;zwnj;లు అంటే 140లక్షల కోట్లు. నార్వేలో ప్రతి పౌరుడి పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు సంపద ఉంది. అక్కడ ప్రజలు ఉచిత విద్య, వైద్యం ఈ ఫండ్ ద్వారానే అందుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;సింగపూర్ మోడల్&amp;zwnj; ప్రత్యేకత ఏంటీ?&lt;/h3&gt;
&lt;p&gt;1974లో సింగపూర్&amp;zwnj; ప్రభుత్వం తన కంపెనీలను నిర్వహించడానికి టెమాసెక్ అనే సంస్థను పెట్టింది. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; ఈ మోడల్&amp;zwnj;ను చాలా ఇష్టపడతారు. సింగపూర్&amp;zwnj; ఎయిర్&amp;zwnj;లైన్స్&amp;zwnj;, డీబీఎస్&amp;zwnj; బ్యాంకు వంటివన్నీ ఈ ఫండ్ లాభాలతోనే నడుస్తున్నాయి. అందుకే సింగపూర్ వెళ్లినప్పుడు అక్కడి నిపుణులతో చర్చిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వెల్త్&amp;zwnj; ఫండ్&amp;zwnj; వల్ల సామాన్యుడికి ఏంటీ ఉపయోగం ?&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వెల్త్&amp;zwnj; ఫండ్ ఏర్పాటుతో సామాన్యుడికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. అయితే ప్రభుత్వం తన ఆస్తుల ద్వారా ఆదాయం సంపాదిస్తే, సామాన్యుడిపై పన్నుల భారం తగ్గుతుంది. వెల్త్ ఫండ్&amp;zwnj; ద్వారా ఇండస్ట్రీయల్ పార్కులు, టెక్ పార్కులు వస్తే ఉద్యోగాలు లభిస్తాయి. గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, స్కూళ్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం అప్పు చేయకుండానే ఈ ఫండ్ లాభాల నుంచి ఖర్&amp;zwnj;చు చేస్తుంది. భవిష్యత్&amp;zwnj;లో ఈ ఫండ్ చ్చే లాభాల నుంచే ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందివచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఈ ఫండ్ ఎలా పని చేస్తుంది?&lt;/h3&gt;
&lt;p&gt;వెల్త్&amp;zwnj;ఫండ్ అనేది ఒక సూపర్ కంపెనీలా ఉంటుంది. దీనిలో మొదటిగా ప్రభుత్వం తన భూములను, ఇతర వనరులను మ్యాపింగ్ చేస్తుంది. ఆ తర్వాత ఆ భూమిలో ఏం చేస్తే లాభమో చూస్తారు. అంటే ఒక ప్రాంతంలో పాడైపోయిన ప్రభుత్వం భవనం ఉంటే, అందులో కార్యకలాపాలు జరగపోతే దాన్ని పడగొట్టి పెద్ద షాపీంగ్ మాల్&amp;zwnj;కో, ఐటీ ఆఫీస్&amp;zwnj;కో అద్దెకు ఇస్తారు. దీని వల్ల ప్రభుత్వం వద్దే భూమి ఉంటుంది. కానీ అద్దె మాత్రం ఈ ఫండ్&amp;zwnj;లో జమ అవుతుంది. ఇదే అసె్ మానిటైజేషన్ అంటారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; వెల్త్&amp;zwnj; ఫండ్&amp;zwnj; ఎదురయ్యే సవాళ్లు ఏంటీ?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రభుత్వ భూములు ప్రైవేటు వాళ్లకు దారాదత్తం చేస్తారనే అపవాదు ప్రభుత్వానికి వస్తుంది. ప్రజలకు అర్థం కాకుంటే అధికార పార్టీకి ప్రమాదం. ప్రభుత్వ భూములు అమ్మడం కాదు వాటిని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం వస్తుందనే భావన వారికి చేరవేయాలి. ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ ఫండ్ పాలసీలు మారకుండా ఉండేందుకు గ్లోబల్ ఎక్స్&amp;zwnj;పర్ట్స్&amp;zwnj;తో ఒక స్వతంత్ర బోర్డు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/14/5d34206016aea0bb288a83b4cb1369ee1771053343482215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Budget Updates: ఏపీ బడ్జెట్‌లో సెక్టార్స్, పథకాల వారీగా కేటాయింపులు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/business/budget/andhra-pradesh-budget-live-updates-minister-payyavula-kesav-and-kinjarapu-atchannaidu-presenting-2026-general-budget-and-agriculture-budget-in-assembly-238038</link><comments>https://telugu.abplive.com/business/budget/andhra-pradesh-budget-live-updates-minister-payyavula-kesav-and-kinjarapu-atchannaidu-presenting-2026-general-budget-and-agriculture-budget-in-assembly-238038#respond</comments><pubDate>Sat, 14 Feb 2026 10:17:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/andhra-pradesh-budget-live-updates-minister-payyavula-kesav-and-kinjarapu-atchannaidu-presenting-2026-general-budget-and-agriculture-budget-in-assembly-238038</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP Budget Updates:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవిష్యత్ నిర్ణయించే కీలకమైన బడ్జెట్&amp;zwnj; నేడు సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే ఏప్రిల్&amp;zwnj; 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్&amp;zwnj;ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇవాళ శాసనసభ, మండలిలో ఈ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈసారి బడ్జెట్&amp;zwnj; పరిణామం 3.32లక్షల కోట్లు ఉండొచ్చని అంచనా ఉంది. గతేడాది ప్రవేశ పెట్టిన 3,22, 359 కోట్లతో పోలిస్తే ఈశారి పదివేల కోట్లు పెరిగే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;బడ్జెట్&amp;zwnj; రోజున షెడ్యూల్ ఇలా ఉంది...&lt;/h3&gt;
&lt;p&gt;ఉదయం పదిన్నరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమవుతుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలను కేబినెట్ మంత్రులు ఆమోదించనున్నారు. అనంతరం 11. 15 నిమిషాలకు సభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఆయన బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్&amp;zwnj; ప్రవేశ పెడతారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;శాసన మండలిలో హోంమంత్రి అనిత రాష్ట్ర బడ్జెట్&amp;zwnj;ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్&amp;zwnj; వ్యవసాయం బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఉభయ సభలు వాయిదా పడతాయి. ఫిబ్రవరి 1, 18 తేదీల్లో ఈ బడ్జెట్&amp;zwnj;పై సమగ్ర చర్చ, అనంతరం సభ ఆమోదం ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ సారి బడ్జెట్&amp;zwnj;&amp;zwnj; రూపకల్పనలో రాష్ట్ర ప్రభుత్వం కొంత అప్రమత్తంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్లో కోత పడటంతో అందుకు తగ్గట్టుగానే నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇటీవల కేంద్ర బడ్జెట్&amp;zwnj;లో రాష్ట్రాలకు ఇచ్చే రెవెన్యూ లోటు నిధులను నిలిపేశారు. దీని వల్ల ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఏడాదికి సుమారు పదివేల కోట్లు తగ్గిపోయినట్టు సమాచారం. అంతేకాకుండా ఇతర గ్రాంట్లను కూడా కేంద్రం నిలిపివేసింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి వాటా పెరుగుతుందని ఆశించినా అది చాలా స్వల్పంగా పెరిగింది. సాధారణంగా ప్రతి ఏటా బడ్జెట్ మొత్తాన్ని పది శాతం పెంచుతూ వస్తుంటారు. కానీ ఈ పరిమితుల వల్ల ఈ సారి కేవలం పదివేల కోట్లు అంటే సుమారు మూడు శాతం మాత్రమే పెంచినట్టు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;బడ్జెట్&amp;zwnj;లో ఎవరికి మేలు?&lt;/h3&gt;
&lt;p&gt;ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల అమలపై వెనకడుగు వేయడం లేదన తెలుస్తోంది. అందుకే ఈ కింది అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;సూపర్ సిక్స్ హామీలు- ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వ ఈ బడ్జెట్&amp;zwnj;లో కేటాయించే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అభివృద్ధి, సంక్షేమం- సంక్షేమ పథకాలతోపాటు రాష్ట్ర అభివృద్ధిని సమతూకం చేసేలా నిధులను కేటాయింపులు ఉండబోతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మహిళలు, రైతుల సంక్షేమం- మహిళా సాధికారతకు, రైతు సంక్షేమానికి బడ్జెట్&amp;zwnj;లో ప్రాధాన్యత ఉంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పారిశ్రామిక రంగం- రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఉపాధి అవకాశాలను పెంచడానికి పారిశ్రామిక రంగానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మౌలిక సదుపాయాలు- కొన్నేళ్లు రాష్ట్రంలో రోడ్లు పరిస్థితిపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని పాత రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం కోసం ఈ బడ్జెట్&amp;zwnj;లో ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/14/0857c790bbb4fa9d617088ea7d76a0591771044336382215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Budget 2026: ఏపీ పద్దు రూ. 3.40 లక్షల కోట్లు - నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల !]]></title><link>https://telugu.abplive.com/business/budget/ap-budget-rs-3-lakh-40-thousand-crore-payyavula-to-be-introduced-in-the-assembly-on-saturday-237992</link><comments>https://telugu.abplive.com/business/budget/ap-budget-rs-3-lakh-40-thousand-crore-payyavula-to-be-introduced-in-the-assembly-on-saturday-237992#respond</comments><pubDate>Fri, 13 Feb 2026 18:18:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Raja Sekhar Allu ]]></dc:creator><category><![CDATA[ బడ్జెట్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/business/budget/ap-budget-rs-3-lakh-40-thousand-crore-payyavula-to-be-introduced-in-the-assembly-on-saturday-237992</guid><description><![CDATA[&lt;p&gt;AP budget Rs 3 lakh 40 thousand crores : &amp;nbsp;2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్&amp;zwnj;ను ప్రవేశపెట్టేందుకు కూటమి ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ &amp;nbsp;బడ్జెట్ ను నేడు(శనివారం) ఉదయం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల ప్రవేశ పెట్టనున్నారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఉదయం &amp;nbsp;10:30 గంటలకు ముఖ్యమంత్రి &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. సుమారు రూ. 3.40 లక్షల కోట్ల భారీ &amp;nbsp;అంచనాలతో రూపొందించిన బడ్జెట్ ముసాయిదాకు మంత్రిమండలి అధికారికంగా ఆమోదం తెలపనుంది. అనంతరం ఉదయం 11:15 గంటలకు ఆర్థిక మంత్రి &amp;nbsp;పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్&amp;zwnj;ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తారు. అదే సమయంలో శాసనమండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ ప్రతిపాదనలను సభ ముందు ఉంచుతారు.&lt;br /&gt;&amp;nbsp;&lt;br /&gt;వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది కూడా ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్&amp;zwnj;ను సిద్ధం చేసింది. మధ్యాహ్నం &amp;nbsp;12:50 గంటలకు &amp;nbsp;వ్యవసాయ శాఖ మంత్రి &amp;nbsp;కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రత్యేక పద్దును ప్రవేశపెడతారు. శాసనమండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్&amp;zwnj;ను సమర్పిస్తారు. సాగు నీటి ప్రాజెక్టులు, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు ఈ బడ్జెట్&amp;zwnj;లో భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది.&lt;br /&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;ఈ సారి బడ్జెట్&amp;zwnj;లో రాజధాని అమరావతి నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన &amp;nbsp;సూపర్ సిక్స్ &amp;nbsp;హామీల అమలు కోసం భారీగా నిధుల కేటాయింపులు జరగనున్నాయి. ముఖ్యంగా తల్లికి వందనం, దీపం-2.0, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు వంటి పథకాలకు బడ్జెట్&amp;zwnj;లో సింహభాగం కేటాయించేలా ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసింది.&lt;br /&gt;&amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఇరుసభలు వాయిదా పడనున్నాయి. ఆదివారం, సోమవారం సభకు సెలవు ప్రకటించారు. తిరిగి మంగళవారం ఉదయం సమావేశాలు ప్రారంభమై, బడ్జెట్&amp;zwnj;పై సాధారణ చర్చ కొనసాగుతుంది. మార్చి 7వ తేదీ వరకు సుమారు 17 పని దినాల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ &amp;nbsp;ఇప్పటికే నిర్ణయించింది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe class=&quot;vidfyVideo&quot; style=&quot;border: 0px;&quot; src=&quot;https://telugu.abplive.com/web-stories/lifestyle/why-is-jewelry-hidden-in-pink-paper-237866&quot; width=&quot;631&quot; height=&quot;381&quot; scrolling=&quot;no&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/02/13/ef5828ec6dbb1697258c223f8cf4bc771770986861727228_original.png" width="220"/></item></channel></rss>