Chinese Cars India: గత కొన్నేళ్లుగా భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లోకి చైనీస్ కార్లు నేరుగా లేదా జాయింట్‌ వెంచర్ల ద్వారా నిశ్శబ్ధంగా ప్రవేశించాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరగబోతోంది. ప్రధానంగా ఎలక్ట్రిక్‌, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ విభాగాల్లో ఈ కంపెనీలు తమ పట్టును బిగించడానికి సిద్ధమవుతున్నాయి. 

Continues below advertisement

లగ్జరీ బడ్జెట్ విభాగాల్లో సరికొత్త వ్యూహంతో వస్ుతన్న JSW MG

మహీంద్రా, టాటా వంటి దేశీయ దిగ్గజాలకు గట్టి పోటీ ఇచ్చేలా ఎంజీ మోటార్ తన లైనప్‌ను భారీగా విస్తరిస్తోంది. ఎంజీ మోటార్ త్వరలో మెజెస్టర్ పేరుతో మొదటి డీ+ సెగ్మెంట్ ఎస్‌యూవీని లాంచ్ చేస్తోంది. ఇది 5,046mm పొడవుతో ప్రస్తుతం మార్కెట్‌ లీడర్‌గా ఉన్న టయోటా పార్చ్యునర్‌ కంటే చాలా పెద్దదిగా ఉంటుంది. ఇందులో 212bhp పవర్ 478 Nm టార్క్‌ను ఉత్పత్‌చేసే 2.0 లీటర్ ట్విన్ టర్బో డీజిల్‌ ఇంజిన్ ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌తో పాటు, ఇందులో సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా ట్రిపుల్ డిఫరెన్షియల్‌ లాక్, M-క్రాల్‌ సిస్టమ్‌ వంటి ఆఫ్ రోడింగ్ ఫీచర్లు ఉండబోతున్నాయి. దీని ధర 40 నుంచి 45 లక్షల వరకు ఉంటుందని అంచనా. 

టాటా టియాగో ఈవీకి పోటీగా ఎంజీ బింగో ఈవీ రానుంది. ఇది కామెట్‌ ఈవీ, విండసర్‌ ఈవీలకు దీటుగా ఉంటుంది. ఇందులో 31.9 kWh 37.9 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉంటాయి. టియాగో ఈవీ 315 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే ఇస్తుండగా, బింగో ఈవీ మెరుగైన రేంజ్‌తోపాటు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. దీని ధర రూ. 11 నుంచి 14 లక్షల మధ్య ఉండొచ్చు. 

Continues below advertisement

మహీంద్రా XUV 7XO, టాటా సఫారీలకు పోటీగా ఎంజీ 520 రాబోతోంది. దీని ప్రధాన ఆకర్షణ 1.5 లీటర్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌ ఇంజిన్. ఇది 197bhp పవర్‌ ఇస్తుంది. ఇది కేవలం ఎలక్ట్రిక్ మోడల్‌లోనే 100 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. మొత్తం రేంజ్‌ 1100 కిలోమీటర్లు దాటుతుంది. దీని ఆల్‌ ఎలక్ట్రిక్ వెర్ష 500 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. 

ప్రీమియం విభాగంలో ఎంజీ IM6 అనే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కూపే ఆగస్టు 2026లో విడుదల కానుంది. 100kWh బ్యాటరీతో వచ్చే ఈ కారు టెస్లా మోడల్‌ వై, హ్యుందాయ్‌ అయోనిక్5తో పోటీ పడుతుంది. దీని AWD వెర్షన్ ఏకంగా 741bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న ZS ఈవీ స్థానంలో ఎంజీ ఎస్‌5 ఈవీ రాబోతోంది. ఇది హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్ ధరలో లభించవచ్చు. 

JSW మోటర్స్‌ నుంచి సరికొత్త మోడల్స్

JSW గ్రూప్ తన సొంత బ్రాండ్‌ JSWమోటార్స్ నుంచి సరికొత్త మోడల్స్ రిలీజ్ చేయనుంది. దీపావళి నాటికి జేటూర్‌ T2 ఎస్‌యూవీ లాంచ్ చేయనుంది. ఇది ల్యాండ్‌ రోవర్‌ డిఫెండర్‌ నుంచి ప్రేరణ పొంది దీన్ని రూపొందించారు. ఇది 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్‌ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 221bhp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 220mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌ , 700mm నీటిలో వెళ్లే సామర్థ్యం దీని ప్రత్యేకతలు 

క్రెటా ఎలక్ట్రిక్ కంటే కొంచెం పెద్దదిగా ఉండే సీ సెగ్మెంట్‌ ఎస్‌యూవీ జేకూ J5. 60.9kWh బ్యాటరీతో 461 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. దీని ఇంటీరియర్‌లో 13.2 అంగుళా వర్టికల్ టచ్‌ స్క్రీన్ ఉంటుంది. ఈ కంపెనీ విడుదల చేయనున్న మరో మోడల్‌ చెరి ఐకార్ వీ 23. ఇది రెట్రో స్టైల్ బాక్సీ డిజైన్‌తో కూడిన ఆఫ్‌ రోడర్, దీని AWD వెర్షన్ 510 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. ఇది 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో రూ. 18-25 లక్షల మధ్య వచ్చే ఛాన్స్ ఉంది. 

లీప్ మోటార్ సంస్థల నుంచి కొత్త మోడల్స్ 

జీప్, సిట్రోయెన్ కంపెనీలను నిర్వహిస్తున్న స్టెలాంటిస్ గ్రూప్, లీప్ మోటార్‌ను భారత్‌లోకి తీసుకొస్తోంది. ఈ జాయింట్ వెంచర్‌ను లీప్ మోటరా బీ10 మోడల్ వస్తోంది. ఇది కంపాక్ట్ ఎలక్ట్రిక్ క్రాస్ ఓవర్, ఇది బైవైడీ ఆట్టో 3తో పోటీ పడుతుంది. ఇది 510కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను ఇచ్చే రెండు బ్యాటరీ ఆప్షన్లతో వస్తుంది. లీప్‌మోటార్ సీ10 కూడా క్రెటా ఎలక్ట్రిక్ కంటే పెద్దగా ఉండే మిడ్ సైజ్ ఎస్‌యూవీ. 15 నుంచి 22 లక్ష ధరలో 424 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది. టియాగో ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు లీప్ మోటార్ T03 హ్యాచ్‌బ్యాక్ తీసుకొస్తున్నారు. దీని ధర 8 నుంచి 12 లక్ష లోపు ఉంటుంది. 395 మైలేజీ ఇస్తుందని భావిస్తున్నారు. 

మార్కెట్‌లో లీడర్‌గా పట్టు నిలుపుకోవడానికి బీవైడీ ఎత్తుగడ 

ప్రస్తుతం భారత్‌ల బలంగా ఉన్న బైవైడీ కూడా తన ప్రోడక్ట్స్‌ను అప్‌డేట్ చేస్తుంది. ఇందులో మొదటిది బైవైడీ డాల్ఫిన్. ఇది ఎంజీ విండసర్‌ ఈవీకి గట్టిపోటీ ఇస్తుంది. 201bhp పవర్‌తో కేవలం 7 సెకన్లలో 0-100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. క్రెటా ఈవీకి, మహీంద్రా BE6లకు నేరుగా పోటీ ఇచ్చే బీవైడీ అట్టో 2ను రిలీజ్ చేయనున్నారు. ఇది 380 కిలోమీటర్ల రేంజ్‌తో ఈ మిడ్ సైజ్ ఎస్‌యూవీ రాబోతోంది. ఇందులో తిరిగే టచ్‌స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బీవైడీ అట్టో 3 ఫేస్‌లిఫ్ట్‌ ఇప్పటకే అమ్ముడువుతోంది. దీన్ని కొత్తగా డిజైన్ చేస్తున్నారు. రేంజ్‌ను కూడా అప్‌డేట్ చేస్తున్నారు. బీవైడీ సిలయ్‌6 1.5 లీటర్ ఇంజిన్, బ్యాటరీ కలయికతో వచ్చే ప్లగ్ ఇన్ హైబ్రిడ్, దీని మొత్తం రేంజ్ 1100 కిలోమీటర్లు.కేవలం ఎలక్ట్రిక్ పవర్‌ోనే 92 కిలోమీటర్ల ట్రావెల్ చేయవచ్చు. చైనీస్ కంపెనీల రాకతో భారతీయ వినియోగదారులకు మునుపెన్నడూ లేని విధంగా అనేక ఆప్షన్లు లభించనున్నాయి.