Mahindra UDO eAuto: భారతదేశంలో ఎలక్ట్రిక్ లాస్ట్ మైల్ మొబిలిటీ రంగం వేగంగా ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మహీంద్రా లాస్ట్ మైల్ మొబిలిటీ లిమిటెడ్ (MLMML), తన సరికొత్త ఎలక్ట్రిక్ త్రీ వీలర్ మహీంద్రా UDOను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధరగా రూ.3,58,999 (ఎక్స్-షోరూమ్) ఇప్పుడు అమ్ముతున్నారు, కొంత కాలం తరువాత ఈ రేటు రూ.3,84,299గా మారిపోతుంది.

Continues below advertisement

విమాన డిజైన్ ప్రేరణ

“UDO” అనే పేరు హిందీలో ‘ఎగరడం’ అనే అర్థాన్ని ఇస్తుంది. విమానాల డిజైన్ నుంచి స్ఫూర్తి పొందిన ఈ ఈ-ఆటోను మహీంద్రా ఇండియా డిజైన్ స్టూడియో అధిపతి ప్రతాప్ బోస్ బృందం రూపొందించింది. కంపెనీ దీన్ని “ఆటోప్లేన్”గా అభివర్ణిస్తోంది. పెద్ద హెడ్‌ల్యాంప్స్, పెద్ద పానోరమిక్ విండ్‌షీల్డ్, స్టైలిష్ మిర్రర్లు దీని ప్రత్యేకతలు.

Continues below advertisement

సెగ్మెంట్ ఫస్ట్ మోనోకోక్ నిర్మాణం

సాంప్రదాయ ఆటోలతో పోలిస్తే UDOలో సెగ్మెంట్ ఫస్ట్ ఫుల్ మోనోకోక్ కన్‌స్ట్రక్షన్ ఉంది. ఇది బలమైన నిర్మాణంతో పాటు మెరుగైన రైడ్ క్వాలిటీని అందిస్తుంది. రఫ్ రోడ్లపై కూడా స్థిరంగా నడిచేలా ఉండేలా రూపొందించారు.

డ్రైవర్ & ప్యాసింజర్ కంఫర్ట్

డ్రైవర్ కోసం ప్రత్యేకంగా “పైలట్ సీట్” అందించారు. ఇది సాధారణ సీట్లతో పోలిస్తే దాదాపు 20% మందంగా ఉంటుంది. ప్రయాణికులకు ఎక్కువ హెడ్‌రూమ్, లెగ్‌రూమ్ ఇచ్చారు. ఇంటీరియర్ లేఅవుట్ లౌంజ్ ఫీలింగ్ ఇస్తుంది. ఇండిపెండెంట్ రియర్ సస్పెన్షన్, డ్యూయల్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ రైడ్ కంఫర్ట్‌ను పెంచుతాయి.

బ్యాటరీ & పనితీరు

11.7 kWh IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఇందులో అందించారు. PMS మోటార్ 13.6 bhp (10kW) పవర్, 52 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రియల్ వరల్డ్ రేంజ్ 200 km అని కంపెనీ పేర్కొంటోంది. ARAI సర్టిఫైడ్ రేంజ్ 265 km.

డ్రైవింగ్ మోడ్‌లు

Range, Ride, Race అనే మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి. Race మోడ్‌లో గరిష్ట వేగం 55 గంటకు km. రీజెనరేటివ్ బ్రేకింగ్, రివర్స్ థ్రోటిల్ ఫంక్షన్, హిల్ హోల్డ్ అసిస్ట్, క్రీప్ ఫంక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సేఫ్టీ & వారంటీ

12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, డ్రమ్ బ్రేకులు ఇచ్చారు. బ్యాటరీ, డ్రైవ్‌ట్రైన్, ఛార్జర్ IP67 రేటింగ్‌తో వచ్చాయి. 6 సంవత్సరాలు లేదా 1.5 లక్షల km వారంటీ అందిస్తున్నారు. 1 లక్ష km వరకు ఉచిత సర్వీసింగ్. అదనంగా రూ.20 లక్షల ప్రమాద బీమా కవరేజీతో Uday Nxt పథకం కూడా ఉంది.

తయారీ కేంద్రం

ఈ మోడల్ మహీంద్రా జహీరాబాద్ ప్లాంట్‌లో తయారు అవుతోంది. అక్కడ ఆధునిక ఆటోమేటెడ్ బ్యాటరీ అసెంబ్లీ, రోబోటిక్ ప్రొడక్షన్ లైన్లు ఏర్పాటు చేశారు.

సాంప్రదాయ ఆటోల రూపాన్ని మార్చే ప్రయత్నంగా మహీంద్రా UDO నిలుస్తోంది. మెరుగైన డిజైన్, 200 km రేంజ్‌తో అదనంగా డబ్బు సంపాదించుకునే అవకాశం, అధునాతన ఫీచర్లతో లాస్ట్ మైల్ మొబిలిటీకి కొత్త ప్రమాణాలు సెట్ చేయనుంది. తక్కువ ధరలో ప్రీమియం అనుభవం కోరుకునే ఆటో డ్రైవర్లకు ఇది మంచి ఎంపికగా మారే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.