పెరుగుతున్న కాలుష్య నియమాలు మరియు మెరుగైన మైలేజీని కోరుకుంటున్న కస్టమర్ల కారణంగా మహీంద్రా హైబ్రిడ్ టెక్నాలజీ వైపు మళ్లుతోంది.
Mahindra Hybrid SUVs: హైబ్రిడ్ టెక్నాలజీకి షిఫ్ట్ అవుతున్న మహీంద్రా.. మైలేజీ కోసం Mahindra XUV 7XOతో ప్రయోగం
మహీంద్రా కంపెనీ తన SUVలలో హైబ్రిడ్ టెక్నాలజీని ప్రవేశపెట్టే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. తక్కువ కాలుష్యంతో పాటు బెస్ట్ మైలేజీని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

- మహీంద్రా SUVలు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాయి.
- కఠినమైన కాలుష్య నియమాల నేపథ్యంలో హైబ్రిడ్ అవసరం పెరుగుతోంది.
- మెరుగైన మైలేజ్, తక్కువ కాలుష్యం కోసం హైబ్రిడ్ వాహనాలు ప్రయోజనకరం.
- XUV 7XO హైబ్రిడ్ వెర్షన్ భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.
Mahindra Hybrid SUVs | భారత ఆటో మార్కెట్లో SUV సెగ్మెంట్ వేగంగా మారుతోంది. ప్రస్తుతం కార్ల కంపెనీలు కేవలం శక్తివంతమైన ఇంజిన్ల పైనే కాకుండా, మెరుగైన మైలేజీ, తక్కువ కాలుష్యాన్ని విడుదల చేసేలా కార్ల తయారీపై ఫోకస్ చేస్తున్నాయి. ఇందువల్లే హైబ్రిడ్ టెక్నాలజీకి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోంది. దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా సైతం ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం మహీంద్రా కంపెనీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లు విక్రయిస్తోంది. అయితే కంపెనీకి అత్యధిక విక్రయాలు డీజిల్ SUVల నుండే జరుగుతున్నాయి. రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం కఠినమైన కాలుష్య నియమాలను అమలు చేయనున్న క్రమంలో మహీంద్రా హైబ్రిడ్ టెక్నాలజీని అవలంబించడం చాలా అవసరమని భావిస్తున్నారు.
మహీంద్రా దృష్టి ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీ వైపు
మహీంద్రా SUVలు ఎక్కువగా వాటి పవర్ఫుల్ పనితీరు, స్ట్రాంగ్ ఇంజిన్లకు ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా మహీంద్రా కంపెనీ డీజిల్ వాహనాలను కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఇప్పుడు మార్కెట్ వేగంగా మారుతోంది మరియు కస్టమర్లు శక్తివంతంగా ఉండటంతో పాటు ఎక్కువ మైలేజీని ఇచ్చే వెహికల్స్ను కోరుకుంటున్నారు. అందుకే కంపెనీ ప్రస్తుతం హైబ్రిడ్ టెక్నాలజీపై ఫోకస్ చేసింది. హైబ్రిడ్ వాహనాల్లో అయితే పెట్రోల్ ఇంజిన్తో పాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ, మోటార్ కూడా ఉంటుంది. ఈ రెండింటి వల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా కార్ మరింత స్మూత్గా నడుస్తుంది.
నివేదికల ప్రకారం, మహీంద్రా కొత్త ప్లాట్ఫారమ్ ఇప్పటికే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ రెండు సాంకేతికతలకు అనుగుణంగా సిద్ధంగా ఉంది. అంటే కంపెనీ భవిష్యత్తు మార్కెట్ దృష్టిలో ఉంచుకుని తన కొత్త వాహనాలను సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం Mahindra XUV 7XOలో టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు ఉండగా, Mahindra XEV 9e పూర్తిగా ఎలక్ట్రిక్ SUVగా ఉంది. అయితే రాబోయే కాలంలో XUV 7XO హైబ్రిడ్ వెర్షన్ను లాంచ్ చేసే అవకాశం ఉంది.
మెరుగైన మైలేజీ కోసం ప్రయత్నాలు..
ఈ హైబ్రిడ్ SUVలో పెట్రోల్ ఇంజిన్తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటారు అమరుస్తారు. దీనివల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే, సిటీ ట్రాఫిక్లో, రద్దీ రోడ్లపై లేదా తక్కువ వేగంతో ఉన్నప్పుడు వాహనం పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్లో నడుస్తుంది. అంటే తక్కువ దూరం, తక్కువ వేగంతో ఉన్నప్పుడు ఇంజిన్ సౌండ్ మీకు దాదాపు వినిపించదు. వాహనం చాలా నిశ్శబ్దంగా వెళ్తుంది. ఇదే ఏదైనా హైబ్రిడ్ కారు ప్రత్యేకతగా పేర్కొంటారు.
కాగా, XUV 7XO హైబ్రిడ్ వాహనంలో ప్రస్తుతం ఉన్న మహీంద్రా పెట్రోల్ వాహనాల కంటే మెరుగైన మైలేజీ వస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మహీంద్రా పెట్రోల్ ఇంజిన్లు మంచి పనితీరును కనబరిచినప్పటికీ, మైలేజీ విషయంలో వెనుకబడి ఉన్నాయని వినిపిస్తోంది. కనుక హైబ్రిడ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత మహీంద్రా వాహనాల్లో ఈ పరిస్థితి మారవచ్చు. ఎలక్ట్రిక్ మోటారు ఇంజిన్పై ఒత్తిడిని తగ్గిస్తుంది. తద్వారా కారు ఫ్యూయల్ ఆదా అవుతుంది. వాహనం మెయింటైన్ చేయడానికి మీ ఖర్చులు కొంతమేర తగ్గుతాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
మరిన్ని ఆసక్తికర ఆటో న్యూస్ కోసం క్లిక్ చేయండి
Before You Go
Auto Expo 2023 Day 1 Highlights: ఎంతో హైప్ తో మొదలైన ఆటో ఎక్స్ పో మొదటి రోజు హైలైట్స్
Frequently Asked Questions
మహీంద్రా హైబ్రిడ్ టెక్నాలజీపై ఎందుకు దృష్టి పెడుతోంది?
హైబ్రిడ్ వాహనంలో ఏముంటాయి?
హైబ్రిడ్ వాహనాల్లో పెట్రోల్ ఇంజిన్తో పాటు ఎలక్ట్రిక్ బ్యాటరీ మరియు మోటార్ కూడా ఉంటాయి. ఇవి ఇంధన వినియోగాన్ని తగ్గిస్తాయి.
XUV 7XO లో ఏయే ఇంజిన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి?
ప్రస్తుతం Mahindra XUV 7XO లో టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
సిటీ ట్రాఫిక్లో హైబ్రిడ్ SUVలు ఎలా పనిచేస్తాయి?
సిటీ ట్రాఫిక్లో లేదా తక్కువ వేగంతో ఉన్నప్పుడు, హైబ్రిడ్ SUVలు పూర్తిగా ఎలక్ట్రిక్ మోడ్లో నిశ్శబ్దంగా నడుస్తాయి.
ట్రెండింగ్ వార్తలు






















