ఆడి ఇండియా బాటలోనే ఇప్పుడు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ 'బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా' కూడా పయనిస్తోంది. వచ్చే నెల అంటే ఏప్రిల్ 2026 నుండి తన మొత్తం వాహన శ్రేణిపై రెండు శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ ధరల పెంపు బీఎమ్‌డబ్ల్యూతో పాటు మినీ (MINI) బ్రాండ్ కార్లకు కూడా వర్తిస్తుంది. దేశీయంగా తయారయ్యే (Locally Manufactured) మోడళ్లు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే (CBU) ప్రీమియం కార్లు రెండింటిపై ఈ భారం పడనుంది.

Continues below advertisement

ధరల పెంపు వర్తించే మోడళ్లుభారత్‌లో తయారయ్యే 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ, 5 సిరీస్ ఎల్‌డబ్ల్యూబీ, 7 సిరీస్ వంటి సెడాన్లతో పాటు ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7 వంటి పాపులర్ ఎస్‌యూవీల ధరలు పెరగనున్నాయి. అలాగే పవర్‌ఫుల్ ఎమ్340ఐ (M340i), ఎలక్ట్రిక్ ఐఎక్స్1 (iX1) మోడళ్ల రేట్లు కూడా మారుతాయి. విదేశాల నుండి నేరుగా వచ్చే ఐ5, ఐ7, ఐఎక్స్, జెడ్4, ఎమ్2, ఎమ్5, ఎమ్8 కాంపిటీషన్ వంటి హై-ఎండ్ కార్ల ధరలు కూడా ఏప్రిల్ 1 నుండి భారంగా మారనున్నాయి. మినీ కూపర్ ఎస్, కంట్రీమ్యాన్ ఇ, జెసీడబ్ల్యూ కంట్రీమ్యాన్ వంటి మోడళ్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

పెరుగుదలకు కారణాలు ఏంటి?బీఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ హర్దీప్ సింగ్ బ్రార్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో లగ్జరీ కార్లకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, పెరిగిన లాజిస్టిక్స్ ఖర్చులు, ముడి సరుకుల ధరలు కంపెనీపై భారాన్ని పెంచాయని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ తగ్గడం కూడా ధరల సర్దుబాటుకు ప్రధాన కారణమని వివరించారు. కస్టమర్లకు వరల్డ్ క్లాస్ సర్వీస్, లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లు అందించడంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే ఈ స్వల్ప పెంపు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

Continues below advertisement

వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. లగ్జరీ కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు ఈ నెలలోనే తమ బుకింగ్స్ పూర్తి చేసుకోవడం ఉత్తమమ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఏప్రిల్ నుండి పెరిగే ఈ రెండు శాతం ధరల వల్ల కొన్ని హై-ఎండ్ మోడళ్లపై లక్షల రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉంది.