అన్వేషించండి

Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం

వైాజాగ్ స్టీల్ ప్లాంటులో జరిగింది ఒక్క ప్రమాదం కాదని, అరగంట వ్యవధిలో రెండు ప్రమాదాలు జరిగాయి. మృత్యుంజయులం అని పోస్ట్ పెట్టిన కాసేపటికే తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో సోమవారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదానికి సంబంధించి దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడ జరిగింది ఒక ప్రమాదం కాదు.. అరగంట వ్యవధిలో ఒకే రకమైన రెండు ప్రమాదాలు జరిగాయి. స్టీల్ మెల్ట్ షాప్ (SMS-1) లో భారీ పేలుడు జరిగి 8 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. అంతకు ముందే ఎస్‌ఎంఎస్‌-2 లోనూ సరిగ్గా అలాంటి పేలుడు ఘటన సంభవించింది. అదృష్టవశాత్తూ ఎవరికి ఏం కాలేదు. కానీ అంతలోనే ఎస్ఎంఎస్1లో పేలుడుతో విస్ఫోటనం జరిగి ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎస్‌ఎంఎస్‌-1, ఎస్‌ఎంఎస్‌-2లలో ఒకేసారి ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అని కార్మికులు, సిబ్బంది తెలిపారు.


Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం

సోమవారం సాయంత్రం దాదాపు 3:57 గంటల సమయంలో ఎస్‌ఎంఎస్‌-2 విభాగంలో కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి లాడిల్ (ఉక్కు ద్రవపు పాత్ర) వచ్చే క్రమంలో క్రేన్‌తో పైకి ఎత్తుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 60 టన్నుల మరుగుతున్న ఉక్కు ద్రవం కింద పోయింది. అక్కడ పనిచేస్తున్న నలుగురు పర్మినెంట్ ఉద్యోగులు, ఇద్దరు ఇన్‌ఛార్జ్‌లు, దాదాపు 10 మంది కలాసీలు కలిపి మొత్తం 16 మంది కార్మికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఏం జరిగిందా అని తోటి ఉద్యోగులు టెన్షన్ పడుతున్న సమయంలో తాము మృత్యుంజయులం అంటూ వారు సహోద్యోగుల వాట్సాప్ గ్రూపుల్లో పెట్టిన మెసేజ్‌లు చూసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తప్పిపోయిందని సంతోషించారు. కానీ, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.

అరగంటలోనే మరో విభాగంలో పేలుడు.. 8 మంది దుర్మరణం
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఎస్‌ఎంఎస్‌-2 ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అంటే సాయంత్రం దాదాపు 4:25 గంటల ప్రాంతంలో ఎస్‌ఎంఎస్‌-1 విభాగంలో కంటిన్యూ క్యాస్టింగ్ డిపార్ట్‌మెంట్ నుండి మిషన్-2కు ఉక్కు ద్రవాన్ని పంపుతుండగా మరో భారీ పేలుడు సంభవించింది. దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ఉక్కు ద్రవం మీద పడటం, వేడి ఎక్కవగా ఉండటంతో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. ద్రవపు ఉక్కు నుంచి గ్యాస్‌ను పూర్తిగా తొలగించకుండా పంపడం వల్లే లాడిల్‌లో ప్రెజర్ పెరిగి పేలిపోయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.  


Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం

భద్రతా నిబంధనలపై 6 నెలల ముందే ఫిర్యాదులు
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని, అందువల్లే ఈ తరహా ప్రమాదాలు పునరావృతమవుతున్నాయని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతేడాది డిసెంబరు 9న ఏఐటీయూసీ (AITUC) యూనియన్ కేంద్ర రీజియన్ ప్రతినిధులు లేబర్ కమిషనర్‌కు లేఖ రాశారు. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు స్టీల్ ప్లాంట్‌లో జరిగిన పలు ప్రమాదాల వల్ల 20 మందికి పైగా చనిపోగా, వందల మంది గాయపడ్డారని ఆ లేఖలో పేర్కొన్నారు. గత మార్చిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు కూడా ఫిర్యాదు చేసినా కార్మికులు సురక్షితంగా ఉండేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం

యాజమాన్యం ఒత్తిడి, నాసిరకం మెటీరియలే కారణమా?
ఈ ప్రమాదాల వెనుక యాజమాన్యం నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాల ఒత్తిడి ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్మికులకు తగిన సమయం ఇవ్వకుండా ఒత్తిడి పెంచడం, భద్రతా ప్రొటోకాల్స్ సరిగ్గా అమలు చేయకపోవడం ప్రమాదాలకు దారితీస్తున్నాయని తెలుస్తోంది. ఉక్కు తయారీలో వాడే ఫెర్రో మిశ్రమాల నాణ్యత కూడా చాలా నాసిరకంగా ఉంటుందని కార్మికులు ఆరోపిస్తున్నారు. మెటీరియల్ లోపాలపై కూడా ఫోకస్ చేయాలని, కార్మికుల భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి నారా లోకేష్, ఎంపీ భరత్ సహా పలువురు నేతలు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మంగళవారం నాడు మృతుల కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆసుపత్రులకు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Breaking News: 2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
2029 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లతో తెలంగాణలో అధికారలోకి వస్తుంది: రేవంత్ రెడ్డి
Youtuber Ravan: యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
యూట్యూబర్ రావణ్‌ తరఫున వాదిస్తున్న పొన్నవోలు సుధాకర్! వైసీపీతో సంబంధం లేదని వివరణ!
RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Jofra Archer Vs Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ బలహీనతను పట్టేసిన జోఫ్రా ఆర్చర్.. ఐపీఎల్ నెట్స్ లో దొరికిపోయిన బీహార్ బ్యాటర్!
Embed widget