అన్వేషించండి

Ganta Srinivasa Rao: ఏపీ అరాచకంలో అఫ్గాన్, అప్పుల్లో శ్రీలంకను దాటేసింది! అసలు సినిమా ముందుంది - గంటా

విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం (మే 30) చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.

రాజమండ్రిలో మహానాడు విజయవంతమైందని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ మేనిఫెస్టోతో వైఎస్ఆర్ సీపీ నేతలకు భయం మొదలైందని అన్నారు. తెలుగు దేశం పార్టీ తన మేనిఫెస్టోను ఎంతో పవిత్రంగా చూస్తుందని, టీడీపీ మేనిఫెస్టో ప్రజల గుండెచప్పుడని అన్నారు. మహానాడులో విడుదల చేసిన మేనిఫెస్టో ట్రైలర్ మాత్రమే అని అన్నారు. అసలు సినిమా ముందుముందుందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం (మే 30) చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.

ఏపీలో విధ్వంస, ఆరాచక పాలనలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని, ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి జగన్ మోహన్ రెడ్డి మెడలు వంచుతున్నాడని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేదం అని ప్రజలను మోసం చేశారని అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెడుతున్నారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ విజయానికి కృషి చేసిన విజయమ్మ, షర్మిల ఈ రోజు ఎక్కడ ఉన్నారో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు. జగన్ నుంచి ఆయన కుటుంబ సభ్యులు దూరం అయ్యారని అన్నారు.

యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుతోందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు నిరుద్యోగులకు వరమని అన్నారు. బీసీలకు ఒక రక్షణ చట్టం, ఇంటింటింటికి మంచి నీరు చాలా మంచి పథకాలు అని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో మేధోమథనం చేసిన తర్వాతే మేనిఫెస్టోను విడుదల చేశారని తెలిపారు. గతంలో దీపం పథకం తెచ్చిన ఘనత చంద్రబాబుదే అని, ఇప్పుడు మూడు గ్యాస్ సిలిండర్‌లు ఉచితంగా ఇస్తామని అన్నారని చెప్పారు. 

అరాచకంలో అఫ్గానిస్థాన్

టీడీపీ మేనిఫెస్టోతో వైఎస్ఆర్ సీపీ నేతల్లో గుబులు రేగుతోందని అన్నారు. కొంత మంది ఉక్రోషం తట్టుకోలేక మేనిఫెస్టోను వైఎస్ఆర్ సీపీ నేతలు చించివేశారని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంస పాలన జరుగుతోందని అన్నారు. సీఎం జగన్ అప్పట్లో అమ్మ ఒడి అందరికీ ఇస్తామని నమ్మించి, ఇప్పుడు ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం అరాచకంలో అఫ్గానిస్థాన్, అప్పుల్లో శ్రీలంకను మించిపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు సీపీఎస్‌ను రద్దు చేస్తామని మాట తప్పారని అన్నారు. ఎక్కువ మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదాను మెడలు వంచి తెస్తామన్నారని, ఇప్పుడు ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి ఈయనే మెడలు వంచుతున్నారని ఎగతాళి చేశారు.

గాలికి 3 వేల పెన్షన్ హామీ

సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి జగన్ మాట తప్పారని అన్నారు. 30 లక్షల ఇళ్ల నిర్మాణం అని, 3 వేల ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. మెగా డీఎస్సీ కూడా అంతే గాలికి వదిలేశారని అన్నారు. 3 వేల పెన్షన్ అనే హామీ కూడా గుర్తుపెట్టుకోలేదని అన్నారు. ఇప్పుడు ఎంత పెన్షన్ ఇస్తున్నారని ప్రశ్నించారు. రైల్వే జోన్, పోలవరంలోనూ మాట తప్పి మడమ తిప్పారని అన్నారు. కరెంట్ ఛార్జీలు ఏడు సార్లు పెంచారని, పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు వైఎస్ జగన్ తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం చంద్రబాబుదని అన్నారు. నరకాసుర పాలనకు చమరగీతం పాడాలని తెలిపారు.  ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా.. టీడీపీ అధికారంలోకి వస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని గంటా శ్రీనివాసరావు మాట్లాడారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget