Srikakulam: చెల్లెలి కోసం చెరువులో దూకేసిన అక్క, తర్వాత తల్లి కూడా - చివరికి ఘోర విషాదం!
తల్లి తులసమ్మ బట్టలు ఉతుకుతుండగా చిన్న కుమార్తె జాహ్నవి చెరువులో దిగింది. ఈ విషయాన్ని గమనించిన పెద్ద కుమార్తె హారిక తల్లికి చెప్పకుండా, చెల్లెల్ని కాపాడాలనే ఆత్రుతతో నీటిలో దూకేసింది.
Srikakulam News: శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన విషాదం చోటు చేసుకుంది. ఓ చెల్లెలు ఆపదలో ఉండగా, ఆమెను రక్షించి అక్క మృత్యువాత పడింది. నందిగాం మండలం కాశీరాజు కాశీపురం గ్రామంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. కాశీరాజు కాశీపురం గ్రామం సమీపంలో ఉన్న చెరువులో సవర తులసమ్మ తన ఇద్దరి కుమార్తెలు జాహ్నవి, హారికలతో కొన్నాళ్లుగా బట్టలు ఉతికేందుకు వెళ్తూ ఉంది. అదే క్రమంలో నిన్న కూడా బట్టలు ఉతికేందుకు తన కుమార్తెలను వెంట బెట్టుకొని వెళ్లింది.
తులసమ్మ బట్టలు ఉతుకుతుండగా చిన్న కుమార్తె జాహ్నవి చెరువులో దిగింది. ఈ విషయాన్ని గమనించిన పెద్ద కుమార్తె హారిక తల్లికి చెప్పకుండా, చెల్లెల్ని కాపాడాలనే ఆత్రుతతో నీటిలో దూకేసింది. చెల్లిని కాపాడి జాహ్నవి నీటిలో మునిగిపోతుండగా గమనించిన తల్లి హారికను కాపాడేందుకు నీటిలో దూకింది. తల్లి కూతుర్లు నీటిలో మునిగిపోతుండగా గమనించిన తులసమ్మ భర్త, ప్రాణాలకు తెగించి నీటిలో దూకి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, ఆ ప్రయత్నంలో భాగంగా చివరికి తులసమ్మ మాత్రమే ప్రాణాలతో మిగిలింది.
అప్పటికే నీట మునిగి ఊపిరాడక హారిక అనే 13 ఏళ్ల బాలిక మృత్యువాత పడింది. హారిక బందపల్లి ఆశ్రమ పాఠశాలలో చదువుతుంది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడం కోసం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మెళియాపుట్టి మండలం బందపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో హారిక 7వ తరగతి చదువుతుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో తన తల్లి తులసమ్మ, చెల్లి జాహ్నవితో కలిసి బట్టలు ఉతికేందుకు రాళ్లబంద చెరువుకు వెళ్లింది. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగింది. ఇద్దరు కుమార్తెలు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన తల్లి తులసమ్మ పెద్ద కేకలు వేస్తూ వారిని కాపాడేందుకు చెరువులోకి దిగింది. చిన్న కుమార్తె జాహ్నవిని కాపాడి ఆమె కూడా నీటిలో చిక్కుకుంది.
నీరు తాగేయడంతోనే మరణం
ఈలోగా ఘటనా స్థలానికి చేరుకున్న భర్త బ్రహ్మయ్య.. భార్య తులసమ్మను, పెద్ద కూతురు హారికను బయటకు తీశాడు. హారిక నీరు తాగేయడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. ఈమెతో పాటు జాహ్నవి, తులసమ్మను కూడా 108 వాహనంలో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే హారిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హారిక మృతితో కాశీరాజుకాశీపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రెండు రోజుల క్రితమే వరదలో ఇద్దరు
శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో విషాదం నెలకొంది.కేదారిపురం గ్రామ సమీపంలోని వరహాలగెడ్డ వద్ద వరద నీటిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తులు పాడి శంకర్, కూర్మారావులుగా గుర్తించారు. ఈ క్రమంలో బ్రిడ్జికి సమీపంలో శంకర్ మృతదేహాం లభ్యమైంది. మరొకరి మృతదేహం కోసం గాలించిన అనంతరం లభ్యంతమైంది. దీంతో గ్రామంలో విషాదఛాయాలు అలుముకున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets