Hyderabad To Visakha Trains: నేడు హైదరాబాద్ నుంచి విశాఖకు స్పెషల్ ట్రైన్.. రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాటు
Kacheguda To Vizag Trains | హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ నుంచి విశాఖపట్నం వరకు మే 15న ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు.

Kacheguda to Visakhapatnam Special Train | హైదరాబాద్: శుక్రవారం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులు చాలానే ఉంటారు. అయితే వారు రైలులో టికెట్ బుకింగ్ కోసం చూస్తుంటారు. కానీ కొన్ని రోజులకు ముందే టికెట్లు బుకింగ్ పూర్తవుతుంది. దాంతో అటు బస్సు ఛార్జీలతో ఇబ్బంది పడుతూ కొందరు జర్నీ చేస్తుంటారు. మరికొందరు ఎంత ఇబ్బంది అయినా రైళ్లలోనే ఎలాగోలా వెళ్లిపోతారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాచిగూడ నుంచి విశాఖపట్నం వరకు మే 15, శుక్రవారం రోజున ఒక ప్రత్యేక రైలును (రైలు నంబర్: 07810) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యేక రైలులో కేవలం స్లీపర్, జనరల్ బోగీలు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది. షెడ్యూల్ ప్రకారం, ఈ రైలు మే 15 శుక్రవారం రాత్రి 8.45 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయల్దేరి, మరుసటి రోజు (మే 16న) ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ప్రయాణ మార్గంలో ఈ రైలు మల్కాజిగిరి, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతుంది. అయితే, సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ ప్రత్యేక రైలులో టికెట్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. రెగ్యులర్ రైళ్లలో స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.435 ఉండగా, ఈ స్పెషల్ రైలులో రూ.525 గా అధికారులు నిర్ణయించారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























