Sagar Kavach: ఏపీ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలోని సమగ్ర తీర భద్రతపై రెండ్రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ కవాతు బుధవారం రోజు ప్రారంభం అయింది. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG), ఇండియన్ నేవీ, ఆంధ్ర ప్రదేశ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ ఇతర భద్రతా సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో భద్రతా చర్యలను పెంచే లక్ష్యంతో కసరత్తును ప్రారంభించాయి. 2008 నవంబర్ 26న ముంబయిలో జరిగిన ఉగ్రదాడి తర్వాత తీరప్రాంత భద్రత తెరపైకి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ఒక సముద్ర రాష్ట్రం కావడం వల్ల సముద్ర భద్రతకు అపారమైన ప్రాముఖ్యతను ఇస్తోంది.


ఈ కసరత్తును రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. కమాండర్, కోస్ట్ గార్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయం (తూర్పు), చెన్నై ద్వారా సమన్వయం చేస్తారు. రాష్ట్ర తీర ప్రాంత భద్రత విషయంలో పౌరులు కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఈ కవాతును రెడ్ ఫోర్స్, అటాకర్స్, బ్లూ ఫోర్స్, డిఫెండర్స్ అనే బృందాలు నిర్వహిస్తాయి. కోస్తా జిల్లాల్లోని వ్యూహాత్మక ఆస్తులు, జనావాస ప్రాంతాలను లక్ష్యాల్లో చేర్చనున్నారు. దాడి చేసేవారిని గుర్తించడం కోసం బ్లూ ఫోర్స్‌లో భాగంగా సాధారణ ప్రజలను ప్రోత్సహించాలి. అదే విషయాన్ని భద్రతా ఏజెన్సీలకు తెలియజేయాలి. ఇది తీర ప్రాంత భద్రతా యంత్రాంగాన్ని బలోపేతం చేస్తుంది. ఈ వ్యాయామం తీరప్రాంత భద్రతను నిర్ధారించడంలో పాల్గొన్న అన్ని ఏజెన్సీల సామర్థ్యాన్ని వాటి మధ్య సమన్వయ స్థాయిని కూడా పరీక్షిస్తుంది. ఈ కవాతు సమయంలో, సముద్ర దళ సిబ్బంది ఫిషింగ్ ఓడలను తనిఖీ చేశారు. అలాగే ట్రాలర్లు, ఫిషింగ్ ఓడలు సూచించిన రంగులు లేకుండా సముద్రంలోకి వెళ్లడానికి అనుమతించరు.