అన్వేషించండి

Visakhapatnam News: విశాఖలో రహేజా పెట్టుబడులు, ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న నిర్మాణ సంస్థ

Raheja Group investments | విశాఖపట్నంలో భారీ నిర్మాణ ప్రాజెక్టు ప్రారంభానికి కె.రహేజా కార్పొరేషన్‌ సిద్ధంగా ఉంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి రహేజా సంస్థ పెట్టుబుడలపై ప్రతిపాదన చేసింది.

Raheja investments in Visakhapatnam | విశాఖపట్నం: విశాఖలో ఇదివరకే గూగుల్, టీసీఎస్ డేటా సెంటర్లు ఏర్పాటుకు చర్యలు చేపట్టాయి. పలు కొత్త సంస్థలు, ఐటీ కంపెనీలు నగరానికి వస్తే త్వరలోనే విశాఖ రూపురేఖలో మారనున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ కె.రహేజా కార్పొరేషన్‌ విశాఖలో ఇన్వెస్ట్ చేయడానికి నిర్ణయం తీసుకుంది. విశాఖలో త్వరలో ఏర్పాటు కానున్న డేటా సెంటర్లు, ఐటీ సంస్థలకు అవసరమైన వాణిజ్య, నివాస భవనాల సముదాయాలు నిర్మించేందుకు రహేజా సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా దాదాపు 28.65 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.

ఈ ప్రాజెక్టు విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి, ఉత్పాదకత పెరుగుదలకు, అలాగే ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి వీలుంటుంది. ఈ ప్రాజెక్టు కోసం సంస్థ రూ.2,172.26 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. మధురవాడ ఐటీ హిల్‌ నంబరు-3లో 27.10 ఎకరాలు భూమిని ప్రాజెక్టు కోసం కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 9,681 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని రహేజా సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనలో పేర్కొంది.

ఐటీ కంపెనీలకు ఆఫీసులు సిద్ధం చేయనున్న రహేజా గ్రూప్

విశాఖలో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్ ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ఇటీవల ఢిల్లీలో సంస్థ ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. గూగుల్ సంస్థ ఏపీలో ఏకంగా 1.33 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభంతో పలు ఐటీ, దాని అనుబంధ సంస్థలు నగరానికి రాబోతున్నాయి. ఈ సంస్థల ఏర్పాటుకు ఆఫీసు స్థలాలు కావాలి. ప్రస్తుతం మిలీనియం టవర్‌ 1, 2లో సుమారు 6 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్‌ వంటి సంస్థలకు కేటాయించారు. విశాఖకు కొత్తగా రాబోతున్న కంపెనీలకు కార్యాలయ స్థలాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. రహేజా సంస్థ చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 28.65 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఆఫీసు కార్యాలయాల కోసం అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి, ఉత్పాదకత పెరుగుదలకు, అలాగే భారీ ఉద్యోగ అవకాశాలు సృష్టించడానికి దోహదపడనుంది.

రహేజా ప్రాజెక్టు పనుల వివరాలు
మొదటి దశలో 2028 నాటికి వాణిజ్య భవనాలను, నివాస సముదాయాలను 2030 నాటికి పూర్తి చేయాలని రహేజా సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు పనుల కోసం రూ.663.42 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు పనులతో 9.59 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది.

రెండో దశలో 2031 నాటికి వాణిజ్య భవనాలను, 2035 నాటికి నివాస సముదాయాలను  పూర్తిచేసేందుకు రహేజా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. రెండో దశలో రూ.1,418.84 కోట్లు వెచ్చించనుంది. తద్వారా 19.06 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి తెస్తామని సంస్థ ఏపీ ప్రభుత్వానికి చేసిన ప్రతిపాదనల్లో పేర్కొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Madanapalle kidney Scam: పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
Advertisement

వీడియోలు

SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Chinnaswamy Stadium RCB | 2026లో  చిన్నస్వామి స్టేడియంపై బ్యాన్‌లో నో ఐపీఎల్ | ABP Desam
Ind vs SA | టాస్ కాయిన్ మార్చాలని డిసైడ్ అయిన బెంగాల్ క్రికెట్ అససియేషన్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Blast: ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
ఢిల్లీ పేలుడు కేసులో ఎరుపు కారు వెతుకులాటలో ట్విస్ట్- కీలక ప్రకటన చేసిన డీలర్‌
Pawan Kalyan: వెబ్‌సైట్‌లో  అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
వెబ్‌సైట్‌లో అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు - పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
Adilabad Tiger Fear: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు -  ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు - ప్రత్యేక జాగ్రత్తలు చెబుతున్న అధికారులు
Madanapalle kidney Scam: పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
పేదల అవయవాలే వారి వ్యాపార పెట్టుబడి - మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక భయంగొలిపే వాస్తవాలు
Priyanka Chopra - Globetrotter First Look: మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
మందాకినీగా ప్రియాంక చోప్రా... మహేష్ - రాజమౌళి సినిమాలో ఫస్ట్ లుక్ రిలీజ్!
Patanjali Gurukulam: తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
తొలి జాతీయ క్రీడా పోటీలో డబుల్ స్వర్ణం - పతంజలి గురుకులం హరిద్వార్ విద్యార్థుల ఘనత
Bank Loan on Silver Jewelry:  వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
వెండి ఆభరణాలపై కూడా బ్యాంకు లోన్‌ తీసుకోవచ్చు! నిబంధనలను తెలుసుకోండి?
Adilabad News: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చరచ్చ  కొట్టకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు 
ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రచ్చరచ్చ  కొట్టకున్న బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు 
Embed widget