News
News
వీడియోలు ఆటలు
X

Chandrababu: మత్స్యకారులకు మొక్కుబడిగా డబ్బులు, వైసీపీ సర్కారుది అంతా మోసమే: చంద్రబాబు

Chandrababu on Fisherman Subsidy: ఏపీలోని వైసీపీ సర్కారు మత్స్యకారులను మోసం చేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. విశాఖలో నిర్వహించిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో బాబు మాట్లాడారు.

FOLLOW US: 
Share:

Chandrababu on Fisherman Subsidy: రాష్ట్రంలోని మత్స్యకారులకు మొక్కుబడిగా డబ్బులు ఇస్తూ వైసీపీ సర్కారు మోసం చేస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ఏపీలో 20 లక్షల మందికి పైగా మత్స్యకారులు ఉంటే కేవలం లక్షల మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి సర్కారు గొప్పలు చెప్పుకుంటోందని మండిపడ్డారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతికి, అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని బాబు గుర్తు చేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ఇవాళ వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. 

Also Read: Chandrababu: నాది అద్దె ఇల్లు, నీకు ఊరూరా ప్యాలెస్‌లు: సీఎం జగన్ కు చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్

మత్స్యకారుల కోసం తెలుగు దేశం పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని బాబు గుర్తు చేశారు. తొలిసారి మత్స్యకారుల బోట్లకు కమ్యూనికేషన్ కిట్లు-వీహెచ్ఎఫ్ లు పెట్టి ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాకుండా మత్స్యకారుల ప్రాణాలు కాపాడటానికి లేటెస్ట్ టెక్నాలజీ వాడిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు. అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేసినట్లు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల కోసం రూ. 788 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ప్రమాదవశాత్తు మత్స్యకారులు ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులకు వైసీపీ ప్రభుత్వం పరిహారం అందించడలం లేదని, అది చాలా దుర్మార్గమని వ్యాఖ్యానించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తప్పకుండా మత్స్యకారుల కుటుంబాలకు వెంటనే ఆర్థిక పరమైన వెసులు బాటు కల్పిస్తామని మత్స్యకారుల ఆత్మీయ సమ్మేళనంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Also Read: Chandrababu Visakha Tour: బుధవారం నుంచి 3 రోజులు ఉత్తరాంధ్ర పర్యటనకు చంద్రబాబు - పూర్తి షెడ్యూల్ ఇలా

'వెనకబడిన వర్గాలను గుర్తించిన మొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఏకైక నాయకుడు నందమూరి తారకరామారావు. రాజకీయంగా బీసీలను పైకి తేవాలని, నాయకులను తీర్చిదిద్దాలని, స్థానిక సంస్థల్లో 25 శాతం రిజర్వేషన్లు పెట్టారు. వెనకబడిన వర్గాలకు ఆ రోజు గుర్తింపు ఇవ్వడం ద్వారా సమర్థవంతమైన నాయకులు వచ్చారు. ఇప్పుడు ఈ వేదికపై వెనకబడిన వర్గాల నాయకులు కూర్చున్నారంటే అది స్వర్గీయ ఎన్టీ రామారావు చూపిన చొరవ, తీసుకున్న నిర్ణయాల ఫలితం. ఆ తర్వాత రిజర్వేషన్లను 33 శాతానికి పెంచారు. వెనకబడిన వర్గాలను పెంచాలని టీడీపీ సర్కారు రిజర్వేషన్లు పెంచితే.. వైసీపీ సర్కారు మాత్రం ఆ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించింది. మత్స్యకారుల బోట్లకు మొట్టమొదటిసారి వీహెచ్ఎఫ్ టెక్నాలజీలు పెట్టి ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేసేలే చూసి లేటెస్ట్ టెక్నాలజీతో ప్రజలను కాపాడిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది.

అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. సంవత్సరానికి కేవలం మత్స్యకారుల కోసమే రూ. 788 కోట్లు ఖర్చు చేశాం. ఇప్పుడు మాత్రం ప్రమాదవశాత్తు మత్స్యకారులు ఎవరైనా చనిపోతే బెనిఫిట్స్ సమయానికి అందట్లేదు. తప్పకుండా ఇది సవరించాలి. టీడీపీ అధికారంలోకి రాగానే మత్స్యకారులు ఎవరైనా చనిపోయిన వెంటనే ఆర్థికపరమైన వెసులుబాటు ఇవ్వడమే కాకుండా వితంతు పింఛన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. 20 లక్షల మత్స్యకారులు ఉంటే కేవలం లక్ష మందికి మాత్రమే బెనిఫిట్స్ ఇస్తోంది వైసీపీ ప్రభుత్వం. అది కూడా అనేక ఆంక్షలు పెడుతోంది. ఇది చాలా దుర్మార్గం. తెలుగుదేశం పార్టీ హయాంలో కేవలం మత్స్యకారుల కోసం 9 రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పాం. టీడీపీ ప్రభుత్వానికి మత్స్యకారులపై ఉన్న ప్రేమకు అది నిదర్శనం' అని చంద్రబాబు పేర్కొన్నారు.

Published at : 18 May 2023 08:21 PM (IST) Tags: ycp tdp Chandrababu criticize matsyakarulu

సంబంధిత కథనాలు

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారం 

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

రూమ్‌ తీసుకున్నాడు, భార్యను పిలిచి చంపేశాడు - అనకాపల్లి జిల్లా లాడ్జ్‌ కేసు ఛేదించిన పోలీసులు

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top Headlines Today: నేటి నుంచి యువగళం పునఃప్రారంభం, విజయవాడలో సీఎం జగన్ టూర్

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: చెన్నై పాంచ్‌ పవర్‌, ఐదో ఏట అడుగు పెట్టిన జగన్ సర్కారు, చేరికలపై ఈటల నిరాశ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ

టాప్ స్టోరీస్

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?

BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ -   జాతీయ వ్యూహం మారిపోయిందా ?

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

మెగాస్టార్‌ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల

ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు మరికొన్ని సంవత్సరాల సమయం పడుతుంది: సజ్జల