<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>visakhapatnam</title><atom:link href="https://telugu.abplive.com/visakhapatnam/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Sun, 24 May 2026 22:10:27 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Breaking News: భారతీయులను చూసి సభ్యత, సంస్కారం నేర్చుకోండి: అమెరికాకు ఇరాన్ కౌంటర్]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124#respond</comments><pubDate>Sat, 23 May 2026 08:50:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-23rd-may-2026-248124</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Breaking News:&lt;/strong&gt;భారత్&amp;zwnj;లో సామాన్యుడి రవాణా బడ్జెట్&amp;zwnj; మరోసారి తలకిందులైంది గత పది రోజుల్లోనే చమురు సంస్థలు మూడోసారి ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. శనివారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చిన ఈ ధరల పెంపుతో పెట్రోల్&amp;zwnj;, డీజిల్&amp;zwnj; రేట్లు సరికొత్త గరిష్టాలకు చేరుకున్నాయి.&lt;/p&gt;
&lt;p&gt;శనివారం చమురు సంస్థలు విడుదల చేసిన ప్రకటన ప్రకారం పెట్రోల్&amp;zwnj; లీటరుకు 87పైసలు పెరిగింది. డీజిల్&amp;zwnj; లీటరకు 91పైసలుపెరిగింది. సీఎన్జీ ఢిల్లీలో కిలోకు రూపాయి పెరిగింది. ఇప్పుడు అక్కడ కిలో సీఎన్జీ ధర 91.09రూపాయలుగా ఉంది. గడచిన పది రోజులను గమనిస్తే ఇంధన ధరలు మొత్తంగా లీటర్&amp;zwnj;కు దాదాపు ఐదు రూపాయలు పెరిగాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఇంధన ధరల పెరుగుదలకు ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ, భౌగోళిక పరిస్థితులు కారణమవుతున్నాయి. పశ్చిమాశియాలో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణాకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనలు అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెంచుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;భారత్ తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీని వల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లలో ధరలు పెరిగినప్పుడల్లా దేశీయంగా రేట్లు పెంచక తప్పడం లేదు. గతంలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం, చమురు సంస్థలు ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా తామే భరించాయి. 2021-24 మధ్య కాలంలో చమురు సంస్థలు సుమారు 24, 500 కోట్ల నష్టాన్ని చవిచూశాయి. అలాగనే 2024-25లో ఎల్పీజీ వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు సుమారు నలభై వేల కోట్ల భారాన్ని భరించాయి. ఈ నష్టాలను భర్తీ చేసుకునే క్రమంలో ఇప్పుడు ధరలను పెంచుతున్నట్టు తెలుస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈ వరుస ధరల పెంపు కేవలం వాహనదారులకే పరిమితం కాదు. డీజిల్ ధర పెరగడం వల్ల రవాణా,లాజిస్టిక్ ఖర్చులు పెరుగుతాయి. ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పండ్లు, ఇతర సరకుల రవాణా ఖర్చులు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది.మల్టిపుల్ సెక్టార్లలో ఉత్పత్తి వ్యయం పెరిగి ద్రవ్యోల్బణానికి దారి తీయవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం ధరలు పెరుగుతున్నప్పటికీ గత నాలుగేళ్లలో భారత్ నాలుగు సార్లు ఇంధన ధరలను తగ్గించిందని ప్రభుత్వ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 27న స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని లీటర్&amp;zwnj;కు పది రూపాయలు తగ్గించారు. దీని వల్ల డీజిల్&amp;zwnj;పై ఎక్సైజ్ సుంకాన్ని దాదాపు సున్నాకి తీసుకొచ్చారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో నెలకొన్న అనిశ్చితి తగ్గే వరకు ఇంధన ధరల్లో ఈ హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా ఇంధన వనరుల అన్వేషణపై దృష్టి సారించాలని ఇప్పటికే ప్రధాని మోదీ మంత్రులకు దిశానిర్దేశం చేశారు. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/cc693aa25c5244d4a36d302b993e96381779506339312215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Petrol Price Hike May 2026: పది రోజుల్లో మూడోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! మీ ప్రాంతంలో రేట్లు ఎంత?]]></title><link>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</link><comments>https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118#respond</comments><pubDate>Sat, 23 May 2026 07:49:10 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ ఇండియా ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/india/petrol-diesel-price-hike-india-third-time-in-may-2026-impact-analysis-248118</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Petrol Price Hike May 2026:&amp;nbsp;&lt;/strong&gt;దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతోంది. మే నెలలో సామాన్యుడిపై మరోసారి భారం పడింది. శనివారం (మే 23, 2026) దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. గత పది రోజుల్లోనే ధరలు పెరగడం ఇది మూడోసారి. అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు పుల్&amp;zwnj;స్టాప్ పడలేదని ఇలా పెట్రోల్ ధరలు పెంచుతున్నారు.&amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;నేటి తాజా ధరలు ఇవే&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర 91 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 98.64 నుంచి రూ. 99.51కి, డీజిల్ ధర రూ.91.58 నుంచి రూ. 92.49కి చేరింది.&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు (లీటరుకు):&lt;/h3&gt;
&lt;p&gt;హైదరాబాద్&amp;zwnj;: పెట్రోల్ రూ. 111.88 (+0.87), డీజిల్ రూ. 99.95 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;ముంబై: పెట్రోల్ రూ. 108.49 (+0.87), డీజిల్ రూ. 95.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;కోల్&amp;zwnj;కతా: పెట్రోల్ రూ. 110.64 (+0.87), డీజిల్ రూ. 97.02 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;చెన్నై: పెట్రోల్ రూ. 105.31 (+0.87), డీజిల్ రూ. 96.98 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;గురుగ్రామ్: పెట్రోల్ రూ. 100.38 (+0.87), డీజిల్ రూ. 92.92 (+0.91).&lt;/p&gt;
&lt;p&gt;నోయిడా: పెట్రోల్ రూ. 98.78 (+0.87), డీజిల్ రూ. 93.12 (+0.91).&lt;/p&gt;
&lt;h3&gt;గత 10 రోజుల్లో ఏం జరిగింది?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఈ నెలలో పెట్రోల్ ధరల బాదుడు మే 16న ప్రారంభమైంది. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా లీటరుకు రూ. 3 వరకు పెంచారు. ఆ తర్వాత మే 19న మెట్రో నగరాల్లో మరో 90 పైసలు పెరిగాయి. తాజా పెరుగుదలతో కలిపి చూస్తే, గత పది రోజుల్లోనే ఇంధన ధరలు దాదాపు రూ.5 మేర పెరిగాయి. కేవలం పెట్రోల్, డీజిల్ ధరలే కాకుండా ఇటీవలి రోజుల్లో సిఎన్&amp;zwnj;జి (CNG), పిఎన్&amp;zwnj;జి (PNG) ధరలు కూడా పలు నగరాల్లో పెరిగాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Adilabad Public Opinion on Petrol Rates | ఆదిలాబాద్ జిల్లాలో వాహనదారుల ఆందోళన | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/nJUeVpjXDNk&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇలా ధరలు పెంచుతున్నారు. ప్రపంచ మార్కెట్&amp;zwnj;లో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. వెస్ట్ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన ముడి చమురు అవసరాల కోసం దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్&amp;zwnj;లో ఏ చిన్న మార్పు వచ్చినా, అది మన దేశీయ ధరలపై ప్రభావం చూపుతుంది&lt;/p&gt;
&lt;h3&gt;సామాన్యుడిపై ప్రభావం &amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు అన్ని రంగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.&lt;br /&gt;రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. దీంతో నిత్యావసర వస్తువులు, పండ్లు, కూరగాయల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా భారం పెరిగితే అది చివరకు సామాన్య వినియోగదారుడిపైనే పడుతుంది, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. మే నెలలో మూడోసారి జరిగిన ఈ ధరల పెంపు మధ్యతరగతి జీవి బడ్జెట్&amp;zwnj;ను అస్తవ్యస్తం చేస్తోంది.&amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp; &amp;nbsp;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/9c111b1825415d75fd5cd660a3a30ed31779502511854215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave deaths Telangana AP:అగ్ని గుండంలా తెలుగు రాష్ట్రాలు! వడదెబ్బకు పోతున్న ప్రాణాలు! రికార్డులు తిరగరాస్తున్న ఉష్ణోగ్రతలు!]]></title><link>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</link><comments>https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115#respond</comments><pubDate>Sat, 23 May 2026 06:19:01 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telangana-ap-heatwave-deadly-summer-2026-updates-deaths-records-248115</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave deaths Telangana AP:&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాల్లో సూరీడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోంది. ఈ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. గత 24 గంటల్లోనే వడదెబ్బ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సూరీ ఊచకోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో శుక్రవారం ఒక్క రోజు వడబెద్దకు 21 మంది మరణించారు. ఇందులో అత్యధికంగా విజయవాడలోనే ఉన్నారు. ఇక్కడ పది మంది మరణించారు. మృతుల్లో ఎనిమిది మంది యాచచకులే. రోడ్డు పక్కన, పార్కుల వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న వీరిని ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. &amp;nbsp;ఇక ఏలూరులో ముగ్గురు, కాకినాడలో ముగ్గురు, పల్నాడులో ఇద్దరు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణ నిప్పుల కొలిమి&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో ఎండల తీవ్రత మరింత భీకరంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వడ దెబ్బతో 34మంది మరణించినట్టు తెలుస్తోంది. దాదాపు ఇరవైకిపైగా జిల్లాల్లో 46 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కుమురం భీం ఆసీఫాబాద్&amp;zwnj; జిల్లాలోని సిర్పూర్(టి)లో అత్యధికంగా 46.5 డిగ్రీల సెల్సియస్&amp;zwnj; ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎందుకు ఈ పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఎండలు కేవలం వేసవి ప్రభావం మాత్రమే కాదు. హిందూ మహాసముద్రంలో వేడి పెరగడం వల్ల ఏర్పడే ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో వడగాలుల సంఖ్య, వాటి వ్యవధి పెరుగుతోంది. నగరాల్లో కాంక్రీట్ కట్టడాలు, వాహనాల వినియోగం వల్ల వేడి గాలి బయటకు వెళ్లకుండా అక్కడే నిలిచిపోతోంది. ఫలితంగా నగరాల్లో ఉష్ణోగ్రతలు గ్రామీణ ప్రాంతాల కంటే రెండు నుంచి పది డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మీ గుండె భద్రం&lt;/h3&gt;
&lt;p&gt;రాజస్థాన్, పంజాబ్ ఎడారి ప్రాంతాల నుంచి వీస్తున్న పొడి వేడి గాలుల మధ్య భారతంతోపాటు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా రాత్రి పూట చల్లబడాల్సిన వాతావరణం, ప్రస్తుతం 24-30 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు అవుతోంది. ఇది మానవుల గుండపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో నాలుగు రోజులు ఇదే తంతు&lt;/h3&gt;
&lt;p&gt;వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే నాలుగు రోజులు అత్యంత కీలకం. అందుకే తెలంగాణలోని 18 జిల్లాలు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. శని, ఆదివారాల్లో కూడా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 11 నుంచి సాయంత్ర నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు రావద్దని సూచించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎండల వల్ల కేవలం ప్రాణ నష్టమే కాదు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండ తీవ్రతకు రోడ్డుపై వెళ్తున్న స్కూటీ మంటల్లో చిక్కుకుంది. జనగామా జిల్లాలో ఎండల వల్ల పంట పొలాల్లో మంటలు చెలరేగాయి. ధాన్యం కుప్పలు బూడిద అయ్యాయి. ఎండల వల్ల ఏసీలు, కూలర్ల వాడకం పెరిగింది. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో గ్రిడ్&amp;zwnj; డిమాండ్ రికార్డు స్థాయిలో 15, 016 మెగావాట్లకు చేరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రకృతి వైపరిత్యాలు మన చేతల్లో లేకపోయినా, అప్రమత్తతతో ప్రాణనష్టాన్ని తగ్గించవ చ్చు. ముఖ్యంగా బాలింతలు, గర్భిణులు, వృద్ధులు ఈ ఎండల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/23/d48fb75c61a4176b3cc996446019a3391779497175229215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: ఏపీలో రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల! జూన్ 18న పోలింగ్!]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017#respond</comments><pubDate>Fri, 22 May 2026 07:16:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-22nd-may-2026-248017</guid><description><![CDATA[&lt;p&gt;Breaking News: విజయవాడ పటమటలోని వంద అడుగుల రోడ్డులో సినిమాను తలపించే యాక్షన్ సీన్స్ కనిపించాయి. అమ్మాయి కోసం ఇద్దరు యువకులు వార్&amp;zwnj;కు దిగారు. వారి వద్ద ఉన్న థార్&amp;zwnj; వాహనాలతో రోడ్డుపై పోట్లాడుకున్నారు. ఓం రోహిత్ అనే ఇద్దరు యువకులు సృష్టించిన బీభత్సానికి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం అక్కడకు చేరుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. మిగతా వ్యక్తి పరారీలో ఉన్నాడు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;హీరా గోల్డ్ నౌహీరా షేక్ అరెస్టు&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;హీరా గోల్డ్ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్&amp;zwnj;ను &amp;nbsp;ఈడీ అధికారులు గురుగ్రామ్&amp;zwnj;లో అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి, నకిలీ గుర్తింపు కార్డులతో పరారీలో ఉన్న ఆమెను ఎట్టకేలకు పట్టుకున్నారు. 5,600 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసిన &amp;nbsp;ఆమెను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలిస్తున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/4e66bd1dbd3a8edbe18d950968bebd951779414256927215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Heatwave in Andhra Pradesh and Telangana:తెలుగు రాష్ట్రాల్లో హీట్‌వేవ్‌ దెబ్బ! పిడుగురాళ్లలో 48.1 డిగ్రీలు! పలు జిల్లాలకు రెడ్ అలర్ట్!]]></title><link>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</link><comments>https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016#respond</comments><pubDate>Fri, 22 May 2026 06:53:19 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/telugu-states-andhra-pradesh-telangana-heatwave-crisis-48-degrees-piduguralla-red-alert-2026-248016</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Heatwave in Andhra Pradesh and Telangana: &lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారాయి. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లోని పిడుగురాళ్లలో 48.1 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రత నమోదు కాగా, తెలంగాణలో వడదెబ్బకు జనం పిట్టల్లా రాలుతున్నారు. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఎల్&amp;zwnj;నినో ప్రభావంతో మరిన్ని రోజులు ఈ వేడి కొనసాగే అవకాశం ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తెలుగు రాష్ట్రాలు ప్రస్తుతం అగ్ని గుండాలను తలపిస్తున్నాయి. వేసవి తీవ్రత గతంలో ఎప్పుడూ లేని విధంగా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో భానుడు తన ప్రచండ రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 7 గంట నుంచే బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. వేడిగాలులు, ఉక్కపోతతో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో రికార్డుల మోత&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లా నిప్పుల కుంపటిలా మారింది. బుధవారం పిడుగురాళ్లలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, గురువారం అది ఏకంగా 48.1 డిగ్రీలకు చేరుకుంది. ఇది గత 11 ఏళ్లలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డు సృష్టించింది. 2019లో ఇక్కడ 45.5 డిగ్రీలు మాత్రమే నమోదు అయ్యింది. మొన్నటి వరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డుల్లో ఉంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం పల్నాడుజిల్లా మాత్రమే కాదు, రాష్ట్రంలోని 20 జిల్లాలోని సుమారు 200 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. విజయనగరం జిల్లాలో వడదెబ్బ కారణంగా ఇద్దరు వ్యక్తులు మరణించారు. రాత్రి వేళల్లో కూడా ఉపశమనం లభించడం లేదు. దాదాపు 42 డిగ్రీల వేడి కొనసాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణలో రెడ్ అలర్ట్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజే ఇరవై మందికిపైగా మరణించారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే 9 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర చరిత్రలో మొదటిసారిగా 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల మార్కును దాటాయి. పెద్దపల్లి జిల్లా ముత్తారం, సూర్యాపేటజిల్లా మునగాలలో అత్యధిక 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Breaking |  Fire accident at Charminar | పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. మదీనా చౌరస్తా| ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/9Lxo0q-Bp6o&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం విపత్కర పరిస్థితులకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్&amp;zwnj; మహాసముద్రంలో ఏర్పడిన బలమైన ఎల్&amp;zwnj;నినో పరిస్థితులు భారత ఉపఖండంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి ప్రధాన కారణం. గాలిలో తేమ శాతం గణనీయంగా పడిపోవడంతో వేడి తీవ్రత రెట్టింపు అవుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడకపోవడం వల్ల వాతావరణం చల్లబడటం లేదు. రాజస్థాన్, మహారాష్ట్ర నుంచి వీస్తున్న పొడి గాలులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను ఉడికిస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;పచ్చదనం తగ్గడంతో ప్రమాదం&lt;/h3&gt;
&lt;p&gt;అదనంగా ఉత్తర భారత్&amp;zwnj;లోని బాండా వంటి నగరాల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడానికి అడవులు నరికివేత, నదుల్లో ఇసుక తవ్వకాలు, గ్రీన్ కవర్ తగ్గడం వంటి మానవ తప్పిదాలు కూడా &amp;nbsp;కారణం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పచ్చదనం తగ్గడం ఈ వేడికి పరోక్ష కారణం కావచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;మరో వారం రోజులు ఇదే పరిస్థితి&lt;/h3&gt;
&lt;p&gt;గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మే నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 7-8 డిగ్రీలు అధికంగా నమోదు అవుతున్నాయి. పల్నాడు నుంచి ఢిల్లీ వరకు ఉన్న స్ట్రెచ్&amp;zwnj;లో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. &amp;nbsp;&amp;nbsp;&lt;br /&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/22/1df6a35a5fe8c8cd3687960e25eb9ff11779412899529215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Latest News:ఎక్కువ మంది పిల్లల్ని కానాలని ముందు లోకేష్‌కు చెప్పు! చంద్రబాబు సంతానం కాన్సెప్టుపై వైఎస్ జగన్ సెటైర్లు ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-suggested-to-chandrababu-naidu-to-tell-lokesh-to-have-more-children-247938</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-suggested-to-chandrababu-naidu-to-tell-lokesh-to-have-more-children-247938#respond</comments><pubDate>Thu, 21 May 2026 13:24:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-suggested-to-chandrababu-naidu-to-tell-lokesh-to-have-more-children-247938</guid><description><![CDATA[&lt;p&gt;YS Jagan Latest News: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ఎక్కువ సంతానం ఉండాలనే కాన్సెప్టుపై వైఎస్ అధినేత జగన్ మండిపడ్డారు. ఇదేమి దిక్కుమాలిన ఆలోచన అంటూ ఫైర్ అయ్యారు. &quot; సంతానమే సంపదట. ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారు. నగదు ప్రోత్సాహకం ఇస్తారట. సూపర్ సిక్స్, సెవెన్ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడాలని ప్రజలు మొత్తుకుంటున్నారు. &quot; అని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు మాట &amp;nbsp;చెప్పిన మాట ఆయన కుమారుడు లోకేష్ అయినా పాటించాలి కదా అంటూ ఎద్దేవా చేశారు. &quot; చంద్రబాబుకు ఒక్కడే కొడుకు. ఆయన కొడుకు లోకేష్&amp;zwnj;కు ఒక్కడే కొడుకు. బాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదా. ప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురిని కనాలట. &quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | EX CM YS JAGAN PRESS MEET | MAVIGAUN వైఎస్ జగన్ ప్రెస్ మీట్ LIVE  | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/Hs6sGg2FvT0&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రజలు మంచిగా చదువుకోకుండాఉండాలని పేదలుగానే ఉండాలనే ఆలోచనతో ఇలాంటి ప్రచారం చేస్తున్నారని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; అభిప్రాయపడ్డారు. ఇదో దిక్కుమాలిన ఆలోచనగా కొట్టిపారేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ తమక హయాంలో మూలన పడలేదన్నారు. పిల్లలకు మేనమామలా మంచి చదువులు చదవించానని, ఇవాళ వారికి కనీసం గోరుముద్దలు కూడా అందడం లేదన్నారు. సరైన ఆహారం అందక ఆసుపత్రి పాలవుతున్నారని, వ్యవస్థలన్నీ ఇంత దారుణంగా ఉంటే పిల్లలను కనమని ఎలా పిలుపునిస్తారని ప్రశ్నించారు. మహిళలను పిల్లల్ని కనే మెషిన్లుగా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;బోత్&amp;zwnj; ఆర్&amp;zwnj; నాట్ సేమ్&amp;zwnj; అంటూ లోకేష్&amp;zwnj;పై విమర్శలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;బోత్&amp;zwnj; ఆర్&amp;zwnj; నాట్ సేమ్ అని లోకేష్ అంటూ లోకేష్ చెప్పే డైలాగ్స్&amp;zwnj;పై జగన్ విమర్శలు చేశారు. వెన్నుపోటుతో పార్టీని లాక్కునే ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీది అని, ప్రజా మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశామని జగన్ అన్నారు. ప్రజలకు ద్రోహం, వాడుకోవడం, వదిలేయడం మీ క్యారెక్టర్ అని విమర్శించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్ అని కితాబు ఇచ్చుకున్నారు. పనులు చేసి చూపించడం మా స్టైల్ అని, పబ్లిసిటీ చేయడం మీ స్టైల్ అని ఆరోపించారు. బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాది అయితే రెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీది అని బోత్&amp;zwnj; ఆర్ నాట్ సేమ్ అని జగన్ డైలాగ్ చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;అధికారులను విడిచి పెట్టేది లేదు: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;ప్రజాస్వామ్యంలో అల్టిమేట్&amp;zwnj;గా ఏది ఇస్తావో అదే తిరిగి వస్తుందన్నారు జగన్. రేపు వచ్చేది తమ ప్రభుత్వమేనని చంద్రబాబు ప్రలోభాలు, భయంతో పోలీసులు పని చేయొద్దని సూచించారు. అన్ని విషయాలపై విచారణ ఉంటుందని తప్పు చేసిన అధికారులను చట్టం ముందు నిలబెడతామన్నారు. సప్త సముద్రాల అవతల ఉన్నా సరే వదిలి పెట్టేది లేదని మరోసారి వార్నింగ్ ఇచ్చారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సోషల్ మీడియాపై ఆంక్షలు&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో సోషల్ మీడియాపై కూడా ఆంక్షలు పెడుతున్నారని జగన్ మండిపడ్డారు. ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదన్నారు. ప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్ కనబడకుండా చేస్తున్నారని సోషల్ మీడియా కూడా సెన్సార్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. ఎఫ్&amp;zwnj;ఐఆర్&amp;zwnj; చేసిన సోషల్ మీడియా ప్లాట్&amp;zwnj;ఫారమ్&amp;zwnj;లకు పంపిస్తున్నారని చెప్పారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/21/be01f0ccf2df08dbbe5f9800243b55a01779349649867215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Latest News: "చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు! పెట్రోల్‌పై 8 రూపాయలు తగ్గింగాలి" జగన్ హాట్ కామెంట్స్!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-hot-comments-on-andhra-pradesh-cm-chandra-babu-and-petrol-price-247935</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-hot-comments-on-andhra-pradesh-cm-chandra-babu-and-petrol-price-247935#respond</comments><pubDate>Thu, 21 May 2026 13:04:13 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-hot-comments-on-andhra-pradesh-cm-chandra-babu-and-petrol-price-247935</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;YS Jagan Latest News:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అధినేత జగన్. చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్&amp;zwnj;తో వైసీపీ నేతలే టార్గెట్&amp;zwnj;గా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన యాక్టీవ్&amp;zwnj;గా ఉండరని, అందుకే నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆఖరి పాలన సమయంలోనైనా ప్రజలకు మంచి చేయాలని జగన్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ ధరలు తగ్గించాలని లీటర్&amp;zwnj;పై 8 రూపాయల వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;చంద్రబాబుకు బీపీ పెరుగుతుంది: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;ను జంగిల్ రాజ్&amp;zwnj;గా మార్చేసి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. రెండేళ్లలో ప్రజలకు మంచి చేయకపోగా ప్రశ్నించి వారిపై కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందన్నారు. తనకు ప్రతికూలంగా ఏదైనా విషయం వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మరో రాజకీయ అలజడి రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతుందని ఎద్దేవా చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | EX CM YS JAGAN PRESS MEET | MAVIGAUN వైఎస్ జగన్ ప్రెస్ మీట్ LIVE  | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/Hs6sGg2FvT0&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;మావిగన్ అంటే చంద్రబాబు గుండె ఆగిపోతుంది: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;అమరావతి అయితే జీరో నుంచి మొదలు పెట్టాలని అందుకే తాము మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు జగన్. ఆ పదం వింటేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్రం చేస్కున్న దురదృష్టమని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల భవిష్యత్&amp;zwnj;లో కూడా ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే అమరావతి కోసం 47 వేల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్ర ఖజానా నుంచి 9 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్&amp;zwnj; ఉన్నా మళ్లీ పర్మినెంట్ బిల్డింగ్స్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;చదరపు అడుగు ఖర్చు 30 వేలు: జగన్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;కేవలం ఐదు బిల్డింగ్&amp;zwnj;ల కోసం చేస్తున్న ఖర్చు చూసి జనం నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ ఐదు బిల్డింగ్స్&amp;zwnj; కోసం చదరపు అడుగు కోసం 20, 427 రూపాయలు ఖర్చు చేస్తున్నారని పాత లెక్క ప్రకారం ఇది ఐదు వేలే అన్నారు. తెలంగాణ నిర్మించిన సచివాలయానికి కూడా అంత ఖర్చు కాలేదని, ప్రపంచంలోని ఏ కట్టడాలకు ఇంత ఖర్చు చేయడం లేదని చెప్పారు. ఇది కేవలం నిర్మాణ ఖర్చు మాత్రమేనని ఇంకా ఫర్నీచర్, ఇంటీరియర్ లెక్కలు వేసుకుంటే అది 30 వేలు దాటిపోతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;కిలోమీటర్ రోడ్డుకు 53 కోట్లు : జగన్&lt;/h3&gt;
&lt;p&gt;జాతీయ రహదారి నిర్మాణానికి కిలోమీటర్&amp;zwnj;కు 24 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రం చెప్పిందని చంద్రబాబు మాత్రం అమరావతిలో రోడ్లకు కిలోమీటర్&amp;zwnj;కు 53 కోట్లు ఖర్చు చేస్తున్నారని జగన్ తెలిపారు. బిల్డింగ్స్, రోడ్ల విషయంలోనే కాకుండా ప్లాట్ల కేటాయింపులో కూడా స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. సామాన్యులకు చెరువుల్లో, కుంటల్లో, ప్లాట్లు కేటాయిస్తూ సన్నిహితులకు మాత్రం రోడ్లు పక్కనే భూములు ఇప్పించారని ఆరోపించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;లీటర్ పెట్రోల్ ధర రూ. 8 తగ్గించాలి: జగన్&lt;/h3&gt;
&lt;p&gt;ఎన్నికల ముందు సూపర్ సిక్స్&amp;zwnj; అన్న వ్యక్తి తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేశారని జగన్ ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఇన్&amp;zwnj;పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామనని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని పెంచేశారని మండిపడ్డారు. కోవిడ్ టైంలో కూడా తాము రూపాయి మాత్రమే పెంచామని తర్వాత పెంచలేదని గుర్తు చేశారు. ఇంధన సంక్షోభంలో కూడా చంద్రబాబు స్కామ్&amp;zwnj;లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పెట్రోల్&amp;zwnj; లీటర్&amp;zwnj;కు 8 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు&lt;/h3&gt;
&lt;p&gt;&lt;a title=&quot;చంద్రబాబులే హత్యా రాజకీయాలు అని ఆరోపించిన జగన్ చెడ్డోడినైతే తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా అని జగన్ ప్రశ్నించారు. జగన్ నైజానికి ఇదే నిదర్శమని అన్నారు.&quot; href=&quot;https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announced-that-rajasekhar-reddy-died-only-after-chandrababu-warning-and-that-there-are-still-doubts-about-his-death-247930&quot; target=&quot;_self&quot;&gt;చంద్రబాబులే హత్యా రాజకీయాలు అని ఆరోపించిన జగన్ చెడ్డోడినైతే తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా అని జగన్ ప్రశ్నించారు. జగన్ నైజానికి ఇదే నిదర్శమని అన్నారు.&lt;/a&gt; చంద్రబాబులా తన తండ్రి హత్యా రాజకీయాలు నేర్పించలేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయని చెప్పారు. ఈ వయసులోనూ ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; కుట్ర రాజకీయాలు చేస్తుంటే తాను మాత్రం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నామన అందుకు గర్వంగా ఉందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/21/c06abbf3e4e6dcff8dcd4553d13c2b841779348731854215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[YS Jagan Latest News: చంద్రబాబు వార్నింగ్ తర్వాతే రాజశేఖర్ రెడ్డి మృతి! నేటికీ అనుమానాలున్నాయ్?: జగన్ ]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announced-that-rajasekhar-reddy-died-only-after-chandrababu-warning-and-that-there-are-still-doubts-about-his-death-247930</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announced-that-rajasekhar-reddy-died-only-after-chandrababu-warning-and-that-there-are-still-doubts-about-his-death-247930#respond</comments><pubDate>Thu, 21 May 2026 12:29:17 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ys-jagan-announced-that-rajasekhar-reddy-died-only-after-chandrababu-warning-and-that-there-are-still-doubts-about-his-death-247930</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;YS Jagan Latest News:&lt;/strong&gt; వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj;సీపీ అధినేత వైఎస్ జగన్&amp;zwnj; ప్రెస్&amp;zwnj;మీట్&amp;zwnj; పెట్టి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తన తండ్రి మృతిపై నేటికీ తమకు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన తర్వాతే రెండు మూడు రోజులకు వైఎస్&amp;zwnj;ఆర్&amp;zwnj; హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారని అన్నారు. ఇలాంటివి తన కుటుంబంలో మూడు ఘటనలు జరిగాయన్నారు. తన తండ్రిని, చిన్నానను చంపేశారని ఆరోపించారు. బాధితులమైన తమపై నిందలు వేసి గొడ్డలి పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎన్నికల కోసం తాతను చంపేశారు: జగన్&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;&quot;మా కుటుంబంలో ముగ్గురు చనిపోయారు. మా తాత, మా నాన్న, చిన్నాన్న ముగ్గురు రాజకీయాలకు బలైపోయారు. మేం బాధితులం. కానీ మా పైనే తప్పుడు ప్రచారం చేస్తూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. రాజారెడ్డిని చెప్పిందెవరు? టీడీపీ వాళ్లే కదా, ఈ ఘటన చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది.&quot;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;LIVE | EX CM YS JAGAN PRESS MEET | MAVIGAUN వైఎస్ జగన్ ప్రెస్ మీట్ LIVE  | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/Hs6sGg2FvT0&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ఎవరిది క్రిమినల్ బ్రెయిన్&lt;/h3&gt;
&lt;p&gt;1999 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రాజశేఖర్&amp;zwnj;ను పులివెందులకే పరిమితం చేసేందుకు రాజారెడ్డిని చంపేశారని అన్నారు. రాజకీయ కోణంతో ఈ పని చేశారన్నారు. &quot;తాత రాజారెడ్డి హత్య కేసులో దోషులను బరితెగించి హైదరాబాద్&amp;zwnj; టీడీపీ ఆఫీస్&amp;zwnj;లో దాచి పెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి వారికి శిక్ష పడకుండా చేశారు. ఇందులో ఎవరిది క్రిమినల్ బ్రెయిన్ అని చంద్రబాబును అడుగుతున్నాను.&quot; &amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;చంద్రబాబు వార్నింగ్ తర్వాత వైఎస్&amp;zwnj;ఆర్ మృతి&lt;/h3&gt;
&lt;p&gt;తాతా విషయంలోనే కాదు నాన్న వైఎస్ఆర్ విషయంలో కూడా ఇదే జరిగింది. వైఎస్ఆర్ చనిపోక ముందు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన వీడియో క్లిప్పింగ్స్&amp;zwnj; సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. &quot;మా నాన్న విషయంలోనూ అంతే, చనిపోక ముందే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తా అన్నారు. రెండు మూడు రోజులకే రాజశేఖర్ రెడ్డి చనిపోయారు. ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఎవరిదీ హత్యా రాజకీయాలు చంద్రబాబు.&quot; అని జగన్ ప్రశ్నించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వివేకానంద రెడ్డి హత్య జరిగిందన్నారు. ఆయన వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి తరఫున ప్రచారం చేసి వచ్చిన తర్వాత హత్య చేశారని చెప్పారు. ఆ హత్య కేసును కూడా తమపై వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. &quot;ఇదే చంద్రబాబు ప్రభుత్వం ఉండగానే వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. వైసీపీ కోసం, అవినాష్ రెడ్డి కోసం ప్రచారం చేసి వచ్చారు. తానే చంపినట్టు చెలరేగిపోయి మాట్లాడిన దస్తగిరి అనే వ్యక్తి ఇవాళ స్వేచ్ఛగా పోలీసుల సెక్యూరిటీలో కారులో తిరుగుతున్నారు. చంద్రబాబు లాయర్&amp;zwnj;, దస్తగిరి లాయర్ కూడా ఒక్కరే. రాజకీయ లబ్ధి కోసం ప్రలోభాలతో హంతకులను రక్షిస్తున్నారు. &quot; అని విమర్శలు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎవరిది గన్ కల్చర్?&lt;/h3&gt;
&lt;p&gt;గన్ కల్చర్ కూడా చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు బావమరిది, వియ్యంకుడైన బాలకృష్ణ టపా టపా అని ఇంట్లో కాల్పులు జరపలేదా అని ప్రశ్నించారు. సాక్ష్యాలు లేకుండా ఉండేందుకు వాచ్&amp;zwnj;మెన్&amp;zwnj; కూడా హత్య చేశారని ఆరోపించారు. &quot; చంద్రబాబు బావమరిది, వియ్యంకుడు బాలకృష్ణ గన్ పట్టుకొని టపాటపా అని కాల్చిపడేయలేదా. ఎవరిది గన్ కల్చర్ అని అడుగుతున్నాను. ఆ తర్వాత సాక్ష్యం ఉండకూడదని ఆ ఇంట్లో ఉన్న వాచ్&amp;zwnj;మెన్&amp;zwnj;ను బండరాయితో కొట్టి చంపేశారు. హరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి కేటీఆర్&amp;zwnj;తో పొత్తులపై చంద్రబాబు మాట్లాడారు. ఎవరిది శవ రాజకీయాలు.&quot; అని జగన్ ప్రశ్నించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఎన్టీఆర్&amp;zwnj;కు వెన్నుపోటు, రంగా హత్యలో ఎవరి పాత్ర ఉంది?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఎన్టీఆర్&amp;zwnj;కు వెన్నుపోటు పొడవంలో, రంగా హత్య కేసులో ఎవరి పాత్ర ఉందో తెలుగు ప్రజలకు తెలుసని &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; అన్నారు. &quot;కూతురును ఇచ్చి, రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్&amp;zwnj;కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని గుర్తును లాక్కొని చనిపోయేలా చేసింది ఎవరని అడుగుతున్నాను. వంగవీటి మోహన్ రంగా ఎలా చనిపోయారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిరాహార దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి నరికి చంపారు. ఈ ఘటనలో వేళ్లు అన్నీ కూడా చంద్రబాబు వైపే చూస్తున్నాయి. హరిరామజోగయ్య ఏకంగా పుస్తకం రాశారు. ఆ హత్యకేసులో ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ నేటికీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ఎమ్మెల్యే.&quot; అని గుర్తు చేశారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&quot; ఎన్టీఆర్&amp;zwnj;పై దాడి చేసిన కేసులో మల్లెల బాబ్జీని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కొన్ని రోజులకే డెడ్&amp;zwnj;బాడీగా మారాడు. ఆయన జేబులో లెటర్ దొరికింది. మూడు లక్షలు ఇస్తానని చెప్పారని ఉందని ఆ డబ్బులు ఇచ్చింది ఎవరు అనే విషయంపై దర్యాప్తు లేదు. ఈ కేసులో వెళ్లన్నీ అప్పట్లో చంద్రబాబు వైపే చూపించాయి. పింగలి దశరథ్&amp;zwnj;రామ్&amp;zwnj; &amp;nbsp;అనే జర్నలిస్ట్&amp;zwnj;ను కత్తులతో దాడి చేసి చంపారు. ఈ ఘటనలో &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; వైపే వేళ్లని చూపించాయి.'&quot; అని చరిత్ర వివరించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/21/ae9950d1fc5c5e3ce74091058084a9161779346596820215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!]]></title><link>https://telugu.abplive.com/news/andhra-pradesh-telangana-heatwave-record-temperatures-247909</link><comments>https://telugu.abplive.com/news/andhra-pradesh-telangana-heatwave-record-temperatures-247909#respond</comments><pubDate>Thu, 21 May 2026 09:01:23 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/andhra-pradesh-telangana-heatwave-record-temperatures-247909</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana Weather Updates:&amp;nbsp;&lt;/strong&gt;తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనే సామెత నిజం అవుతోంది. చాలా ప్రాంతాల్లో రోళ్లు, రాళ్లు పలిగే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జనం విలవిలలాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి మొదలు కాక ముందు నుంచే ఎండు ఠారెత్తించాయి. గతానికి కంటే భిన్నంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత తీవ్ర స్థాయికి వెళ్లాయి. దీంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పిడుగురాళ్లలో ప్రళయం&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండలు అసాధారణంగా పెరిగాయి. బుధవారం నాటి గణాంకాల ప్రకారం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో అత్యధికంగా 47. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ వేసవిలో నమోదు అయిన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఒక్క పల్నాడు జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 28 జిల్లాలకు గాను, 23 జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటగా, 204 మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయ్యాయి. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పిడుగురాళ్ల తర్వాత నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం జిల్లాల్లోని పెదచెర్లోపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;తెలంగాణలో అదిరిపోతున్న ఎండలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తెలంగాణలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్&amp;zwnj;పూర్&amp;zwnj;్లో 46.5 డగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. గత &amp;nbsp;పదేళ్ల రికార్డులను తుడిచి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హనుమకొండలో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;వడగాలులకు పోతున్న ప్రాణాలు&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;తీవ్రమైన ఎండల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ బుధవారం ఒక్క రోజే వడదెబ్బకు పది మందికిపైగా మృతి చెందారు. మరణించిన వారిలో రైతులు, ఉపాధి కూలీలు, మున్సిపల్&amp;zwnj; కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు, కరీంనగర్&amp;zwnj;, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్&amp;zwnj;, జనగామ, రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్&amp;zwnj; జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో కూడా వడ దెబ్బ కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గీత కార్మికుడు చనిపోయాడు. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కౌలు రైతు చనిపోయాడు. మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది వడదెబ్బకు ఏపీలో మృత్యువాత పడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుతం వాయవ్య భారతం నుంచి వేడిగాలులు కోస్తాంధ్ర, రాయలసీమవైపు వీస్తున్నాయి. దీనికి తోడు &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;, రాయలసీమ మీదుగా దక్షి కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం. సాధారణం కంటే 4.5 నుంచి 6.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/21/f415be449b0fdc2503561ef18e5582e41779334084422215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Breaking News: చంద్రబాబుకు ఇవే లాస్ట్ ఎన్నికలు? నాన్న మృతిపై నేటికీ అనుమానాలు ఉన్నాయ్?]]></title><link>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-21st-may-2026-247901</link><comments>https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-21st-may-2026-247901#respond</comments><pubDate>Thu, 21 May 2026 07:31:53 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/top-stories-today-in-andhra-pradesh-and-telangana-breaking-news-on-21st-may-2026-247901</guid><description><![CDATA[&lt;p&gt;Breaking News: భారత ప్రధానమంత్రి తన ఐదు దేశాల పర్యటనను పూర్తి చేసుకుని గురువారం తెల్లవారుజామున (మే 21) భారత్&amp;zwnj; తిరిగి వచ్చారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలలో విజయవంతమైన దౌత్య పర్యటనల అనంతరం ప్రధాని మోదీ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలు దేశానికి అత్యంత ముఖ్యమైనవిగా అభివర్ణిస్తున్నారు. ఇంధన భద్రత, సాంకేతిక సహకారం, వాతావరణ మార్పు, రక్షణ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం ఈ టూర్&amp;zwnj; ప్రధాన లక్ష్యాలు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాని మోదీ యూఏఈ పర్యటన వల్ల ఏం సాధించారు?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;2026, మే 15న, ప్రధాని మోదీ యూఏఈని సందర్శించారు. ఆయన ఐదు దేశాల పర్యటనలో ఇది మొదటి పర్యటన. ఈ పర్యటన సందర్భంగా, అబుదాబిలో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనతో, ఇరు దేశాలు రక్షణ సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లాయి. ఇందులో భాగంగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్య ఫ్రేమ్&amp;zwnj;వర్క్&amp;zwnj;పై సంతకాలు చేశాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్&amp;zwnj;కు 3 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును అందించడానికి, ఎల్&amp;zwnj;పిజిని సరఫరా చేయడానికి ఒప్పందం కుదిరింది. యూఏఈ భారత మార్కెట్లలో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్యాకేజీని ప్రకటించింది. అదనంగా, హోర్ముజ్ జలసంధి గుండా సురక్షిత ప్రయాణానికి ప్రధాని మోదీ, అధ్యక్షుడు నహ్యాన్ మద్దతు తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;Narenda Modi- Meloni Friendship:మరోసారి ఇంటర్&amp;zwnj;నెట్&amp;zwnj;ను షేక్&amp;zwnj; చేస్తున్న మెలోడీ|MELODI | ABP Desam&quot; src=&quot;https://www.youtube.com/embed/3IlNvbMirXE&quot; width=&quot;919&quot; height=&quot;517&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటన వల్ల ఒరిగిందేంటీ?&amp;nbsp;&lt;/h3&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ నెదర్లాండ్స్&amp;zwnj;లో కూడా పర్యటించారు, అక్కడ ఆయన సాంస్కృతిక, దౌత్య, ఆర్థిక రంగాలలో దేశానికి ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత అప్&amp;zwnj;డేట్ చేశారు. డచ్ ప్రభుత్వం చోళ సామ్రాజ్యానికి చెందిన 11వ శతాబ్దపు రాగి ఫలకాలను భారత్&amp;zwnj;కు అప్పగించింది. దేశంలో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఏర్పాటుకు, సాంకేతిక సహకారం కోసం ప్రముఖ కంపెనీలైన ఏఎస్ఎంఎల్, టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరింది.&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాని మోదీ స్వీడన్ పర్యటన ప్రయోజనం ఏంటీ?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ రెండు రోజులపాటు స్వీడన్&amp;zwnj;లో పర్యటించారు. ఆయన పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకెళ్లడం, జాయింట్ ఇన్నోవేషన్ పార్టనర్&amp;zwnj;షిప్ రెండో దశను, ఇండియా-స్వీడన్ టెక్నాలజీ అండ్ ఏఐ కారిడార్&amp;zwnj;ను ప్రారంభించడం, రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించడం వంటి అంశాలపై ఫలవంతమైన చర్చలు జరిగాయి. స్వీడన్ ప్రజలు, స్వీడన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్&amp;zwnj;సన్ చూపిన ఆప్యాయతకు, స్నేహానికి కృతజ్ఞతలు తెలిపారు.&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాని మోదీ నార్వే పర్యటన విశేషాలు ఇవే!&lt;/h3&gt;
&lt;p&gt;ప్రధాని మోదీ నార్వేలో చారిత్రాత్మక పర్యటన చేశారు. ఈ పర్యటన దేశానికి ఆర్థిక, వ్యూహాత్మక, సాంకేతిక, దౌత్య రంగాలలో అనేక ముఖ్యమైన విజయాలను అందించింది. భారత్, నార్వే తమ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం, హరిత వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ పర్యటన సందర్భంగా, ప్రధానంగా హరిత హైడ్రోజన్, పవన శక్తి, కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీలలో సహకారాన్ని పెంపొందించే రంగాలకు సంబంధించి మొత్తం 12 ప్రధాన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. దేశానికి 7,000 కిలోమీటర్లకుపైగా ఉన్న తీరప్రాంత అభివృద్ధి, హరిత నౌకాయానం, ఓడరేవు మౌలిక సదుపాయాలపై ఉమ్మడి కృషి, బాహ్య అంతరిక్షాన్ని శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించడంపై పరిశోధనల కోసం ఇస్రో, నార్వేల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h3&gt;ప్రధాని మోదీ తన ఇటలీ పర్యటన ద్వారా ఏమి పొందారు?&lt;/h3&gt;
&lt;p&gt;ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఐదు దేశాల పర్యటనను ఇటలీతో పూర్తి చేశారు. ఇక్కడ, ఆయన ప్రతిష్టాత్మకమైన విల్లా డోరియా పాంఫిలిలో ఇటలీ &amp;nbsp;ప్రధానమంత్రి జార్జియా మెలోనితో సమావేశమయ్యారు. ప్రధానమంత్రికి లాంఛనప్రాయ గౌరవ వందనం లభించింది. ప్రతినిధి బృందాల స్థాయి చర్చలు జరిగాయి. ఇద్దరు నాయకులు సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 అమలులో పురోగతిని సమీక్షించారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, రక్షణ, బ్లూ ఆర్థిక వ్యవస్థ, అనుసంధానం, విద్య రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి అంగీకరించారు. అంతేకాకుండా, భౌగోళిక రాజకీయాలకు సంబంధించిన పరిణామాలపై కూడా చర్చించారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/05/21/5d9627cde7d4c609c8eb8c2591ed49c41779328855291215_original.jpg" width="220"/></item></channel></rss>