అన్వేషించండి

YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?

YSRCP Leader Ambati Rambabu: వైసీపీ లీడర్ అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో ఒకదాంట్లో బెయిల్ వచ్చింది. ఇంకా చాలా కేసులు ఉన్నందున ఇంకా జైల్లో ఉండాల్సి వస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

YSRCP Leader Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరు ఉన్న మాజీ మంత్రి , వైసీపీ లీడర్ అంబటి రాంబాబుకు కాస్త ఊరట లభించింది. ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్న ఆయనకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆయన విడుదల కావడం లేదు. అసలు రాంబాబుకు ఏ కేసులో బెయిల్ వచ్చింది? ఆయన ఇంకా జైలులోనే ఎందుకు ఉండాల్సి వస్తోంది? 

గుంటూరు జిల్లాలో నమోదైన ఒక కేసు విషయంలో అంబటి రాంబాబుకు గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణ చేసిన న్యాయస్థానం ఆయనకు బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఆయనకు, వైఎస్‌ఆర్‌ సీపీ శ్రేణులకు కొంత ఉపశమనం కలిగించే విషయమే. 

రిమాండ్‌లోనే ఎందుకు ఉండాలి?

కోర్టు బెయిల్ ఇచ్చింది కదా, మరి అంబటి రాంబాబు జైలు నుంచి ఎందుకు విడుదల కావడం లేదని సందేహం చాలా మందికి ఉంటుంది. దానికి ప్రధాన కారణం పీటీ వారెంట్. అంబటి రాంబాబుపై కేవలం ఒక్క కేసు మాత్రమే లేదు. ఆయనపై మరికొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి పీటీ వారెంట్లు ఉండటంతో ఆయన ప్రస్తుతానికి రిమాండ్‌లోనే కొనసాగాల్సి ఉంటుంది. 

చట్ట ప్రకారం, ఒక వ్యక్తిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నప్పుడు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తేనే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అంబటి రాంబాబుకు ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ, మిగిలిన కేసుల్లో కూడా బెయిల్ మంజూరు అయితే తప్ప ఆయన విడుదల సాధ్యం కాదు. 

రాజకీయంగా ఈ కేసు ప్రాముఖ్యత 

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వివిధ స్కామ్‌లు, చేసిన కామెంట్స్‌పై గత ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీ కీలక నేతలపై కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలు ఆధారంగా చేసుకొని పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అంబటి రాంబాబు తన కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చారు. ఇప్పుడు అదే వ్యాఖ్యు ఆయనను చట్టపరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. 

ప్రస్తుతానికి అంబటి రాంబాబు గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో బెయిల్ పొందినప్పటికీ మరికొన్ని కేసుల్లో పీటీ వారెంట్ జారీ అయినందున విడుదల ఇప్పట్లో లేదనే చెప్పాలి. వాటిలో కూడా బెయిల్ వస్తేనే ఆయనకు విడుదల ఉంటుంది. 

మరోవైపు గతేడాది నవంబర్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆయన ర్యాలీ చేపట్టారు. ఆ ర్యాలీలో పోలీసు అధికారులను దూషించారని అప్పట్లోనే పోలీసులు కేసు పెట్టారు. ఆ కేసులో ఆయనపై పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ కేసులో ఆయనకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు అంబటి రాంబాబుపై 44 కేసులు ఉన్నాయి. వాటి అన్నింటిలో కూడా పోలీసులు పీటీ వారెంట్ జారీ చేస్తున్నారు. 

Frequently Asked Questions

అంబటి రాంబాబుకు ఏ కేసులో బెయిల్ మంజూరైంది?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరు జిల్లాలో నమోదైన కేసులో అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది.

అంబటి రాంబాబు ఇంకా జైలులోనే ఎందుకు ఉన్నారు?

అంబటి రాంబాబుపై వేరే కేసుల్లో కూడా పీటీ వారెంట్లు ఉన్నాయి. అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తేనే ఆయన విడుదల అవుతారు.

చట్ట ప్రకారం, ఒక వ్యక్తికి ఒకే కేసులో బెయిల్ వస్తే విడుదల అవుతారా?

కాదు, ఒక వ్యక్తిపై ఒకటి కంటే ఎక్కువ కేసులు ఉన్నప్పుడు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తేనే జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత ప్రభుత్వంలో వైసీపీ నాయకులపై కేసులు నమోదు కావడానికి కారణమేమిటి?

గత ప్రభుత్వంలోని మంత్రులు, వైసీపీ కీలక నేతలు చేసిన స్కామ్‌లు, వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం మారిన తర్వాత కేసులు నమోదు అవుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

MP Putta Mahesh Kumar: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. దుష్ప్రచారాలు నమ్మవద్దన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ 
TDP MP Putta Mahesh Kumar: డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబు చిత్తశుద్ధిపై షర్మిల ప్రశ్నలు
డ్రగ్స్ తీసుకున్న టీడీపీ ఎంపీ రాజీనామాకు వైసీపీ డిమాండ్.. చంద్రబాబుకు షర్మిల సూటి ప్రశ్న
Viral News:
"గుండెల నిండా దమ్ముతో ఎదురించాలి, జెండా ఎగరేయాలి" జనసేన ఆవిర్భావం రోజున ఓ బామ్మ కామెంట్స్ వైరల్‌!
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలివే
Advertisement

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Embed widget