విజయవాడ డివిజన్‌ మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే శాఖ ప్రకటించింది. విజయవాడ పరిధిలో జరుగుతున్న రైల్వే పనులు కారణంగా కొన్నింటిని రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లించినట్టు అధికారులు ప్రకటించారు. సోమవారం నుంచి అంటే డిసెంబర్‌ 4 నుంచి ఈ ప్రకటన అమలులోకి రానుందని తెలిపారు.