<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0" xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/" xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/" xmlns:dc="http://purl.org/dc/elements/1.1/" xmlns:atom="http://www.w3.org/2005/Atom" xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/" xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/" xmlns:media="http://search.yahoo.com/mrss/"><channel><title>vijayawada</title><atom:link href="https://telugu.abplive.com/vijayawada/feed" rel="self" type="application/rss+xml"/><link>https://telugu.abplive.com/</link><description/><lastBuildDate>Tue, 18 Aug 2026 17:13:46 +0530</lastBuildDate><language>en-US</language><sy:updatePeriod>hourly</sy:updatePeriod><sy:updateFrequency>1</sy:updateFrequency><generator>https://telugu.abplive.com</generator><item><title><![CDATA[Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-repeated-absence-andhra-pradesh-cabinet-meetings-political-differences-with-tdp-leaders-256620</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-repeated-absence-andhra-pradesh-cabinet-meetings-political-differences-with-tdp-leaders-256620#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 13:17:44 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/pawan-kalyan-repeated-absence-andhra-pradesh-cabinet-meetings-political-differences-with-tdp-leaders-256620</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Pawan Kalyan:&lt;/strong&gt; ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో మరో 15ఏళ్లు కూటమి అధికారంలో ఉంటుంది, ప్రతి వేదికపై నేతలు చెబుతున్న మాట. కానీ లోలోపల మాత్రం చాలా గడబిడ జరుగుతోందని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj; వ్యవహార శైలి ఈ విభేదాలను ఎత్తి చూపుతోంది. ఆయన వరుసగా నాలుగు సార్లు కేబినెట్ సమావేశాలకు గైర్హాజరయ్యారు. ఆరోగ్య కారణాలతో సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. భోగాపురం ఎయిర్&amp;zwnj;పోర్ట్ ప్రారంభోత్సవం రోజు తప్ప ఈ మధ్య కాలంలో పవన్, చంద్రబాబు వేదిక పంచుకున్న కార్యక్రమం ఒకటీ లేదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పించే అంశంపై నిర్వహించిన మంత్రిమండలి భేటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్&amp;zwnj; సమావేశమైంది. ఇచ్చిన హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ ఆమోదం తెలిపేందుకు మంత్రులు చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్&amp;zwnj; గైర్హాజరయ్యారు. ఫీవర్ కారణంగానే ఆయన ఈ భేటీలో పాల్గోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నప్పటికీ దీని వెనుక బలమైన కారణం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కీలకమైన సమావేశాలకు పవన్ కల్యాణ్ డుమ్మా కొట్టడం చాలా కాలం నుంచి సాగుతోంది. ఇప్పుడు వారం పది రోజుల్లోనే మూడు నాలుగు కీలక భేటీలకు ఆయన హాజరుకాలేదు. దీంతో తెలుగుదేశంతో &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt;ానికి విభేదాలు వచ్చాయా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు అసెంబ్లీ కీలక అంశాలపై చర్చించారు. అందులో ఒకటి డీఎస్సీ ఆరోపణలపై ప్రభుత్వం చర్చ ప్రారంభించింది. ఇది కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశం. దీనికి కూడా ఉప ముఖ్యమంత్రి రాలేదు. గత వారం అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవంలో కూడా పవన్ కల్యాణ్ పాల్గొనలేదు. ఆయన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అదే రోజు విశాఖలో జరిగిన ఏనుగుల దినోత్సవంలో పవన్ పాల్గొన్నారు. తన భుజం సర్జరీ, తన తల్లి అనారోగ్యం కారణంగా కేబినెట్ భేటీలకు రాలేదు. తర్వాత ఒకసారి నడుంనొప్పి ఉందని కూడా మంత్రివర్గం సమావేశం జరుగుతుండగానే మధ్యలోనే వెళ్లిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;పదే పదే కీలక సమావేశాలకు పవన్ డుమ్మా కొడుతుండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు దేశంపై పవన్ కల్యాణ్ అలిగారని ప్రచారం జరుగుతోంది. కీలకమైన నేతతో ఆయనకు విభేదాలు ఉన్నాయని అంటున్నారు. ప్రశ్న రావణ్&amp;zwnj; అరెస్టు లాంటి విషయాల్లో తెలుగుదేశం తీసుకున్న స్టాండ్&amp;zwnj;తో పవన్ విభేదించినట్టు తెలుస్తోంది. రావణ్&amp;zwnj;కు పదే పదే బెయిల్ వస్తుండటం, పోలీసులు సరిగా వ్యవహరించలేదని కూడా అన్నట్టు సమాచారం. ఈ విషయంలో సీరియస్&amp;zwnj;గా ఉండకపోతే తన సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చినట్టు కూటమి వర్గాలు చెబుతున్నాయి. పవన్ మొదటి నుంచి లా అండ్ ఆర్డర్ విషయంలో అభ్యంతరాలు చెబుతూనే ఉన్నారు. తన చేతిలో ఉండి ఉంటే వైసీపీ నాయకులకు చుక్కలు చూపించేవాడినని ఆయన స్వయంగా అన్నారు. అనిత పని తీరుపై కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారని అందుకే ఆ శాఖను టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు.&lt;/p&gt;
&lt;p&gt;పవన్ కల్యాణ్&amp;zwnj;కు ఇబ్బంది లేకుండా, కోపం రాకుండా ఉండేందుకు చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే మంత్రిపదవి ఇవ్వలేని పరిస్థితుల్లో నాగబాబుకు మంత్రి హోదాలో ఉండేలా ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చారని టాక్. ఇదంతా కూడా పవన్&amp;zwnj;ను సంతృప్తిపరిచే పనిలో భాగమని అంటున్నారు. గతంలోనే నాగబాబుకు మంత్రిపదవి ఇస్తానని బహిరంగ వేదికపై చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇంత వరకు అది చేయలేదు. అందుకే ఆ విషయంలో పవన్&amp;zwnj;కు కోపం వచ్చిందేమో అని నాగబాబుకు కీలక పదవి అప్పగించారు.&lt;/p&gt;
&lt;p&gt;ఎన్ని చేసినా ప్రస్తుతానికి ఉప ముఖ్యమంత్రి శాంతించడం లేదని తెలుస్తోంది. అందుకే కీలకమైన సమావేశాలకు ఆయన రావడం లేదని సమాచారం. ఎక్కడెక్కడో జరిగిన ప్రారంభోత్సవాలకు, ఇతర ఈవెంట్లకు సోషల్ మీడియాలో పెట్టి చప్పట్లు కొట్టే పవన్ కల్యాణ్, రాజధాని అమరావతి సీడ్&amp;zwnj;యాక్సెస్&amp;zwnj; రోడ్డు ప్రారంభోత్సానికి సంబంధించి ఒక్క ట్వీట్ చేయలేదు. ఇవన్నీ చూస్తుంటే &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, &lt;a title=&quot;పవన్ కల్యాణ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Pawan-Kalyan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;పవన్ కల్యాణ్&lt;/a&gt; మధ్య ఉన్న విభేదాలు ఇప్పట్లో చల్లారేలా లేవని అంటున్నారు. &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/be867cbb45715a52e674114bdcee50f41787039180177215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!]]></title><link>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</link><comments>https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589#respond</comments><pubDate>Tue, 18 Aug 2026 07:58:22 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ జాబ్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/jobs/andhra-pradesh-teacher-recruitment-dsc-notification-3000-posts-nara-lokesh-256589</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;AP DSC Notification 2026:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న లక్షలాది మంది మంత్రి నారా లోకేష్ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఎప్పుడు ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారో చెబుతూ క్యాలెండర్ ప్రకటించారు. దాని ప్రకారం అక్టోబర్&amp;zwnj;లో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 3000 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ రాబోతోందని ఆయన తెలిపారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ వేదికగా లోకేష్&amp;zwnj; ప్రకటన&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; శాసనసభ వర్షాకాల సమావేశాల్లో భాగంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్&amp;zwnj; &amp;nbsp;ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టమైన రోడ్డు మ్యాప్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా రాబోయే అక్టోబర్&amp;zwnj; నెలలో 3000 పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుందని ప్రకటించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఉపాధ్యాయ- విద్యార్థి నిష్పత్తిని మెరుగుపరచడం ద్వారా విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ప్రతి ఏటా డీఎస్సీ&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన మరో అంశం యాన్యువల్ డీఎస్సీ, ఇప్పటివరకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియక అభ్యర్థులు పడే మానసిక ఒత్తిడిని తొలగించడానికి, ప్రతి సంవత్సరం నిర్ధిష్ట సమయంలో నోటిఫికేషన్ విడుదల చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీని వల్ల అభ్యర్థులు తమ ప్రిపరేషన్&amp;zwnj;ను ప్రణాళికాబద్ధంగా కొనసాగించుకోడానికి వీలు అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్&amp;zwnj;-2, డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియలో ముందంజలో ఉన్నట్టు అసెంబ్లీలో వెల్లడించింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;నియామకాల్లో పారదర్శకత&lt;/h2&gt;
&lt;p&gt;నియామక ప్రక్రియలో ఎటువంటి అక్రమాలకు తావులేకుండా వంద శాతం పారదర్శకత పాటిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని, జిల్లాల వారీగా ఉన్న ఖాళీలు, రిటైర్మెంట్&amp;zwnj;లు, పదోన్నతలు ఆధారంగా నోటిఫికేషన్ డిజైన్ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గతంలో ఎదురైన న్యాయపరమైన ఆటంకాలను, దాదాపు 336 కోర్టు కేసులను అధిగమించి గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీని 148 రోజుల్లోనే రికార్డు స్థాయిలో పూర్తి చేసినట్టు గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ&lt;/h2&gt;
&lt;p&gt;ఉపాధ్యాయులకు కేవలం పాఠశాలలకు పరిమితం కాకుండా, వారికి అత్యాధునిక బోధనా పద్ధతుల్లో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఏపీ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి దేశాలకు పంపి అంతర్జాతీయ ఎక్స్&amp;zwnj;పోజర్ కల్పించనున్నారు. అక్టోబ్&amp;zwnj;లో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు నిర్వహించి ఉగాది పండుగ నాటికి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి వీరందరూ విధుల్లో చేరనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/18/26826903dd147be88738a2f7b510cf721787019858734215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP CM Chandrababu Speech: ఎల్‌నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. అక్కడ మాత్రమే వరి వేయాలని రైతులకు సూచనలు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 21:20:16 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-cm-chandrababu-highlights-severe-drought-and-el-nino-impact-in-ap-legislative-council-256579</guid><description><![CDATA[&lt;p&gt;అమరావతి: ఈ ఏడాది భారత్&amp;zwnj;లో పలు రాష్ట్రాల్లో ఎల్ నినో తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆగస్టు నెల సగం పూర్తయినా లోటు వర్షపాతం కారణంగా రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో తీవ్ర ప్రభావం, నీటి సంక్షోభంపై మాట్లాడుతూ ఈ ఏడాది 35.5 శాతం లోటు వర్షపాతం ఉంటుందని నిపుణులు అంచనా వేశారని రైతులకు కీలక సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలోనూ తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి లభ్యత తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోటు వర్షపాత పరిస్థితుల కారణంగా రైతులు అన్ని ప్రాంతాల్లో వరి వేసి ఇబ్బంది పడొద్దని సూచించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;గోదావరి బేసిన్ మినహా ఇతర ప్రాంతాల్లో వరి వద్దు!&lt;/strong&gt;&lt;br /&gt;గోదావరి నదికి మాత్రమే కొంత వరద నీరు వస్తోందని తెలిపారు. కనుక గోదావరి బేసిన్ మినహా మిగిలిన ఏ ప్రాంతంలోనూ వరి పంటలు వేస్తే, పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ విషయాన్ని రైతులు గ్రహించి నీటిని అత్యంత పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదవుతుందని రైతులు అర్థం చేసుకుని, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మంచిదన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు వారి ప్రాంతాల్లో ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/0c6deb82229a002e4c9329fa640804a51786981200531233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూనే, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెడతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది దాదాపు 35.5 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులతో పాటు పెన్నా బేసిన్ వ్యాప్తంగా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, కొన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం 42 శాతానికి చేరిందన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;నీటి కొరతతో రాష్ట్రాల మధ్య వివాదాలు&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;నీటి కొరత వల్ల రాష్ట్రాల మధ్య వివాదాలు, విభేదాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా ఏపీ ప్రభుత్వం నీటి నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రాలైన &lt;a title=&quot;కర్ణాటక&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Karnataka&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;కర్ణాటక&lt;/a&gt;, మహారాష్ట్రలలో కూడా వర్షపాతం తగ్గడంతో అక్కడి రిజర్వాయర్లు నిండిన తర్వాతే మన రాష్ట్రానికి నీరు వస్తుందని తెలిపారు. దీనివల్ల కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీటి ప్రవాహం భారీగా తగ్గిందని ఆయన వివరించారు. ఉదాహరణకు శ్రీశైలానికి సాధారణంగా రావాల్సిన 753 టీఎంసీల నీటికి గాను ఈ ఏడాది కేవలం 214 టీఎంసీలు మాత్రమే వచ్చాయని తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;జూన్ నుంచి డిసెంబర్ మధ్య సాధారణంగా పడాల్సిన 867 మిల్లీమీటర్ల వర్షపాతానికి బదులుగా కేవలం 557 మి.మీ మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందన్నారు. జులై నుంచి నవంబర్ వరకు &amp;nbsp;20 శాతం నుండి 68 శాతం వరకు లోటు వర్షపాతం ఉంటుందని, డిసెంబర్&amp;zwnj;లో మాత్రమే స్వల్పంగా సాధారణ వర్షపాతం ఉండవచ్చని వివరించారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుందని.. కొన్ని జిల్లాల్లో జులైలో 68 శాతం లోటు వర్షపాతం నమోదు కాగా, ఆగస్టులో 35 శాతం, సెప్టెంబర్ నెలలో 35 శాతం, అక్టోబర్&amp;zwnj;లో 25 శాతం, నవంబర్&amp;zwnj;&amp;zwnj; నెలలో 20 శాతం మేర లోటు వర్షపాతం నమోదు కానుందని అంచనాలు వివరించారు. &amp;nbsp;నీటి కొరత ముప్పు తీవ్రంగా ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; హెచ్చరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/e020b81666993aefcbcfe68bc98679421786981067447233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! ]]></title><link>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</link><comments>https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 16:23:03 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ పాలిటిక్స్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/politics/bjp-national-executive-ap-telangana-leaders-political-strategy-cabinet-expansion-256555</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh and Telangana BJP:&amp;nbsp;&lt;/strong&gt;సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని అధిష్ఠానం ప్రకటించింది. నితిన్ జట్టులోకి తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం ఇద్దరికే చోటు దక్కింది. ఆ ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన వారే. రామ్&amp;zwnj;మాధవ్&amp;zwnj;కు చోటు దక్కినా ఆయన ఢిల్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలంగాణ నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు లభించలేదు. అంతేకాకుండా మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ఉన్న డీకే అరుణకు కూడా చోటు కల్పించలేదు. అయితే ఈ మార్పులు చేర్పులపై ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు చెందిన నేతలు కాస్త నిరాశ చెందుతుంటే, తెలంగాణకు చెందిన నేతలు మాత్రం ముసిముసి నవ్వులు నవ్వుతూ ఫుల్&amp;zwnj; ఖుష్ అవుతున్నారు. పదవులు రాని వారందరూ ఎందుకు ఆనందపడుతున్నారో చూద్దాం. &amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీలో అన్&amp;zwnj;హ్యాపీ- తెలంగాణలో హ్యాపీ&lt;/h2&gt;
&lt;p&gt;మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు ఏవైనా సరే ఒక లీడర్&amp;zwnj;కు బూస్ట్ ఇస్తాయి. తన ప్రాంతంలో పెట్టు మరింత పెంచుకోవడానికి సహకరిస్తాయి. అందుకే పదవుల కోసం గ్రామస్థాయి లీడర్ నుంచి జాతీయ స్థాయి నాయకుడి వరకు పోటీ పడుతుంటారు. లాబీయింగ్ చేస్తుంటారు. పదవులు రాని వారు మాత్రం విమర్శలు చేస్తారు. ఆలిగి కూర్చుంటారు. మరికొందరు తిరుగుబాటు చేస్తారు. బీజేపీ నేతల ఆలోచనలు మాత్రం వేరుగా ఉన్నాయి. త్వరలోనే జరిగే మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అందుకే తమను జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదని సంబరపడిపోతున్నారు. అదే తెలంగాణ నేతల్లో ఆనందాన్ని రెట్టింపు చేస్తే, ఆంధ్రప్రదేశ్ నేతల్లో నిరాశ నింపుతోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;ఏపీ బీజేపీ నేతలకు ఆమాత్యయోగం లేనట్టే!&lt;/h2&gt;
&lt;p&gt;పార్టీలు ఏ పని చేసినా దాని వెనుక రాజకీయ వ్యూహం కచ్చితంగా ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా అదే ఆలోచనతో పావులు కదుపుతోంది. వివిధ స్థాయి పదవులకు నాయకులను ఎంపిక చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో పార్టీని అధికారంలోకి వచ్చే బలం బలగం బీజేపీకి లేదు. అందుకే కూటమితో ప్రయాణం సాగిస్తోంది. అందుకే సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తూనే కూటమిని కూడా కాపాడుకోవాలని ఆలోచనతో వెళ్తోంది. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా ఆంధ్రప్రదేశ్&amp;zwnj;కు ఒక మంత్రి పదవి వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ మంత్రి పదవి ఇచ్చే క్రమంలో లెక్కలు పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పటికే మూడు మంత్రిపదవులు ఆ రాష్ట్రం నుంచే ఉన్నాయి. ఇందులో టీడీపీ లీడర్లు ఇద్దరు అయితే, మూడో వ్యక్తి బీజేపీ నుంచి ఎన్నికైన వ్యక్తే. టీడీపీ నుంచి శ్రీకాకుళం నుంచి ఎన్నికైన రామ్మోహన్ నాయుడు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉంటే, గుంటూరు నుంచి ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్&amp;zwnj; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. నరసాపురం నుంచి బీజేపీ గుర్తుపై గెలిచిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు భారీ పరిశ్రమల, ఉక్కు శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పించిన అధిష్ఠానం&lt;/h2&gt;
&lt;p&gt;ఇప్పుడు ఏపీకి ఇంకో పదవి ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా సీనియర్&amp;zwnj;, రాజమండ్రి నుంచి విజయం సాధించిన పురంధేశ్వరి పోటీకి వస్తారు. ఇవ్వాల్సిన మంత్రి పదవి ఈసారి కూటమి పార్టీల్లో ఒకరికి ఇవ్వాల్సిన మోదీ, అమిత్&amp;zwnj;షా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలా చేస్తే బీజేపీ కేడర్&amp;zwnj;ను నిరాశ పరచినట్టు అవుతుంది. అందుకే జాతీయ కార్యవర్గంలోకి పురంధేశ్వరిని తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను మంత్రిపదవి రేసు నుంచి తప్పించారు. దీంతో సమీకరణాలు లెక్కించడం బీజేపీకి, కూటమి పార్టీలకు ఈజీ అవుతుంది. అందుకే ఇది తెలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు ఒక్కసారిగా డీలా పడిపోయారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;తెలంగాణలో నేతల హ్యాపీకి కారణం!&lt;/h2&gt;
&lt;p&gt;తెలంగాణలో బీజేపీ నేతలు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటున్నారు. ఒక వేళ జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించి ఉంటే కచ్చితంగా తమ మంత్రిపదవి ఆశలపై నీళ్లు చల్లినట్టేనని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎవర్నీ ఎంపిక చేయకపోవడం వారంతా తమ లాబీయింగ్&amp;zwnj;ను మరింత తీవ్రం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్&amp;zwnj;తో పోల్చుకుంటే తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్టీ పదవులతో ఇక్కడి నేతలను డైవర్ట్ చేయలేమని గ్రహించి, వారి మంత్రి పదవుల ఆప్షన్&amp;zwnj;ను లైవ్&amp;zwnj;లో ఉంచింది. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కచ్చితంగా వారిని తీసుకుంటారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి మంత్రిపదవులు ఉన్నాయి. కిషన్ రెడ్డి గనుల శాఖను చూస్తున్నారు. మరో నేత &lt;a title=&quot;బండి సంజయ్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Bandi-Sanjay&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బండి సంజయ్&lt;/a&gt;&amp;zwnj; కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలు అందిస్తున్నారు. వీరితోపాటు ఇంకో మంత్రిపదవి తెలంగాణలు దక్కవచ్చని వార్తలు వస్తున్నాయి. అందుకే వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోలేదనే విశ్లేషణ వినిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;విష్ణువర్దన్ రెడ్డి పలుకుబడి!&lt;/h2&gt;
&lt;p&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో బీజేపీ యువ నేత విష్ణువర్దన్ రెడ్డి మాత్రం కాస్త హ్యాపీగా ఉన్నారు. ఆయన కరుడుగట్టిన &lt;a title=&quot;బీజేపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/BJP&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;బీజేపీ&lt;/a&gt; లీడరే అయినప్పటికీ ఆయన మనసు వైసీపీలో ఉంటుందని కూటమి నేతలు సెటైర్లు వేస్తుంటారు. అందుకే ఆయన్ని రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులకు కానీ, ఎన్నికల్లో పోటీకి కానీ &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt;, &lt;a title=&quot;జనసేన&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Janasena&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జనసేన&lt;/a&gt; అంగీకరించలేదు. నేరుగా ఆయనకు కేంద్రంలో ప్రత్యేక పదవులు ఇచ్చే పరిస్థితి లేదు. మధ్యేమార్గంగా ఆయన్ని డైరెక్ట్&amp;zwnj;గా నబీన్ టీంలోకి తీసుకున్నారు. దీంతో అధిష్ఠానం వద్ద ఆయన పలుకుబడి బాగానే ఉందని ప్రచారం మొదలైంది. ఇది ఆయనకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకుంటున్నారు.&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/f6776cb0dd10100a2bcd1c14c41ae34d1786963892353215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Chandra Babu About Mega DSC 2025: మెగా డీఎస్సీ2025 ఆరోపణలపై సాక్ష్యాలు ఉంటే సభ ముందు పెట్టండి, వైసీపీకి చంద్రబాబు సవాల్‌!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 15:03:30 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-mega-dsc-2025-irregularities-transparency-cm-chandra-babu-naidu-challenges-to-ysrcp-256547</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Chandra Babu About Mega DSC 2025: &lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్&amp;zwnj; అసెంబ్లీలో మెగా డీఎస్సీ 2025పై కీలకమైన చర్చ జరిగింది. ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. రోడ్లపై నిరసనలు తెలియజేస్తోంది. అధికారులు ఎప్పటికప్పుడు వారు చేస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే వస్తున్నారు. అయినా తమ ఆరోపణలను మాత్రం వారు ఆపడం లేదు. దీంతో అసెంబ్లీలోనే చర్చ పెట్టి పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే అసెంబ్లీలో విస్తృతంగా చర్చ సాగింది. ఇందులో మాట్లాడిన మంత్రులు, ముఖ్యమంత్రి వైసీపీ తీరును తప్పుపట్టారు. అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపించకుండా కేవలం బురద జల్లుతున్నారని, అపోహలు సృష్టించడమే వారి పని అని అంటూ మండిపడ్డారు. సాక్ష్యాలు ఉంటే పట్టుకొని సభకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సవాల్ చేశారు. ఈ ప్రభుత్వంలో తప్పులకు ఆస్కారం లేదని అలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. అదే టైంలో జరగని తప్పులు గురించి ఆధారాలు లేకుండా పదే పదే ఆరోపణలు చేసిన వారి కూడా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఎలాంటి తప్పులు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే మెగా డీఎస్సీ 2025 నియామకాలు పూర్తి అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చి చెప్పారు. తప్పులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ విషయం రాసిన అభ్యర్థులకు, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు తెలుసునని అన్నారు. అందుకే వైసీపీ ఎన్ని విధాలుగా తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నా పట్టించుకున్న వారు లేరని అభిప్రాయపడ్డారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;కేవలం వైసీపీ నేతలు మాత్రమే రోడ్డుపైకి వచ్చి నానాయాగి చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. వారు చేస్తున్న ఆరోపణలకు అధికారులు సాక్ష్యాలతో సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తున్న వైసీపీ నేతలకు స్పోర్ట్స్&amp;zwnj;కు గేమ్స్&amp;zwnj;కు తేడా తెలియదన్నారు. అందుకే ఏదో జరిగిపోయిందనే భ్రమల్లో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి అధికారులతోపాటు డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు కూడా రోడ్డుపైకి వచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారని, వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని గుర్తు చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నా వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు చంద్రబాబు. వారు అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ ఉద్యోగాల నోటఫికేషన్ వేయలేకపోయామనే కోపంతోనే ఇలాంటివి చేస్తున్నారని అన్నారు. తాము ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టు నోటిఫికేషన్ ఇచ్చామని, 108 రోజుల్లోనే ప్రక్రియను ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేశామని అన్నారు. ఇందులో భాగమైన అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞత తెలిపారు. ఇంత పకడ్బంధీగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేసినప్పటికీ వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. నిజంగా వారి వద్ద ఏమైనా ఆధారాలు ఉంటే కచ్చితంగా అసెంబ్లీకి వచ్చి వాటిని టేబుల్&amp;zwnj;పై పెట్టాలని సవాల్ చేశారు. రోడ్డుపై నిలబడి ఏవో కాగితాలు చూపించి ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;తమ ప్రభుత్వంలో తప్పుల చేసేందుకు ఆస్కారం లేదని అలాంటి తప్పులు ఉన్నట్టు నిరూపిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; అన్నారు. అదే టైంలో సాక్ష్యాలు లేకుండా పదే పదే తప్పుడు ఆరోపణలు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. తప్పులు జరిగి ఉంటే చర్యలు, సాక్ష్యాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేసినా చర్యలు ఉంటాయని వైసీపీ వాళ్లకు వార్నింగ్ ఇచ్చారు. ఇక డీఎస్సీపై క్లియర్&amp;zwnj;గా అన్ని వివరాలు చెప్పేశామని, ఇకపై దీని గురించి చర్చ అనవసరమని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. &amp;nbsp; &amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/459819c5b4ea23eceab5ca61520078461786958965147215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Nara Lokesh About Mega DSC: 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి, వైసీపీ విమర్శలకు టీచర్లే కౌంటర్ ఇచ్చారు]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 13:17:14 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/nara-lokesh-speaks-on-mega-dsc-2025-transparancy-and-educational-reforms-in-ap-assembly-256537</guid><description><![CDATA[&lt;p&gt;Nara Lokesh on Mega DSC 2025 |&amp;nbsp;అమరావతి: ఎంతో బాధ్యతగా తీసుకుని, కేవలం 148 రోజుల్లోనే డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంత్రి నారా లోకేష్ మెగా డీఎస్సీ-2025 నియామకాలు, విద్యా రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలపై కీలక ప్రసంగం చేశారు. డీఎస్సీ నియామకాలపై శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి విమర్శలకు చెక్ పెట్టారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;టీచర్లను కూటమి విదేశాలకు పంపితే.. వైసీపీ హయాంలో వైన్స్ వద్ద ఉంచారు..&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;అసెంబ్లీలో నారా లోకేష్ మాట్లాడుతూ.. &amp;lsquo;రాష్ట్రంలో నిరుద్యోగుల కోసం ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియను ఎంతో బాధ్యతగా నిర్వర్తిస్తున్నాం. సీఎం నారా &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt; నాయుడు ఆకాంక్ష మేరకు టీచర్ల నియామకాలు, బదిలీలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాం. ఇప్పటివరకు &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; ప్రభుత్వాల హయాంలో మొత్తం 1.80 లక్షల టీచర్ పోస్టులను భర్తీ చేశాం. &amp;nbsp;టీచర్లలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు కూటమి ప్రభుత్వం వారిని సింగపూర్, ఫిన్&amp;zwnj;లాండ్ వంటి విదేశాలకు పంపించాం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీచర్లను మద్యం దుకాణాల వద్ద నిలబెట్టి, వారి గౌరవాన్ని భంగపరిచేలా చేశారని&amp;rsquo; &amp;nbsp;విమర్శించారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/dVMH5-s5nYs?si=XTPE2KnhaZE_Z3L_&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;దేశ చరిత్రలో తొలిసారిగా వర్టికల్, హారిజాంటర్ రిజర్వేషన్&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ప్రజలందరికీ పూర్తి స్వేచ్ఛ ఉందని, వ్యవస్థను ఎవరైనా ప్రశ్నించవచ్చని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్ల అమలుపై భిన్నాభిప్రాయాలు ఉన్నవారు కోర్టులను ఆశ్రయించగా, 336 కేసులు నమోదైనప్పటికీ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని చర్చ సందర్భంగా తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా డీఎస్సీలో వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకాలు అత్యంత పారదర్శకంగా జరగడం వల్లే వేలాది మంది టీచర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఇందులో భాగంగా వైసీపీ చేస్తున్న విమర్శలను ఖండిస్తూ, విజయవాడలో మెగా డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లు భారీ ఆత్మగౌరవ ర్యాలీ చేశారని&amp;rsquo; మంత్రి లోకేష్ &amp;nbsp;వివరించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/6f1867abc280632f094682559cb50dab1786951815846233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Assembly Session: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం, మండలిలో మెగా డీఎస్సీపై వైసీపీ ప్రశ్నలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-assembly-monsoon-sessions-begin-speaker-ayyanna-patrudu-to-chair-bac-meeting-256508</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-assembly-monsoon-sessions-begin-speaker-ayyanna-patrudu-to-chair-bac-meeting-256508#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 09:46:07 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/ap-assembly-monsoon-sessions-begin-speaker-ayyanna-patrudu-to-chair-bac-meeting-256508</guid><description><![CDATA[&lt;p&gt;AP Assembly Monsoon Sessions | అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 4 రోజులపాటు ఈ సెషన్ లో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది.&amp;nbsp; తొలిరోజున ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో మొదలయ్యాయి. సభలో ప్రజా సమస్యలు, వివిధ శాఖల సమర్థతపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 7 కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.&lt;/p&gt;
&lt;p&gt;సోమవారం ఉదయం 10:30 గంటల తర్వాత లంచ్ బ్రేక్ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) భేటీ కానుంది. ఈ సమావేశాలు ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, సభలో ఏయే ముఖ్యమైన అంశాలపై చర్చించాలనే విషయాలపై ఈ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశముంది.&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;శాసనమండలిలో వైసీపీ ప్రశ్నల వర్షం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;ఎగ్జామ్ లేకుండానే డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. మెగా డీఎస్సీలో అవకతవకలపై చర్చ జరగాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైఎస్సార్&amp;zwnj;సీపీ ఎమ్మెల్సీలు చెబుతున్నారు. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని ప్రతిపక్షం గట్టిగా డిమాండ్ చేస్తోంది. అదేవిధంగా ఈ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్&amp;zwnj;సీపీ డిమాండ్ చేస్తోంది. ఉదయం 10 గంటలకు శాసనమండలి ప్రారంభమైంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;Also Read: &lt;a href=&quot;https://telugu.abplive.com/politics/ap-tdp-janasena-alliance-social-media-war-damage-control-256420&quot; target=&quot;_blank&quot; rel=&quot;noopener&quot;&gt;TDP Janasena Social Media War: క్షేత్రస్థాయిలో పాలనలో సమన్వయం .. సోషల్ మీడియాలో సెల్ఫ్ గోల్ ! కూటమి సోషల్ వార్&amp;zwnj;ను అరికట్టడం ఎలా?&lt;/a&gt;&lt;/p&gt;
&lt;p&gt;శాసన మండలి ప్రారంభానికి ముందు వైఎస్సార్&amp;zwnj;సీపీ ఎమ్మెల్సీలు నిరసన ప్రదర్శనగా మండలిలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. డీఎస్సీ ప్రక్రియలోని లోపాలపై వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పి. రామాంజనేయులు (రామచంద్రారెడ్డి) మండలి చైర్మన్&amp;zwnj;కు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;ఈ సందర్భంగా వైఎస్సార్&amp;zwnj;సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై నిష్పక్షపాత విచారణ సాగాలంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పూర్తి వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా మరియు తమకు నచ్చిన రీతిలో నిబంధనలను, జీవోలను సవరించడం ఎంతవరకు న్యాయమని నిలదీశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అవుట్&amp;zwnj;సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగికి మొదటి ర్యాంక్ రావడం వెనుక అనేక అనుమానాలు ఉన్నాయని, మంత్రి తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/5b5b5cae915619f75262a7326dfb83731786939868032233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500#respond</comments><pubDate>Mon, 17 Aug 2026 07:56:02 +0530 </pubDate><dc:creator><![CDATA[ Khagesh ]]></dc:creator><category><![CDATA[ అమరావతి ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/amravati/andhra-pradesh-assembly-sessions-mega-dsc-nara-lokesh-key-bills-amaravati-256500</guid><description><![CDATA[&lt;p&gt;&lt;strong&gt;Andhra Pradesh Assembly Sessions:&amp;nbsp;&lt;/strong&gt;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్&amp;zwnj; ఎస్ అబ్దుల్&amp;zwnj; నజీర్&amp;zwnj; నోటిఫికేషన్ మేరకు ఉదయం 9 గంటలకు శాసనసభ, పది గంటలకు శాసన మండలి కొలువుదీరనున్నాియ. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అత్యంత కీలకమైన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు ప్రజా ప్రాధాన్యత కలిగి అంశాలను సభ ముందుకు తీసుకురానుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;సమావేశాల అజెండా&lt;/h2&gt;
&lt;p&gt;ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ సమావేశాలు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతను శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ కానుంది. ఈ కమిటీ సమావేశాల కాలవ్యవధిని, ప్రతి రోజూ చర్చించాల్సిన అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఈసారి సమావేశాల్లో ఒక నూతన సాంకేతిక విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన సీట్లలో కూర్చుంటే వారి హాజరు నమోదు అయ్యేలా డిజిటల్ ఏర్పాట్లు చేశారు. భద్రత దృష్ట్యా అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మీడియా, సిబ్బందికి డిజిటల్ పాస్&amp;zwnj;లనను తప్పనిసరి చేశారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;మండలిలో మెగా డీఎస్సీపై వార్&lt;/h2&gt;
&lt;p&gt;మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు జరిగాయని చాలా కాలంగా వైసీపీ ప్రచారం చేస్తోంది. మండలిలో కూడా దీనిపై నిలదీయాలని చూస్తోంది. అందుకే తొలి రోజే మెగా డీఎస్సీపై మంత్రి నారా లోకేష్&amp;zwnj; సభలో ప్రకటన చేయనున్నారు. పారదర్శకంగా ఎలా నిర్వహించారో పవర్&amp;zwnj;పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నారు. దీంతో ఈ వివాదానికి పుల్&amp;zwnj;స్టాప్ పెట్టి భవిష్యత్&amp;zwnj;లో చర్చ లేకుండా చేయాలని అధికార పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;కీలక బిల్లులు ఆమోదం&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;ఈ సమావేశాల్లో ప్రభుత్వం సుమారు 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని 34శాతానికి పెంచుతూ ప్రభుత్వం బిల్లు తీసుకురానుంది. దీనిపై డెడికేటెడ్&amp;zwnj; కమిషన్ ఇచ్చిన నివేదికను ఆగస్టు 18న మంత్రిమండలి ఆమోదించి, అదే రోజు సభలో చర్చకు పెట్టనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;మున్సిపల్ మేయర్లు, చైర్మన్&amp;zwnj;ను నేరుగా ప్రజలే ఎన్నుకునే ప్రత్యక్ష ఎన్నికల విధానానికి సంబంధించి చట్ట సవరణ చేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టాన్ని ఉపసంహరించుకుని, మహిళలు, బాలికల భద్రత కోసం మరింత పటిష్టమైన నిబంధనలను ప్రభుత్వం రూపొందించనుంది. ఏపీ విద్యుత్ శాసనాలు-2019 బిల్లును ఉపసంహరించుకుంటూ సంబంధిత శాఖ మంత్రులు కొత్త ప్రతిపాదనలు చేయనున్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి&lt;/h2&gt;
&lt;p&gt;రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం తన కార్యాచరణను సభలో వివరించే ఛాన్స్ ఉంది. క్వాంటమ్&amp;zwnj; వ్యాలీ ట్విన్ టవర్స్&amp;zwnj;, రైల్వే రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించనుంది. అలాగే, పెట్టుబడులను ఆకర్షించేందుకు రూపొందించిన ఏపీ పీపీపీ పాలసీ 2026 గురించి కూడా చర్చ జరగనుంది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;h2&gt;అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ దూరం- స్పీకర్ హెచ్చరిక&amp;nbsp;&lt;/h2&gt;
&lt;p&gt;గత సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా వైసీపీ సభ్యులు సభకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని, సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇవ్వరని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యను స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఖండించారు. సభకు రాకుండా సమయం ఇవ్వడం లేదనడం సరికాదన్నారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt;&amp;zwnj;కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడానికి లేదని, కానీ సభకు వస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కల్పిస్తాం, సమాధానం చెప్పించే బాధ్యత తనది అన్నారు. ఎమ్మెల్యే క్వార్టర్లపై వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్&amp;zwnj;పై కూడా స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/17/3a34975dfe5d931e1a8be4e48229db261786933483287215_original.jpg" width="220"/></item><item><title><![CDATA[DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్]]></title><link>https://telugu.abplive.com/andhra-pradesh/dsc-2025-teachers-hold-self-respect-rally-in-vijayawada-against-ysrcp-allegations-256477</link><comments>https://telugu.abplive.com/andhra-pradesh/dsc-2025-teachers-hold-self-respect-rally-in-vijayawada-against-ysrcp-allegations-256477#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 15:25:45 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ ఆంధ్రప్రదేశ్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/andhra-pradesh/dsc-2025-teachers-hold-self-respect-rally-in-vijayawada-against-ysrcp-allegations-256477</guid><description><![CDATA[&lt;p&gt;DSC 2025 Teachers Rally in Vijayawada | ఏపీలో మెగా డీఎస్సీపై అధికార కూటమి పార్టీలు, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, పారదర్శకంగా టీచర్ పోస్టులను భర్తీ చేశామని సీఎం &lt;a title=&quot;చంద్రబాబు&quot; href=&quot;https://telugu.abplive.com/topic/Chandrababu&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;చంద్రబాబు&lt;/a&gt;, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహా మంత్రులు చెబుతున్నారు. కానీ మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని.. టీచర్ పోస్టుల భర్తీలో భారీగా అక్రమాలు, అవకతవకలు జరిగాయని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎప్పటికప్పుడూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో డీఎస్సీ 2025 విజేతలు ప్రభుత్వానికి మద్దతుగా విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. మెగా డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, పారదర్శకంగా రిక్రూట్&amp;zwnj;మెంట్ జరిగిందని వైఎస్ జగన్ వీరాభిమాని చెప్పడం హాట్ టాపిక్ అయింది.&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు వైఎస్సార్సీపీ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ, వారి ఆరోపణలకు వ్యతిరేకంగా విజయవాడ నగరంలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ ఆదివారం (ఆగస్టు 16న) నిర్వహించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ ప్రదర్శన స్వరాజ్ మైదాన్&amp;zwnj;లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వరకు సాగింది. తమది ప్రతిభ ఆధారంగా సాధించిన ఏపీ మెగా డీఎస్సీ అని, పోస్టుల భర్తీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేస్తూ టీచర్లు నినాదాలతో హోరెత్తించారు. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/f662d673f070a89bf6154a8c6c6c7c571786873854088233_original.jpg&quot; /&gt;&lt;/p&gt;
&lt;p&gt;వైఎస్సార్సీపీ నేతలు తమ ప్రతిభను కించపరిచేలా బురదచల్లడం మానుకోవాలని, లేకపోతే రాబోయే రోజుల్లో పాఠాలతో పాటు రాజకీయ గుణపాఠాలు కూడా చెబుతామని ప్లకార్డులు పట్టుకుని హెచ్చరించారు. అహర్నిషలు శ్రమించి, ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన తమపై విషప్రచారం ఆపాలని డిమాండ్ చేస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు. ఈ ర్యాలీలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొని తమ నిరసన తెలిపారు.&lt;/p&gt;
&lt;p&gt;&lt;iframe title=&quot;YouTube video player&quot; src=&quot;https://www.youtube.com/embed/FepsW9jGm-k?si=ostAWU4jpQmZBwdf&quot; width=&quot;560&quot; height=&quot;315&quot; frameborder=&quot;0&quot; allowfullscreen=&quot;allowfullscreen&quot;&gt;&lt;/iframe&gt;&lt;/p&gt;
&lt;p&gt;&lt;br /&gt;&lt;img src=&quot;https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/db64a79ad3117db86eb1d6c56ac91d031786873825446233_original.jpg&quot; /&gt;&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;వైఎస్ జగన్ అభిమానిగా చెబుతున్నా.. ఎలాంటి అక్రమాలు జరగలేదు&lt;/strong&gt;&lt;br /&gt;ఓ అభ్యర్థి మాట్లాడుతూ.. మెగా డీఎస్సీలో తాను స్కూల్ అసిస్టెంట్ గా సెలక్ట్ అయ్యానని తెలిపారు. తాను చిన్నప్పటి నుంచి వైఎస్ జగన్ వీరాభిమానినని, &lt;a title=&quot;వాట్సాప్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/whatsapp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;వాట్సాప్&lt;/a&gt; డీపీ కూడా జగన్ ఫొటోనే ఉంటుందన్నారు. తాను &lt;a title=&quot;టీడీపీ&quot; href=&quot;https://telugu.abplive.com/topic/tdp&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;టీడీపీ&lt;/a&gt; కార్యకర్త, అభిమానిని కాదని.. ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకుంటే మా ఉద్యోగాలను అవమానించారు. కనుక ఈరోజు నుంచి నేను &lt;a title=&quot;జగన్&quot; href=&quot;https://telugu.abplive.com/topic/cm-jagan&quot; data-type=&quot;interlinkingkeywords&quot;&gt;జగన్&lt;/a&gt; అభిమానిని కాదని పేర్కొన్నారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;ఓ అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజమైపోతుందని అంతా నమ్ముతారు. కానీ వైసీపీ చేసిన ఆరోపణల్లో నిజం లేదని డీఎస్సీ 2025 విజేతలు అన్నారు. ఇది దగా డీఎస్సీ కాదని, మెగా డీఎస్సీ అని.. ఎంతో శ్రమించి తెచ్చుకున్న జాబ్స్ అని స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్లలో తిని కడుపు నింపుకుని ప్రిపేర్ అయి టీచర్ జాబ్ తెచ్చుకున్నానని ఓ అభ్యర్థి తెలిపారు. వైసీపీ హయాంలో నోటిఫికేషన్లు రాలేదని, కూటమి ప్రభుత్వం రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి పారదర్శకంగా పోస్టులను భర్తీ చేశారని పేర్కొన్నారు. భార్యా పిల్లల్ని దూరం చేసుకుని మరీ చదువుకుని ఉద్యోగాలు సాధించిన మమ్మల్ని అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/37d40f291ab72c3753799f5b371a99a61786872979138233_original.jpg" width="220"/></item><item><title><![CDATA[AP Local Body Elections: 2025 ఓటర్ల జాబితా ఆధారంగా ఏపీలో స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ నిర్ణయానికి కారణమిదే!]]></title><link>https://telugu.abplive.com/news/ap-local-body-elections-to-be-held-based-on-2025-sir-voter-lists-sec-timelines-announced-256473</link><comments>https://telugu.abplive.com/news/ap-local-body-elections-to-be-held-based-on-2025-sir-voter-lists-sec-timelines-announced-256473#respond</comments><pubDate>Sun, 16 Aug 2026 14:31:32 +0530 </pubDate><dc:creator><![CDATA[ Shankar Dukanam ]]></dc:creator><category><![CDATA[ న్యూస్ ]]></category><guid isPermaLink="true">https://telugu.abplive.com/news/ap-local-body-elections-to-be-held-based-on-2025-sir-voter-lists-sec-timelines-announced-256473</guid><description><![CDATA[&lt;p&gt;AP Local Body Elections |&amp;nbsp;అమరావతి: ఆంధ్రప్రదేశ్&amp;zwnj;లో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) తుది ఓటర్ల జాబితాలతో కాకుండా పాత ఓటర్ల జాబితా ఆధారంగానే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (AP SEC) నిర్ణయించింది. 2025 నాటి సర్ ఓటర్ల జాబితాల ఆధారంగానే పోలింగ్ జరగనుంది.&lt;/p&gt;
&lt;p&gt;అక్టోబరు 3న SIR తుది ఓటర్ల జాబితాలు ప్రచురితం చేయనున్నారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని స్థానిక సంస్థల్లో ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని భావిస్తే స్థానిక ఎన్నికల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతుందని భావించి 2025 నాటి ఓటర్ల జాబితాలకే రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ మేరకు పురపాలక, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఫొటో గుర్తింపు ఓటర్ల జాబితాల ప్రచురణకు ఈసీ ఆదేశాలతో ఏర్పాట్లు వేగవంతంగా సాగుతున్నాయి. స్థానిక సంస్థలకు అక్టోబరులోనే ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఏపీ ప్రభుత్వం ఉందని గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో ఓటర్ల జాబితా, ఎన్నికల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తోంది. &amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;రిజర్వేషన్లపై త్వరలో కీలక నిర్ణయం&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ శుక్రవారమే తన నివేదికను సమర్పించింది. దీనిపై కూటమి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అత్యంత కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయితే ఎన్నికలు మరింత దగ్గరపడినట్లే అని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓటర్ల జాబితాల ప్రచురణను మున్సిపాల్టీల్లో సెప్టెంబర్ 3 నాటికి, ఇప్పటివరకు జాబితా సిద్ధం చేయని సుమారు 50 పంచాయతీల్లో ఆగస్టు 17 లోగా పూర్తి చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.&lt;/p&gt;
&lt;p&gt;పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక, వాటి పబ్లికేషన్ ప్రక్రియను ఆగస్టు 21 నుంచి 31 లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన అదనపు బ్యాలెట్ బాక్సుల కోసం ఇతర రాష్ట్రాలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే లేఖలు రాశారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఇతరత్రా ముందస్తు ఏర్పాట్లను 30 నుండి 45 రోజుల్లోగా పూర్తి చేయాలనే ప్రణాళికతో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది.&amp;nbsp;&lt;/p&gt;
&lt;p&gt;&lt;strong&gt;ఓటర్ల జాబితా కోసం నోటిఫికేషన్ జారీ&lt;/strong&gt;&lt;/p&gt;
&lt;p&gt;&amp;nbsp;ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం.401/SEC-F1/2026-1 జారీ చేసింది. దాంతో మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాల ప్రచురణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. భారత ఎన్నికల సంఘం సేకరించిన తాజా అసెంబ్లీ ఓటర్ల డేటాను ప్రాతిపదికగా తీసుకుని మున్సిపల్ వార్డుల వారీగా విభజిస్తున్నారు. ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు మున్సిపల్ కమిషనర్లు, పోలింగ్ స్టేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయం చేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలో పాలనా సౌలభ్యం, ఫిర్యాదుల త్వరిత పరిష్కారం కోసం జోనల్ కమిషనర్లకు ప్రత్యేకాధికారాలు ఇచ్చారు.&lt;/p&gt;
&lt;p&gt;ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు, సవరణలు, జాబితాల్లో పేర్లను సరిచూసుకోవడానికి CEO Andhra Pradesh Portal ద్వారా సమాచారం పొందవచ్చు. స్థానిక ఎన్నికల నిర్వహణ విధానం, ముందస్తు సమాచారం, అప్&amp;zwnj;డేట్స్ తెలుసుకోవడానికి Election Commission of India వెబ్&amp;zwnj;సైట్&amp;zwnj;ను చూడాలని అధికారులు సూచించారు.&lt;br /&gt;&lt;br /&gt;&lt;/p&gt;]]></description><slash:comments>0</slash:comments><media:thumbnail url="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/08/16/234853b9236bc47c599047dda2561ea11786867988307233_original.jpg" width="220"/></item></channel></rss>