News
News
వీడియోలు ఆటలు
X

Tirupati: అమ్మాయి పేరుతో ఇన్‌స్టాలో మెసేజ్! బాబోయ్ ఎంత పెద్ద గొడవ అయిందో!

యువతి అని నమ్మి ఇన్‌స్టాగ్రాంలో మెసేజ్ లు చేసిన మరో యువకుడు

యువకుడని తెలుసుకుని ఫోన్ లో వార్నింగ్

ఇరువర్గాల గొడవకు దారి తీసిన యువకుల మధ్య తగాదా

FOLLOW US: 
Share:

ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వాడని వారు ఉండరు.. కొందరు సోషల్ మీడియాను మంచి‌ పనులకు ఉపయోగిస్తే, మరి కొందరు చెడు ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ అమాయకులైన వారికి టార్గెట్ చేసుకుని మోసగిస్తున్నారు.. తాజాగా యువతి పేరుపై ఓ యువకుడు ఇన్ స్టాగ్రాంలో మరో యువకుడి వల వేసిన ఘటన తిరుపతి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. యువతి పేరుపై మెసేజులు చేస్తున్న అతను యువతి కాదని తెలుసుకున్న యువకుడు, ఫోన్‌లో వార్నింగ్ ఇచ్చాడు.. దీంతో ఆ ఇద్దరూ యువకుల మధ్య ఫోన్ లో జరిగిన వాగ్వాదం కాస్తా గొడవకు దారి తీసింది.. ఒకరి వర్గం మరొక వర్గీయులపై దాడి చేసుకునే వరకూ దారి తీసింది.. తాతయ్య గుంట గంగమ్మ గుడికి దర్శనంకు విచ్చేసిన తమపై, తన పిల్లలపై ఓ వర్గం దాడి చేస్తున్నట్లు ఓ వీడియోను చిత్రీకరించిన ఓ మహిళా సోషల్ మీడియాలో‌ పోస్టు చేయడంతో విషయం బయటకు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. అసలు ఏమైందంటే..?

తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ ఎస్సై జయ స్వాములు వెల్లడించిన వివరాల‌ మేరకూ.. తిరుపతి‌ నగరంలోని వేదాంతపురం అగ్రహారంకు చెందిన సోము అను వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో ఉప్పరపల్లికి చెందిన మహమద్ బాషా కు ఆన్లైన్ లో అమ్మాయి పేరుతో రెండు రోజుల ముందు మెసేజ్ వచ్చింది. అందుకు మహమద్ బాషా కూడా స్పందిస్తూ తిరిగి మెసేజ్ చేశాడు.. తరువాత సోము అమ్మాయి పేరుతో ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ లు పెడుతునట్లు తెలుసుకొని మహమద్ ఫోన్ చేసి సోముకు వార్నింగ్ ఇచ్చాడు. అసభ్య పదజాలంతో దూషించాడు.. ఐతే వీరిద్దరి మధ్య మాట మాట పెరిగి, సోము తన ఫ్రెండ్ నవీన్ కు విషయం చెప్పగా నవీన్, మహమద్ కు ఫోన్ చేసి హెచ్చరించాడు.

ఐతే ఇదే విషయంను మహమద్ తన ఫ్రెండ్ పసుపులేటి చందుకు విషయం చెప్పగా, చందు ఫోన్ లో నవీన్ తో గొడవ పెట్టుకొని నువ్వు ఎక్కడవున్నావో చెప్పు, నేను అక్కడకే వచ్చి మీ కథ తేల్చేస్తాను అని హెచ్చరించాడు.. చందు తుడ సర్కిల్ వద్ద అరటికాయల మండిలో వుంటానని, వచ్చి తేల్చుకో అని చెప్పడంతో బుధవారం రాత్రి సుమారు 10:30 గంటలకు సోము, నవీన్, అతని స్నేహితులు శశాంక్, భరత్, పవన్ కల్యాణ్, ప్రకాష్, డిల్లీ, మౌళి, చోటు, రోహిత్ లు కట్టెలు తీసుకొని ఆటోలో తుడ సర్కిల్ వద్దకు వచ్చారు.. అప్పటికే మహమద్, చందు అతని అన్న నాగార్జున అతని స్నేహితులు గంగాధర్, ప్రదీప్ కుమార్, పతిలు కర్రలతో సిద్దంగా ఉండి ఒకరికొకరు గొడవ పడారు.

అటు శశాంక్, భరత్ లు పీకే లేఔట్ లో ఉంటున్న వాళ్ల అమ్మ ఉషా రాణికి ఫోన్ చేసి విషయం చెప్పారు.. ఆమె తన కుమార్తె చందన ప్రియతో కలిసి తుడా సర్కిల్ వద్దకు వచ్చి సోము, నవీన్, శశాంక్, భరత్, పవన్ కల్యాణ్, ప్రకాష్, డిల్లీ, మౌళి, చోటు, రోహిత్ లతో కలిసి చందు వాళ్ళతో తిరిగి గొడవ పడ్డారు. ఈ గొడవలో‌ ఇరువర్గాల వారికి స్వల్ప గాయాలు అయ్యాయి.. ఐతే ఉషారాణి తాను తన పిల్లలతో గంగమ్మ గుడి దర్శనానికి ఆటోలో వచ్చినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు తమపై దాడి చేసినట్లు వీడియో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసి, తిరుపతి ఈస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది.. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా, సోము ‘ఆన్లైన్’ లో అమ్మాయి పేరుతో మహమద్ కు ఇన్ స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టాడని తెలిసింది. ఆ మెసేజ్ కు మహమద్ కూడా రిప్లై ఇచ్చాడని, నిజం తెలుసుకొని ఇరు వర్గీయులు గొడవపడ్డారని పోలీసుల విచారణలో తెలిసింది. 

ఈ క్రమంలో ఉషారాణి తాను తన పిల్లలతో గంగమ్మ గుడికి దర్శనానికి ఆటోలో వచ్చినట్లు అందరిని నమ్మించి తప్పుదోవ పట్టించింది.. తాతయ్యగుంట గంగమ్మ గుడికి దర్శనార్థం వచ్చిన మహిళల, పిల్లలపై దాడి జరిగినట్టు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అని, వ్యక్తిగత కారణాలతో గొడవ జరిగిందని, అవాస్తవాన్ని వాస్తవంగా నమ్మించేందుకు సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన మహిళపై కఠిన చర్యలు తీసుకుంటాంమని ఎస్సై‌ జయ స్వాములు తెలియజేశారు.

Published at : 11 May 2023 09:13 PM (IST) Tags: Instagram Tirupati News Tirupati Gangamma Jatara Insta messaging

సంబంధిత కథనాలు

Tirumala: ఆ భక్తుడి బంగారు చైన్‌పై శ్రీనివాసుడి ప్రతిమలు- ఆసక్తిగా చూసిన జనం

Tirumala: ఆ భక్తుడి బంగారు చైన్‌పై శ్రీనివాసుడి ప్రతిమలు- ఆసక్తిగా చూసిన జనం

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

Todays Top 10 headlines: తెలంగాణ దశాబ్ధి వేడుకలకు శ్రీకాారం- టీడీపీ మేనిఫెస్టోకు వైసీపీ ప్రచారం చేస్తుందా?

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్‌గ్రేషియా ప్రకటన

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

APPSC: త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్

టాప్ స్టోరీస్

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా

24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా