AP CM Chandrababu: రాయలసీమ ఇక ‘రాయల్’ సీమ.. ఏపీకి దిగ్గజ సంస్థ రావడంపై సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Rayalaseema to become Royal Seema | తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టుబడులకు నిర్ణయం తీసుకోవడంతో సీమ ప్రాంతానికి 'రాయల్' కళ రాబోతోందని సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్ చేశారు.

Andhra Pradesh News Today | అమరావతి: రాయలసీమను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్న తన నిబద్ధతను చాటుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. సీమ ప్రాంతానికి పాత వైభవం తీసుకువస్తూ, ఇకపై ఇది కేవలం రాయలసీమ మాత్రమే కాదు, నిజమైన 'రాయల్' సీమ అని ఆయన అభివర్ణించారు. తిరుపతిలో ప్రముఖ ద్విచక్ర వాహన దిగ్గజ సంస్థ 'రాయల్ ఎన్ఫీల్డ్' భారీ పెట్టుబడులతో తన యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో, ఆ సంస్థ పేరులోని రాయల్ అనే పదాన్ని సీమకు అన్వయిస్తూ సీఎం చంద్రబాబు ఈ పోస్ట్ పెట్టారు.
Royal Enfield is cruising its way into Rayalaseema! pic.twitter.com/sEQsvW5Zyk
— N Chandrababu Naidu (@ncbn) May 8, 2026
పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న రాయలసీమ..
రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం పారిశ్రామికంగా, ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పారిశ్రామిక రంగంలో అనేక అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ (Sri City) ఒక భారీ పారిశ్రామిక హబ్గా అవతరించింది. ఇక్కడ క్యాడ్బరీ, పెప్సికో, కోల్గేట్-పామోలివ్, కెల్లాగ్స్, మొబైల్ తయారీ దిగ్గజం ఫాక్స్కాన్ వంటి కంపెనీలు తమ యూనిట్లను నడుపుతున్నాయి.
ఇక ఆటోమొబైల్ రంగంలో అనంతపురం జిల్లాలో ఉన్న కియా మోటార్స్ ఒక గేమ్ చేంజర్గా నిలిచింది. దీనికి తోడు తాజాగా తిరుపతి సమీపంలో ద్విచక్ర వాహన దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ (Royal Enfield) తన భారీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. వీటితో పాటు, చిత్తూరు జిల్లాలో అమర రాజా బ్యాటరీస్, మదనపల్లె పరిసరాల్లో డిక్సన్ టెక్నాలజీస్ వంటి సంస్థలు వేలమందికి ఉపాధి కల్పిస్తున్నాయి. కడప జిల్లాలో స్టీల్ పరిశ్రమల ఏర్పాటు దిశగా జేఎస్డబ్ల్యూ (JSW Steel) వంటి సంస్థలు అడుగులు వేస్తున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో కర్నూలు జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్, విండ్ పవర్ పార్కులు (గ్రీన్ కో వంటి సంస్థల ఆధ్వర్యంలో) ఏర్పాటు కావడం విశేషం. సిమెంట్ పరిశ్రమకు పుట్టినిల్లు అయిన ఈ ప్రాంతంలో అల్ట్రాటెక్, జువారీ, పన్యాం సిమెంట్స్ వంటి ప్రముఖ సంస్థలు దశాబ్దాలుగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. మరిన్ని సంస్థల రాకతో రాయలసీమ ప్రాంతం ఒక పవర్ఫుల్ పారిశ్రామిక కారిడార్గా మారుతోంది.
అదేవిధంగా, విశాఖపట్నం ఐటీ హబ్గా మారుతున్న క్రమంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభం కానుండటంపై కూడా చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. వైజాగ్ అభివృద్ధిని ప్రతిబింబించేలా గూగుల్ లోగో శైలిలో ఒక ప్రత్యేకమైన పోస్టును ఆయన పంచుకున్నారు. రాష్ట్రంలోకి గూగుల్, రాయల్ ఎన్ఫీల్డ్ వంటి అంతర్జాతీయ సంస్థలు వస్తుండటం ఏపీ పారిశ్రామిక ప్రగతికి నిదర్శనమని, దీని ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
ట్రెండింగ్ వార్తలు























