By: ABP Desam | Updated at : 28 May 2023 05:41 PM (IST)
పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!
చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లి, పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి, అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు ప్రాజెక్టులను శనివారం ఉదయం రాష్ట్ర యువ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త బోడే రామచంద్రయాదవ్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ పరిశీలన చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ముంపు గ్రామాల ప్రజలు, నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తా అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో రైతులు కోల్పోయిన వ్యవసాయ పంటలు, వృక్షాలు, దెబ్బతిన్న పర్యావరణం, ముంపు గ్రామాలను పరిశీలించారు.
ఇప్పటికైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించి ప్రాజెక్టుల ముంపు నిర్వాసిత రైతులు, ప్రజలకు వెంటనే నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. రోడ్డు మార్గాన్ని వెళితే బలంతో పోలీసుల ద్వారా అడ్డుపడుతుండగా హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టులన్ని తిరిగి పరిశీలించానని చెబుతున్నారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో హెలికాప్టర్ లో ప్రాజెక్టులను ఏరియల్ పరిశీలన చేయడం కూడా నేరమని, పోలీస్ కేసులు పెడతామని హెచ్చరించినప్పటికీ రైతులు, ప్రజల కోసం ఏ మాత్రం వెనకంజ వేయకుండా రైతు నాయకుడు రామచంద్ర యాదవ్ దిగ్విజయంగా ప్రాజెక్టుల ఏరియల్ సర్వే చేశారని తెలుస్తోంది. అయితే ఇది పర్మిషన్ లేకుండా చేశారని, చట్ట విరుద్ధమని చెబుతున్న పోలీసులు రామచంద్ర యాదవ్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్కోట్ వన్డేలో టీమ్ఇండియా ఓటమి
/body>