పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఏరియల్ సర్వే కలకలం, టార్గెట్ మంత్రి పెద్దిరెడ్డి!
చిత్తూరు జిల్లా సోమల మండలం ఆవులపల్లి, పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి, అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం ముదివేడు ప్రాజెక్టులను శనివారం ఉదయం రాష్ట్ర యువ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త బోడే రామచంద్రయాదవ్ హెలికాప్టర్ ద్వారా ఏరియల్ పరిశీలన చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి ముంపు గ్రామాల ప్రజలు, నిర్వాసిత రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తా అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలు, ముంపు ప్రాంతాల్లో రైతులు కోల్పోయిన వ్యవసాయ పంటలు, వృక్షాలు, దెబ్బతిన్న పర్యావరణం, ముంపు గ్రామాలను పరిశీలించారు.
ఇప్పటికైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించి ప్రాజెక్టుల ముంపు నిర్వాసిత రైతులు, ప్రజలకు వెంటనే నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల కారణంగా నష్టపోయిన రైతులు, ప్రజల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. రోడ్డు మార్గాన్ని వెళితే బలంతో పోలీసుల ద్వారా అడ్డుపడుతుండగా హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్టులన్ని తిరిగి పరిశీలించానని చెబుతున్నారు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాలతో హెలికాప్టర్ లో ప్రాజెక్టులను ఏరియల్ పరిశీలన చేయడం కూడా నేరమని, పోలీస్ కేసులు పెడతామని హెచ్చరించినప్పటికీ రైతులు, ప్రజల కోసం ఏ మాత్రం వెనకంజ వేయకుండా రైతు నాయకుడు రామచంద్ర యాదవ్ దిగ్విజయంగా ప్రాజెక్టుల ఏరియల్ సర్వే చేశారని తెలుస్తోంది. అయితే ఇది పర్మిషన్ లేకుండా చేశారని, చట్ట విరుద్ధమని చెబుతున్న పోలీసులు రామచంద్ర యాదవ్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
and tablets